breaking news
Rajreddy
-
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కొత్త చైర్మన్గా ప్రొ.అశోక్
రాయదుర్గం (హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ నూతన చైర్మన్గా ప్రొఫెసర్ అశోక్ ఝన్ఝన్వాలా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన పాలక మండలి ప్రత్యేక సమావేశంలో ఒక ప్రకటన చేశారు. 1998లో ఆరంభం నుంచి ట్రిపుల్ఐటీ హైదరాబాద్ చైర్మన్గా కొన సాగిన ప్రొఫెసర్ రాజ్రెడ్డి పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలో ట్రిపుల్ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త చైర్మన్ అశోక్ ఝన్ఝన్వాలా, పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ రాజ్రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్, ఇతర ప్రొఫెసర్లతో కలసి నూతనంగా రూపొందించిన సిల్వర్జూబ్లీ శిల్పాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ అశోక్ ఝన్ఝన్ వాలా మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ హైదరాబాద్ను జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో మంచి గుర్తింపు పొందేలా తీర్చిదిద్దు తానని తెలిపారు. ప్రొఫెసర్ పీజే నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ఐటీ హైదరా బాద్.. దేశంలో నంబర్వన్ స్థానంలో ఉందన్నారు. -
ఆర్జీయూకేటీ చాన్స్లర్గా డాక్టర్ రాజ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజీవ్గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) చాన్స్లర్గా డాక్టర్ రాజ్రెడ్డిని తిరిగి నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గత ఐదేళ్లుగా చాన్స్లర్గా ఉన్న డాక్టర్ రాజ్రెడ్డి మరో ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. డాక్టర్ రాజ్రెడ్డి అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.