breaking news
PMK chief Ramdas
-
తండ్రీకొడుకులు ఒక్కటైతే.. కూతురిలో అసంతృప్తి!
సాక్షి,చెన్నై: పీఎంకేలో గత ఏడాదిన్నర కాలంగా తండ్రీకొడుకుల మధ్య సాగుతున్న అధికార పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్, ఆయన కుమారుడు , పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ల మధ్య వివాదం కారణంగా గత శాసనసభ ఎన్నికల్లో ఇరువర్గాలు విడివిడిగా పనిచేశాయి. అయితే, రామదాస్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కుటుంబ కలహాలు సమసిపోయాయి. అయితే, ఈ పరిణామాలతో రాందాసు కుమార్తె శ్రీగాంధితో పాటుగా ముఖ్య నేతలలో తీవ్ర అసంతృప్తి అన్నది బయలు దేరింది. కుటుంబ సభ్యుల సమక్షంలో భావోద్వేగ కలయిక: గత ఎన్నికల్లో రామదాస్ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, అన్బుమణి భార్య సౌమ్య అన్బుమణితో సహా నలుగురు పీఎంకే ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత పారీ్టపై అన్బుమణి పట్టు బిగిసింది. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకులను కలపడానికి కుటుంబ పెద్దలు, ముఖ్య నేతలు రాయబారం నడిపారు. రామదాస్ – సరస్వతి దంపతుల 61వ వివాహ వార్షికోత్సవాన్ని ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. బుధవారం తైలాపురం తోటలోని రామదాస్ నివాసానికి అన్బుమణి, ఆయన భార్య సౌమ్య, కుమార్తెలు సంయుక్త, సంగమిత్ర, సంజుత్ర, అల్లుళ్లు, మనవళ్లతో కలిసి వచ్చారు. రామదాస్ వర్గీయులు వారికి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఏడాదిన్నరగా కొడుకును దూరం పెట్టిన రామదాస్, అన్బుమణిని చూడగానే కన్నీళ్లతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కుటుంబం అంతా కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.దీనిపై అన్బుమణి మాట్లాడుతూ, అమ్మ, నాన్నల 61వ పెళ్లిరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వచ్చి ఆశీస్సులు తీసుకున్నాం. ఇకపై అంతా మంచిదే జరుగుతుందన్నారు. ఇంత వరకు అంతా బాగానే సాగినా అసలు ట్విస్టు తాజాగా బయలు దేరింది. తెరపైకి కొత్త వివాదం: సోదరి శ్రీగాంధి అసంతృప్తి తండ్రీకొడుకులు ఒకటవ్వడం పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపినప్పటికీ, కుటుంబంలో మాత్రం మరో వివాదం నివురు గప్పిన నిప్పులా మారింది. రామదాస్ను అన్బుమణి కలిసిన సమయంలో ఆయన చిన్న చెల్లెలు కవిత ఉన్నారు. కానీ, పెద్ద కుమార్తె, పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షురాలు) శ్రీగాంధి, ఆమె కుమారుడు ముకుందన్ ఈ వేడుకను బహిష్కరించారు. గతంలో కొడుకుపై కోపంతో అన్బుమణిని పక్కన పెట్టిన రామదాస్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పెద్ద కుమార్తె శ్రీగాంధికి అప్పగించారు. అయితే ఆమె ను బలవంతంగా ఈ పదవిలో కూర్చోబెట్టారని టాక్. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన శ్రీగాంధి ఎలాగైనా ఎంపీ లేదా ఎమ్మెల్యే కావాలన్న పట్టుదలతో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. తనను రాజకీయాల్లోకి బలవంతంగా తీసుకొచ్చి , ఇప్పు డు తండ్రీకొడుకులు రాజీ పడటంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు మద్దతు వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీపై మళ్లీ అన్బుమణి పూర్తి పట్టు సాధించిన పక్షంలో తన రాజకీయ భవిష్యత్తు , అధికార కలలు కల్లలుగానే మిగిలిపోతాయని శ్రీగాంధి తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో శ్రీగాంధి పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతుండటం వల్ల, తండ్రీకొడుకులు ఒకటైనా పార్టీలో అంతర్గత వివాదాలు కొనసాగుతూనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కోడలికి వ్యతిరేకంగా మామ ప్రచారం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో పీఎంకేలో నెలకొన్న వివాదం మరింతగా ముదురుతోంది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు న్యాయ పోరాటంచేసినా ఫలితం శూన్యం. పార్టీ, ఎన్నికల గుర్తు మామిడి పండు అన్బుమణి గుప్పెట్లోకి చేరింది. దీంతో అన్బుమణి మద్దతుదారులు ఎన్నికలలో పోటీ చేస్తున్న చోట్ల రాందాసు వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన నియోజకవర్గాలలో అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు వ్యాఖ్యల తూటాలను పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన ధర్మపురి నుంచే బయలు దేరనుండడంతో వ్యవహారం ఎలాంలలి రచ్చకు దారితీయబోతున్నదో అన్న ఉత్కంఠ నెలకొంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి పోటీ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా స్వయంగా ప్రచారానికి రాందాసు రంగంలోకి దిగారు. ప్రచార బాట సోమవారం ధర్మపురిలో సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు ప్రచారం చేయనున్నారు. 35 ఏళ్లుగా తన భుజాలపై మోసిన పార్టీ, చిహ్నంకు వ్యతిరేకంగా రాందాస్ ప్రచారం నిర్వహించనున్నడం గమనార్హం. రాందాసు మద్దతు దారులకు సిలిండర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తన అభ్యర్థులకు మద్దతుగా, అన్బుమణి అభ్యర్థులకు వ్యతిరేకంగా రామ్దాసు ప్రచార బాటకు సిద్ధమయ్యారు. సోమవారం ధర్మపురిలో తన కోడలు సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచార సభ నిర్వహించనున్నారు. కుటుంబ విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో రాందాసు ఎలాంటి వ్యాఖ్యల తూటాలను పేల్చనున్నారో వేచి చూడాల్సిందే. ఆతదుపరి 16న కుంబకోణం. 17న కాట్టుమన్నార్కోయిల్, జయకొండం, 18న తిట్టకుడి, విరుదాచలం, భువనగిరి, 19న చెయ్యార్, పోలూరు, కలసపాక్కం. 20న విక్రవాండి, సెంజి, కీల్పెన్నాత్తూరులలో అన్బుమణి పీఎంకే, మామిడి చిహ్నంకు వ్యతిరేకంగా ప్రచారంకు రాందాసు నిర్ణయించడం గమనార్హం. కాగా ఒకే పారీ్టకి చెందిన తండ్రీకొడుకులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి, ఒకరిపై ఒకరు ఓట్లు వ్యాఖ్యల తూటాలన పేల్చుకునేందుకు సిద్ధం కావడంతో పీఎంకే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ధర్మపురిలో ఈ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
విధ్వంసంతో రిజర్వేషన్లు సాధ్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులో కులాల డేటాను సేకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులను సూచించేందుకు త్వరలోనే ఓ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి సోమవారం ప్రకటించిన విషయం తెల్సిందే. విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో వెన్నియార్ సామాజిక వర్గానికి 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ మాజీ కేంద్ర మంత్రి అంబుమణి రాందాస్ నాయకత్వంలో పట్టాలి మక్కల్ కాట్చి ప్రతినిధి బృందం కలసి వెళ్లాక పళనిస్వామి ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం వెన్నియార్ సామాజిక వర్గం తమిళనాడులో ఎక్కువ వెనక బడిన వర్గాల (ఎంబసీ) జాబితాలోన కొనసాగుతోంది. ఓటర్లలో కూడా వారిది చాలా బలమైన వర్గం. 2021, ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వెన్నియార్ వర్గం తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కావాలంటూ డిమాండ్ తీసుకొచ్చింది. తమిళనాడులో ఇప్పటికే 69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పట్టాలి మక్కల్ కాట్చి (పీఎంకే), ఏఐఏడిఎంకే, బీజేపీలతో కలసి పోటీ చేయాలనుకుంటోంది. 2019లో ఏఐఏడీఎంకేతో కలసి పొత్తు పెట్టుకోవడం వల్లనే రామదాస్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. (కొత్త పార్టీ: రజనీకాంత్ కీలక ప్రకటన) వెన్నియార్ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పీఎంకే ఆందోళన ప్రారంభించిన రోజునే కులాల డేటా సేకరణకు కమిషన్ను ఏర్పాటు చేస్తానంటూ పళనిస్వామి ప్రకటించారు. తమ డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించేంత తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలంటూ పార్టీ కార్యకర్తలకు పార్టీ వ్యవస్థాపక నాయకుడు రామదాస్ పిలుపునివ్వడంతో ఆందోళన విధ్వంసం చోటు చేసుకుంది. చెన్నై నగరంలోకి ఎక్స్ప్రెస్ రైలు రాకుండా శివారులోనే దానిపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. ప్రధాన రహదారులన్నింటిని మూసివేశారు. దీంతో పీఎంకేను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి. మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకొని విధ్వంసానికి బాధ్యులను చేస్తూ రామదాస్తోపాటు ఆయన కుమారుడు అంబుమణి రామదాస్లపై కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. (బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే) ఆందోళనల్లో విధ్వంసం సష్టించడం పీఎంకేకు కొత్త కాదు. వెనకబడిన వర్గాల (బీసీ) జాబితా నుంచి ఎక్కువ వెనకబడిన వర్గాల (ఎంబీసీ) జాబితాను వేరు చేయాలంటూ 1987లో పీఎంకే ఆందోళనలో విధ్వంసకాండకు పాల్పడగా 21 మంది మరణించారు. ఆ నేపథ్యంలోనే 1989లో అప్పటి డీఎంకే ప్రభుత్వం 20 శాతం రిజర్వేషన్లతో ఎంబీసీ కోటాను ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి పీఎంకే ఆందోళనలను ఆపేందుకే కులాల డేటా సేకరణకు కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. దీనవల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకొనే ప్రమాదం ఉంది. (నాన్న పార్టీ.. నాకు సంబంధం లేదు: విజయ్ ) తమిళనాడు కమిషన్ వేసినా కులాల డేటాకు సర్వే నిర్వహించక పోవచ్చు. ఒకవేళ నిర్వహించినా దాన్ని విడుదల చేయకపోవచ్చు. కులాల ప్రాతిపదికన కాకుండా దేశంలో సామాజికంగా, ఆర్థికంగా వెనకబాటు ప్రాతిపదికన 2011లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేనే ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా విడుదల చేసేందుకు సాహసించలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ కూడా 2015లో ప్రజల సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం మీద చేసిన సర్వేను ఇంతవరకు విడుదల చేయలేదు. ఇందుకు కారణం ఎఫ్సీ, బీసీ, ఓసీ, ఎంబీసీల డేటాకు సంబంధించి ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉజ్జాయింపుగా చెబుతున్న లెక్కలకు, ఆయా సామాజిక వర్గాలు చెబుతున్న లెక్కలకు, సర్వే లెక్కలు భిన్నంగా ఉండడమే. సర్వే వివరాలను బయటకు వెల్లడించడం వల్ల ప్రభుత్వాలకు, పార్టీలకు మధ్య గొడవలే కాకుండా, సమాజంలో కూడా అశాంతి పరిస్థితులు ఏర్పడుతాయన్న భయమే ప్రధాన కారణం. తమిళనాడులో సర్వే నిర్వహిస్తే రాష్ట్ర జనాభాలో వెన్నియార్ సామాజిక వర్గం వారు 20 శాతం కూడా లేరని తెలిస్తే గొడవలు జరగుతాయి. ఎంబీసీ జాబితా నుంచి వారిని వేరు చేసి, ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నట్లు వారికి ప్రత్యేక క్యాటగిరీ కింద 20 శాతం రిజర్వేషన్లు కేటాయించిన ఇతర సామాజిక వర్గాలు ఆందోళనలకు దిగుతాయి. అప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్లు కూడా 89 శాతం చేరుకుంటాయి. రిజర్వేషన్లు 50 శాతం కోటాను మించకూడదంటూ సుప్రీం కోర్టు మార్గదర్శకాలు సూచించిన విషయ తెల్సిందే. -
పీఎంకే అధినేత రాందాస్ కొత్త స్వరం
పీఎంకే అధినేత రాందాస్ కొత్త స్వరం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తమిళులు అధికంగా నివసించే మండలాలను తమిళనాడులో కలపాలనే డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేనున్నట్లు ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాట పీఎంకే బలోపేతమే లక్ష్యంగా రాందాస్ సాగుతున్నారు. రాజకీయంగా బలమైన వన్నియర్ సామాజిక వర్గాన్ని చేరదీయడం లక్ష్యంగా పావులు కదిపారు. ఈ క్రమంలో ఆయన అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. ముఖ్యంగా మరక్కానం అల్లర్ల కేసులు వెంటాడుతున్నాయి. అరెస్టులు, విధ్వంసం వల్ల ప్రభుత్వానికి ఏర్పడిన కోట్లాది రూపాయల నష్టాన్ని పీఎంకే నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రాందాస్ ఇష్టారాజ్యంగా సంచరించే వీలు లేకుండా నిషేధాజ్ఞలు అమలుచేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను విభజిస్తూ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం ఇటీవల నిర్ణయం ప్రకటించింది. అదే సమయంలో రాందా స్ కొత్త స్వరం అందుకున్నారు. తమిళనాడులో కలపాలి తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నివసించే తమిళుల హక్కులు కాపాడడం అనే మరో అజెండాను రాందాస్ సిద్ధం చేసుకున్నారు. తమిళులు ఆంధ్రప్రదేశ్లో ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారనే వాదనను ఆయన లేవనెత్తారు. ఈ మేరకు రాందాస్ శనివారం చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేశారు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు అధికంగా నష్టపోయింది తమిళనాడు మాత్రమేనని తెలిపారు. మొత్తం 70 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కలిసిపోయిందని పేర్కొన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 32 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఎనిమిది మండలాలు (300 గ్రామాలు)గా తెలిపారు. ఇది తమిళ ప్రజలకు ఆ రోజుల్లో జరిగిన పెద్ద ద్రోహంగా అభివర్ణించారు. విద్య, ఉద్యోగం విషయాల్లో స్థానికేతరులుగా పరిగణించడం వల్ల తమిళులు నష్టపోతున్నారని తెలిపారు. అలాగే క్షేత్రస్థాయి మొదలుకుని ఎమ్మె ల్యే, ఎంపీలుగా పోటీచేసే రాజకీయ హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో నివసించే తమిళులు తమ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకోవాలంటే 700 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు వెళ్లాల్సి ఉందని తెలిపారు. ఈ ఎనిమిది మండలాలను తమిళనాడులో కలిపితే కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉండే ముఖ్యమంత్రికి విన్నవించుకోవచ్చని ఆయన వివరించారు. ఇటువంటి అనేక ప్రయోజనాల దృష్ట్యా చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, తిరుపతి, శ్రీకాళహస్తి మరో మూడు మండలాలను తమిళనాడులో కలపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తమిళనాడుకు ఏర్పడిన నష్టాన్ని ఈ ఎనిమిది మండలాలను కలపడం ద్వారా భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు తమ పార్టీ కేంద్రంపై ఒత్తిడి తేనున్నట్లు తెలిపారు.


