breaking news
ranjith sinha
-
సీబీఐ చీఫ్గా ఢిల్లీ మాజీ సీపీ!
ప్రతిష్టాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధిపతిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ అలోక్ వర్మ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అలోక్ వర్మ రెండేళ్ల పాటు సీబీఐ డైరెక్టర్గా సేవలు అందించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నియామక కమిటీలో ప్రధానితోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్సింగ్ ఖేహర్, లోక్సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే కూడా ఉన్నారు. సీబీఐ డైరెక్టర్ అనిల్ సిన్హా డిసెంబర్ 2న పదవీ విరమణ చేయడంతో అప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. వర్మ ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-యూనియన్ టెర్రిటరీ)కి చెందిన 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో దేశ రాజధాని ఢిల్లీలో, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరిలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. దేశాన్ని కుదిపేసిన బొగ్గు కేటాయింపుల కుంభకోణం దర్యాప్తును సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న అభియోగాలతో ఆయనపై పాత్రపై దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఆ సంస్థకు, ప్రత్యేకించి కొత్తగా దాని సారథ్య బాధ్యతలు స్వీకరించిన అలోక్ వర్మకు సవాల్గా మారిన సంగతి తెలిసిందే. -
సీబీఐకి పరీక్షాసమయం
చేసిన తప్పులు శాపాలై వెంటాడతాయని సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్సిన్హాకు ఆలస్యంగా అర్ధమై ఉంటుంది. బొగ్గు కుంభకోణం దర్యాప్తును రంజిత్ ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న అభియోగాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఆయనపై పాత్రపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించడం ఆ సంస్థకు, ప్రత్యేకించి కొత్తగా దాని సారథ్య బాధ్యతలు స్వీకరించిన అలోక్ కుమార్ వర్మకు అగ్నిపరీక్షలాంటిది. గత కొన్నేళ్లుగా సీబీఐ తీరుతెన్నులు ప్రజాస్వామికవాదుల్ని కలవరపరుస్తున్నాయి. అది పాలకుల చేతిలో పనిముట్టుగా మారిందని సాక్షాత్తూ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించినా, సక్రమంగా వ్యవహరించాలని హెచ్చరించినా దానిలో మార్పు రాలేదు. దేశంలోని దర్యాప్తు సంస్థలన్నిటికీ తలమానికంగా ఉండాల్సిన ఆ సంస్థ పాలకుల చేతిలో కీలుబొమ్మ అయింది. దేశాన్ని పట్టి కుదిపిన లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాన్ని దర్యాప్తు చేయమని సర్వో న్నత న్యాయస్థానం ఆదేశిస్తే... ఆ దర్యాప్తు క్రమాన్నే కుంభకోణంగా మార్చిన ఘనత సీబీఐదే! బొగ్గు కుంభకోణంలో సుప్రీంకోర్టుకు ఎప్పటికప్పుడు అందించాల్సిన పురో గతి నివేదికలను అంతకన్నా ముందు నిందపడినవారికే చూపుతున్నదని మీడియా వెల్లడించినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. అందులో ఆవగింజంత నిజం కూడా లేదని వాదిస్తూ వచ్చిన సీబీఐ తీరా ఆ మాటే అఫిడవిట్ రూపంలో ఇవ్వా లని సుప్రీంకోర్టు ఆదేశించాక లొంగివచ్చింది. ‘చూపించడం నిజమే...ఇకపై ఆ పని చేయబోమని రంజిత్సిన్హా అంగీకరించాల్సి వచ్చింది. ఆ చూపినవేమిటో కాస్త వివ రించమని నిలదీశాక పరువు బజారున పడింది. ఫలానా అఫిడవిట్లో ఫలానా వాక్యాలు మారాయని సీబీఐ ఇచ్చిన జాబితాను అధ్యయనం చేశాక నివేదిక మౌలిక స్వరూపమే మారిపోయిందని న్యాయమూర్తులు నిర్ధారణకొచ్చారు. ఇదింకా చల్లా రకముందే సీబీఐ విశ్వసనీయతనూ, ప్రత్యేకించి రంజిత్సిన్హా వ్యక్తిత్వాన్ని ప్రశ్నా ర్ధకం చేసే మరో కథనం వెలుగులోకొచ్చింది. వివిధ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నవారు ఆయనను వచ్చి కలుస్తున్నారని ప్రశాంత్భూషణ్ నేతృత్వంలోని కామన్ కాజ్ సంస్థ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. అదంతా అబద్ధమని, తన ఇంటి వద్ద ఉంచే లాగ్ బుక్లో గుర్తు తెలియని వ్యక్తులు కావాలని కొందరి పేర్లు చేర్చారని మొదట్లో కొట్టిపారేసిన సిన్హా, ‘అలా కలిస్తే తప్పేముంది... నా ఇంటి తలుపులు ఎవరికైనా తెరిచే ఉంటాయ’ని చెప్పేవరకూ వచ్చారు. పైగా ఆ వచ్చినవారు కేసుల్లో నిందితులైతే కావొచ్చు... అంతకన్నా ముందు వారు నా స్నేహితులు అని అడ్డగోలు వాదన మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ అంశంలోనే సుప్రీంకోర్టు రంజిత్సిన్హాపై దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ స్థాయి అత్యున్నత సంస్థకు సారథ్యం వహించిన మాజీ డైరెక్టర్పై కేసు పెట్టి దర్యాప్తు జరపాలనడం దేశ చరిత్రలో ఇది తొలిసారి. ఇది ప్రస్తుత డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మకు వ్యక్తిగతంగా కూడా పెద్ద సవాలే. ఎందుకంటే ఆ దర్యా ప్తునకు నేతృత్వం వహించాల్సింది ఆయనే. అయితే ఉన్నంతలో సుప్రీంకోర్టు సీబీఐ పరువు నిలిపినట్టే. ఎందుకంటే ఈ దర్యాప్తును మరో సంస్థకు అప్పజెప్పి ఉంటే సీబీఐకి అదో మచ్చగా మిగిలిపోయేది. సర్వోన్నత న్యాయస్థానం దాన్ని విశ్వ సించడం లేదన్న సందేశం వెళ్తే ఆ సంస్థ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లేది. తన మాజీ డైరెక్టర్పై వచ్చిన ఆరోపణల విషయంలో సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకపోవచ్చునన్న సందేహాలను కొట్టిపారేస్తూ సారథి మారారు గనుక సంస్థపై తమకు నమ్మకమున్నదని న్యాయమూర్తులు చెప్పారు. దాన్ని సీబీఐ నిలబెట్టుకోగ లుగుతుందా? ఇది ఆ సంస్థకు జీవన్మరణ సమస్య. సిన్హా తప్పు చేశారని న్యాయ మూర్తులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఆ విషయంలో మరింత కూలంక షంగా దర్యాప్తు జరపాలని భావించారు. నిజానికి రంజిత్సిన్హా నియామకం సమ యంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని, విపక్ష నేత తదితరులుండే కమిటీ ద్వారానే అత్యున్నత స్థాయి సంస్థల సారథులను ఎంపిక చేయాలన్న ప్రతి పాదన రూపుదిద్దుకుంటున్న సమయంలోనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం హడా వుడిగా రంజిత్ నియామకాన్ని పూర్తి చేసింది. సీబీఐని అధికారంలో ఉన్నవారు పంజరంలో చిలుకగా మార్చారని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని తనకు విస్తృత అధికారాలు రావడం కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. సంస్థ డైరెక్టర్కు సంపూర్ణ అధికారాలిస్తే తప్ప సమర్ధవంతంగా పనిచేయడం సాధ్యపడదని సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో చెప్పారు. అలా చెప్పిన వ్యక్తి అందుకు తగ్గట్టు ఉన్నత వ్యక్తిత్వాన్ని కనబరిస్తే, విశ్వసనీయతను సాధించే విధంగా ప్రవర్తిస్తే వేరుగా ఉండేది. కానీ సిన్హా పనితీరు అడుగడుగునా సందేహాలనే మిగిల్చింది. అయితే ఇది కేవలం సీబీఐకి, రంజిత్సిన్హాకు మాత్రమే సంబంధించిన, పరిమితమైన సమస్య కాదు. దేశంలో దాదాపు అన్ని సంస్థల పనితీరు అలాగే ఉంటున్నది. వాటి సారథులు ఆ సంస్థల పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నారు. నిజానికి అలాంటి ‘సమర్థత’ ఉన్నవారికే ఉన్నత పదవులొస్తున్నాయి. అవార్డులు, రివార్డులు లభిస్తున్నాయి. ఈ ధోరణిని ఆపాలంటే ఎక్కడో ఒకచోట కఠినంగా వ్యవహరించక తప్పదు. నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు చర్యలు తీసుకోక తప్పదు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణమైనా, బొగ్గు కుంభకోణమైనా స్వయంగా సుప్రీం కోర్టే పర్యవేక్షించిన కేసులు. కనీసం అందుకోసమైనా జాగ్రత్తగా వ్యవహరించాలని, నింద పడకుండా చూసుకోవాలని సీబీఐగానీ, రంజిత్సిన్హాగానీ అనుకోలేదు. పాలకుల కటాక్షవీక్షణాలుంటే తమకేమీ కాదన్న భరోసాయే దీనికి కారణం. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అలాంటి మనస్తత్వం ఉన్నవారిలో నిస్సం దేహంగా పరివర్తన తీసుకొస్తాయి. ప్రజాస్వామ్యంలో తాము ఎవరికి జవాబు దారీగా ఉండాలో, తమ విధులను ఎంత జాగ్రత్తగా నిర్వహించాలో గ్రహించేలా చేస్తాయి. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సీబీఐదే. -
సీబీఐ డైరెక్టర్కు చుక్కెదురు
ప్రజావేగు పేరు తెలియకపోయినా విచారిస్తామన్న సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: 2జీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హాకు సోమవారం సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఇంటి వద్ద సందర్శకుల జాబితాలో వివాదాస్పద నమోదులపై సమాచారం ఇచ్చిన ప్రజావేగు పేరు తెలియకపోయినా ఆయనపై వచ్చిన ఆరోపణలపై దాఖలైన ఫిర్యాదును విచారించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది. జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయంలో 2జీ కేసుల విచారణ కోసం నియమించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్పీపీ) సహాయాన్ని కోరింది. సీల్డ్ కవర్లో ప్రజావేగు పేరు తెలపాలని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరతూ ఎన్జీవో దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అదే సమయంలో ప్రజావేగు పేరు వెల్లడించడానికి ఆ ఎన్జీవో నిరాకరించడంతో ఈ కేసును ఇక్కడితో ముగించాలంటూ సీబీఐ డెరైక్టర్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ చేసిన వాదనను ధర్మాసనం తిప్పికొట్టింది. తనపై వచ్చిన ఫిర్యాదులపై ఒక్క రోజు విచారణ కొనసాగినా అది 2జీ కేసులపై ప్రభావం చూపి ప్రజలకు చేటు చేస్తుందని రంజిత్ వేడుకోగా.. తాము అలా భావించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ ఫైళ్లు, రంజిత్ సిన్హాపై ఆరోపణలకు సంబంధించిన సందర్శకుల జాబితాతో పాటు అన్ని పత్రాలను ఎస్పీపీ ఆనంద్ గ్రోవర్కు అప్పగించాలని ధర్మాసనం సూచించింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి వచ్చే నెల 10న జరిగే తదుపరి విచారణలో గ్రోవర్ కోర్టుకు సహకరిస్తారని ధర్మాసనం పేర్కొంది. అంతకు ముందు కోర్టు ఆదేశాలిచ్చినా ఆ ప్రజావేగు పేరు తెలపకపోవడంపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ భేషరుతుగా క్షమాపణ కోరారు. -
సీబీఐ చీఫ్ వ్యాఖ్యలపై దుమారం
ఇషత్ర్ కేసులో అమిత్ షాను ఇరికిస్తే యూపీఏ సంతోషించేదని రంజిత్ అన్నట్లు ఆంగ్లపత్రిక కథనం ఖండించిన సీబీఐ న్యూఢిల్లీ: ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్ కేసు చార్జిషీటులో బీజేపీ నేత అమిత్ షా పేరును నిందితునిగా చేర్చినట్లయితే యూపీఏ ప్రభుత్వం సంతోషించేదని సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా వ్యాఖ్యానించిట్టుగా ఢిల్లీకి చెందిన ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం వివాదానికి దారితీసింది. అయితే దీనిని సీబీఐ ప్రతినిధి ఖండించారు. సిన్హా అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి అమిత్ షా సన్నిహితుడనే విషయం తెలిసిందే. ఇషత్ ్రఎన్కౌంటర్ వ్యవహారంలో మాజీ హోంమంత్రి అమిత్షా(ఎన్కౌంటర్ జరిగిన సమయంలో హోంమంత్రిగా ఉన్నారు)ను ప్రశ్నించినప్పటికీ ఆయన పేరును సీబీఐ చార్జిషీటులో పేర్కొనలేదు. అయితే ఆయన పేరును నిందితునిగా చేర్చినట్లయితే యూపీఏ ప్రభుత్వం సంతోషించేదని, కానీ తాము సాక్ష్యాధారాలకు అనుగుణంగా వ్యవహరించామని, అమిత్ షాను ప్రాసిక్యూట్ చేయతగిన సాక్ష్యాలేవీ లేవని కనుగొన్నట్టు సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా పేర్కొన్నట్టు ఢిల్లీకి చెందిన ఓ ఆంగ్ల బిజినెస్ దినపత్రిక తన కథనంలో పేర్కొంది. దీనిపై సీబీఐ అధికార ప్రతినిధి ఒకరు శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సీబీఐ డెరైక్టర్ అటువంటి వ్యాఖ్యలేమీ చేయలేదని, ఆయన వ్యాఖ్యలను తప్పుగా పేర్కొన్నారని స్పష్టం చేశారు. సీబీఐ నిష్పాక్షికమైన, రాజకీయాలతో సంబంధం లేని సంస్థ అని తెలిపారు. ఇషత్ ్రజహాన్ కేసులో సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపిందని వివరించారు. ఇదిలా ఉండగా అమిత్ షాను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిని దెబ్బతీయడానికి సీబీఐపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నించిందనేందుకు సీబీఐ డెరైక్టర్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని బీజేపీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ విమర్శించారు. దీనిపై జనతాదళ్(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ స్పందిస్తూ.. రాజకీయపార్టీల గురించి ఇంతవరకు ఏ సీబీఐ డెరైక్టర్ కూడా ఇటువంటి ప్రకటనలు చేయలేదని మండిపడ్డారు. ఆయన తనకున్న అధికార పరిధుల మేరకు వ్యవహరించాలని హితవు పలికారు.