RajmargYatra App
-
ఫాస్ట్ట్యాగ్ పేరుతో మోసాలు: NHAI హెచ్చరిక
హైవేలపై రద్దీని, వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 'ఫాస్ట్ట్యాగ్'ను పరిచయం చేసింది. ఆ తరువాత యాన్యువల్ పాస్ తీసుకొచ్చారు. మోసగాళ్లు కూడా.. ఈ సేవలను అందిస్తున్న మోసపూరిత వెబ్సైట్లను సృష్టించారు. ఈ విషయాన్ని NHAI వెల్లడిస్తూ.. ప్రయాణికులను హెచ్చరించింది.ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్లను విక్రయిస్తున్నట్లు చెప్పుకునే నకిలీ వెబ్సైట్లు, అనధికారిక లింక్ల పట్ల జాగ్రత్త వహించాలని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. ఈ పాస్లు కేవలం అధికారిక రాజమార్గయాత్ర యాప్ ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈ పాస్లను విక్రయించే అధికారం ఇతర ఏ ప్లాట్ఫామ్లకు లేదు. ఇతర నకిలీ ప్లాట్ఫామ్లను నమ్మితే.. ఆర్థిక మోసానికి లేదా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగానికి దారితీయవచ్చు. అప్రమత్తంగా ఉండండి. తెలియని లింక్లను నమ్మకూడదని ఎన్హెచ్ఏఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది.Attention National Highway Users!NHAI cautions commuters against fake websites and unauthorised links claiming to sell FASTag Annual Passes. The #FASTagAnnualPass is available only through the official Rajmargyatra App. Any other platform offering the pass is not authorised and… pic.twitter.com/uAaHMCUAR1— NHAI (@NHAI_Official) April 22, 2026ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్లు అసలైన FASTag పోర్టల్లను పోలిన నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. అంతే కాకుండా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ వంటివి ఉపయోగించే వాటిని ముందు వరసలో కనిపించేలా చేస్తున్నారు. ఇలాంటి వెబ్సైట్లను ఓపెన్ చేస్తే.. మొబైల్ నంబర్లు, వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమాచారం, చెల్లింపు వివరాలు వంటి సున్నితమైన వివరాలను నమోదు చేయమని కోరతారు. ఇంటర్ఫేస్ నిజమైనదిగా కనిపించినప్పటికీ.. ఆ చెల్లింపు మోసగాళ్ల నియంత్రణలో ఉన్న ఖాతాలకు వెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాల్సి ఉంటుందని NHAI హెచ్చరించింది.ఇదీ చదవండి: యాపిల్ సీఈఓ.. టిమ్ కుక్ సంపద ఎంతో తెలుసా? -
దీపావళికి.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్
ప్రయాణికుల సౌలభ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్' పాస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పాస్ను ఇష్టమైనవారికి గిఫ్ట్గా ఇవ్వొచ్చని 'నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా' (NHAI) వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ దీపావళికి మీ ప్రియమైన వారికి ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్గా ఇవ్వండి. ఇది దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు మరియు జాతీయ ఎక్స్ప్రెస్వేలలో ఏడాది పొడవునా ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేసింది.గిఫ్ట్గా ఎలా ఇవ్వాలి?రాజ్మార్గయాత్ర యాప్ ద్వారా యాన్యువల్ పాస్ను గిఫ్ట్గా ఇవ్వొచ్చు. ఈ యాప్లోని 'యాడ్ పాస్' ఆప్షన్ మీద క్లిక్ చేసి, వినియోగదారుడు ఎవరికైతే గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారో.. వారి వెనికల్ నంబర్ & ఇతర వివరాలను ఫిల్ చేసిన తరువాత.. ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయవద్దు. ఇలా చేసిన తరువాత యాన్యువల్ పాస్ యాక్టివేట్ అవుతుంది.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. యాన్యువల్ పాస్కు జాతీయ రహదారి వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఆగస్టు 15న అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. కాగా దీనిని ప్రారంభించిన రెండు నెలల్లోనే దాదాపు 5.67 కోట్ల లావాదేవీలతో.. 25 లక్షల మంది వినియోగదారుల మైలురాయిని దాటింది.ఇదీ చదవండి: ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియాజాతీయ రహదారి వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే.. ఈ ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్లకు (ఏది ముందు అయితే అది) అనుమతిస్తుంది. దీనికోసం రూ. 3000 వన్ టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లిస్తే.. రెండు గంటల్లోపు యాక్టివేట్ అవుతుంది. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.This Diwali, gift your loved ones #FASTagbasedAnnualPass — a thoughtful gesture ensuring seamless travel and hassle-free toll payments all year round.Read more: https://t.co/WULEWyNDMG Let’s make every journey bright and safe. ✨#NHAI #FASTag #Diwali2025 pic.twitter.com/1dyiHPVj7B— NHAI (@NHAI_Official) October 18, 2025


