breaking news
powerful Earthquake
-
వణికిన వెనెజువెలా
కరాకస్/న్యూఢిల్లీ/టోక్యో/ఫోర్ట్ బ్రాగ్: దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజువెలా దేశం బుధవారం రెండు శక్తివంతమైన భూకంపాలకు చివురుటాకులా గజగజా వణికిపోయింది. 39 సెకన్ల వ్యవధిలో వచ్చిన భూకంపాల ధాటికి దేశంలో వేలాదిగా కట్టడాలు పేకమేడల్లా కుప్పకూలాయి. చాలా ప్రాంతాలు శిథిలాలతో నిండిపోయి మరుభూమిగా మారాయి. భవనాలు కూలడంతో, శిథిలాలు మీద పడటంతో 188 మంది సజీవ సమాధి అయ్యారు. 1,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. చాలా మంది జాడ గల్లంతైంది. శిథిలాల కింద పెద్దసంఖ్యలో జనం చిక్కుకున్నారన్న వార్తల నడుమ మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని సహాయక బృందాలు వెల్లడించాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం రాజధాని కరాకస్ నగరానికి పశ్చిమంగా 170 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. 39 సెకన్ల తర్వాత అంతకంటే అధిక తీవ్రత(7.5)తో మరో భూకంపం వచ్చింది. రెండు భూకంపాల దెబ్బకు భవనాలు కుప్పకూలాయి. ఇంత తీవ్రతతో వెంట వెంటనే భారీభూకంపాలు రావడం వెనెజువెలాలో గత వందేళ్లలో ఇదే తొలిసారి. భూప్రకంపనలతో ఇళ్లు, దుకాణాలు, కర్మాగారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దేశంలోని ప్రధాన సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం దెబ్బతింది. దీంతో విమాన రాకపోకలను నిలిపేశారు. కూలిన భవనాల నుంచి క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధప్రాతిపదికన సహాయక, అన్వేషణ చర్యలు చేపడుతున్నామని దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్ తెలిపారు. ఉత్తర కరాకస్లోని లా గువైరా నగరం అన్నింటికన్నా ఎక్కువగా నాశనమైంది. నగరంలో ఎటుచూసిన ప్రకృతి ప్రకోప విలయం కన్పిస్తోంది. కుప్పకూలిన భవనాలతో నగరం మరుభూమిని తలపిస్తోంది. రక్తమోడుతున్న స్థానికులను అతి కష్టంమీద శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడే నేలమీదనే పడుకోబెట్టి చికిత్సచేస్తున్న దృశ్యాలు, భూకంపం వేళ జనం భవనాల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. దక్షిణ అమెరికా, కరీబియా భూఫలకాల కూడలిలో ఉండే వెనెజువెలాలో భూకంపాలు సర్వసాధారణం. కానీ ఇలాంటి భారీభూకంపాలు తక్కువే. తొలి భూకంప కేంద్రాన్ని కరీబియన్ తీరంలోని పశ్చిమ మోరాన్లో భూమికి 22 కిలోమీటర్ల లోపల గుర్తించామని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. తర్వాత వచ్చిన భూకంపం కేంద్రాన్ని ఈశాన్య మోరాన్లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉంటే భూకంప వినాశనం దారుణంగా ఉంటుంది. ‘‘మేమున్న భననం కదలడం చూసి భయంతో వణికిపోయాం. కూలి మీదపడుతుందని అనుకున్నా. చలిలో అమ్మ, కూతురుతో ఆరుబయటే ఉండిపోయాం. కంటిమీద కనుకులేదు. భయంతో ఏడుస్తూ ఉండిపోయాం. బతుకుతామని అనుకోలేదు’’అని 41 ఏళ్ల స్థానికురాలు మేరియా క్రిస్టినా డియాజ్ తెలిపారు. పైపులు పేలి మరింత ప్రమాదం సంభవిస్తుందని ముందు జాగ్రత్తగా ఇళ్లకు సహజవాయు పైప్లైన్ సరఫరాను అధికారులు నిలిపేశారు. విద్యుత్ సరఫరా ఆగపోవడంతో కరాకస్ నగరంలో అంధకారం అలుముకుంది. మొబైల్ సేవలు నిలిచిపోయాయి. విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. సబ్వే సర్వీసులను రద్దుచేశారు. దేశంలో అంతర్గత సమస్యల కారణంగా విధించిన సోషల్మీడియాపై ఆంక్షలను ఆపత్కాలంలో ఎత్తేసి భూకంపబాధితులకు, బంధువులకు సాయపడాలని ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ కోరింది. 2025 ఆగస్ట్లో నాటి అధ్యక్షుడు నికొలస్ మదురో ‘ఎక్స్’వంటి సామాజికమాధ్యమాలపై నిషేధం విధించారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఈ ఘటనను జాతీయ విపత్తుగా అధ్యక్షురాలు ప్రకటించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణం కోసం 20 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. వీటికితోడు ప్రపంచదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. సాయం చేస్తాం: ప్రధాని మోదీ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మిత్రదేశానికి తగు సాయం అందజేస్తామని ‘ఎక్స్’వేదికగా ప్రకటించారు.జపాన్,అమెరికాలోనూ.. జపాన్ ఈశాన్య తీర భూభాగంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం భూప్రకంపనలకు హషికామీ, సెండాయ్, మొరియోకమీ నగరాల్లో జనం భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, సునామీ హెచ్చరికలనూ జారీచేయలేదని జపాన్ ప్రభుత్వం తర్వాత వెల్లడించింది. భూమి నుంచి 50 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. టోక్యోలోనూ స్వల్ప భూకంపం సంభవించింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నీయా రాష్ట్రంలోనూ ఫోర్ట్ బ్రాగ్ నగరంలో 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియరాలేదు. -
వనౌటులో భారీ భూకంపం
వెల్లింగ్టన్(న్యూజీలాండ్): పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో మంగళవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైన ఈ భూకంపం తాకిడి తీవ్ర నష్టం సంభవించింది. పోర్ట్ విలాలోని వివిధ దేశాల దౌత్యకార్యా యాలున్న భవన సముదాయం సహా నేల మట్టమైన పలు భవనాల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష మయ్యా యి. పోర్ట్ విలాలోని నౌకాశ్రయం దెబ్బతింది. అక్కడి విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. పోర్ట్ విలా దౌత్య కార్యా లయంలోని తమ సిబ్బంది అందరూ సురక్షి తంగానే ఉన్నారని, ప్రస్తుతానికి కా ర్యాల యాన్ని మూసి వేశామని అమెరికా, ఆస్ట్రేలి యా తెలిపాయి. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. పలువురు మృతి చెందినట్లు చెబుతున్నారు. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో పూర్తి వివరాలు తెలియడం లేదు. ప్రజలను తీర ప్రాంతాలకు దూరంగా వెళ్లాలని హెచ్చరించారు. నష్ట సమాచారం సామాజిక మాధ్యమాల్లో మాత్రమే కొంతమేర సమాచారం బయ టకు వస్తోంది. పోర్ట్ విలాకు 30 కిలోమీటర్ల దూరంలో భూమికి 37 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం ఒంటిగంట సమ యంలో ఒక్కసారిగా తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. అనంతర ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. -
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు కూడా జారీ..
-
మెక్సికోలో భారీ భూకంపం
మెక్సికో సిటీ : మెక్సికోలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.29 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. ఆక్సాకా స్టేట్ పసిఫిక్ తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్టుగా సమాచారం. భూకంప ప్రభావంతో మెక్సికోలో పలు భవనాలు కంపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి భయంతో పరుగులు తీశారు. మరోవైపు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను అక్కడ నుంచి తరలించారు. కాగా 2017లో మెక్సికోలో భూకంపం కారణంగా 355 మంది మృతి చెందారు. -
ఇటలీలో భారీ భూకంపం: 247కి చేరిన మృతుల సంఖ్య
- ఇటలీలో పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం - 247కి చేరిన మృతుల సంఖ్య, 368మందికి పైగా గాయాలు - శిథిలాల కింద మృతదేహాలు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అక్యుమోలి: ఇటలీలో భారీ భూకంపం ధాటికి గురువారం నాటికి మరణించిన వారి సంఖ్య 247కి చేరగా, 368మందికి పైగా గాయాలు అయ్యాయి. నిన్న (బుధవారం) తెల్లవారుజామున ఇటలీలోని కేంద్ర పర్వత ప్రాంతాల్లో 6.0 నుంచి 6.2 తీవ్రతతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా మధ్య ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలు కకావికలమయ్యాయి. నిన్నటివరకూ 120 మంది మృతి చెందినట్లు ఇటలీ ప్రధాని రెంజీ ప్రకటించారు. అయితే నేటివరకూ మృతుల సంఖ్య దాదాపు 159వరకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. పలువురు శిథిలాల్లో చిక్కుకోగా.. మరికొంతమంది గల్లంతయ్యారు. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో 300 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే. అదేవిధంగా మయన్మార్లో 6.8 తీవ్రతతో.. మయన్మార్నూ భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ మయన్మార్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సుమారు 84 కిలోమీటర్ల వరకు వ్యాపించిన ప్రకంపనాలు పొరుగున ఉన్న థాయ్లాండ్, బంగ్లాదేశ్, భారత్ తదితర దేశాలలో ప్రభావం చూపాయి. -
ఇటలీలో భారీ భూకంపం
-
ఇటలీలో భారీ భూకంపం
- 120 మంది మృతి రిక్టర్స్కేలుపై 6.2 తీవ్రత - మయన్మార్లోనూ ప్రకంపనలు అక్యుమోలి: ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 6.0 నుంచి 6.2 తీవ్రతతో దేశంలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు తలెత్తాయి. ఫలితంగా మధ్య ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలు కకావికలమయ్యాయి. 120 మంది మృతి చెందినట్లు ఇటలీ ప్రధాని రెంజీ ప్రకటించారు. 368 మందికిపైగా గాయాలయ్యాయి. పలువురు శిథిలాల్లో చిక్కుకోగా.. మరికొంతమంది గల్లంతయ్యారు. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో 300 మంది ప్రాణాలు కోల్పోయారని.. ఆ తర్వాత ఆ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదేనని అధికారులు చెబుతున్నారు. భూకంపం ధాటికి ఎమాట్రిస్ నగరం పూర్తిగా ధ్వంసమైందని నగర మేయర్ సర్జియో పిరోజీ తెలిపారు. నగరం నడిబొడ్డున భారీ భవనాలు కుప్పకూలిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వివరించారు. భూకంప తీవ్రతను ముందుగా గుర్తించే యూఎస్జీఎస్ పేజర్ సిస్టమ్ ఇటలీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాన మంత్రి మాటో రెంజి ఫ్రాన్స్ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా కూలిపోయిన భవ నాల శిథిలాల కింద చిక్కుకున్న పలువురు సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలికా గ్రామస్తుడు 69 ఏళ్ల గిడో బోర్డో మీడియాతో మాట్లాడుతూ ‘నేనిక్కడ లేను. భూకంపం రాగానే హుటాహుటిన ఇక్కడికి వచ్చాను. చూస్తే.. మా సోదరి, ఆమె భర్త శిథిలాల్లో చిక్కుకుపోయారు. వారిని వెలికితీసేవారి కోసం ఎదురు చూస్తున్నాం. ఎలాగోలా వారి పిల్లల్ని రక్షించుకోగలిగాం. వారిప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని వివరించారు. బాధితుల్లో తొమ్మిది నెలల పాప కూడా ఉంది. వారి తల్లిదండ్రులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఓ మామ్మ చేసిన తెలివైన పని వల్ల ఆమె మనవలిద్దరూ బతికి బయటపడ్డారు. ప్రకంపనలు ప్రారంభం కాగానే ఆ మామ్మ ఆ పిల్లల్ని మంచం కిందకి విసిరేయడంతో వారికేం కాలేదు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం ఇటలీలో భూకంపంతో పెద్ద ఎత్తున ప్రజలు మృతిచెందడంపై భారత ప్రధాన మంతి నరేంద్ర మోదీ విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఈ ఘటనలో ఇటలీలో నివసించే భారతీయులకు ఎలాంటి ప్రమాదం జరగలేద ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మయన్మార్లో 6.8 తీవ్రతతో.. మయన్మార్నూ భారీ భూకంపం కుదిపేసింది. సెంట్రల్ మయన్మార్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సుమారు 84 కిలోమీటర్ల వరకు వ్యాపించిన ప్రకంపనాలు పొరుగున ఉన్న థాయ్లాండ్, బంగ్లాదేశ్, భారత్ తదితర దేశాలలో ప్రభావం చూపాయి. భూకంపం ధాటికి 22 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ స్పానిష్ పర్యాటకుడు గాయపడ్డాడు. పలు భవనాలు, ప్రాచీన ఆలయాలు, పురాతన నగరం బగాన్లో 60 ప్రసిద్ధ పగోడాలు కుప్పకూలాయి. జనం భయంతో బయటికి పరుగులు తీశారు. -
శిథిలాల్లో చిన్నారులు.. మిన్నంటిన ఆర్తనాదాలు!
అది తెల్లవారుజాము 3.30 గంటల సమయం. అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. ఇంతలో భూమి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే కన్నుమూశారు. ఇళ్లూ, భవనాలు నేలమట్టమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు శిథిలాల గుట్టలుగా మారిపోయాయి. దాదాపు 73 మంది ప్రాణాలు విడిచారు. 150 మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద వందలమంది చిక్కుకున్నారు. శిథిలాల కింద ఉన్నవారిని కాపాడటానికి సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నది. శిథిలాల కింద నుంచి చిన్నారుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని, చాలాచోట్ల గాయాలైన స్థానికులు శిథిలాలలోని తమ చిన్నారులను కాపాడుకోవడానికి వట్టి చేతులతో మట్టిపెళ్లలను తొలగిస్తున్నారని సహాయక సిబ్బంది తెలిపారు. భూకంప కేంద్రం సమీపంలోని చాలా గ్రామాల్లో, పట్టణాల్లో హృదయావిదారకమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇది బుధవారం తెల్లవారుజామున ఇటలీలో సంభవించిన భారీ భూకంపం సృష్టించిన పెనువిలయం. సెంట్రల్ ఇటలీ అంబ్రియాలోని నొర్షియా సమీపంలో సంభవించిన ఈ భూకంపం ధాటికి ఇటలీ రాజధాని రోమ్లోనూ భవనాలు వణికిపోయాయి. భూకంప కేంద్ర స్థానానికి 100 మైళ్ల దూరంలోని క్రొషియాలోనూ ప్రభావం కనిపించింది. అంబ్రియన్ పరత్వాల సమీపంలో ఉన్న అమెట్రిస్, అక్యుమోలి, అర్కాట డెల్ ట్రోంటో, పెస్కారా డెల్ టోరంటో తదితర గ్రామాలు, పట్టణాలు పూర్తిగా నేలమట్టమై.. శిథిలాల దిబ్బగా కనిపిస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర విషాద పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ భూకంపంలో భారతీయ బాధితులెవరూ లేరని, ఇటలీలోని ప్రవాస భారతీయులందరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందుతోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు.


