breaking news
Pongal 2015
-
పొంగల్ కు కొంభన్
కొంభన్ చిత్రం పొంగల్ రేస్కు సిద్ధం అవుతోంది. కార్తీ నటిస్తున్న తాజా చిత్రం కొంభన్. లక్ష్మీమీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. పరుత్తివీరన్ తరువాత కార్తీ గ్రామీణ పాత్రలో నటిస్తున్న చిత్రం కొంబన్. చిత్ర ఆడియోను ఈ నెలలోనూ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేసులో విక్రమ్, ఎమిజాక్సన్ హీరో హీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో ఆస్కా రవి నిర్మించిన ఐ చిత్రంతోపాటు అజిత్, త్రిష, అనుష్క హీరోహీరోయిన్లుగా గౌతమ్మీనన్ దర్శకత్వంలో ఎ ఎం రత్నం నిర్మిస్తున్న ఎన్నైఅరిందాల్, విశాల్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తున్న ఆంబళ చిత్రాల్లో ఉన్నారుు. దీంతో ముక్కోణపు పోటీ నాలుగు చిత్రాలకు చేరింది. మరో విషయం ఏమిటంటే కమలహాసన్ నటించిన ఉత్తమవిలన్ చిత్రం కూడా సంక్రాంతికి తె రపైకి రానున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్ర విడుదల గురించి అధికార ప్రకటనరాలేదు. -
సంక్రాంతి గోపాలుడు
విశ్వంలో పరిణమిల్లే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. అలాంటప్పుడు మానవుల ఈతిబాధలకు కారకుడు దైవం కాక మరెవరు? ఈ ప్రశ్ననే సమాజంపై సంధించాడు ఓ వ్యక్తి. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఏకంగా దైవం పైనే కేసు బనాయించాడు. మరి దానికి దైవం ఎలా స్పందించాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘గోపాల గోపాల’. దేవుడిపైనే కేసు వేసే గోపాల్రావుగా వెంకటేశ్ నటిస్తుంటే, సాక్షాత్ గోపాలునిగా పవన్కల్యాణ్ నటిస్తున్నారు. నాటి బాలీవుడ్ సూపర్స్టార్ మిథున్చక్రవర్తి ఇందులో ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండటం విశేషం. కిశోర్కుమార్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్బాబు, శరత్మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. బాలీవుడ్లో రూపొందిన ‘ఓమైగాడ్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. కథలోని ఆత్మ చెడకుండా, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులతో దర్శకుడు డాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్, పవన్కల్యాణ్ కాంబినేషన్లో వచ్చే సన్ని వేశాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా ఉంటాయని సమాచారం. ప్రస్తుతం వారిద్దరిపైనే హాస్పిటల్కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సంక్రాతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. వెంకటేశ్కి జోడీగా శ్రియ నటిస్తున్న ఈ చిత్రంలో మధుశాలిని, పోసాని కృష్ణమురళి, రంగనాథ్, రాళ్లపల్లి, కృష్ణుడు, దీక్షాపంత్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: ఉమేశ్ శుక్లా, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, కూర్పు: గౌతంరాజు.