breaking news
Rajiv Jain
-
అదానీ గ్రూప్లో మరిన్ని పెట్టుబడులు
సిడ్నీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ కంపెనీలలో మరిన్ని పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు జీక్యూజీ పార్ట్నర్స్ వ్యవస్థాపకుడు రాజీవ్ జైన్ తాజాగా స్పష్టం చేశారు. భారత్లో 25 శాతం ఎయిర్ ట్రాఫిక్ అదానీ నిర్వహిస్తున్న ఎయిర్పోర్టుల ద్వారానే నమోదవుతున్నట్లు జైన్ పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీ సరుకు రవాణా(కార్గో)లో అదానీ గ్రూప్ పోర్టులు 25 నుంచి 40 శాతం పరిమాణాన్ని సాధిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఐదేళ్లుగా అదానీ గ్రూప్లో పెట్టుబడులు చేపట్టేందుకు వేచిచూస్తున్నట్లు విలేకర్ల సమావేశంలో జైన్ తెలియజేశారు. స్థానిక ఇన్వెస్టర్లతో జైన్ సమావేశమ వుతున్నారు. అయితే షేర్ల ధరలు అందుబాటులో లేకపోవడంతో దీర్ఘకాలం వేచి చూసినట్లు వెల్లడించారు. కాగా.. ఇటీవల అదానీ గ్రూప్లోని 4 కంపెనీలలో అమెరికా ఈక్విటీ పెట్టుబడుల కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ 1.87 బిలియన్ డాలర్లు(రూ. 15,446 కోట్లు) ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇకపైన కూడా అదానీ గ్రూప్లో పెట్టుబడులను మరింత విస్తరించనున్నట్లు జైన్ స్పష్టం చేశారు. ఇటీవల సెకండరీ మార్కెట్లో బ్లాక్ డీల్స్ ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్(ఏఈఎల్), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్), అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్), అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్(ఏటీఎల్)లకు చెందిన మైనారిటీ వాటాలను జీక్యూజీ పార్ట్నర్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. అదానీ పవర్ అనుబంధ సంస్థల విలీనం పూర్తిస్థాయి అనుబంధ సంస్థలు ఆరింటిని విలీనం చేసుకున్నట్లు అదానీ పవర్ లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. వీటిలో అదానీ పవర్ మహారాష్ట్ర, అదానీ పవర్ రాజస్తాన్, ఉడుపి పవర్ కార్పొరేషన్, రాయ్పూర్ ఎనర్జెన్, రాయ్గఢ్ ఎనర్జీ జనరేషన్, అదానీ పవర్ ముంద్రా లిమిటెడ్ ఉన్నట్లు పేర్కొంది. గత నెల(ఫిబ్రవరి) 8న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అహ్మదాబాద్ బెంచ్ ఇందుకు అనుమతించినట్లు తెలియజేసింది. -
ఐబీ చీఫ్ పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ రాజీవ్ జైన్, రీసెర్చ్ అండ్ అనాలిసిన్ వింగ్(రా) కార్యదర్శి అనిల్ ధస్మనాల పదవీకాలాన్ని కేంద్రం 6 నెలలు పొడిగించింది. మేలో లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు వారు పదవిలో ఉంటారు. ఎన్నికల ముంగిట వ్యూహాత్మకంగా కీలకమైన ఈ పదవుల్లో మార్పులు చేయడం ఇష్టంలేకే ప్రధాని నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధస్మనా డిసెంబర్ 29న, జైన్ డిసెంబర్ 30న విరమణ చేయాల్సి ఉంది. 1985 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి అనిల్ శ్రీవాస్తవకు నీతి ఆయోగ్ సలహాదారు నుంచి ప్రధాన సలహాదారుగా పదోన్నతి కల్పించారు. 1988 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్ ఐపీఎస్ అధికారి రాంపాల్ పవార్ను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డైరెక్టర్గా నియమించారు. -
చంద్రబాబును కలిసిన ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్