breaking news
Priyanka Chabra
-
మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావా
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎస్తెటిషియన్, కాలిఫోర్నియాకు చెందిన సెలబ్రిటీ ఫేషియలిస్ట్, సోనియా డకార్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. 2021, ఏప్రిల్లో సోనియాకు చెందిన బెవర్లీ హిల్స్ స్టూడియోలో జరిగిన కెమికల్ పీల్ ట్రీట్మెంట్ వల్ల తన ముఖం శాశ్వతంగా పాడైపోయిందని ఆరోపిస్తూ ఒక మహిళ దావా వేసింది.మొటిమలనివారణ కోసం చికిత్స సమయంలో సోనియా తన ముఖంపై తెలియని పదార్థాన్ని పూయడంతో తనకు తీవ్రమైన గాయాలు, దాని వలన వచ్చాయని బాధితురాలు విక్టోరియా నెల్సన్ పేర్కొంది. మోసం, చట్టవిరుద్ధమైన వ్యాపార పద్ధతులు , లైసెన్స్ లేని వైద్య వృత్తి ద్వారా తనకు జరిగిన నష్టానికి గాను రూ. 31.48 లక్షలకు మించి నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది. తనతోపాటు యువతులు నమ్మిన పరిశ్రమలో మరింత పారదర్శకత తీసుకురావాలనేదే తన దావా లక్ష్యమని ఇన్స్టా పోస్ట్లో వెల్లడించింది. View this post on Instagram A post shared by Victoria Nelson (@victorianelsonn) నవంబర్ 18న, అటార్నీ జనరల్ కార్యాలయం సోనియా డకార్పై ఫిర్యాదు చేసింది, ఆమె ఎస్టాబ్లిష్మెంట్ ,ఎస్తెటిషియన్స్ లైసెన్స్ రెండింటినీ శాశ్వతంగా రద్దు చేయాలని కూడా విక్టోరియా డిమాండ్ చేసింది. తన తరపున నా లీగల్ టీమ్ కూడా సోనియాపై సివిల్ దావా వేసిందని తెలిపింది. విక్టోరియా గతంలో తన సోషల్ మీడియాలో ఎస్తెటిషియన్ క్లయింట్గా తన అనుభవాన్ని పంచుకుంది.తాను 2019 నుండి సోన్యా క్లయింట్గా ఉన్నానని , గతంలో పీల్తో సానుకూలప్రభావం ఉండటంతో, ఇది మరొక చికిత్స కోసం వారిని విశ్వసించేలా చేసింది. అయితే కెమికల్ పీల్ సమయంలో, ముఖంపై తీవ్రమైన మంట, దురద వచ్చాయని తెలిపింది. అయితే ద్రావణాన్ని కడిగిన తర్వాత, విక్టోరియా తనకు తీవ్రమైన కాలిన గాయాలు అయినట్లు గుర్తించింది. నెల రోజుల పాటు చికిత్స తీసుకుంటే చికిత్సలో గాయాలు నయమవుతాయని సోనియా ఆమెకు హామీ ఇచ్చిందని కూడా తెలిపింది. అయితే, 2021లో 18 సెషన్లు, 2022లో 12 సెషన్స్ కోసం దాదాపు 60 వేల డాలర్లు ఖర్చు చేసింది. అయినా ముఖంపై ఇంకా కాలిన గాయాలు పోలేదని చెప్పింది. 2023 నుంచి సోనియా మాట్లాడటంమానేసింది. ఆమె చేస్తున్న మైక్రోనీడ్లింగ్ చికిత్సలు కూడా ఆ లైసెన్స్ పరిధిలోకి రావని తనచు సమాచార అందిందని చెప్పుకొచ్చింది. అందుకే తనకు నష్టపరిహారం కావాలని డిమాండ్ చేస్తోంది. ఇదీ చదవండి: ప్రెస్ సెక్రటరీ సౌందర్యంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలుమరోవైపు బోర్బరింగ్ అండ్ కాస్మోటాలజీ బోర్డు ప్రకారం, సౌందర్య నిపుణులకు మెడికల్-గ్రేడ్ ఉత్పత్తులను ఉపయోగించడానికి లేదా మైక్రోనీడ్లింగ్ వంటి విధానాలను నిర్వహించడానికి లైసెన్స్ లేదు. సంబంధిత నిబంధనలలో వివరించిన విధంగా వారి అభ్యాస పరిధిని అర్థం చేసుకోవడం లైసెన్స్ దారుడి బాధ్యత అని బోర్డు స్పష్టం చేసింది. కాగా కాలిఫోర్నియాకు చెందిన బెవర్లీ హిల్స్లోని ఫేషియలిస్ట్ సెలబ్రిటీ క్లయింట్లలో ప్రియాంక చోప్రా, మడోన్నా, గ్వినేత్ పాల్ట్రో, సోఫియా వెర్గారా, కిమ్ కర్దాషియాన్, మేగాన్ ఫాక్స్, డ్రూ బారీమోర్, కామెరాన్ డియాజ్ ఉన్నారు.ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో -
పెళ్లికళ వచ్చేసింది
సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగినా ఒక ట్రెండ్లా నడుస్తుంటుంది. ఒక సినిమా హిట్ అయితే అలాంటి ఫార్ములాతో వరుసగా సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్లో పెళ్లిళ్ల ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నే ‘దీప్వీర్’ (దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్) ఒక్కటయ్యారు. డిసెంబర్ 2న ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్) జో«ద్పూర్లో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగాలని ముంబైలోని ప్రియాంకా చోప్రా నివాసంలో బుధవారం పూజ చేశారు. పెళ్లి పీటలెక్కనున్న ఈ జాబితాలోకి తాజాగా రాఖీ సావంత్, శ్వేతాబసు ప్రసాద్ చేరారు. శ్వేతాబసు ప్రసాద్ బాయ్ఫ్రెండ్, దర్శకుడు రోహిత్ మిట్టల్ జూన్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని బాలీవుడ్ టాక్. మరోవైపు ఎప్పటికప్పుడు ఏదోఒక సెన్సేషన్తో వార్తల్లో నిలిచే రాఖీసావంత్ కూడా పెళ్లి కూతురు కాబోతున్నట్టు ప్రకటించారు. టెలివిజన్ యాక్టర్ దీపక్ కలాల్ను వివాహం చేసుకోబుతున్నట్టు సోషల్ మీడియాలో తెలిపారామె. డిసెంబర్ 31 సాయంత్రం 5: 55 నిమిషాలకు వీరి వివాహం లాస్ ఏంజెల్స్లో జరగనున్నట్టు పేర్కొన్నారు. ‘‘మేం ఒక్కటవ్వాలనుకుంటున్నాం. ఇండస్ట్రీలో చాలా మంది ఒక్కటవుతున్నారు. ఇదే రైట్ టైమ్ అనిపించింది. అందరి ఆశీర్వాదం మాకు కావాలి’’ అని రాఖీ సావంత్ బాలీవుడ్ మీడియాకు తెలిపారు. సో.. బాలీవుడ్కి పెళ్లికళ వచ్చేసిందన్నమాట. -
అతడు... ఆమె... ఓ స్కూటర్
వెన్నెల కిషోర్, ప్రియాంక చాబ్రా జంటగా రూపొందిన చిత్రం ‘అతడు... ఆమె.. ఓ స్కూటర్’. గంగారపు లక్ష్మణ్ దర్శకుడు. అమరేంద్రరెడ్డి నిర్మాత. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వించే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. థియేటర్లతో పాటు జింగ్రీల్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, విదేశాల్లో ఈ చిత్రాన్ని వీక్షించాలనుకునేవారు... మూడు డాలర్లు వెచ్చించి ఈ సైట్లో చూడొచ్చని వెన్నెల కిషోర్ తెలిపారు. అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రియాంక చాబ్రా కృతజ్ఞతలు చెప్పారు. బిజినెస్ విషయంలో కూడా సంతృప్తిగా ఉన్నామని చిత్రసమర్పకుడు ముత్తు కుమారస్వామి ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా కథా రచయిత జగదీష్ బాగ్లీ కూడా పాల్గొన్నారు.


