-
ప్రత్యేకహోదాపై జగన్ చెప్పిందే సత్యం
పెనగలూరు: ప్రత్యేకహోదాపై నాలుగున్నర సంవత్సరాల నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలే సత్యమని తేలిందని రాజంపేట మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ పేర్కొన్నారు. కొండూరులో ఆదివారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై జగన్ ఏమైతే ప్రజలకు చెప్పారో.. అవే మాటలు పార్లమెంటులో గల్లా జయదేవ్ ఇంగ్లిష్లో చెప్పారన్నారు. జగన్ చెప్పిన మాటలు అప్పుడు కాదనుకున్న టీడీపీ ఇప్పుడు అవే మాటలు పార్లమెంటులో చెప్పడం చూస్తే జగన్ మాటలే సత్యమని తెలుస్తోందన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినరోజు టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఉండి కూడా ప్రత్యేకహోదాపై విఫలం చెందారని ఆమె విమర్శించారు. ప్రత్యేకహోదా ఇవ్వలేమని బీజేపీ చెపుతుంటే టీడీపీ కనీసం నిరసన కూడా తెలుపకపోవడం దారుణమన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు జగన్ను విమర్శించడం మానుకుని, ప్రత్యేకహోదా కోసం పోరాడాలని ఆమె హితవు పలికారు. అలాగే ఈనెల 24న వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్లో టీడీపీ కూడా పాల్గొనాలని కోరారు. ప్రత్యేకహోదా అనేది ఒక పార్టీకి సంబంధించినది కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నమ్మకాన్ని ప్రతి పార్టీ నిలబెట్టేలా కృషి చేయాలన్నారు. అలాగే మంగళవారం వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ను రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ప్రభావతమ్మ కోరారు. కార్యక్రమంలో పెనగలూరు జెడ్పీటీసీ విజయ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కేతా చక్రపాణి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
సీడీపీఓల సస్పెన్షన్
పెనుకొండ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఐసీడీఎస్ పెనుకొండ సీడీపీఓ ప్రభావతమ్మ,గతంలో పెనుకొండలో పనిచేసి ప్రస్తుతం హిందూపురం అడిషనల్ సీడీపీఓగా ఉన్న లీలా విజయకుమారి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2013–14 మధ్యకాలంలో ఇందిరమ్మ అమృత హస్తం పథకం కింద గర్భిణులు, బాలింతలు, అంగన్వాడీ చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందించకుండా లీలావిజయకుమారి అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. కమిషనర్, కలెక్టర్, ఐసీడీఎస్ పీడీలకు ఫిర్యాదులు వెళ్లగా ఇటీవల విచారణ చేయించారు. అలాగే ప్రస్తుత పెనుకొండ సీడీపీఓ ప్రభావతమ్మ పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లోని అంగన్వాడీ అద్దె భవనాలకు సంబంధించి బాడుగ డబ్బు డ్రా చేసి.. రూ. 3.15లక్షలు స్వాహా చేసినట్లు పుట్టపర్తికి చెందిన చెన్నకేశవులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కడప ఐసీడీఎస్ పీడీ రాఘవరావు విచారణ చేపట్టారు. విచారణ అధికారిగా రెండు నెలల క్రితం పెనుకొండ కార్యాలయానికి వచ్చిన ఆయన పూర్తి స్థాయిలో రికార్డులు తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement