-
పీటర్ ముఖర్జియా విడుదల
ముంబై: 2012నాటి సంచలన షీనా బోరా హత్య కేసులో గత నాలుగేళ్లుగా జైళ్లో ఉంటున్న పీటర్ ముఖర్జియాకు శుక్రవారం విడుదల అయ్యారు. బాంబే హైకోర్టు ఆయనకు ఫిబ్రవరిలోనే బెయిల్ ఇచ్చినప్పటికీ.. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఆరువారాల పాటు ఆ బెయిల్ ఉత్తర్వులపై స్టే విధించింది. ఆ స్టే గడువు గురువారంతో ముగిసింది. సీబీఐ అప్పీల్ చేసుకోకపోవడంతో ఆయన శుక్రవారం విడుదల అయ్యారు. సొంత కూతురు హత్యకు సంబంధించిన ఈ కేసులో ముఖర్జియా మాజీ భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన ముద్దాయి. పీటర్ ముఖర్జియా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లుగా ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని బెయిల్ ఉత్తర్వుల్లో బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. -
హార్దిక్ అరెస్ట్, విడుదల
సూరత్: గుజరాత్లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న హార్దిక్ పటేల్ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి, తర్వాత బెయిల్పై విడుదల చేశారు. సూరత్లో హార్దిక్, ఆయన మద్దతుదారులు శనివారం ‘ఏక్తా ర్యాలీ’ నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ముందస్తుగా అదుపులోకి తీసుకుని తర్వాత అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని వారిపై ఎఫ్ఐ ఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. హార్దిక్తోపాటు మరో 35 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ర్యాలీకి నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోలేదని తెలిపారు. తర్వాత హార్దిక్ను, అయన అనుచరులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రూ. వెయ్యి పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. హార్దిక్ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పటేళ్లు నిరసన తెలిపారు. వారికి, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. వదంతులను నిలువరించడానికి రాష్ర్టంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం పటేళ్ల వర్గాన్ని అణచివేస్తోందని హార్దిక్ ఆరోపించారు. దండినుంచి అహ్మదాబాద్కు ర్యాలీ నిర్వహించేం దుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హార్దిక్ సూరత్లో ర్యాలీ తలపెట్టారు. -
బెయిల్పై విడుదలయిన కేజే కుమార్
చిత్తూరు అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కేజే కుమార్ గురువారం బెయిల్పై విడుదలయ్యారు. చిత్తూరు జిల్లా నగరిలో కమిషనర్పై దాడి చేశారని పోలీసులు తప్పుడు ఫిర్యాదుతో కేజే కుమార్ను, ఆయన కుమారుడు కేజే సురేష్, పార్టీ కార్యకర్తలు ముగ్గురిని గత నెలలో అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలులో ఉంచిన విషయం తెలిసిందే. వీరితో పాటు నగరి మునిసిపల్ చైర్పర్సన్ కేజే శాంతిపై కూడా కేసు బనాయించారు. వీరందరికీ బుధవారం రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఉత్తర్వులతో నాయకులు చిత్తూరులోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం కుమార్ తదితరులు చిత్తూరు వన్టౌన్ పోలీసు స్టేషన్లో షరతుల మేరకు సంతకం చేశారు. అక్కడి నుంచి డీసీసీబీ బ్యాంకు ఆవరణలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేజే కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు, టీడీపీ నాయకులు ఒక్కటై తమపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని కేజే కుమార్ అభిప్రాయపడ్డారు. -
సత్యం రామలింగరాజు విడుదల
-
సత్యం రామలింగరాజు విడుదల
హైదరాబాద్: చర్లపల్లి జైలు నుంచి సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి.రామలింగరాజు మరో ఏడుగురు బెయిలుపై బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారమే వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ పత్రాలు జైలు అధికారులకు అందడం జాప్యం జరగడం వల్ల వారు ఈ రోజు విడుదలయ్యారు. సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రామలింగరాజు, అతని సోదరుడు రామరాజు లక్ష రూపాయల చొప్పున, మిగతా నిందితులు 50 వేల రూపాయల పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు వారు పూచీకత్తు సమర్పించి విడుదలయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement