-
12th ఫెయిల్ డైరక్టర్ కొడుకు ప్రపంచ రికార్డ్..!
-
ఐదేళ్ల తర్వాత సాధించారు
లక్నో: ఎట్టకేలకు హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్కు అర్హత సాధించింది. ఆంధ్ర జట్టుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ను డ్రా చేసుకున్న బద్రీనాథ్ బృందం గ్రూప్ ‘సి’లో టాపర్గా నిలిచింది. తద్వారా ఈ సీజన్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన హైదరాబాద్ జట్టు వచ్చే ఏడాది మేటి జట్లతో తలపడే అవకాశాన్ని పొందింది. ఐదేళ్ల తర్వాత మన జట్టు ‘ఎలైట్’ ఇన్నింగ్స ఆడనుంది. గతంలో 2011లో చివరిసారిగా హైదరాబాద్ జట్టు ఎలైట్లో ఆడింది. మంచుకురిసే వేళలో...: రెండో రోజులాగే శనివారం చివరి రోజు కూడా లంచ్ విరామం తర్వాత... చాలా ఆలస్యంగా ఆట మొదలైంది. పొద్దుపోయాక కూడా ఎంతకీ తెరిపినివ్వని పొగమంచు ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో తొలి సెషన్ అంతా మంచుదుప్పటిలో తుడిచిపెట్టుకుపోయింది. తర్వాత కేవలం 40 ఓవర్ల ఆటే సాగింది. చివరకు డ్రా ఫలితంతో ఆంధ్ర జట్టు 3, హైదరాబాద్ ఒక పాయింట్ పొందాయి. దీంతో హైదరాబాద్ 31 పారుుంట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మళ్లీ తడబాటు...: నాలుగో రోజు 219 పరుగుల లక్ష్యంతో 13/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స కొనసాగించిన హైదరాబాద్ మ్యాచ్ ముగిసే సమయానికి 47 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. టాప్ఆర్డర్ బ్యాట్స్మెన్ మళ్లీ రెండో ఇన్నింగ్సలోనూ తడబడ్డారు. ఆట మొదలైన తొలి ఓవర్లోనే అనిరుధ్ (2) శివకుమార్ బౌలింగ్లో క్లీన్బౌల్డయ్యాడు. దీంతో ఓవర్నైట్ స్కోరు వద్దే రెండో వికెట్ను కోల్పోయింది. తర్వాత ఓపెనర్ అక్షత్ రెడ్డి (5), బావనక సందీప్ (13) జతరుునప్పటికీ... వీరిద్దరూ ఎక్కువసేపు నిలువలేకపోయారు. అనంతరం వచ్చిన హిమాలయ్ అగర్వాల్ (0) కూడా చేతులెత్తేయడంతో హైదరాబాద్ 36 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోరుు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ బద్రీనాథ్ (14 నాటౌట్), కొల్లా సుమంత్ (10 నాటౌట్) మరో వికెట్ పడకుండా 20 ఓవర్లపాటు జాగ్రత్తగా ఆడారు. మ్యాచ్ నిలిచే సమయానికి నాటౌట్గా నిలిచారు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్ 2, భార్గవ్ భట్, శివకుమార్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స: 190; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స: 143; ఆంధ్ర రెండో ఇన్నింగ్స: 171/6 డిక్లేర్డ్ హైదరాబాద్ రెండో ఇన్నింగ్స: తన్మయ్ రనౌట్ 9; అక్షత్ రెడ్డి (సి) భార్గవ్ (బి) విజయ్ కుమార్ 5; అనిరుధ్ (బి) శివకుమార్ 2; సందీప్ (సి) ప్రణీత్ (బి) భార్గవ్ 13; బద్రీనాథ్ నాటౌట్ 14; హిమాలయ్ (సి) భరత్ (బి) విజయ్ కుమార్ 0; సుమంత్ నాటౌట్ 10; ఎక్స్ట్రాలు 3; మొత్తం (47 ఓవర్లలో 5 వికెట్లకు) 56. వికెట్ల పతనం: 1-9, 2-13, 3-28, 4-30, 5-36. బౌలింగ్: విజయ్ కుమార్ 19-12-13-2, స్టీఫెన్ 6-3-10-0, భార్గవ్ భట్ 14-3-21-1, శివకుమార్ 7-3-12-1, రవితేజ 1-1-0-0. -
42 ఫోర్లు.. 9 సిక్సర్లు!
ముంబై: దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో భాగంగా ఇక్కడ మహారాష్ట్రతో జరిగిన రంజీ మ్యాచ్లో మరో సంచలన ఇన్నింగ్స్ నమోదైంది. ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ (308: 326 బంతుల్లో 42 ఫోర్లు, 9 సిక్సర్లు) విజృంభించి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ రెచ్చిపోయాడు. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటునే, చెత్త బంతులను మాత్రం బౌండరీలు దాటించాడు. కాగా, అంతకుముందు ఇదే మ్యాచ్ లో మహారాష్ట్ర ఆటగాళ్లు స్వప్నిల్ గుగలే(351నాటౌట్), అంకిత్ బావ్నే(258నాటౌట్) మూడో వికెట్కు అభేద్యంగా 594 పరుగులు జోడించి దేశవాళీ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. తద్వారా తొలిసారి ఒకే రంజీ మ్యాచ్ లోముగ్గురు 250కు పైగా వ్యక్తిగత పరుగులను నమోదు చేసిన మరో రికార్డు లిఖించబడింది. చివరిరోజు ఆటలో భాగంగా 155 పరుగులతో ఓవర్ నైట్ బ్యాట్స్మన్ గా క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ దూకుడుగా ఆడి ట్రిపుల్ ను సాధించాడు. ఈ క్రమంలోనే రెండొందలకు పైగా పరుగులను ఫోర్లు, సిక్సర్లతోనే సాధించి ఢిల్లీని పటిష్ట స్థితికి తీసుకెళ్లాడు. దాంతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్ లో 590 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్ ను 635/2 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఇన్నింగ్స్ తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మహారాష్ట్ర ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
ఆంధ్రకు ఇన్నింగ్స్ ఓటమి
ఇండోర్: రంజీ ట్రోఫీలో భాగంగా ఇక్కడ మధ్యప్రదేశ్ తో జరిగిన గ్రూప్ -బి లీగ్ మ్యాచ్ లో ఆంధ్ర ఇన్నింగ్స్ తొమ్మిది పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 159/5 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం తన రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 78.3 ఓవర్లలో 214 పరుగులకు చాపచుట్టేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్ లో 56 పరుగులు మాత్రమే చేసి ఫాలో ఆన్ ఆడిన ఆంధ్రను మధ్య ప్రదేశ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అంకిత్ శర్మ ఏడు వికెట్లతో వెన్నువిరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసిన అంకిత్ అదే ఊపును రెండో ఇన్నింగ్స్ లో కూడా కొనసాగించి ఆంధ్ర పతనాన్ని శాసించాడు. ఆంధ్ర ఆటగాళ్లలో ప్రశాంత్(49), కెప్టెన్ మహ్మద్ కైఫ్(51), ప్రదీప్(62)లు ఆకట్టుకున్నా జట్టును ఓటమిని తప్పించలేకపోయారు. బుధవారం రెండో రోజు ఆటలోనే ఆంధ్ర పదిహేను వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ తాజా విజయంతో మధ్య ప్రదేశ్ క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ 279 ఆలౌట్ ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 56 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 214 ఆలౌట్
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
'ఇడియట్ సిండ్రోమ్' అంటే ఏంటీ..? ప్రమాదకరమా..?
సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
టీడీపీతో కుమ్మక్కు.. ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement