breaking news
Prajay Engineers Syndicate Limited
-
ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ డైరెక్టర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దొంగ సంతకాలతో ఫ్లాట్ను అమ్మిన కేసులో ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుమీత్ సేన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. శామీర్పేట పోలీసులు బుధవారం సుమీత్ సేన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శామీర్పేట సీఐ భాస్కర్రెడ్డి కథనం ప్రకారం... ప్రజయ్ హోమ్స్ మాజీ సీఎండీ లేటు చంద్రమోహన్రెడ్డి భార్య హైమావతీరెడ్డికి మజీద్పూర్ గ్రామ పరిధిలో ప్రజయ్ హోమ్స్లోని తన 429 గజాల ఫ్లాట్ను దొంగ సంతకాలతో ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని సుమిత్ సేన్, విజయ్ సేన్, షర్మిల రెడ్డి, రోహిత్ రెడ్డి, పూర్ణిమలపై ఈ నెల 16 న శామీర్పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన శామీర్పేట పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమిత్ సేన్ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా ఫోర్జరీ చేసినట్లు ఆధారాలు లభించడంతో మంగళవారం రాత్రి కోర్టులో హాజరు పరిచి జైలుకి పంపినట్లు శామీర్పేట సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. పరారీలో మరో నలుగురు... ఇదే కేసులో మరో నలుగురు నిందితులు విజయ్ సేన్, షర్మిల రెడ్డి, రోహిత్ రెడ్డి, పూర్ణిమ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. -
అనుమతి ఒకలా.. కట్టింది ఇంకోలా!
ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్ లిమిటెడ్ ఎల్బీ నగర్లో 8 వేల గజాల్లో ప్రిన్స్టన్ టవర్ పేరిట వాణిజ్య సముదాయాన్ని నిర్మించింది. ఇందులో ఒక్కో అంతస్తు 30 వేల చ.అ.ల్లో విస్తరించి ఉంది. అయితే వాస్తవానికి నిర్మాణ అనుమతులు ఒకలా ఉంటే నిర్మాణం మాత్రం మరోలా ఉంది. అంటే స్థానిక సంస్థ నుంచి పోడియం టవర్ స్టైల్లో అనుమతులను తీసుకున్న నిర్మాణ సంస్థ.. కట్టింది మాత్రం అందుకు పూర్తి భిన్నంగా! జీ+1 మినహా మిగిలిన అన్ని అంతస్తుల్లోనూ అనుమతులను ఉల్లఘించింది. సెట్బ్యాక్స్లోనూ అతిక్రమణే. పైపెచ్చు జీ+1కు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకుని అన్ని అంతస్తులనూ వినియోగించేస్తుంది కూడా. 1.25 లక్షల చ.మీ. స్థలాన్ని 3 లెవల్స్ పార్కింగ్ కోసం కేటాయించారు. జీ+5 వరకు వాణిజ్య స్థలాన్ని, 6వ అంతస్తులో ఆఫీస్ స్పేస్, ఆ తర్వాతి అంతస్తులో బాంక్విట్ హాల్ను అభివృద్ధి చేశారు. అయితే ప్లాన్లో 7వ అంతస్తులోని హోటల్ డిజైన్ ఒకలా ఉంటే.. నిర్మాణంలో మాత్రం ఇంకోలా ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 5 శాతం స్థలాన్ని కస్టమర్లు కొనుగోలు చేస్తే.. మిగిలినవి లీజుకు తీసుకున్నారు కూడా.