breaking news
phone burnt
-
చార్జీంగ్.. హెడ్సెట్లో పాటలు.. షాక్
చండీగడ్ : మొబైల్ ఫోన్కు చార్జీంగ్ పెట్టి, హెడ్ సెట్లో పాటలు వింటున్న యువకుడు షాక్ కొట్టి చనిపోయాడు. ఈ సంఘటన బుధవారం హర్యానా రాష్ట్రంలోని యముననగర్ జిల్లా పాండ్యో గ్రామంలో చోటు చేసుకుంది. తాత్సింగ్ (22) అనే యువకుడు తన ఇంట్లో ఫోన్కు చార్జీంగ్ పెట్టి అలానే హెడ్ఫోన్ పెట్టుకుని పాటలు వింటున్నాడు. ఆ సమయంలో ఇంట్లో విద్యుత్ సరఫరా లేదు. కరెంటు వచ్చే సమయానికి చార్జీంగ్ కేబుల్ అలానే ఉండడంతో తాత్సింగ్ కరెంటు షాక్కు గురైయ్యాడు. దాంతో ఇంట్లో వాళ్లు అతడ్ని యముననగర్లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు. -
ఫోను కాలిందని.. ప్యాంటు విప్పి పరుగులు!
రోజూలాగే అతగాడు ప్యాంటు జేబులో ఫోన్ పెట్టుకుని.. మోటార్ సైకిల్ మీదు వెళ్తున్నాడు. అంతలో ఉన్నట్టుండి జేబు వేడెక్కినట్లు అనిపించింది. ఎందుకైనా మంచిదని ఫోన్ చూసుకున్నాడు.. అప్పటికే అది బాగా వేడెక్కింది. దాంతో బయటకు తీయబోయాడు.. అప్పటికే అది కాలడం మొదలైంది. కష్టమ్మీద బయటకు తీసి, కింద పారేశాడు. కానీ ఆలోపే ఆయన చేతులు, తొడ భాగాలు కొంతవరకు కాలిపోయాయి. చైనాలోని జాంగ్ అనే యువకుడు జేబులో పెట్టుకున్న ఫోన్ ఏమీ చేయకుండానే దానంతట అదే కాలిపోయిందని చుటియాన్ మెట్రోపోలిస్ డైలీ పత్రిక తెలిపింది. దాంతో అతగాడు అప్పటికప్పుడే రోడ్డుమీద ప్యాంటు విప్పేసి దాన్ని అవతల పారేసి పరుగులు తీయడం మొదలుపెట్టాడు. అతడు వాడుతున్నది కూడా ఆషామాషీ ఫోన్ కాదు. శామ్సంగ్ ఎస్ఎం-జి90089డబ్ల్యు. జాంగ్ గనక వెంటనే స్పందించి ఉండకపోతే.. మరింత పెద్ద ప్రమాదం సంభవించేదట. ఆ ఫోన్ను తాను 2014లో ఒక లోకల్ స్టోర్లో దాదాపు రూ. 41వేలు పెట్టి కొన్నానని, అందులో విడిభాగాలు కూడా కంపెనీవి తప్ప వేరేవేవీ వాడలేదని జాంగ్ చెప్పాడు. ఇప్పటివరకు ఫోన్ కూడా బాగానే ఉందని, ఉన్నట్టుండి ఎందుకు కాలిపోయిందో తెలియలేదని అన్నాడు. ఈ విషయం తెలిసిన శామ్సంగ్ సిబ్బంది జాంగ్కు కాల్ చేసి, ఆ ఫోన్ తమవద్దకు తీసుకురావాలని, దాన్ని పరీక్షిస్తామని చెప్పినట్లు తెలిసింది.