-
రౌడీషీటర్ హత్య?
జగిత్యాల క్రైం/రాయికల్: విందులో ఏర్పడ్డ చిన్నపాటి గొడవ హత్యకు దారితీసింది. స్నేహితులే ఓ రౌడీషీటర్ను హత్య చేసిన ఘటన మంగళవారం జగిత్యాల జిల్లా సింగరావుపేట శివారులో జరిగింది. అయితే మృతదేహం లభించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల మండలం చల్గల్కు చెందిన బొల్లారపు యశ్వంత్, గాజర్ల కిశోర్ జగిత్యాలలోని అరవింద్నగర్కు చెందిన రౌడీషీటర్ మాద అనిల్కుమార్(21)తో కలిసి సింగరావుపేట శివారులోని ఓ రేకులషెడ్డులో మంగళవారం విందు చేసుకున్నారు. చిన్నపాటి గొడవనే హత్యకు దారితీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం యశ్వంత్, కిశోర్ చల్గల్కు వచ్చి.. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని.. అత్యవసరంగా కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లాలని కారు తీసుకెళ్లారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి గుర్తుతెలియని చోట పడేశారు. తర్వాత యశ్వంత్ అతని మిత్రునికి ఫోన్చేసి కారును మెట్పల్లిలో వదిలిపెట్టామని, తాము అనిల్ను హత్య చేశామని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. కారు యజమాని, అతని మిత్రుడు మెట్పల్లికి వెళ్లి కారును అందులో రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్ సీఐ రాజేశ్, రూరల్ ఎస్సై కిరణ్కుమార్, రాయికల్ ఎస్సై కరుణాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తల్లి ఫిర్యాదుతో రాయికల్ ఠాణాలో కేసు నమోదు చేశారు. అనంతరం జగిత్యాల డీఎస్పీ భద్రయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలంలో రక్తపు మరకలు ఉండడంతో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు దొరికితేనే మృతదేహం లభ్యం? అనిల్కుమార్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు లొంగిపోతే తప్ప మృతదేహం ఎక్కడుందనేది తెలుసుకోవడం కష్టంగా ఉంది. నిందితుల సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్లో ఉండడంతో పోలీసులు పలుకోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రౌడీషీటర్ వాహెద్ దారుణ హత్య
► ప్రత్యర్థిగా మారిన అనుచరుడు ఫెరోజ్ ► పథకం ప్రకారం విందుకు పిలిచి ఘాతుకం ► జహీరాబాద్లో ఘటన ► దందాలో తలెత్తిన విభేదాలే కారణం జహీరాబాద్/సిటీబ్యూరో: హైదరాబాద్కు చెందిన రౌడీషీటర్ సయ్యద్ వాహెద్ (35) జహీరాబాద్లో దారుణహత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక బృందావన్ కాలనీ వద్ద ఉన్న ఓ ఫాంహౌస్లో ఈ హత్య జరిగింది. సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న కథనం ప్రకారం... నగరంలోని బోరబండ పండిట్ నెహ్రూనగర్కు చెందిన పహిల్వాన్ వాహెద్పై సనత్నగర్ ఠాణాలో‡ రౌడీషీట్ ఉంది. ఇతడిపై 11 కేసులున్నాయి. మూడు హత్యలు, మరో మూడు రేప్ కేసుల్లో నిందితుడు. అంతేకాకుండా పండిట్ ¯ð హ్రూనగర్, రాజీవ్గాంధీ నగర్, యూసుఫ్ నగర్, వాహెద్ నగర్ ప్రాంతాల్లో తను అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకొని నేరాలు, సెటిల్మెంట్లు చేసేవాడు. దీంతో పీడీ యాక్ట్ కింద ఏడాది పాటు జైల్లో ఉండి.. ఈనెల 4న జైలు నుంచి విడుదలయ్యాడు. అతని గ్యాంగ్లోనే కొనసాగిన కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఫెరోజ్ సొంతంగా గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ఇతడిపై ఒక హత్యతో పాటు పలు కేసులున్నాయి. వాహెద్ జైల్లో ఉన్న సమయంలో ఫెరోజ్ తన దందాలు ఉధృతం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇదిలా ఉండగా, గతంలో మాదిరిగా కలిసి పనిచేద్దామని ఫెరోజ్.. వాహెద్తో నమ్మబలికాడు. జహీరాబాద్లో విందు ఉందని, అక్కడికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పాడు. జహీరాబాద్కు చెందిన ఇనాయత్తో బీదర్కు చెందిన వ్యక్తి ఫాంహౌస్లో ఫెరోజ్ విందు ఏర్పాటు చేయించాడు. 2.30 గంటల ప్రాంతంలో హత్య శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఫెరోజ్ తన అనుచరులు ఆరుగురితో హైదరాబాద్ నుంచి జహీరాబాద్ చేరుకున్నాడు. సాయంత్రం 6 గంటలకు వాహెద్ ఏడుగురు అనుచరులతో ఫాంహౌస్కు వచ్చాడు. ఫెరోజ్, అతడి మనుషులతో కలిసి గదిలో కూర్చుని వాహెద్ మద్యం తాగాడు. వాహెద్ అనుచరులు మాత్రం ఫాంహౌజ్ బయట కూర్చుని తాగారు. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో వాహెద్పై ఫెరోజ్, అతని మనుషులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశాడు. దీంతో వాహెద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని అనుచరులపై దాడికి యత్నించగా వారంతా పరారయ్యాడు. మృతుడి తమ్ముడు వసీం విషయం తెలుసుకొని ఉదయం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. డీఎస్పీ తిరుపతన్న, సీఐ నాగరాజు, ఎస్సైలు రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్యకు గల కారణాలు సేకరించారు. విందు ఏర్పాటు చేసిన ఇనాయత్ను, ఫాంహౌస్ మేనేజర్ మొయిజ్ను విచారించారు. మద్యం, మగువలతో ఎర వాహెద్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఫెరోజ్ మద్యం, మగువలను ఎరివేసినట్టు తెలుస్తోంది. విందులో 25 మంది వరకు ఉండి ఉంటారని, వారిలో మహిళలు కూడా ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఒక మహిళను గదిలోకి పంపించిన అనంతరం ఫెరోజ్ మనుషులు వాహెద్పై దాడి చేసి ఉండొచ్చని తెలిపారు. హత్యకు గురైన సమయంలో వాహెద్ ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవు, మహిళకు సంబంధించిన వస్రా్తలు కూడా పడి ఉన్నాయి. -
రౌడీషీటర్ దారుణహత్య
పరిచయస్తులపైనే అనుమానం? మృతదేహాన్ని పరిశీలించిన ఏఆర్ ఏఎస్పీ వెంకటాచలం: రౌడీషీటర్ను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి అతిదారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మండలంలోని చెముడుగుంట పంచాయతీ నక్కలకాలనీలో బుధవారం మధ్యాహ్నం జరి గింది. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు నగరంలోని బుజబుజనెల్లూరు భగత్సింగ్ కాలనీకి చెందిన కోడూరు అశోక్కుమార్ (35) బస్సుడ్రైవర్, ఆటో మెకానిక్గా పనిచేసేవాడు. మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండటంతో మొదటి భార్య అతన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో ఉడ్కాంప్లెక్స్ ప్రాంతానికి చెందిన బద్దెపూడి చెంచురామయ్య కుమార్తె ధనమ్మను రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఏడు నెలల కుమార్తె ఉంది. అశోక్కుమార్, ధనమ్మ ఉడ్కాంప్లెక్స్ సమీపంలో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. అశోక్కుమార్పై ఓ హత్య కేసుతో పాటు పలు కేసులు ఉన్నా యి. దీంతో ఇతనిపై నెల్లూరు ఐదోనగర పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. బుధవారం ఉదయం భార్య ధనమ్మతో గొడవపడిన అశోక్కుమార్ తన ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటలకు నక్కలగుంట ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడనే విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్కార్డు అధారంగా భగత్సింగ్కాలనీకి చెందిన అశోక్కుమార్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అశోక్కుమార్ మామ చెంచురామయ్య, అత్త శ్యామలమ్మ సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పరిచయస్తులే హంతకులు అశోక్కుమార్ను అతని పరిచయస్తులే హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్య ధనమ్మతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చిన అశోక్కుమార్కు పరిచయం ఉన్న ఇద్దరు వ్యక్తులు అతని సెల్ఫోన్కు ఫోన్ చేసినట్లు కా ల్స్ డీటైల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని బట్టి చూస్తే నిందితులు పధ కం ప్రకారం అశోక్కుమా ర్ను అక్కడకు రప్పించి గొడ్డళ్లతో మెడ, తలపై నరికి దారుణంగా హత్య చేసినట్లు భావిస్తున్నారు. నిందితులను పట్టుకుంటాం: ఏఆర్ అడిషనల్ ఎస్పీ రౌడీషీటర్ హత్యకేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని ఏఆర్ అడిషనల్ ఎస్పీ సూరిబాబు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హత్యకు గురైన రౌడీషీటర్ అశోక్కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అశోక్కుమార్ హత్యపై అన్నీకోణాల్లో విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అశోక్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన వెంట రూరల్ డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. -
మరో రౌడీపై పీడీ యాక్ట్
యాకుత్పుర: పాతబస్తీకి చెందిన మరో కరుడుగట్టిన రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ ఖాన్ అలియాస్ బార్డర్ యూసుఫ్పై నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. దీం తో పోలీసులు యూసుఫ్ ఖాన్ను ఆదివారం అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. భవానీనగర్కు చెం దిన ఇతనిపై మూడు హత్యలు, హత్యాయత్నం, రెండు స్నాచింగ్, బెదిరింపు కేసులున్నాయి. యూసుఫ్ దశాబ్ద కాలం నుంచి వరుసగా నే ర సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన మాజీ మావోయిస్టు, టీఆర్ఎస్ నాయకుడు కోనపురి రాములు హత్య కేసులో కూడా ఇతడు నిందితుడు. కిరాయి హత్యలు చేయడంలో సిద్ధహస్తుడు. ఇతని ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ చట్టం కింద ఒక్కసారి జైలుకెళ్తే ఏడాది పాటు బెయిల్ రాదు. ఏడాది వరకు కూడా వీరి ప్రవర్తనలో మార్పు వస్తే విడుదల చేస్తారు. లేని పక్షంలో మరో ఏడాది పాటు జైలులో ఉంచే అధికారం పోలీసులకు ఉంటుంది. నెల రోజుల వ్యవధిలో నగర పోలీసులు పది మంది రౌడీషీటర్లను పీడీ యాక్ట్ కింద చర్లపల్లి జైలుకు తరలించారు. పీడీ యాక్ట్పై అరెస్టయిన రౌడీషీటర్లు వీరే..... మహ్మద్ ఇల్యాస్ బిన్ హబీబ్ సలామ్ (గోల్కొండ) మహ్మద్ మాజిద్ (గొల్కొండ) చోర్ కౌసర్ (ఆసిఫ్నగర్) యూసుఫ్ (ఆసిఫ్నగర్) మహ్మద్ ఫిర్దౌస్ (బంజారాహిల్స్ సయ్యద్నగర్) మహ్మద్ లతీఫ్ (మల్లేపల్లి) మహ్మద్ తన్వీర్ (ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్నగర్) పల్లె సుధాకర్రెడ్డి(జూబ్లీహిల్స్) బోడ రాజుల (జూబ్లీహిల్స్) తాజాగా మహ్మద్ యూసుఫ్ ఖాన్ (భవానీనగర్) -
పట్టపగలు రౌడీషీటర్ దారుణ హత్య
బెంగళూరు: పాతకక్షలతో రౌడీషీటర్ను దారుణంగా నరికి చంపిన సంఘటన ఇక్కడి మడివాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బీటీఎం లేఔట్లో నివాసం ఉంటున్న నఖ్రా బాబు (35)ను దారుణంగా హత్య చేశారు. ఇదే ఏడాది జూన్ 24న రాత్రి కర్ణాటక-తమిళనాడు సరిహద్దులలోని సిఫ్కాట్లో బెంగళూరుకు చెందిన రౌడీషీటర్ కవల అలియాస్ విజయ్కుమార్ కారులో వెళ్తుంటే ప్రత్యర్థులు వెంబడించి దారుణంగా రోడ్డుపై వెంటాడి హత్య చేశారు. ఈ కేసులో నఖ్రా బాబుతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. జామీనుపై బయటకు వచ్చిన నిందితులు బెంగళూరులో ఉంటున్నారు. ఇదిలా ఉంటే రెండు వర్గాలు రాజీకి వచ్చారు. మధ్యవర్తుల సమక్షంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇక్కడి బీటీఎం లేఔట్లోని జైభీమానగరలోని వెళ్లారు. ఆ సమయంలో ఇరు వ ర్గాల మధ్య మాటామాటా పెరిగింది. పరస్పరం దాడులకు చేసుకున్నారు. కవలను హత్య చేసిన నఖ్రా బాబును దారుణంగా హత్య చేశారు. అతని వెంట ఉన్న విశ్వ, హీరాలాల్, బాబులకు తీవ్రగాయాలు కావడంతో సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న బెంగళూరు అడిషనల్ పోలీసు కమిషనర్ అలోక్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముందు జాగ్రత చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement