-
సంక్రాంతి తర్వాత షురూ
‘వైల్డ్ డాగ్’ సినిమా చిత్రీకరణ, బిగ్ బాస్ షోతో కొన్ని రోజులుగా నాగార్జున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20తో ‘బిగ్ బాస్–4’ పూర్తవుతుంది. ‘వైల్డ్ డాగ్’ కూడా ఇటీవలే పూర్తయింది. దాంతో కొత్త ప్రాజెక్ట్కు రెడీ అయ్యారు నాగ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందనున్న చిత్రం జనవరి నెలలో ఆరంభం కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను సంక్రాంతి తర్వాత ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో నాగ్ సరసన జోడీగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వారిని త్వరలోనే ఫైనల్ చేయనున్నారని తెలిసింది. -
సిద్ధు ఈజ్ బ్యాక్!
వస్తుతః తమిళుడైనా, అక్కడి కన్నా తెలుగులో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరో - సిద్ధార్థ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న ఆయన కొంతకాలంగా నేరు తెలుగు చిత్రాల్లో కనిపించడం లేదు. తాజాగా ఇప్పుడు ఆయన ఒక నేరు తెలుగు చిత్రంలో నటించడానికి సిద్ధమైనట్లు కృష్ణానగర్ కబురు. ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గతంలో జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘చందమామ కథలు’, ఇటీవలే అధోజగత్తుకు చెందిన ఇద్దరు దొంగల జీవితాలపై తీసిన కామెడీ-థ్రిల్లర్ ‘గుంటూర్ టాకీస్’ ద్వారా పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్. ఆయన తన తాజా ప్రయత్నానికి సిద్ధార్థ్ను కథానాయకుడిగా ఎంచుకొన్నారట! బహిర్గతం చేయకుండా మనం మనసులోనే దాచుకొనే ఆలోచనలు, అంతరంగ భావోద్వేగాలను నగ్నంగా ఆవిష్కరించే ఒక సున్నితమైన ప్రేమకథగా ఈ చిత్రకథను అల్లుకుంటున్నట్లు ఫిల్మ్నగర్ టాక్! ఇప్పటికే ఈ స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేసిన దర్శకుడు ఏప్రిల్ ఆఖరు కల్లా షూటింగ్ మొదలుపెట్టేస్తారట! మొత్తానికి, సిద్ధార్థ్ సెకండ్ ఇన్నింగ్స్కు ఇది షురూ అన్న మాట!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement