breaking news
public anger
-
ప్రజాగ్రహం దెబ్బకు సీఎంను మార్చేశారు
సూరత్: అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ సమర్థవంతమైన పాలన అందించలేక అవస్థలు పడుతోందని ప్రధాని మోదీ విమర్శించారు. కర్ణాటకలో సీఎం కుర్చీ నుంచి సిద్ధరామయ్యను దింపేసి డీకే శివకుమార్కు కాంగ్రెస్ పట్టంకట్టిన ఉదంతాన్ని మోదీ ప్రస్తావించారు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో శుక్రవారం రూ.18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంబోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని మోదీ ప్రసంగించారు. ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ అక్కడి ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ అందించే అసమర్థపాలన చలువే ఇదంతా. కర్ణాటకలోనూ ఇదే పునరావృతమైంది. అందుకే ఉన్నపళంగా ప్రస్తుత సీఎంను పక్కకునెట్టి కొత్త నేతను సీఎం కుర్చీపై కాంగ్రెస్ కూర్చోబెట్టింది. గత 12 ఏళ్లుగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సందిగ్ధ పరిస్థితులను తనుకు సానుకూలంగా మల్చుకోవాలని ఆశపడింది. కానీ జనం వాళ్లను తిరస్కరించారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్ స్థానిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు భంగపాటు తప్పలేదు. గుజరాత్ ఓటర్లు కాంగ్రెస్ను కన్నెత్తి కూడా చూడట్లేరు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ అసమర్థన పాలనతో పరువుపోగొట్టుకుంటున్నారు. దేశంలో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొనేలా చేసి రాజకీయ, ఎన్నికల లభ్ది పొందాలని కాంగ్రెస్ శతథా ప్రయతి్నస్తుంటే మేం భారత దేశం పలురంగాల్లో సామర్థ్యం పెంపు కోసం కృషిచేస్తున్నాం’’అని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘వ్యతిరేక భావం నుంచి భారత్ ఏనాడో పక్కకు జరిగింది. ఇప్పుడంతా అవధుల్లేని ఆశా దృక్పథంతో, అసాధారణ ఆకాంక్షలతో భారత్ పురోగమిస్తోంది. ఇంధన రంగంలో భారత్ స్వావలంభన దిశగా అడుగులేస్తోంది. ఓవైపు చమురు, సహజవాయువులను వేర్వేరు ఖండాల దేశాల నుంచి కొనుగోలుచేస్తూ మరోవైపు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను పెంచుకుంటున్నాం. గత 12 ఏళ్లలో భారత సౌరవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 250 గిగివాట్లకు పెరిగింది’’అని మోదీ అన్నారు. పర్యటనలో భాగంగా సూరత్ జిల్లాలోని హజీరాలో ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో వారి పరిశ్రమలో ‘జొరావర్(బలశాలి) 25 టన్నుల యుద్ధట్యాంక్ల తయారీని మోదీ పర్యవేక్షించారు. తర్వాత డామన్లో రూ.2,970 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆరంభించారు. కొత్త ఎయిర్పోర్ట్ టరి్మనల్నూ ప్రారంభించారు. లక్షద్వీప్లోనూ రూ.885 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. -
హామీల గురించి అడిగితే దాడులు చేస్తారా
-
ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రజాగ్రహం తప్పదు
అనంతపురం టౌన్ : విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, ఇతర హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, బడ్జెట్లో జిల్లాకు అన్యాయం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జగదీష్, ఇతర నాయకుల అరెస్టును నిరసిస్తూ ఆదివారం విపక్షాల ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో ఆందోళన చేసిన సీపీఐ నేతలను అరెస్టు చేసి జైలులో పెట్టడం దారుణమన్నారు. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. విభజన బిల్లుపై చర్చ సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని ప్రతిపక్షంలో ఉండి వెంకయ్యనాయుడు కోరానన్నారు. అధికారంలోకి రాగానే మాటమార్చారని మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టుకుకేవలం రూ.100 కోట్లు కేటాయించడం తెలుగు ప్రజలను అవమానించడమేనన్నారు. రాష్ట్ర బడ్జెట్లో వెనుబడిన రాయలసీమ అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై చంద్రబాబునాయుడు ఒత్తిడి తేవడం మానేసి విదేశీ పర్యటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న సీపీఐ నేతల అరెస్టు అన్యాయమని శాసనసభలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వాకౌట్ చేశారన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్పపాడు హుసేన్ పీరా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, రాష్ట్ర కార్యదర్శి నరేంద్రరెడ్డి, నగర కమిటీ యవజన అధ్యక్షుడు మారుతీనాయుడు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, సీపీఐ నేతలు పాల్గొన్నారు. కేసులు పెట్టి ఉద్యామన్ని అణచలేరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేసులు పెట్టి ఉద్యమాన్ని అణచలేరని స్పష్టం చేశారు. సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. రాజధాని పేరుతో ప్రభుత్వం వ్యాపారం చేయడంపై చూపించే శ్రద్ధ రాష్ట్ర సంక్షేమంపై చూపడం లేదని ధ్వజమెత్తారు. -
'ప్రజలకు కాంగ్రెస్ పట్ల ఆగ్రహం అర్ధమవుతుంది'


