breaking news
Plasmodium
-
మలేరియాకు ర్యాడికల్ చికిత్స!
మళ్లీ మళ్లీ జ్వరం వస్తుండటం ఎందుకంటే... మలేరియా అనేది ప్రోటోజోవా అనే విభాగానికి చెందిన ఏకకణ జీవి అయిన ‘ప్లాస్మోడియమ్’ కారణంగా వస్తుంది. మళ్లీ ఇందులోనూ కొన్ని రకాలు ఉంటాయి. ఉదాహరణకు ప్లాస్మోడియమ్ వైవాక్స్, ప్లాస్మోడియమ్ ఓవ్యూల్. మిగతా రకాలు ఎలా ఉన్నా... ఇవి మాత్రం చికిత్స తర్వాత... మందులకు దొరికి నశించిపోకుండా ఉండేందుకు వెళ్లి కాలేయంలో దాక్కుంటాయి. ఒకవేళ ఇవి అక్కడ దాక్కుని ఉంటే... చికిత్స తర్వాత కొన్ని రోజులకూ లేదా కొన్ని నెలలకు సైతం మళ్లీ మళ్లీ జ్వరం తిరగబెడుతూ ఉంటుందన్నమాట. అందుకే దాన్ని పూర్తిగా తొలగించేలా చేయడానికే ఈ ‘ర్యాడికల్ చికిత్స’ అవసరమన్నమాట. మలేరియా వచ్చినప్పుడు కొంతమంది ప్రాథమికంగా చికిత్స తీసుకుని తగ్గగానే దాని గురించి మరచిపోతారు. నిజానికి మలేరియా తగ్గాక కూడా ఆ జ్వరానికి ‘ర్యాడికల్ ట్రీట్మెంట్’ అనే చికిత్స తీసుకోవాలి. అంటే శరీరంలోని మలేరియల్ ఇన్ఫెక్షన్ను పూర్తి స్థాయిలో తీసివేయడమన్నమాట. సాధారణంగా మలేరియా జ్వరం తగ్గిన రెండు వారాల పాటు ఈ చికిత్సను కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే మలేరియా జ్వరం మళ్లీ రావచ్చు. మరప్పుడు ఏం చేయాలి? మలేరియా వచ్చాక అది ప్లాస్మోడియమ్ వైవాక్స్, ప్లాస్మోడియమ్ ఓవ్యూల్ రకానికి చెందిందా కాదా అని తెలుసుకోవడం కోసం ‘బ్లడ్ స్మియర్’ను మైక్రోస్కోప్ కింద పరీక్షించాల్సి ఉంటుంది. బాధితుడికి ప్లాస్మోడియమ్ వైవాక్స్ ఉందని తెలిశాక, వాస్తవానికి అతడికి ‘ప్రైమాక్విన్’ అనే మందును 14 రోజుల పాటు ఇవ్వాలి. అయితే వాళ్లలో ‘జీ6పీడీ’లోపం ఉంటే అలాంటివాళ్లకు ప్రైమాక్విన్ మందు ఇవ్వకూడదు. ఆ లోపం ఉందా లేదా అని తెలుసుకునేందుకు ‘జీ6పీడీ’ అనే పరీక్ష నిర్వహించి, లోపం లేనివాళ్లకు మాత్రమే ప్రైమాక్విన్ మందు ఇవ్వాల్సి ఉంటుంది. అలా మందును నిర్ణీత కాలంపాటు బాధితుడికి ఇచ్చి... అతడిలోనుంచి మలేరియాను సమూలంగా తొలగిపోయేలా చేయాలి. దీన్నే ‘ర్యాడికల్ ట్రీట్మెంట్’ అంటారు. డాక్టర్ జి. నవోదయ సీనియర్ ఫిజీషియన్, జనరల్ మెడిసిన్ -
మలేరియాకు ఇక కొత్త చికిత్స
లండన్: మలేరియాను సమర్థంగా నివారించేందుకు విప్లవాత్మక కొత్త చికిత్స అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు మలేరియా పరాన్నజీవి(ప్లాస్మోడియం)కి అతిముఖ్యమైన ‘పీఎఫ్పీకేజీ’ అనే కైనేజ్ ప్రొటీన్ను కనుగొంది. పరిశోధనలో భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ మహమూద్ ఆలం కూడా ముఖ్య పాత్ర పోషించారు. బ్రిటన్లోని వర్సిటీ ఆఫ్ లీసెస్టర్, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రవేత్తల బృందంతో కలసి పరిశోధనల్లో పాల్గొన్నారు. కైనేజ్ ప్రొటీన్ను నిర్వీర్యం చేయడం వల్ల పరాన్నజీవిని హతమార్చవచ్చని కనుగొన్నారు. వీరి పరిశోధన ఫలితాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో వచ్చాయి.