breaking news
Rajkot team
-
రాజ్కోట్ కోచ్గా కిర్స్టెన్?
ముంబై: గత సీజన్ వరకు ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన గ్యారీ కిర్స్టెన్ వచ్చే సీజన్ ఐపీఎల్లో రాజ్కోట్ జట్టుకు కోచ్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇంటెక్స్ సంస్థకు చెందిన రాజ్కోట్ ఫ్రాంఛైజీ ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్తో చర్చలు జరుపుతున్నట్లు సమచారం. ఈ జట్టులో ఉన్న స్టార్ క్రికెటర్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలతో గతంలో భారత జట్టు కోచ్గా కిర్స్టెన్ కలిసి పని చేశారు. డ్రాఫ్ట్లో తీసుకున్న ఆటగాళ్లకు ఆ జట్టు యాజమాన్యం ఇప్పటికే కిర్స్టెన్ గురించి చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ జట్టు ఈ సీజన్లో కొత్త కోచ్ను తీసుకోవడం కోసం కిర్స్టెన్ను తొలగించింది. పుణే జట్టుతో ఫ్లెమింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ధోనిల అనుబంధం వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ కొనసాగనుంది. ధోని కెప్టెన్గా వ్యవహరించబోతున్న కొత్త ఫ్రాంచేజీ పుణే... ఫ్లెమింగ్ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. -
'ధోనీ ఏ టీమ్లో ఉన్నా అదే ఫేవరెట్'
న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీ రాజ్కోట్ కెప్టెన్గా భారత క్రికెటర్నే నియమించాలని టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ సూచించాడు. స్థానిక ఆటగాళ్ల ప్రతిభ గురించి భారత ఆటగాడికే బాగా తెలుసునని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 'రాజ్కోట్ జట్టుకు భారతీయ క్రికెటర్ కెప్టెన్గా ఉండాలి. అతనికి స్థానిక ఆటగాళ్ల బలాలు, బలహీనతల గురించి తెలుసు. కోచ్గా భారతీయుడు అవసరమైతే.. కెప్టెన్గా బ్రెండన్ మెకల్లమ్ను నియమించుకోవచ్చు' అని సన్నీ అన్నాడు. వచ్చే రెండు సీజన్ల కోసం రాజ్కోట్తో పాటు పుణె జట్లను ఐపీఎల్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా వేలంలో రాజ్కోట్.. సురేష్ రైనా, లోకల్ హీరో రవీంద్ర జడేజాతో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మన్ బ్రెండన్ మెకల్లమ్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ జేమ్స్ ఫాల్కనర్ను దక్కించుకుంది. పుణెకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండటంతో ఆ జట్టు ఫేవరెట్గా కనిపిస్తోందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ధోనీ ఏ టీమ్లో ఉన్నా అది ఫేవరేట్ అని అన్నాడు. కొత్త జట్టుకు మహీ వంటి ఆటగాడు అవసరమని పేర్కొన్నాడు. భారత క్రీడల్లో ధోనీ అతిపెద్ద బ్రాండ్ అని కితాబిచ్చాడు. రాజ్కోట్తో పోలిస్తే పుణె కాస్త బలోపేతంగా కనిపిస్తోందని చెప్పాడు.