-
కేరళలో కరోనా విజృంభణ: ప్రభుత్వ కమిటీ కీలక వ్యాఖ్యలు
తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడంపై ప్రభుత్వ జీనోమ్ సీక్వెన్సింగ్ మానిటరింగ్ ఏజెన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మతపరమైన సమావేశాల కారణంగానే కోవిడ్-19 కేసుల ఉధృతి పెరిగిందని ఇండియన్ సార్స్-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం) డైరెక్టర్లలో ఒకరైన అనురాగ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంతో పోలిస్తే కేరళ మెరుగ్గా ఉన్నా మతపరమైన సమావేశాలకు అనుమతించడం సరైన నిర్ణయం కాదని, కేరళ ప్రభుత్వం కేవలం అవసరమైన సేవలను మాత్రమే తిరిగి ప్రారంభించాల్సి ఉందని అగర్వాల్ వ్యాఖ్యానించారు. మతపరమైన సమావేశాలు, ధార్మిక సామూహిక కార్యక్రమాల కారణంగానే 13-20 వేల వరకు రోజువారి కేసులు పెరిగాయన్నారు. దీన్ని నివారించకపోతే కేసులు పెరుగుతూనే ఉంటుందని అగర్వాల్ హెచ్చరించారు. కేరళలో కరోనా కొత్త వేరియంట్ దేనినీ గర్తించనప్పటికీ, నమూనాల్లో 90 శాతం కేసులు డెల్టా వేరియంట్వేననని తేలిందన్నారు. దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్లోకరోనా మూడోదశ రావచ్చునని అనురాగ్ అగర్వాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో వాక్సినేషన్పై దృష్టిపెట్టాలని సూచించారు. ఇప్పటికే కరోనా సోకి కోలుకున్నవారు మళ్లీ వైరస్కు గురి కారు కనుక మూడో వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. అయితే వైరస్ తన రూపాన్ని మార్చుకుంటే ఈ ధోరణి మారుతుందని ఆయన హెచ్చరించారు. ఆగస్టు 31 వరకు స్పెషల్ టీకా డ్రైవ్ మరోవైపు రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఎక్కువైమందికి టీకా అందించే కార్యక్రమంలో భాగంగా స్పెషల్ టీకా డ్రైవ్ ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందన్నారు. వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను ప్రజలకు అందించాలని వాణిజ్య, ప్రజా సంస్థలను విజయన్ పిలుపునిచ్చారు. కాగా కేరళలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో కేవలం కేరళ రాష్ట్రం నుంచే 40 శాతానికి పైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం ఆదివారం కేరళలో కొత్తగా 18,607 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 93 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు13.87 శాతానికి చేరింది. -
తీరని విషాదం: తొక్కిసలాటలో 44 మంది మృతి
జెరూసలెం: పవిత్ర పండుగ వేళ తొక్కిసలాట జరిగి 44 మంది మృతి చెందారు. భయాందోళనతో పరుగులు తీయడంతో తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన ఇజ్రాయెల్ దేశంలోని మౌంట్ మెరోన్ పవిత్ర స్థలం వద్ద చోటుచేసుకుంది. లాగ్ బౌమర్ పండుగ గురువారం యూదులు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా వారి పవిత్ర స్థలం అయిన మౌంట్ మెరోన్ వద్దకు పెద్ద ఎత్తున యూదులు చేరుకున్నారు. ఉమ్మడిగా ప్రార్థనలు, నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగారు. ఈ సమయంలో కొందరు మెట్లపై అదుపు తప్పి కిందపడ్డారు. కింద ఉన్నవారిపై వీరు పడడంతో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో అందరూ భయాందోళన