breaking news
Race Gurram Sequel
-
సీక్వెల్ యోచనలో అల్లు అర్జున్?
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో మరో సీక్వెల్ రాబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో రేసు గుర్రం చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుందన్నది ఆ కథనం సారాంశం. 2014లో వచ్చిన రేసు గుర్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ కు అవకాశం ఉందని సురేందర్రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రకటించబోయే సీక్వెల్కు సురేందర్ రెడ్డినే దర్శకత్వం వహిస్తాడా? లేక వేరే ఎవరైనా చేస్తారా? అన్నది చూడాలి. తారాగణం, టెక్నీషియన్లు తదితర వివరాలపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది. -
ఆ రెండు చిత్రాలకు సీక్వెల్స్ చేయాలని ఉంది!
‘‘రామ్చరణ్ తో సినిమా చేయడానికి కథ సిద్ధం చేసుకుంటుండగా కళ్యాణ్రామ్గారు నాతో సినిమా చేద్దామనుకున్నారు. అలా ‘కిక్-2’ స్టార్ట్ అయింది’’ అని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పారు. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కల్యాణ్రామ్ నిర్మించిన ‘కిక్-2’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని ఆదివారం పాత్రికేయులతో అన్నారు సురేందర్ రెడ్డి. మరికొన్ని విశేషాలను ఆయన చెబుతూ - ‘‘‘కిక్’ తండ్రి కథ, ఇది కొడుకు కధ కాబట్టి ‘కిక్-2’ అని డిసైడయ్యాం. షూటింగ్ త్వరగా పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ టైమ్ పట్టింది. ఈలోపు ‘బాహుబలి’ విడుదల కావడంతో, మా సినిమా విడుదలకు కొంత గ్యాప్ తీసుకున్నాం. బడ్జెట్ ఎక్కువైందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో నిజం లేదు. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. మీడియాలో ఏవేవో వార్తలు వస్తుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోను. అయితే ద్వితీయార్ధంలో నిడివి ఎక్కువగా ఉందని కామెంట్లు వినిపించాయి. అందుకే కొన్ని సీన్స్ ట్రిమ్ చేశాం. అన్నీ కుదిరితే ‘కిక్-2’, ‘రేసుగుర్రం’ సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను. రామ్చరణ్తో చేయబోయే చిత్రానికి కోన వెంకట్ కథ చెడీ చేశారు. త్వరలో ఆ కథను రామ్చరణ్కు వినిపించబోతున్నాను. ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని ఉంది. బాండ్ తరహా చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అలాంటి చిత్రాలు కూడా చేయాలని ఉంది’’ అని చెప్పారు.