-
విలేకరులపై శానిటైజర్ స్ప్రే చేసిన థాయ్ల్యాండ్ ప్రధాని
-
విలేకరులపై శానిటైజర్ స్ప్రే చేసిన ప్రధాని
బ్యాంకాక్: ప్రెస్ మీట్ పెట్టేది ఎందుకు.. ప్రభుత్వ విధానాల గురించి ప్రజలకు తెలపడం కోసం.. అలానే ప్రభుత్వ పని తీరుపై వచ్చిన ఆరోపణలను ప్రజల తరఫున ప్రశ్నించడానికి. అందుకే చాలా మంది నాయకులు ప్రెస్ మీట్స్ అంటే భయపడతారు. ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొవాల్సి వస్తుందో.. ఎక్కడ నోరు జారతామో అని ప్రెస్ మీట్లు పెట్టరు. ఒకవేళా పెట్టినా నచ్చని ప్రశ్నలు ఎదురైతే సమాధానం చెప్పకుండా దాట వేస్తారు. అంతే తప్ప ప్రశ్నలు అడిగిన రిపోర్టర్ల మీద దాడి చేయడం అసంభవం. కానీ దీన్ని నిజం చేసి చూపారు థాయ్లాండ్ ప్రధాని. విలేకరుల తమ ప్రశ్నలతో విసిగిస్తున్నారని అసహనానికి గురైన థాయ్ పీఎం ఏకంగా వారిపై శానిటైజర్ స్ప్రే చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. థాయ్లాండ్ ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్-ఓచా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో రిపోర్టర్లు తాజాగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న పలు అంశాల గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా కొద్ది కాలం నుంచి పలువురు అధికారులు తమ క్యాబినేట్ పదవుల నుంచి వైదొలగారు. అలానే ఏడు సంవత్సరాల క్రితం జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు ముగ్గురు మినిస్టర్లను వారం రోజుల క్రితమే జైలుకు పంపించారు. ఈ అంశాలన్నింటి గురించి విలేకరులు ప్రధాని ప్రయూత్ని ప్రశ్నించారు. రిపోర్టర్ల ప్రశ్నలకు విసిగిపోయిన ప్రధాని ప్రయూత్.. ‘‘మీరు అడగవలసిన ప్రశ్నలు ఇంకా ఏమైనా మిగిలాయా.. ఇలాంటి విషయాలన్ని నాకు కనిపించడం లేదు ఎందుకో.. ఇవన్ని ముందుగా తెలియాల్సింది ప్రధానికే కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వత తన పొడియం వద్ద నుంచి బయటకు వచ్చేశారు. అలా వస్తూ.. పక్కనే ఉన్న శానిటైజర్ డబ్బాను చేతిలోకి తీసుకుని జర్నలిస్ట్ల దగ్గరకు వచ్చి.. వారందరి మీద శానిటైజర్ స్ప్రే చేస్తూ ముందుకు వెళ్లి పోయారు. ఈ తతంగాన్నంత అక్కడ ఉన్న రిపోర్టర్లు వీడియో తీశారు. చివరకు ప్రయూత్ ఇదే రిపోర్టర్లతో చాలా ఆగ్రహంగా మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. ఇక ప్రధాని చర్యలపై నెటిజనులు మండి పడుతున్నారు. ఇంత అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నీళ్ల బదులు శానిటైజర్ తాగిన కమిషనర్ పోలియో బదులు శానిటైజర్.. చిన్నారులు అస్వస్థత -
థాయ్ ప్రధాని తీరు చూస్తే అవాక్కే!
బ్యాంకాక్ : దేశాధ్యక్షులకు లేదా దేశ ప్రధాన మంత్రులకు మీడియాను చూస్తే చిర్రెత్తుకొస్తుందో ఏమో! వారడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటేనే చికాకు పడతారేమో! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నలడిగిన జర్నలిస్టుల వైపు గుర్రుగా చూస్తారు. ‘అసలు నీవు రాసే వార్తలన్నీ నకిలీ వార్తలంటూ’ కొట్టి పారేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వారు అసలు మీడియానే దగ్గరికి రానీవ్వరు. వారు ప్రశ్నలడిగే అవకాశమే ఉండదు కనుక. థాయ్లాండ్ ప్రధాన మంత్రి ప్రయూత్ చాన్–ఓచా వీరికి భిన్నంగా ఆలోచించారు. మీడియా ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కొత్త రకం వ్యూహం పన్నారు. ఇటీవల ఓ ముఖ్యమైన మీడియా సమావేశంలో మైకు ముందు క్లుప్తంగా మాట్లాడారు. ప్రశ్నలడిగితే ‘ఇదిగో వీడిని అడగండీ!’ అంటూ తన నిలువెత్తు కటౌట్ను పక్కనే పెట్టించి చేతులూపుతూ వెళ్లిపోయారు. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, ఎన్నికలు, ఆందోళనకారుల అరెస్టులు....ఇలా ఎన్నో అంశాల గురించి ప్రశ్నలు అడుగుదామనుకొని వచ్చిన ప్రయూత్ ప్రవర్తనకు నోరెల్లబెట్టి తెల్లబోయారు. ఇక చేసేదేమీలేక ప్రధాని కటౌట్ ముందు సరదాగా వివిధ భంగిమల్లో ఫొటోలు, సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. -
సైన్యం అధీనంలో థాయ్లాండ్
బ్యాంకాక్: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో ఆరు నెలలుగా అట్టుడుకుతున్న థాయ్లాండ్ను ఆ దేశ సైన్యం అధీనంలోకి తీసుకుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచి దేశంలో మార్షల్ లా విధించింది. అయితే తమ చర్యపై ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని...రోజువారీ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని సూచించింది. శాంతిభద్రతలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని...ఇది సైనిక కుట్ర ఎంతమాత్రం కాదని ఆర్మీ చీఫ్ జనరల్ ప్రయుత్ చాన్వోచా తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement