-
అన్ని జిల్లాల్లో ఆవులకు వ్యాక్సినేషన్ చేశాం
సాక్షి,హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆవులకు సోకుతున్న పాక్స్ వైరస్ నివారణకు ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ఆవులకు గోట్ పాక్స్ టీకాలు వేయించామని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఇంకా ఎక్కడైనా గోవులు మిగిలి ఉం టే వెంటనే టీకాలు వేయించుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ’పశువులపైనా వైరస్ పడగ’ శీర్షికన ఆదివారం సాక్షి మెయిన్ ఎడిషన్లో ప్రచురితమైన కథనంపై లక్ష్మారెడ్డి స్పందించారు. రాష్ట్రంలోని ఆవులకు తామిచ్చిన గోట్ పాక్స్ టీకా వల్ల లుంఫీస్కిన్ వ్యాధి రాబోదని తెలిపారు. వ్యాధి సోకినట్టు దృష్టికి రాగానే అప్రమత్తమయ్యామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ నేతృత్వంలో మందుల కొనుగోలుకు అన్ని జిల్లాలకు నిధులు మంజూరు చేశామని చెప్పారు. -
కరోనాతో మశూచి టీకా కార్యక్రమాలకు దెబ్బ
ప్యారిస్: కరోనా కారణంగా ఇప్పుడు పిల్లలకు మశూచి టీకా ఇచ్చే కార్యక్రమానికీ విఘాతం కలుగుతోందని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువైందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. చాలా దేశాల్లో ఇప్పటికే మశూచి వ్యాధి కేసులు ఎక్కువగా ఉన్నవాటితో కలిపి మొత్తం 24 దేశాల్లో కోవిడ్ కారణంగా టీకా కార్యక్రమాలను నిలిపివేశారని మరో 13 దేశాల్లో వాయిదా వేశారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ చెబుతున్నాయి. కరోనా తరుణంలో రోగ నిరోధక శక్తిని అందించే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని మీసల్స్ అండ్ రూబెల్లా ఇనిషియేటివ్ స్పష్టం చేసింది. టీకా కార్యక్రమాలను నిలిపివేయడం, వాయిదా వేయడం ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మంది పిల్లలపై ప్రభావం పడనుందని హెచ్చరించింది. -
గొర్రెలను వ్యాధుల నుంచి రక్షించుకోండి..
మంచిర్యాల రూరల్ : గొర్రెల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకుంటే మంద త్వరగా వృద్ధి చెందదు. గొర్రెల్లో వచ్చే వ్యాధులపై కాస్త అవగాహన కలిగి ఉండి, వాటికి సరైన చికిత్స సమాయానికి అందించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే గొర్రెలను వ్యాధుల బారి నుం చి కాపాడుకోవచ్చు. నవంబర్ నెల నుంచి ఏప్రి ల్ వరకు గొర్రెలకు మశూచి వ్యాధి(పాక్స్ వైరస్) ముప్పు పొంచి ఉంటుందని, గొర్రెల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని హాజీపూర్ పశువైద్యాధికారి అర్చన సూచించారు. ముందస్తుగా టీకాలు వేయించడం మంచిదని, గాలిద్వారా వచ్చే ఈ వైరస్ వ్యాపించిన గొర్రెలు ఆహారం తీసుకోక, శ్వాస ఆడక ప్రాణాలు విడుస్తాయని హెచ్చరించారు. వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలను వివరించారు. గొర్రెల మంద వృద్ధి చెందాలంటే.. గొర్రెల మంద రోగాల బారిన పడితే వాటికి పశు వైద్యుల సలహాతో మందులను వాడాలి. తెలిసీ తెలియకుండా మందులను వేయవద్దు. పుట్టిన జీవాలను నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలి. ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మంద త్వరగా వృద్ధి చెందుతుంది. గొర్రెల దొడ్లను ప్రతీ రోజు శుభ్రం చేయాలి. నేల ఎప్పుడూ పొడిగా ఉండేలా చేయాలి. వారానికి ఒకసారి సున్నం చల్లాలి. సాయంకాలం వేళల్లో దోమల నివారణకు పొగబెట్టాలి. మందతో తరచూ రోగాల బారిన పడే జీవాలను తొలగిస్తూ ఉండాలి. పుష్టికరమైన మేత జీవాల ఆరోగ్యం, ఉత్పాదక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. బయటమేపే ప్రదేశాల్లో గొర్రెలు శుభ్రమైన నీటిని తాగేలా చూడాలి. మంద ఒక దగ్గర పెడితే ఖనిజ లవణాలు గల ఇటుకలు, కల్లుప్పును నాకించాలి. బయట మేపడమే కాకుండా, మంద వద్ద కూడా చౌకగా తయారు చేసిన దాణా అందించాలి. మశూచి వ్యాధి లక్షణాలు.. వ్యాధి సోకిన గొర్రెల్లో వారం రోజుల్లో దాని లక్షణాలు బయటపడతాయి వ్యాధి సోకిన గొర్రెలకు జ్వరం తీవ్రంగా ఉంటుంది. చర్మంపై వెంట్రుకలు లేని భాగం, తోక కింద, పెదవులు, ముక్కు రంధ్రాలు, జననేంద్రియాలు, పాల పొదుగుపై ఎర్రని దద్దులు, పొక్కులు ఏర్పడతాయి. కళ్ల నుంచి నీరు, నోటి నుంచి సొంగ, ముక్కు నుంచి చిక్కటి చీముడు కారుతుంది. శ్వాసకోశ వ్యవస్థను వ్యాధి ఆశిస్తే, గొర్రెలు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. జీర్ణకోశ వ్యవస్థను ఆశిస్తే రక్తపు విరేచనాలు అవుతాయి. చూడి గొర్రెలకు వ్యాధి ప్రబలితే ఈసుకుని పోతాయి. వ్యాధి వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా మశూచి వైరస్ వ్యాప్తి చెందుతుంది. వ్యాధిగ్రస్త గొర్రె నుంచి మరొక దానికి వ్యాప్తిస్తుంది. దాణా తొట్టెలు, నీటి తొట్టెలు, ఇతర వస్తువుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా వైరస్ ఊపిరితిత్తుల్లో చేరి ఇతర గొర్రెలకు వ్యాపిస్తుంది. నివారణ చర్యలు.. ప్రతి సంవత్సరం నవంబర్లో గొర్రెలకు మశూచి వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. కొత్త జీవాలను మందలో చేర్చే ముందు వాటిని కొద్ది రోజులు మందకు దూరంగా ఉంచాలి. వాటి ఆరోగ్యాన్ని పరీక్షించాలి. అవి ఆరోగ్యంగా ఉంటేనే మందలో కలపాలి. వ్యాధి సోకిన గొర్రెల వద్దకు వ్యాధి సోకని వాటిని వెళ్లనీయకూడదు. వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే స్థానిక పశువైద్యాధికారులను సంప్రదించాలి. వ్యాధి సోకిన తర్వాత పాటించాల్సిన చర్యలు వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. వ్యాధి వల్ల చనిపోయిన గొర్రెలను లోతుగా గొయ్యి తీసి ఖననం చేయాలి. వ్యాధితో జీవాలు చనిపోయిన ప్రదేశం, అవి తాగిన నీటి తొట్లు, తిన్న దాణా తొట్లను క్రిమిసంహారక ద్రావణంలో శుభ్రపర్చాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి!
రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్
Sakshi News Cartoon: మనమే ఇవ్వలేం! ఇక వాళ్లేందుకిస్తారు!
IPL 2024: ప్లే ఆఫ్స్ అవకాశాలు ఏ జట్టుకు ఎలా..?
ఓటీటీలోకి రాబోతున్న విశాల్ 'రత్నం' సినిమా
సీఎం జగన్ రాయల్ ఎంట్రీ
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
దొంగలు దొరికారు
రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement