-
లోహియా లోకదర్శన సులోచనాలు!
తెలుగువారికి రామమనోహర్ లోహియా ఒక భారత సామ్యవాద నాయక శిరోమణిగానే తెలుసు. హిందూమతం పైనా, పురాణ గాథల పైనా ఆయన చేసిన ప్రగాఢ పరిశోధనలూ, ఆలోచనలూ మనకు దూరంగానే ఉండిపోయాయి. లోహియా ఇతిహాస వ్యాసాల పుస్తకం ఆయనలోని ఈ కోణాన్ని చేరువ చేస్తుంది. పురాణ పాత్రల మీద వెలుగు అన్నట్టేగానీ, ఆ పేరుతో అనేక రాజకీయ, సామాజిక, చారిత్రక సత్యాలు చాటారు. ఉత్తరాది వారు రావణ, కుంభకర్ణాదుల్ని దక్షిణాది వారిగా, రాక్షసులుగా చిత్రించి వధించే ధోరణిని తూర్పారబట్టారు. ఆయన దృష్టిలో శ్రీరాముడు ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య ఐకమత్యానికి ప్రతీక కాగా, శ్రీకృష్ణుడు తూర్పు–పడమరల ఏకత్వానికి ప్రతీక. ‘‘నాకు అవకాశం దొరకాలే గానీ ఈ భూమండలం సహా, యావత్తు గ్రహరాశిని సొంతం చేసుకొని ఏలుబడిలోకి తెచ్చుకొంటాను.’’ – భూస్వామ్య వ్యవస్థలో కూలి నాలి చేసుకొని బతికే శ్రమజీవుల కాయకష్టానికి విలువ కట్టిన ప్రసిద్ధ ఆర్థికవేత్త రికార్డో ప్రకటన. పరాయి వలస పాలనకు వ్యతిరేకంగా అసమాన త్యాగాలతో పోరాడి దాన్నుంచి విముక్తి సాధించుకున్నారు వివిధ ఖండాల ప్రజలు. అయితే విమోచన తరువాత కూడా (స్వతంత్ర భారతం సహా) స్థానిక పాలకుల స్వార్థ ప్రయోజనాల వల్ల దోపిడీ వ్యవస్థలో మౌలికమైన మార్పు రాలేదు. ఈ సత్యాన్ని చాటినవారు భారత స్వాతంత్య్ర పోరాటంలో తలమునకలై తన సమకాలీన రాజకీయ సహచరుల పోకడలనూ, సైద్ధాంతిక రంగంలో ఆటుపోట్లనూ దగ్గ రుండి గమనించిన రామమనోహర్ లోహియా. ఇటీవల లోహియా ఇతిహాస వ్యాసాల పేరిట ‘పురాణ పాత్రలపై కొత్త వెలుగు’ మకు టంతో లోహియా సమతా ట్రస్ట్ నిర్వాహకులు, నిరంతర అధ్యయన శీలి రావెల సోమయ్య ఒక ఉత్తమ సంకలన గ్రంథాన్ని ప్రచురించారు. రిషితుల్యుడు, ఆసియాలో తొలి సామ్యవాదిగా పేరెన్నికగన్న స్వామి వివేకానందకు ఈ సంపుటిని అంకితమిచ్చారు. పేరుకు ‘పురాణ పాత్ర’లపై ప్రసరించిన కొత్త వెలుగే. కానీ దాని చాటున అనేక రాజకీయ, సామాజిక, చారిత్రక సత్యాలు ఉన్నాయి. ఇంతవరకూ తెలుగువారికి లోహియా ఒక భారత సామ్యవాద నాయక శిరోమణిగానే తెలుసు. హిందూమతం పైనా, పురాణ గాథల పైనా ఆయన చేసిన ప్రగాఢ పరిశోధనలూ, ఆలోచనలూ హిందీ భాషా ప్రియులకు మాత్రమే లభ్యమవుతూ వచ్చాయి. ఆ లోటు ప్రస్తుత తెలుగు సంకలనంతో కొంతవరకు తీరుతుంది. పురాణ పాత్రల ప్రస్తావనలో కూడా లోహియా ఆధారపడింది ‘రొడ్డ కొట్టుడు’ సరుకు మీద కాదు. ఎకాఎకిని ఏ మహోన్నతుని భావదీప్తిని అందిపుచ్చుకోవాలో సరిగ్గా ఆ ఉద్దండుని ‘సహవాసాన్నే’ లోహియా కోరుకున్నాడు. ‘అవధి’ అనే స్థానిక ప్రజల భాషకు వ్యతి రేకులైన సంస్కృత ఛాందసుల ఆగడాలను అతి కష్టం మీద వ్యతి రేకించి నిలబడిన పండిత తులసీదాస్ రామాయణ రచనను ప్రేమిం చినవాడు లోహియా! స్థానిక భాష ‘అవధి’లో రచించిన రామాయ ణాన్ని కాపాడుకోవడానికి తులసీదాస్ పడిన కష్టాలు వర్ణనాతీతం. ఆ సమయంలో తులసీదాస్ గ్రంథాన్ని భద్రంగా కాపాడిన వ్యక్తి ముస్లిం సోదరుడు. రామలీల ఉత్సవాల్ని జరిపే ఉత్తరాది వారు రావణ, కుంభకర్ణాదుల్ని దక్షిణాది వారిగా, రాక్షసులుగా చిత్రించి వధించే ధోర ణిని తూర్పారబట్టినవాడు లోహియా. ఆయన దృష్టిలో శ్రీరాముడు ఉత్తర–దక్షిణ భారతదేశాల మధ్య ఐకమత్యానికి ప్రతీక కాగా, శ్రీకృష్ణుడు తూర్పు–పడమరల ఏకత్వానికి ప్రతీక. ఛాందసుల మాటేమోగానీ, లోహియాకు మాత్రం హిందూ మతంలోనే లోపాయికారిగా పాతుకుపోయిన రాజకీయ దూరదృష్టి ఆశ్చర్యం కల్గించింది. ఎందుకంటే, లోహియా భావనలో మతం, రాజనీతి పరిధులు, ఆశయాలు, వాటి పాటింపు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి వాటిని కలపకూడదు. ఎందుకని? ‘‘మతం దీర్ఘకాలం ఉండే రాజనీతి కాగా, రాజనీతి అనేది కొంతకాలం మాత్రమే సాగే మతం’’! మతం, రాజనీతుల్లో వివేకం లేకుంటే అవి రెండూ కలిసిపోయినప్పుడు దేశం నాశనమవుతుం దన్నాడు లోహియా! ‘‘రాజకీయ క్షేత్రంలో మతం చొరబడిపోయి దేశంలో ఎంత ఉద్వేగం, ఉద్రేకం, హింస, ద్వేషాలు ప్రబలిపోతు న్నాయో నేను కళ్లారా చూస్తున్నాను. దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే మత కార్యకలాపాల్ని అరికట్టక తప్పదు’’! చరిత్రకారుడు విల్ డూరాంట్ తన ‘లెసన్స్ ఆఫ్ హిస్టరీ’లో సోష లిస్టు, క్యాపిటలిస్టు పరిణామ దశల గురించి వెలిబుచ్చిన భావాలతో లోహియా ఏకీభవిస్తున్నట్టు కన్పిస్తుంది: ‘‘పెట్టుబడిదారీ విధాన వ్యాప్తి గురించిన భీతితో సోషలిజం తన స్వేచ్ఛా పరిధిని విస్తృతం చేసుకొనక తప్పని స్థితి ఏర్పడినట్టే, సోషలిస్టు వ్యవస్థ విస్తృతిని గమనించి పెట్టుబడీదారి వ్యవస్థ కూడా తన సమానత్వ పరిధిని విస్తృత పరుచుకొనక తప్పలేదు. ఫలితంగా రెండు విభిన్న ధృవాలూ త్వరలో ఏకమయ్యే పరిస్థితి ఉత్పన్నం కావొచ్చు’’! సోషలిజానికి శాశ్వత నిర్వచనాలుండవు, దాని నిత్య పరిణా మంలో కొత్తగా అన్వేషిస్తూ ఉండవలసిందేనని లోహియా భావన. అంతేగాదు, మన తెలుగు భాషకు లోహియా అర్థవంతమైన భాష్యం కూడా చెప్పడం విశేషం! ‘‘తెలుగు భాషలో ‘ఉ’కారాంత పదాలు తర చుగా దొరకడానికీ, తులసీదాస్ రాసిన ‘అవధి’ భాషలోనూ, తులసీ రామాయణంలోనూ ఈ ‘ఉ’కారాంత పదాలు ఎక్కువగా ఉండటాన్నీ లోహియా పేర్కొంటాడు. పదాల చివర్లో ‘ఉ’ కలిపితే పదానికి తీపి దనం ఎక్కువవుతుందనీ, ఈ పద మాధుర్యం వెనుక విజయపురిని పాలించిన ఇక్ష్వాకు రాజుల భాషా ప్రభావం ఉండి ఉండవచ్చనీ, ఈ కారణం వల్లనే ఆంధ్రప్రదేశ్ నుంచి ‘ఉ’ అయోధ్యకు చేరిందో, లేదా అయోధ్య నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లిందో తాను చెప్పలేననీ, కానీ, అవధి, తెలుగు భాషా పదాల పరస్పర వాడకం నిజంగా జరిగిందా అని మాత్రం తెలుసుకోవడం తనకిష్టమనీ అంటాడు. దీనివల్లే లోహియా అనేక ప్రాంతీయ భాషా శాసనాలను ఆసక్తితో చూడటం విశేషం. కానీ ఒక్క అనుమానం – ఎన్నో విషయాలపైన ఇంతగా సాధి కార వ్యాఖ్యలు అందించగల్గిన లోహియాకు క్రీస్తుపూర్వం 2100 సంవత్సరం నాటికే సుమేరియా నాగరికత సంపన్న పాలకుల ఆస్తిపాస్తులను, సేద్య యోగ్యమైన భూసంపదను ఎలా, ఏ పద్ధతుల ద్వారా పేద ప్రజలకు పంచి దుర్భిక్ష పరిస్థితులు తలెత్తకుండా చేయ గలిగిందో అవగాహన లేకపోవడం ఒక మహా సోషలిస్టు నాయకుడిలో లోపంగా భావించవచ్చా?! ఎందుకంటే, అమెరికన్ మహా కోటీశ్వ రుల్లో బలవంతుడైన రాక్ఫెల్లర్ కొడుకు జాన్ డి. రాక్ఫెల్లర్ అమెరికా లోని ఘరానా ప్రయివేట్ ట్రస్ట్ కంపెనీల గురించి ప్రస్తావిస్తూ ఓ గొప్ప నిజాన్ని బహిర్గతం చేశాడు: ‘‘అందమైన అమెరికన్ గులాబీ రోజాను దాని అందచందాలతో, మధుర సువాసనలతో పెంచడం మహా సులభమే. కానీ ఎలా? ఈ పెద్ద గులాబీని ఆసరా చేసుకొని దాని చుట్టూ మొగ్గ తొడుగుతూన్న చిన్న గులాబీలను కాస్తా తుంచి పారేయడం ద్వారా. ఆ పద్ధతిలో ఎదిగినవే అమెరికన్ ట్రస్టు కంపెనీ లన్నీ.’’ జూనియర్ రాక్ఫెల్లర్ మార్క్సిజం పరీక్షకు తనను తాను గురి చేసుకొన్నాడో లేదో తెలియదుగానీ, పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించే అసమ సామాజిక, అరాచక పరిస్థితులను బలైపోయిన శిశు ‘రోజా’ ఉదాహరణ ద్వారా బహిర్గతం చేయగలిగాడు. నూరేళ్ల క్రితమే ఇంగ్లండ్ మహాకవి షెల్లీ ‘ఇంగ్లండ్ ప్రజలకు విన్నపం’ పేరిట ఇచ్చిన సందేశం విశ్వగీతికగా మార్మోగిపోయింది. పారిశ్రామిక విప్లవానంతరం పెట్టుబడిదారీ విధాన ఫలితాల వల్ల కష్ట జీవులైన కార్మిక కుటుంబాలు అనుభవిస్తున్న వ్యథలను గమనించి, ఆ కష్టాలకు కర్మ సాక్షిగా ఆయన నిలబడ్డాడు. ‘‘కష్ట జీవులారా! మీరు నాటే విత్తనాన్ని మరొకడుఅనుభవిస్తున్నాడు, నీవు సృష్టించే సమాజ సంపదను మరొకడెవడో దొంగిలిస్తున్నాడు, నీవు నేసే బట్టలను మరొకడెవడో ధరిస్తున్నాడు, నీవు సృష్టించే ఆయుధాల్ని మరొకడు ధరిస్తున్నాడు. విత్తనం నువ్వే నాటు, కానీ నియంతకు అందనివ్వకు, సంపదను సృష్టించు, కానీ దుర్మార్గ పాలకుడికి అందనివ్వకు, దుస్తులు కుట్టు, కానీ సోమరిపోతుకు అందనివ్వకు ఆయుధాలు తయారుచెయ్యి, కానీ వాటిని నీ రక్షణకే ఉపయోగించు.’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
క్విట్ ఇండియా సీక్రెట్ సెగ ఏడు గుర్రాల రేడియో
‘క్విట్ ఇండియా’ ఉద్యమ సమయంలో 1942 ఆగస్టు 27 నుంచి నవంబర్ 12 వరకు.. అంటే బ్రిటిష్ ప్రభుత్వం కనిపెట్టేవరకు 78 రోజుల పాటు రామ్ మనోహర్ లోహియా అజ్ఞాత ప్రదేశాల్లోంచి నడిపించిన సీక్రెట్ రేడియో (బ్రిటిష్వారి దృష్టిలో ‘కాంగ్రెస్ ఇల్లీగల్ రేడియో’).. అదే ఏడాది జర్మనీలో సుభాస్ చంద్రబోస్ ప్రారంభించిన ‘ఆజాద్ హింద్ రేడియో’కు భిన్నమైనది. క్విట్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ తర్వాతి ఏడాది 2018లో కేంద్రప్రభుత్వ సంస్థ పబ్లికేషన్ డివిజన్ ప్రచురించిన ‘అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డ్యూరింగ్ క్విట్ఇండియా మూవ్మెంట్’ అనే పుస్తకంలో ఆ సీక్రెట్ రేడియోకు సంబంధించి విస్మయకరమైన అనేక వివరాలు ఉన్నాయి. ఐదారు చోట్ల నుంచి! అంతరాయం లేకుండా వివిధ స్థలాల నుంచి కనీసం మూడు ట్రాన్స్మీటర్లు నడిచేవి. ఈ 78 రోజుల (అధికారుల రికార్డుల ప్రకారం 71) రోజుల ప్రసారాలు ఐదారు చోట్ల నుంచి, నాలుగైదు ఫ్రీక్వెన్సీల నుంచి సాగాయి. పరుపులు, సూట్కేసులతో ట్రాన్స్మీటర్ పరికరాలను వేర్వేరు చోట్లకు బ్రిటిష్వాళ్ల కళ్లు కప్పడానికి తరలించేవారు. నవంబరు 12 దాకా ఈ ప్రసారాలు ఆగకపోవడం గమనార్హం. 41.78, 42.34, 41.12, 42.12 మీటర్ల మీద ప్రసారాలు జరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఉదయం, రాత్రి 9 గంటల సమయంలో అరగంటసేపు ఈ ప్రసారాలు సాగేవి. ‘హిందుస్థాన్ హమారా’ అనే పాటతో మొదలై వందేమాతరం గీతంతో ముగిసేవి. 10 వాట్ల ప్రసారశక్తిని, 100 వాట్లు చేయడానికి కృషి చేసి సఫలీకృతులయ్యారు. ఇక ఈ ప్రసారాలు నిర్వహించిన యువసైన్యం వివరాలు ఉత్తేజం కలిగిస్తాయి. బాబూ భాయ్ బొంబాయిలో ఫోర్త్ స్టాండర్డ్ దాకా మాత్రమే చదివిన 20 సంవత్సరాల గుజరాత్ యువకుడు బాబూ భాయ్.. (అసలు పేరు విఠల్దాస్ మాధవి ఖక్కడ్) కిరోసిన్తో కారు నడిపే యంత్రం (కేరో గ్యాస్) తయారీ వ్యాపారంలో ఉన్నవాడు.. ఈ సీక్రెట్ రేడియోకు ముఖ్య నిర్వాహకుడిగా ఉన్నాడు. రామ్ మనోహర్ లోహియా ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన ఘనుడు ఇతనే. 1943 మే తీర్పు ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఇతను ఈ రేడియో ప్రసారాల కారణంగా అనుభవించాడు. నారీమన్ అబరాబాద్ నలభై ఏళ్ల పార్సీ నారీమన్ అబరాబాద్ ప్రింటర్ రావల్పిండిలో జన్మించి లాహోర్లో చదువుకున్నారు. మెట్రిక్యులేషన్ తరవాత వైర్లెస్ విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగి బొంబాయి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ప్రారంభించి అందులో శిక్షణ ఇచ్చేవారు. ఇంగ్లండు వెళ్లి టెలివిజన్ గురించి అధ్యయనం చెయ్యాలని ప్రయత్నించి సఫలుడు కాలేక వెనక్కు వచ్చి బాబూభాయ్ కేరోగ్యాస్ వాణిజ్యంలో చేయి కలిపారు. దీన్ని కూడా నిషేధించాక, బాబూ భాయ్కు సీక్రెట్ రేడియో ట్రాన్స్మీటర్ నిర్మించి ఇచ్చారు ఈ ప్రింటర్ మహాశయుడు. మరో