breaking news
Pour Acid
-
పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..
ఇటీవల కాలంలో కొందరూ పనిలొంచి తీసేసిన లేక వారి తీరు నచ్చక పనిలో పెట్టుకోకపోయిన, లేదా వారి మంచి కోసమే చివాట్లు పెట్టినా పగలు పెంచేసుకుంటారు. ఆ తర్వాత ఆత క్షణికావేశంలో పిచ్చి పనులు చేసి కటకటాల పాలవ్వడమే గాక జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. అచ్చం అలాంటి ఘటనే నొయిడాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..నొయిడాలోని ఓ హౌసింగ్ సోసైటీలో ఓ వ్యక్తి క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఐతే అతని పనితీరు నచ్చక అతన్ని పనిలోంచి తీసేయాలని నిశ్చయించుకున్నారు. దీంతో రగిలిపోయిన అతను డజనుకు పైగా కార్లపై యాసిడ్ పోసి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో కార్లన్ని ఘోరంగా డ్యామేజ్ అయ్యాయి. దీనికి గల కారణమేమిటని..సమీపంలోని సీసీటీవీ ఫుట్జ్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇదంత సదరు క్లీనర్ రామ్రాజ్ పని అని తెలిసి షాక్ గురువుతారు సోసైటీ వాసులు. ఆ వీడియోలో కనిపించిన అగంతుకుడిని రామ్రాజ్గా గుర్తించి సోసైటీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ట్రాక్ చేసి అపార్టమెంట్ వాసుల వద్దకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వారంతా సదరు క్లీనర్పై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఐతే విచారణలో క్లీనర్ తనకు ఎవరో యాసిడ్ ఇచ్చారంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ..పోలీసులు అతన్ని నేరస్తుడిగా అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ క్లీనర్ సోసైటీలో 2016 నుంచి పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #बेरोजगार हो जाने के गुस्से की #आग ऐसी भड़की की 15 गाड़ियों के अंदर #तेजाब डाल दिया इस शख्स ने 😳 मामला #Noida के #Sector_75 की सोसायटी का है, जहां के कार सफाईकर्मी को नौकरी से निकाल दिया गया था. pic.twitter.com/sUhIvTyBPl — Ruby Arun रूबी अरुण روبی ارون 🇮🇳 (@arunruby08) March 17, 2023 (చదవండి: 216 జడ్జీల పోస్టుల భర్తీకి సిఫారసులు రాలేదు) -
రేప్ చేసి..ఆపై యాసిడ్ పోసి..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ లో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు మృగాళ్లు ఒక యువతిపై అత్యాచారాని పాల్పడ్డారు. తమను గుర్తు పట్టకుండా ఉండటానికి ఆమె ముఖం, కళ్లపై ఆసిడ్ పోశారు. ఆపై ఆమెను రైల్వే ట్రాక్ పై పడేశారు. ఈ ఘటన మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారిన యూపీలోని అలహాబాద్ లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాన్పూర్ ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... యాసిడ్ దాడిలో మహిళ గొంతు దెబ్బతిన్నదని, ఒక కన్ను పూర్తిగా కాలిపోయిందని చెప్పారు. మహిళ చేతివేళ్లతో చేసిన సైగల ద్వారా శుక్రవారం తెల్లవారు జామున ఆమెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని గుర్తించామని తెలిపారు. కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు.