breaking news
rarest
-
ప్రపంచంలోని టాప్ 10 అరుదైన శిలలు
-
వజ్రంలో వజ్రం..బీటింగ్ హార్ట్గా పేరు.. అమూల్యమైన విలువ!
సూరత్: వజ్రాన్ని చూస్తేనే కళ్లు చెదురుతాయి. ధగధగలాడుతూ చూపరుల్ని కట్టి పడేస్తుంది. అలాంటిది వజ్రంలో వజ్రం ఉంటే ఇంక వేరే చెప్పాలా. కళ్లు కూడా తిప్పుకోలేం. అలాంటి అరుదైన వజ్రం గుజరాత్లో సూరత్లో వి.డి. గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి లభించింది. ఆ వజ్రం లోపలున్న వజ్రం కూడా లోపల అటూఇటూ ఎంచక్కా కదులుతోందని ఆ కంపెనీ వెల్లడించింది. 0.329 క్యారట్ల ఈ వజ్రానికి బీటింగ్ హార్ట్ అని పేరు పెట్టారు. వజ్రాల గనుల తవ్వకాల్లో గత ఏడాది అక్టోబర్లో ఈ వజ్రం లభించింది. అరుదైన వజ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ది జెమ్ అండ్ జ్యుయెలరీ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) దానిపై మరింత అధ్యయనం చేసింది. ఆప్టికల్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ ద్వారా విశ్లేషించి 2019లో సైబీరియాలో లభించిన వజ్రం మాదిరిదే బీటింగ్ హార్ట్ కూడానని తేల్చింది. అప్పట్లో సైబీరియాలో లభించిన ఈ వజ్రంలో వజ్రం 80 కోట్ల ఏళ్ల కిందటిదని, విలువ అమూల్యమని చెప్పుకున్నారు. ఆ వజ్రానికి మత్రోష్కా అని పేరు పెట్టారు. రష్యాలో తయారు చేసే ఒక దానిలో ఒకటి ఇమిడిపోయే చెక్క బొమ్మల్ని మత్రోష్కా అని పిలుస్తారు. ఇప్పుడు అచ్చంగా అదే మాదిరి వజ్రం మన దేశంలో కూడా లభించడం విశేషం. ఈ వజ్రం లోపలి వజ్రం కూడా అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. వజ్రాలపై అధ్యయనం చేసే ‘డి బీర్స్’గ్రూప్కు చెందిన నిపుణురాలు సమంతా సిబ్లీ గత 30 ఏళ్లలో బీటింగ్ హార్ట్లాంటి అరుదైన వజ్రాన్ని చూడలేదని చెప్పారు. ఈ వజ్రం ఎలా ఏర్పడిందో అధ్యయనం చేస్తామని తెలిపారు. -
ఉరిశిక్ష అమలు సూర్యోదయానికి ముందే ఎందుకు?
న్యూఢిల్లీః ఇండియాలో తీవ్ర నేరాల్లోనూ అత్యంత అరుదుగా విధించే శిక్షల్లో ఉరిశిక్ష ఒకటి. ఇటీవలి కాలంలో పాకిస్తానీ టెర్రరిస్ట్ అజ్మల్ అమిర్ కసబ్, పార్లమెంట్ దాడుల్లో కీలక నిందితుడైన అఫ్జల్ గురు కేసుల్లో ఉరిశిక్షను అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే అసలు మరణ శిక్షను సమర్థించాలా లేదా అన్న అంశంపై చర్చలు కొనసాగడం అలా ఉంచి.. ఈ ఉరిశిక్షను తెల్లవారు జామునే ఎందుకు అమలు చేస్తారు? అన్న అంశం మాత్రం ఆసక్తిని రేపుతుంది. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తారన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అలా తెల్లవారుజామునే ఈ శిక్ష ఎందుకు అమలు చేస్తారన్న విషయంపై ఆరాతీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఉరిశిక్ష అమలు చేయడం మనం సినిమాల్లోనే చూస్తాం. ఓ ఖైదీకి ఉరిశిక్ష అమలు చేసే సమయంలో అక్కడ సాక్ష్యంగా ఓ తలారి, మెజిస్ట్రేట్ లేదా ఆయన ప్రతినిధి, ఓ వైద్యుడు మరి కొందరు పోలీసులు మాత్రం ఉన్నట్లు చూపిస్తారు. అయితే భారతదేశంలో సూర్యోదయాన్నే ఎందుకు మరణ శిక్షను అమలు చేస్తారు అన్నదానికి మరిన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎంతో శక్తిని కలిగి ఉంటుందని, జైలు అధికారులు అన్ని రకాలుగా పూర్తి దృష్టిని కేంద్రీకరించగల్గుతారని, వారి ఇతర రోజువారీ కార్యక్రమాలపై కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందని తెల్లవారుజామునే ఉరిశిక్షను అమలు చేస్తారని తెలుస్తోంది. అంతేకాక శిక్షను అమలు చేసేందుకు ముందు, తర్వాత ఎన్నో విధానాలను పాటించాల్సి రావడం, వివిధ రకాలైన వైద్య పరీక్షలు నిర్వహించడం, వాటిని పలురకాల రిజిస్టర్లలో నమోదు చేయడం వంటి పనులన్నీ చేపట్టాల్సి ఉంటుంది. దీనికితోడు.. అమలు అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి, అదేరోజు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేపట్టేందుకు వీలుగా భౌతిక కాయాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మరోవైపు సూర్యోదయానికి ముందే... అంటే రోజు ప్రారంభం కాకముందే మరణ శిక్షను అమలు చేయకుంటే.. శిక్ష అనుభవించాల్సి వ్యక్తి రోజంతా మానసిక ఒత్తిడి అనుభవించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాన్ని నిరోధించేందుకు కూడా తెల్లవారుజామున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సమాజంనుంచీ ఎదురయ్యే అకస్మాత్ పరిణామాలను నిరోధించేందుకు, వారినుంచీ ఎదురయ్యే వ్యతిరేక సమస్యలు నిరోధించేందుకు అంతా నిద్రలో ఉండే సమయంలో.. సూర్యోదయానికి ముందే ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.