నలుగురు బాబూ భాయ్, ఉషా మెహతా, నారిమన్తో పాటు గుజరాత్ భావనగర్ ప్రాంతానికి చెందిన 28 సంవత్సరాల విఠల్దాస్ కాంతాభాయ్ జవేరీ, బర్కానా సింథ్ ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల వైర్లెస్ నిపుణులు నానక్ ఘర్చంద్ మోత్వానే, బొంబాయికి చెందిన 23 సంవత్సరాల చంద్రకాంత్ బాబుభాయ్ జవేరీ, బొంబాయికే చెందిన 27 సంవత్సరాల జగన్నాథ రఘునాథ్ ఠాకూర్లు లోహియా రేడియోలో కీలకపాత్రలను పోషించారు. ఇంకా ఎంతోమంది ఇందులో భాగస్వాములయ్యారు. కొందరి పేర్లు మాత్రమే ఇంటెలిజన్స్ రికార్డులలో ఉన్నాయి కనుక వారి పేర్లు మాత్రమే ఈ పుస్తకంలో పేర్కొన్నారు. కానీ ఎందరో అజ్ఞాత వీరుల సేవల గురించీ, ఈ సీక్రెట్ రేడియో గురించీ.. 1988 దాకా నేషనల్ ఆర్కైవ్స్లో దాగివున్న ఈ పోలీసు ఫైలు పరిశోధకులు గౌతమ్ ఛటర్జీ కంటపడకపోతే.. మనకు తెలిసి వుండేది కాదు. ఆ అజ్ఞాత వీరులు దేశవ్యాప్తంగా సమాచారం సేకరించి ఆ చీకటి రోజుల్లో రేడియో ప్రసారాల క్రతువుకు ఇచ్చేవారు. –డా నాగసూరి వేణుగోపాల్ఆకాశవాణి పూర్వ సంచాలకులు (చదవండి: క్విట్ ఇండియా రేడియో! సీక్రెట్ ఫైల్స్) -
ఉద్యమశీల కార్యకర్త.. రామ్ మనోహర్ లోహియా
లోహియా కులాంతర వివాహాలయితేనే∙ఏ పెళ్లికయినా వెళ్లేవారు. విడాకులను సమర్థించారు. ఆస్తికి ఆయన వ్యతిరేకి. దానిని ఆచరణలో చూపించారు కూడా. ఆయన హరిజన దేవాలయాలకూ వెళ్లారు. జాతికి కొత్త జవ జీవాలను తీసుకురావడానికి ఆయన తాను చేయగలిగిందంతా చేశారు. ఆయన తన యాభై ఏడేళ్ల జీవితంలో మొత్తం ఇరవై సార్లు అరెస్టు అయినట్లు ఎక్కడో చదివాను. చదవండి: ఉక్కు మహిళకు తగిన మహిళ.. కిరణ్ బేడి లోహియా ఢిల్లీ వార్తాపత్రికలకు పెద్ద పెద్ద ఆదర్శాలతో వ్యాసాలు రాయడానికే పరిమితం కాలేదు. పేదల కోసం తన పోరాటాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించారు. బహుశా అందుకే కావచ్చు మొత్తం 20 అరెస్టుల్లో 12 అరెస్టులు స్వాతంత్య్రం వచ్చాకే జరిగాయి! ఆయన బాగా చదువుకున్న, బాగా పర్యటనలు చేసిన రాజకీయ నాయకుడు. డాక్టర్ లోహియా అనే పేరులోని డాక్టర్ అనే మాట ఆయన చేసిన పరిశోధనలకు లభించింది. బెర్లిన్ నుంచి ఎకనామిక్స్లో ఆయనకు డాక్టరేట్ లభించింది. అప్పుడు ఆయన వయసు 23 ఏళ్లు. పరిశోధనను జర్మనీ భాషలో చేశారు. బ్రిటన్లో చదువుకోడానికి ఆయన ఆసక్తి చూపలేదు. కులం, మతం, జాతి, రాజకీయాలు, సంగీతం, కళలు, అర్థశాస్త్రం, రాజ్యాంగం, న్యాయశాస్త్రం, సాహిత్యం వంటి అంశాలను సమదృష్టితో పరిశీలించి, విమర్శించారు. ఆయన ఢిల్లీలోని రాకబ్గంజ్లో ఉన్న తన ఇంటి తలుపులను అందరికీ ఎప్పుడూ తెరిచే ఉంచేవారు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి తన మాట్లాడవచ్చు. మా నాన్నగారు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఆయనకు సహచరుడు. ఆయన తరచు లోహియా ఇంటికి వెళుతుండేవారు. లోహియా హిందీ, ఉర్దూ, బెంగాలీ, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో అనర్ఘళంగా మాట్లాడుతుండేవారు. ఇంగ్లిషు మీద ఆయన పోరాటం సాగించినప్పటికీ, ఆ భాషలో కూడా నిష్ణాతుడే. ‘‘ప్రపంచంలో ఎక్కడ చూసినా చిన్న, పెద్ద మనుషుల మధ్య అసమానతలు ఉంటూనే ఉన్నాయి. అయితే భారతదేశంలో ఈ అంతరం మరీ దుర్భరంగా ఉంటోంది’’ అని ఆయన ఆవేదన చెందేవారు. ఆయన బతికి ఉంటే ఇప్పుడు కూడా జైల్లోనే ఉండేవారేమో. – నిరంజన్ రామకృష్ణ, లోహియా వెబ్సైట్ రూపకర్త -
‘లోహియా’ పేరిట రాజకీయాలు
న్యూఢిల్లీ/లక్నో: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు రామ్మనోహర్ లోహియా అనుచరులమని చెప్పుకునే పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. లోహియా సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పే పార్టీలు ఆయన పోరాడిన కాంగ్రెస్ పార్టీతోనే పొత్తుకు ప్రయత్నాలు సాగించడం గర్హనీయమన్నారు. ఈ పార్టీలన్నీ కలిసి ‘అవకాశవాద కల్తీ కూటమి’గా ఏర్పడుతున్నాయని దుయ్యబట్టారు. దేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తే లోహియా ఆత్మ నిజంగా క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. తలాక్ బిల్లును వ్యతిరేకించారు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన సిద్ధాంతాలను ఆచరిస్తున్నట్లు తెలిస్తే లోహియా గర్వపడేవారని మోదీ తెలిపారు. ‘ లోహియా ఆలోచనలకు అనుగుణంగా ఎన్డీయే ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కృషి సించాయ్ యోజన, ఈ–నామ్, భూసార పరీక్ష కార్డులు(ఎస్హెచ్సీ) జారీచేస్తున్నాం’ అని వెల్లడించారు. కులతత్వం, లింగ వివక్ష లోహియాను చాలా బాధించేవన్నారు. ‘కానీ ఓటు బ్యాంకు రాజకీయాల్లో పీకల్లోతు మునిగిపోయిన రాజకీయ పార్టీలు దీన్ని పట్టించుకోలేదు. వీరంతా లోహియా సిద్ధాంతాలను ఆచరిస్తున్నామని అబద్ధాలు చెప్పారు’ అని అన్నారు. దేశానికీ ద్రోహం చేస్తారు లోహియా ఎప్పుడూ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ భయంతో వణికిపోయేదని మోదీ విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రైతులను వేధించింది. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను నిరుత్సాహపరిచింది. కానీ కాంగ్రెస్ నేతల స్నేహితులు, బంధువులకు దీన్నుంచి మినహాయింపునిచ్చింది. దేశభద్రతను విస్మరించారు. లోహియా కరుడుకట్టిన కాంగ్రెస్ వ్యతిరేకి. ఈరోజు లోహియా తమకు స్ఫూర్తి అని చెప్పుకునే పార్టీలు ఆయన సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తున్నాయి. ఆయన్ను అవమానించే ఏ అవకాశాన్నీ విపక్ష నేతలు వదులుకోవడం లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని ఆయన చూసుంటే భయపడిపోయేవారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ విమర్శలను ఎస్పీ చీఫ్ అఖిలేశ్ తిప్పికొట్టారు. బీజేపీ ప్రస్తుతం మనోవైకల్యంతో బాధపడుతోందన్నారు. ‘ఓవైపు మహాత్మాగాంధీ, డా.బీఆర్ అంబేద్కర్, రామ్మనోహర్ లోహియా, భగత్సింగ్, సర్దార్ పటేల్ ఆదర్శాలను పాటిస్తున్నట్లు బీజేపీ చెబుతుంది. అంతలోనే ఈ నేతలంతా తీవ్రంగా వ్యతిరేకించే, అసహ్యించుకునే వ్యక్తులను అనుసరిస్తోంది. వాళ్లు ఏ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నారో నాకైతే అర్థంకావట్లేదు’ అని వ్యాఖ్యానించారు. -
అడ్మిట్ కార్డ్ మీద స్టార్ హీరో ఫోటో..!
అలహాబాద్ : విద్యార్థులకే కాక జంతువులకు అడ్మిట్ కార్డ్ ఇచ్చిన యూనివర్సిటీలు ఉన్న దేశం మనది. వాటికి పోటీగా మరో యూనివర్సిటీ వచ్చి చేరింది. అయితే ఈ యూనివర్సిటీ మాత్రం కాస్తా పద్దతిగా విద్యార్థి స్థానంలో జంతువుకు బదులు ఓ స్టార్ హీరో ఫోటోని ప్రింట్ చేసి ఇచ్చింది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ గొండా జిల్లాలో చోటు చేసుకుంది. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ పరిధిలోని రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయ్ కాలేజిలో అమిత్ ద్వివేది అనే విద్యార్థి బీ ఈడీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈ ఏడాది పరీక్షల నిమిత్తం ఇచ్చిన అడ్మిట్ కార్డ్ మీద అమిత్ ఫోటోకు బదులుగా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఫోటోని ప్రింట్ చేసి ఇచ్చారు. ఇది గమనించిన అమిత్ ఈ విషయాన్ని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. అందుకు వారు పొరపాటున అలా జరిగి ఉంటుంది.. ఏం కాదు అంటూ పరీక్షలకు అనుమతిచ్చారని తెలిపాడు. అయితే అమితాబ్ బచ్చన్ ఫోటోతో ఉన్న అడ్మిట్ కార్డ్తో పరీక్షలు రాశాను.. ఇప్పుడు మార్క్స్ షీట్ మీద కూడా అమితాబ్ బచ్చన్ ఫోటో వస్తే నా పరిస్థితి ఏంటి అంటూ వాపోతున్నాడు అమిత్. ఈ విషయం గురించి రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయ్కు చెందిన ఓ సీనియర్ అధికారిని ప్రశ్రించగా.. ‘అమిత్ ఇంటర్ నెట్ సెంటర్లో పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో తప్పిదం దొర్లడం వల్ల ఈ సమస్య వచ్చిందని అనుకుంటున్నాను. లేదా ఇది యూనివర్సిటీ తప్పిదం కూడా అవ్వొచ్చు. ఏది ఏమైనా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్ది, మార్క్స్ షీట్లో అమిత్ ఫోటో వచ్చేలా చేస్తాం’ అని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement