breaking news
Replace medical posts
-
సర్కార్ వైద్యంపై నమ్మకం కలిగించండి
విధి నిర్వహణలో నిర్లక్ష్యం తగదు త్వరలో వైద్య పోస్టుల భర్తీకి చర్యలు వైద్య,ఆరోగ్య శాఖ కమిషనర్ వీణా కుమారి సిద్దిపేటలో ఆకస్మిక తనిఖీలు సిద్దిపేట జోన్ : ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై పూర్తిస్థాయిలో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ వీణా కుమారి అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ఏరియా ఆస్పత్రి, మాతా శిశు సంక్షేమ కేంద్రం, హైరిస్క్ సెంటర్, కంగారు మెథడ్ యునిట్, నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఏరియా ఆస్పత్రిని సందర్శించి అక్కడ ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. వైద్యులు అందుబాటులో ఉండాలని లేని పక్షంలో శాఖాపర చర్యలుంటాయని హెచ్చరించారు. మరోవైపు ఓపీ సమస్య రాకుండా చూడాలని తనకు ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని సూపరింటెండెంట్ శివరాంను హెచ్చరించారు. అనంతరం బ్లడ్ బ్యాంక్, ఎక్స్రే, ఈసీజీ విభాగాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హైరిస్క్ కేంద్రానికి వచ్చిన కమిషనర్ కేంద్రంలో రోగుల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో మంచాలు ఖాళీగా ఉండడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామాల్లో హైరిస్క్ సేవలపై వైద్యులు క్షేత్రస్థాయిలో చైతన్యం చేయాలని సూచించారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని తనిఖీచేసి వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఎస్ఎన్సీయూ కేంద్రం సేవలను వినియోగంలోకి తేవాలన్నారు. రిఫర్ చేయొద్దు సిద్దిపేటలో ఆధునిక వసతులతో కూడిన వైద్యం అందుతున్నప్పటికీ కొందరు వైద్యులు చిన్నపిల్లలను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయడం తగదని కమిషనర్ వీణాకుమారి అన్నారు. ఇక్కడ వైద్యం సరిపోకపోతే హైదరాబాద్లోని నీలోఫర్కు చిన్నపిల్లలను రిఫర్ చేయాలి కానీ, ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేయవద్దని సూచించారు. సిద్దిపేటలో పిల్లల వైద్యుల పనితీరు మారాలని, త్వరలో వైద్యుల నియామకం చేపడతామన్నారు. అనంతరం కంగారు మెథడ్ యూనిట్, ఎంసీహెచ్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక మండలం గంభీర్పూర్కు చెందిన సౌందర్య ప్రసవ అనంతరం ఇంటివద్ద తల్లి,బిడ్డలను దించడానికి 102 ఆంబులెన్స్ డ్రైవర్ 200 డిమాండ్ చేయడం, ఆస్పత్రిలో ధోబీ, నర్సులు డబ్బులు అడిగినట్లు బాధితుడు వెంకటాచారి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ వెంటనే డబ్బులను తిరిగి బాధితునికి ఇప్పించాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పోగొట్టొద్దని హెచ్చరించారు. సిద్దిపేటకు ప్లేట్లెట్ల కేంద్రం ప్రస్తుతం హైదరాబాద్కు పరిమితం అయిన ప్లేట్లెట్లు (రక్తఫలకలు) త్వరలో సిద్దిపేటలో కూడా అందుబాటులో ఉంటాయని కమిషనర్ వీణా కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇతరత్రా కారణాలతో ప్లేట్లెట్స్ తగ్గి ప్రమాదకర స్థితిలోకి చేరుకునే ఈ ప్రాంత రోగుల కోసం ప్రత్యేక వసతిని కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డెంగీని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం 12 ప్లేట్లెట్ల కేంద్రాలను మంజూరు చేసిందన్నారు. అందులో భాగంగానే జిల్లాలో సిద్దిపేటతో పాటు సంగారెడ్డిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. సిద్దిపేట ఆస్పత్రుల్లో వైద్యుల సమస్యను పరిష్కరించే క్రమంలో పీజీ వైద్య విద్యార్థులను నియమించనున్నట్లు తెలిపారు. సిద్దిపేట మండలంలో ఇప్పటివరకు రెండు డెంగీ కేసులను అధికారులు రిఫర్ చేశారని ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కమిషనర్ వెంట వైద్యులు రామస్వామి, అరుణ, లక్ష్మి తదితరులు ఉన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి సిద్దిపేట రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేలా వైద్య సిబ్బంది అలర్ట్గా ఉండాలని కమిషనర్ వీణాకుమారి సిబ్బందికి సూచించారు. శుక్రవారం సీతారాంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల సిద్దిపేట నుంచి 72మంది రక్త నమూనాలు సేకరించగా, 13మంది పాజిటీవ్ వచ్చిందని గుర్తు చేశారు. వైద్య సిబ్బంది ప్రజల్లోకి వెళ్లి సీజనల్ వ్యాధులపైఅవగాహన కల్పించాలని సూచించారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం
త్వరలో ఖాళీ వైద్య పోస్టుల భర్తీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య అట్టహాసంగా దంత వైద్యుల సదస్సు ప్రారంభం హాజరైన 3వేల మంది దంత వైద్యులు, విద్యార్థులు హన్మకొండ చౌరస్తా :ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చడమే కాకుండా ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ పద్మాక్షికాలనీ లోని జయ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం రాష్ట్రస్థాయి తొలి దంత వైద్య సదస్సు ప్రారంభమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కొనసాగనున్న సదస్సుకు డాక్టర్ రాజయ్య ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. ఐడీఏ రాష్ట్ర అధ్యక్షు డు త్రినాథ్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిం చిన రాజయ్య మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంతవైద్య సేవలు రాజయ్య మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించడమే సీఎం లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఆరువేలమంది వైద్యు ల నియామకం కోసం కేంద్రం రూ.5.17కోట్లు కేటాయించిందన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తికాగానే వైద్యుల నియామకం ప్రారంభమవుతుందన్నారు. దంతవైద్యులు సేవలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దంతవైద్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆస్పత్రుల్లోని లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘ఆస్పత్రి బస’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత దంతవైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ డెంటల్ కౌన్సిల్ ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీ కల్పనాదేవి, జయసింహారెడ్డి, నర్సింగరెడ్డి డాక్టర్లు చలపతిరావు, ప్రవీణ్కుమార్, నర్సింగరెడ్డి సురేందర్రెడ్డి, కరుణాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.