breaking news
regional language
-
బహు భాషల బంధువు
యంత్రానికి అనువాదం చిక్కుతుందా? చిక్కినట్లు అనిపించినా... ఇంకా ఎన్నో చిక్కులు ఉండనే ఉన్నాయి. ఆ చిక్కు ముడులు విప్పడానికి, యంత్ర అనువాదంలో సహజత్వాన్ని తీసుకురావడానికి, ప్రాచుర్యం లేని భాషల్లోకి అనువాదాలను తీసుకురావడానికి నడుం కట్టారు మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ కాళికా బాలి.ఇంగ్లీష్ నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసే సైట్లు బోలెడు కనిపిస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో ఆ అనువాదం అసలు అర్థానికి దూరంగా నవ్వు తెప్పించేలా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఆలోచించాలనుకున్నారు కాళికా బాలి.మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ఇండియా సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ అయిన బాలి లాంగ్వేజ్ మోడల్స్ను మరింత సమర్థంగా తీర్చిదిద్దడానికి తన బృందంతో కలిసి రంగంలోకి దిగారు.దిల్లీ, జెఎన్యూలో, యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్లో లింగ్విస్టిక్స్, అకూస్టిక్ ఫొనెటిక్స్ చదువుకున్న కాళికా బాలి ఏఐ ప్రపంచంలోకి రావడానికి ముందు స్పీచ్ టెక్నాలజీపై పనిచేశారు. టెక్ట్స్–టు–స్పీచ్ సిస్టమ్లను నిర్మించారు.లండన్కు చెందిన స్టార్టప్ల ఇంగ్లీష్ స్పీచ్ అప్లికేషన్లపై పనిచేశారు. 2002లో ఇండియాకు తిరిగివచ్చిన తరువాత బెంగుళూలోని హెచ్పీ ల్యాబ్స్లో చేరారు. 2006లో కొత్తగా వచ్చిన మైక్రోసాఫ్ట్ రిసెర్చ్ ల్యాబ్–ఇండియాలో చేరారు.బాలి, ఆమె బృందం ఎన్ఎల్పీకి సంబంధించి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడంపై దృష్టి పెట్టారు. ‘హిందీ అనువాదంపై చేసిన కొన్ని వర్క్స్బింగ్తో పాటు, ఇతర ప్రాథమిక హిందీ–ఇంగ్లీష్ అనువాద వ్యవస్థలోకి వెళ్లాయి’ అంటున్నారు కాళిక. కోడ్ మిక్సింగ్, కోడ్ స్విచ్చింగ్కు సంబంధించి ఆమె కృషి చేశారు.ఆ రోజుల్లో ఎన్నో ఎన్ఎల్పీ సిస్టమ్స్ మోనోలింగ్వల్గా ఉన్నప్పుడు, తన బృందంతో కలిసి ప్రాజెక్ట్ మెలాంజ్’ లాంచ్ చేశారు. ఇది కోడ్–మిక్స్డ్ ఎన్ఎల్పీ రూ΄÷ందించడానికి ఉపకరిస్తుంది.తక్కువ వనరులు అందుబాటులో ఉండే ‘గోండీ’లాంటి భాషలపై కూడా ఆమె పనిచేశారు. ‘హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలను గోండీలోకి అనువాదం చేయడానికి అవసరమైన పుస్తకాలు ఎన్నో ఉపయోగించుకున్నాం. ఇంగ్లీష్, హిందీ నుంచి తొలిసారిగా రెండు వందల గోండీ పుస్తకాలు తీసుకు వచ్చాం’ అంటున్నారు బాలి.బాలి బృందం ప్రస్తుతం స్కేల్డ్–అప్ వెర్షన్ ‘సమీక్ష’ను అభివృద్ధి చేస్తోంది. ఇది రాజ్యాంగం గుర్తించిన 22 అధికారిక భారతీయ భాషలను కవర్ చేస్తుంది. ఉపాధ్యాయులకు ఉపయోగపడే ఏఐ అసిస్టెంట్ ‘శిక్ష కోపైలట్’ అభివృద్ధి చేయడంలో సహకారం అందించారు బాలి.‘మన దేశానికి సంబంధించి ఏఐ ఎకోసిస్టమ్ను తీర్చిదిద్దడంలో కాళిక కీలక పాత్ర ΄ోషించారు. కమ్యూనిటీ–సెంటర్డ్ రిసెర్చ్ కు ప్రాధాన్యత ఇచ్చారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నాను. నైతిక విలువలతోపాటు అరుదైన శాస్త్రజ్ఞానం ఆమెలో కనిపిస్తుంది. కాళిక నుంచి ఎంతో స్ఫూర్తి ΄÷ందాను’ అంటున్నారు ‘కార్య’ సీయీవో మను చో్రపా. ‘కార్య’ అనేది పేద ప్రజలకు ఏఐ డిజిటల్ వర్క్ ద్వారా అదనపు ఆదాయ మార్గాన్ని చూపించే సంస్థ. -
ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యతనివ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది. ఈ ప్రక్రియను వేగంగా ముందుకు తీసు కెళ్ళేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రాల పరిధి లోని ఉన్నత విద్య పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేయాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ఈ నిర్ణ యం తీసుకున్నట్టు పేర్కొంది. కీలక మైన ఉన్నత విద్య లో ప్రమాణాలు మెరుగవ్వాలంటే, బోధన, పాఠ్య పుస్తకాలు స్థానిక భాషల్లోనే ఉండాలని కేంద్రం జరిపిన అధ్యయ నాల్లో వెల్లడైంది. దీనివల్ల సబ్జెక్టుపై విద్యా ర్థులకు పట్టు లభిస్తుందని, పలితంగా విద్యార్థి ఉన్నత విద్యను పూర్తి చేసేలోగా మార్కెట్ అవసరాలకు అనువైన నైపుణ్యాన్ని సంపాదిస్తాడని ఎన్ఈపీ–2020లో పేర్కొన్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుగా పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో తర్జుమా చేయా లని భావించారు. దీనికోసం అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీ) ఆర్టిఫీషి యల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా ‘అనువాదిని’ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలూ ఉపయోగించుకుని డిగ్రీ, ఇంజనీరింగ్తో పాటు అన్ని రకాల ఉన్నత విద్య పాఠ్యపుస్తకాలను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో తర్జుమా చేయాలని సూచించింది. అయితే, ఇంగ్లిష్, స్థానిక భాషను ఎంచుకోవడం విద్యార్థి ఐచ్ఛికమే. తెలుగు మీడియం ఉంటే ప్రత్యేక తరగతి బోధన చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పాఠ్యపుస్తకాల తర్జుమాకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటూ యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. డిగ్రీలో మొదలైంది... ఇంజనీరింగ్పై త్వరలో నిర్ణయం ఎన్ఈపీ–2020లో భాగంగా స్థానిక భాషల్లో పుస్తకాల ప్రచురణపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. తెలుగు అకాడమి ద్వారా పుస్తకాల తర్జుమా చేయిస్తున్నాం. సాంకే తిక విద్యకు సంబంధించిన పుస్తకాలపై త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపి, నిర్ణయం తీసుకుంటాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యామండలి చైర్మన్) ప్రత్యేక బోధకులుండేలా చూడాలి.. స్థానిక భాషలో బోధన అంశాన్ని ముందుకు తెచ్చేటప్పుడు కాలేజీల్లో బోధకుల సంఖ్య పెంచాలి. ఇంగ్లిష్, తెలుగు మీడియాలను వేర్వేరుగా బోధించడం ఒకే అధ్యాపకుడికి సాధ్యం కాదు. దాని వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. – డాక్టర్ వి బాలకృష్ణ, సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) -
ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ కోర్సులను ఇంగ్లిష్ మాధ్యమంలో బోధిస్తున్నప్పటికీ, పరీక్షలను విద్యార్థులు వారి మాతృభాషగా ఉన్న ప్రాంతీయ భాషలో రాసేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతించింది. విద్యార్థులు కోర్సులను ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ, వారు పరీక్షలలో ప్రాంతీయ భాషను ఎంచుకొనేందుకు అవకాశవిువ్వాలని అన్ని సెంట్రల్ వర్సిటీలు సహా అన్ని విశ్వవిద్యాలయాలకు బుధవారం లేఖ రాసింది. స్థానిక భాషల్లో ఉన్నత విద్యా కోర్సులను ప్రోత్సహించేందుకు, బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు మరింత చురుగ్గా పాల్గొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ పేర్కొంది. ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలన్న నూతన విద్యా విధానం మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. పాఠ్య పుస్తకాలను స్థానిక భాషల్లో రూపొందించడం, ఇతర భాషల నుంచి ప్రామాణిక పుస్తకాలను బోధనలో వినియోగించడానికి ఈ విధానం ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. స్థానిక భాషలకు పెరుగుతున్న ప్రాధాన్యత వివిధ పోటీ పరీక్షల్లో, ఉద్యోగ రాత పరీక్షల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో స్థానిక భాషలకు అవకాశం కల్పించాలని వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో యూజీసీ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షలను గతంలో హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో నిర్వహించేవారు. తరువాత పశ్చిమబెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి వారి ప్రాంతీయ భాషల్లో ఆ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో జేఈఈ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షలు, ఇతర ఉద్యోగ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ఇదే తరహాలో వివిధ విశ్వవిద్యాలయాల్లోనూ వివిధ కోర్సుల్లో స్థానిక భాషల్లో పరీక్షలు రాసుకొనేలా యూజీసీ నిర్ణయం తీసుకుంది. స్థానిక భాషలో పరీక్ష రాస్తే విద్యార్ధులు తాము నేర్చుకున్న అంశాలను సంపూర్ణంగా సమాధానాలుగా రాయగలుగుతారని, వారిలోని పరిజ్ఞానాన్ని మరింత లోతుగా మూల్యాంకనం చేసేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని యూజీసీ అభిప్రాయపడింది. ఉన్నత విద్యలో చేరికలను పెంచేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఉన్నత విద్యలో గరిష్ట చేరికలు 27 శాతం కాగా, దీన్ని 2035 నాటికి 50 శాతానికి పెంచాలన్నది నూతన విద్యా విధానం లక్ష్యమని, దీనిని సాధించడానికి నూతన విధానం ఉపకరిస్తుందని పేర్కొంది. -
పేటీఎం ఇకపై తెలుగులోనూ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాలె ట్, ఈ కామర్స్ సంస్థ పేటీఎం తెలుగు సహా పది ప్రాంతీయ భాషల వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆయా భాషల్లో యూజర్ ఇంటర్ఫేస్ను అంబుబాటులోకి తెచ్చింది. పేటీఎం ఆండ్రారుుడ్ యూజర్ ఇంటర్ఫేస్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుం దని, దీంతో దేశంలోని 10 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్లకు చేరువ కానున్నట్టు కంపెనీ పేర్కొంది.