చెంది పరుగులు తీశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. వేలాది మంది పరుగులు పెట్టడంతో తొక్కిసలాటలో కిందపడ్డవారు ప్రాణాలు కోల్పోయారు. ఆ పవిత్ర స్థలం ప్రాంగణమంతా రక్తసిక్తమైంది. చెప్పులు.. బట్టలు చిందరవందరగా పడి హృదయ విదారకంగా మారింది. తొక్కిసలాటలో ఊపిరాడక ఏకంగా 44 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇక తీవ్రంగా గాయపడిన 108 మందిని ఆస్పత్రికి తరలించారని ఆ దేశానికి చెందిన అధికారులు ప్రకటించారు. వారిలో 40 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని ప్రధానమంత్రి నెతన్యాహు సందర్శించారు. ఈ ఘటనపై పలు దేశాల ప్రముఖులు కూడా స్పందించి సంతాపం ప్రకటించారు. అయితే ఈ వేడుకలో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. In Israel, at least 44 people have been killed in a stampede at a religious festival, where ultra-Orthodox Jews had come together for an all-night prayer and dance celebration. pic.twitter.com/6ivY1YR6cQ — DW News (@dwnews) April 30, 2021 -
60 మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్
భోపాల్ : విదేశాలకు చెందిన 60 మంది తబ్లిగీ జమాత్ సభ్యులను భోపాల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విదేశీయుల చట్టం నిబంధన ఉల్లంఘించి పలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనందున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఉజ్బెకిస్తాన్, టాంజానియా, దక్షిణాఫ్రికా, మయన్మార్.. దేశాల నుంచి భారత్కు వచ్చినవారు ఉన్నారు. అరెస్ట్ అయిన తబ్లిగీ సభ్యులు వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా భోపాల్లోని పలు పోలీసు స్టేషన్లో కేసులు నమోదైనట్టుగా భోపాల్ ఐజీ ఉపేంద్ర జైన్ తెలిపారు. (చదవండి : అహ్మదాబాద్లో 700 మంది సూపర్ స్ప్రెడర్స్) అరెస్ట్ అయినవారిలో కొందరికి ఇదివరకే కరోనా సోకిందని అధికారులు తెలిపారు. దీంతో అరెస్ట్ అయిన తబ్లిగీ సభ్యులందరినీ క్వారంటైన్లో ఉంచినట్టు చెప్పారు. కాగా, టూరిస్ట్ వీసాల మీద భారత్కు వచ్చిన విదేశీ తబ్లిగీ సభ్యులు నిబంధనులకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా సమాచారం ఉండటంతోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తబ్లిగీ సభ్యులు బెయిల్ పిటిషన్ను భోపాల్లోని లోకల్ కోర్టు తిరస్కరించింది. (చదవండి : కరోనా వ్యాప్తిపై కొత్తలెక్క!) -
వైభవంగా హులిగమ్మదేవి మహారథోత్సవం
దక్షిణ కర్ణాటకలో ఆదిశక్తి దేవతగా ప్రఖ్యాతి గాంచిన కొప్పళ జిల్లాలోని హులిగిలో వెలసివున్న హులిగమ్మదేవి మహారథోత్సవం మంగళవారం సాయంత్రం అత్యంత ఘనం గా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారిని పూల మాలలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. అక్కిపడె తదితర ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని పల్లకిలో రథం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారిని రథంపై ఉంచి రథాన్ని లాగారు. రథంపైకి భక్తులు పూలు, పండ్లను విసిరి మొక్కులు తీర్చుకొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. - హొస్పేట -
టీటీడీకే పంగనామాలు !
దోడ్డి దారిలో ఉద్యోగాలకు సిఫార్సులు చక్రం తిప్పుతున్న ఇంటి దొంగలు ఎఫ్ఎం రేడియోలో ఇదీ సంగతి తిరుపతి సిటీ: శ్రీవారి ప్రాముఖ్యతను దశ దిశలా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో టీటీడీ ఎస్వీబీసీ, వెంకటేశ్వర ఎఫ్ఎం కమ్యూనిటీ రేడియోను నిర్వహిస్తోంది. స్థానికంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో శ్రోతలను భక్తిమార్గం వైపు తీసుకెళ్లేందుకు 2007లో రేడియోను తీసుకొచ్చారు. అప్పటి నుంచీ వివాదాలను మూటగట్టుకుంటోంది. పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న వారిదే ఇష్టారాజ్యంగా మారిపోయింది. భక్తి కార్యక్రమాలు పలికించేందుకు అప్పట్లో నందిని, కీర్తి, సుగుణ, కుమారి, శివయ్యలను నియమించారు. వాళ్లు ఎవరో కూడా ఇక్కడి అధికారులకు తెలియదు. వారి పేరుపై భక్తి కార్యక్రమాలకు బినామీలు వాయిస్ అందిస్తున్నారు. అసలు వీళ్లను ఎవరు నియమించారో కూడా తెలియని పరిస్థితి. అక్కడ పెత్తనం అంతా వారిదే. అడిగితే వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు. రికార్డుల్లో ఉన్నవారి పారితోషకం మాత్రం వీరు తీసుకుంటున్నారు. ఇప్పుడేమో తాజా ప్రతిపాదనలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బినామీ పేర్లతో ఉద్యోగులుగా వ్యవహరిస్తున్న ముగ్గురిని రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో కొత్తగా ఇద్దరు ప్రోగ్రామ్ ప్రొడక్షన్ అసిస్టెంట్లను తీసుకోవాలని టీటీడీ ఈవో, జేఈవోలకు ప్రతిపాదనలు పంపారు. ప్రతి ఒక్కరికీ నెలకు రూ.15 వేలు పారితోషకం చెల్లించే విధంగా ఫైల్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ స్టాఫ్గా పనిచేస్తున్న సీనియర్లను పక్కకు నెట్టి దొడ్డిదారిలో నియామకాలకు తెరతీశారు. టీటీడీ యాజమాన్యం వెంకటేశ్వర ఎఫ్ఎం రేడియో కమ్యూనిటీలో ఏమి జరుగుతుందో పట్టించుకోవాలని సిబ్బంది వేడుకుంటున్నారు. టీటీడీ విజిలెన్స్ ఆరా .. వారం రోజుల కిందట ఇక్కడ జరుగుతున్న తతంగంపై టీటీడీ విజిలెన్సు విభాగం ఆరా తీసింది. రికార్డులను పరిశీలించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ అన్ని తామై నడిపిస్తున్న అధికారులు ఈ గడ్డు పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియక ఉన్నతాధికారుల వద్ద పంచాయితీ చేస్తున్నట్లు సమాచారం. సూచనల మేరకే పనిచేస్తున్నాం.. దీనిపై ఇన్చార్జి, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్రనాయక్ను వివరణ కోరగా ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నట్లు బినామీ పేర్లపై ఎవరూ పనిచేయడం లేదని తెలిపారు. రికార్డుల ప్రకారం వార్షిక బడ్జెట్ తయారుచేస్తున్నామని చెప్పారు. నూతన నియామకాల విషయంలో ఈవో, జేఈవో సూచనలను పాటిస్తున్నామని తెలిపారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మేం ఓటేశాం.. మరి మీరో?(ఫొటోలు)
గూగుల్కు ఓటింగ్ శోభ!
క్యూలో నిలబడిన విజయ సాయి రెడ్డి
Lok sabha elections 2024: సామాన్యుడిలా క్యూలో నిలబడి ఓటేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
శ్రీనగర్లో భారీ బందోబస్తు మధ్య మొదలైన పోలింగ్!
ఏపీ ఎన్నికల పోలింగ్ వేళ సీఎం జగన్ సందేశం
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
హాలీవుడ్ కింగ్ ఆఫ్ కల్ట్ రోజర్ కన్నుమూత
Daily Horoscope: ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి
ఏపీలో కాసేపట్లో ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
తప్పక చదవండి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement