breaking news
Preeti Rathi Acid Attack
-
ఉరి శిక్ష వేసినా మహిళకు అసభ్య సైగలు
ముంబయి: ఒక్కోసారి ఆవేశంలో ఎలాంటి తప్పు చేసినా దానికి జీవితంలో ఒక్కసారైన పశ్చాత్తాపం కలుగుతుంది. తన పశ్చాత్తాపాన్ని బాధితులకు చెప్పలేడేమోగానీ తన అంతరాత్మతో సంభాషిస్తాడు. కానీ, ముంబయిలో ఓ అమ్మాయి ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆమెపై యాసిడ్ కుమ్మరించి ఆమె ప్రాణాలకు పోయేందుకు కారణమైన ఆ యువకుడిలో మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆఖరికి ఉరిశిక్ష వేసిన సమయంలో కూడా తానేదో గొప్పపనిచేసినట్లుగా వెకిలినవ్వు నవ్వాడు. అది చూసి అప్పటికే నిండు బాధలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు పట్టరాని కోపం వచ్చింది. ఫలితంగా కోర్టు లోపలే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదంతా ముంబయిలోని యాసిడ్ దాడికి గురై చనిపోయిన ప్రీతి రాఠి కేసుకు సంబంధించి అక్కడి కోర్టులో జరిగిన సంఘటన. అంకుర్ పన్వార్ అనే యువకుడు 2013లో ప్రీతిపై యాసిడ్ దాడి చేయగా ఆమె ప్రాణాలుకోల్పోయింది. ఆ కేసుకు సంబంధించి గురువారం తుదివాదనలు జరిగాయి. జడ్జి ఉరిశిక్ష విధించాడు. ఆ సమయంలో బాధితుల కుటుంబ సభ్యులవైపు చూసి అతడు వెకిలి నవ్వు నవ్వాడు. ఆ సమయంలో ప్రీతి తండ్రి అమర్ సింగ్ రాఠి, ఆమె సోదరుడు హితేష్, ఓ మహిళ బంధువు కోర్టులో నుంచి అతడి ముందు వెళుతున్నారు. అది చూసి ప్రీతి సోదరుడు ఎందుకు నవ్వావని ప్రశ్నించగా వారితో ఉన్న మహిళవైపు చూసి అసభ్యకరంగా సైగలు చేశాడు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకోవడంతో కాసేపు గందరగోళం అనంతరం వివాదం సర్దుమణిగింది. -
ఓర్వేలేక యాసిడ్ పోసిన వ్యక్తికి ఉరి శిక్ష
-
ఓర్వేలేక యాసిడ్ పోసిన వ్యక్తికి ఉరి శిక్ష
ముంబయి: ప్రీతిరాఠి అనే నర్సుపై 2013లో యాసిడ్ దాడి చేసి ఆమె ప్రాణాలుపోయేందుకు కారణమైన నేరస్థుడు అంకుర్ లాల్ పన్వార్కు ప్రత్యేక మహిళల న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. అతడు ఉద్దేశ పూర్వకంగానే ముందస్తుగా ప్రణాళిక వేసుకొని ఈ దారుణానికి పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. ఉరి శిక్ష విధించడానికి ఈ కేసు తగినదని పేర్కొంది. అంతేకాదు, ఇది అత్యంత అరుదుగా జరిగే దాడుల కోవాలోకి వస్తుందని న్యాయస్థానం చెప్పింది. 2013 మే 2న ముంబయిలోని బాంద్రా రైల్వే టర్మనల్లో ఓ రైలు దిగొస్తుండగా అంకుర్ ఆమెపై పెద్ద మొత్తంలో యాసిడ్ కుమ్మరించాడు. దీంతో ఆమె శరీరంలోని అంతర్భాగాలు పూర్తిగా పనిచేయడంమాని జూన్ 1న బొంబే ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో దాడికి పాల్పడిన అంకుర్ ను అరెస్టు చేశారు. ఆమె ఉద్యోగంలో ఎదుగుదలను చూసి ఓర్వలేకే తాను దాడి చేసినట్లుగా అతడు కోర్టులో అంగీకరించాడు. మరోపక్క, అంకుర్ మాత్రమే వాళ్ల కుటుంబానికి దిక్కని అతడి తరుపు న్యాయవాది చెప్పినప్పటికీ న్యాయస్థానం ఏకీభవించలేదు. చివరకు ఉరిశిక్ష ప్రకటించింది.