the results
-
టిక్..టిక్..టిక్..
మొత్తం పోలైన ఓట్లు 1,11,766, బరిలో ఉన్న అభ్యర్థులు 31 మంది, ఏర్పాటు చేసిన టేబుళ్లు 28, కౌంటింగ్ ఉ: 8 గంటల నుంచి, స్థలం: చాదర్ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ సాక్షి, సిటీబ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 22న నిర్వహించిన సంగతి తెలిసిందే. బుధవారం వెలువడనున్న ఈ ఫలితాల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో పాటు నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా అధికార టీఆర్ఎస్ భావిస్తుండగా... ప్రభుత్వ తీరుపై ప్రజల వ్యతిరేకత కు ఫలితాలు దర్పణంగా నిలుస్తాయని ప్రతిపక్షాలు.. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. తమ విజయం ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతుండగా... తమకే అనుకూలమని బీజేపీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక దాదాపు తొమ్మిది నెలలకు జరిగిన ఈ ఎన్నికలు ప్రభుత్వ తీరుపై ప్రజల అభిప్రాయానికి అద్దం పడతాయని అధిక శాతం భావిస్తున్నారు. మొత్తం 1,11,766 మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని బ్యాలెట్లలో నిక్షిప్తం చేశారు. లె క్కింపు ఆలస్యమైనా...బుధవారం రాత్రిలోగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 435 పోలింగ్ కేంద్రాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. బరిలో 31 మంది అభ్యర్థులు ఉన్నారు. 32వ అంశంగా నోటా ఓటుంది. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బుధవా రం ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మద్యం అమ్మకాలపై నిషేధం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా సైబరాబాద్, నగర పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. వైన్షాప్లు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ చేయాలని జంట పోలీసు కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
‘గేట్’లో మనోళ్లు గ్రేట్
సత్తా చాటిన సిటీ విద్యార్థులు టాప్-10లో రెండు.. టాప్- 100లో 11 ర్యాంకులు సాక్షి, సిటీబ్యూరో/ కేపీహెచ్బీ, న్యూస్లైన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2014 ఫలితాలలో నగర విద్యార్థులు దుమ్ము దులిపారు. గేట్ ప్రవేశపరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఇద్దరు, టాప్ 100 లోపు 11మంది విద్యార్థులు హైదరాబాద్ హవాను చాటారు. నగరానికి చెందిన తాడూరి నవీన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 8వ ర్యాంకు, ఈఈఈ విభాగంలో రాపోలు జయప్రకాష్ 9వ ర్యాంకుతో సత్తా ప్రదర్శించారు. ఆపై ర్యాంకుల్లో వై.వంశీకృష్ణ(ఈసీఈ) 14వ ర్యాంకు, చంద్ర శ్రీరామ్ కౌషిక్ (ఈఈఈ) 35వ ర్యాంకు, సందీప్(సీఎస్ఈ) 69వ ర్యాంకు, పీయుష్ సోని (ఈసీఈ) 75వ ర్యాంకు, వెంకట రమణరావు (ఈఈఈ) 78వ ర్యాంకు, వంశీ (సీఎస్ఈ) 86వర్యాంకు, చుండూరి శ్రీహర్ష (ఈఈఈ) 90వ ర్యాంకు సాధించారు. ఇదిలా ఉంటే.. నగరంలోని జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులకు వందలోపు రెండు ర్యాంకులు వచ్చాయి. వర్సిటీలో బీటెక్ ఈఈఈ ఫైనలియర్ చదువుతున్న స్టాన్లీ 41వ ర్యాంక్, కె.చాణిక్య 97వ ర్యాంకు సాధించారు. టాప్ ర్యాంకులు రాకున్నా 100 లోపు ర్యాంకులు ఎక్కువమంది నగర విద్యార్థులకు రావడంపై పలువురు ఆచార్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తెలిపారు. ర్యాంకులు సాధించిన వారిలో కొందరు ఇతర జిల్లాలకు చెందిన వారైనప్పటికీ వీరు హైదరాబాద్ కేంద్రం నుంచి గేట్ పరీక్షలు రాశారు. మొదటి నుంచీ కృషి ఇంజనీరింగ్లో చేరినప్పటి నుంచి గేట్లో మంచి ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో కృషి చేశా. ఆల్ ఇండియాలో టాప్ 10 లో ఉండాలనుకున్నా. అయినా 100లోపు 41వ ర్యాంక్ రావడంతో సంతోషంగా ఉంది. - స్టాన్లీ, ఈఈఈ 41వ ర్యాంకర్ ఒత్తిడికి లోనయ్యా.. పరీక్ష రాసేటప్పుడు కొంచెం ఒత్తిడికి గురయ్యా. ఇంత మంచి ర్యాంక్ వస్తుందని ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోనే గేట్ పరీక్షలు రాశా. - కె. చాణుక్య, ఈఈఈ 97వ ర్యాంకర్ -
'ప్రజలకు కాంగ్రెస్ పట్ల ఆగ్రహం అర్ధమవుతుంది'