breaking news
penalise
-
బ్యాంకులకు 15 రోజులే టైమ్.. సెటిల్ చేయాల్సిందే!
మరణించినవారి బ్యాంకు ఖాతాలు, సేఫ్ లాకర్ల క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేసే ప్రతిపాదనలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ముసాయిదా సర్క్యులర్ జారీ చేసింది. ప్రతిపాదిత మార్గదర్శకాలు డిపాజిట్ ఖాతాలు, సేఫ్ లాకర్లు నిర్వహించే అన్ని వాణిజ్య, సహకార బ్యాంకులకు వర్తిస్తాయి. ముసాయిదా సర్క్యులర్ పై ఆగస్టు 27లోగా అభిప్రాయాలు తెలపాలని సెంట్రల్ బ్యాంక్ కోరింది. వీలునామా, కోర్టు ఉత్తర్వులు లేదా వివాదం లేకపోతే వారసత్వ ధృవీకరణ పత్రాలు లేదా ప్రొబేట్ వంటి చట్టపరమైన పత్రాలపై పట్టుబట్టకుండా నామినీలు లేదా జీవించి ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు నిధులను విడుదల చేయాలని సర్క్యులర్లో పేర్కొంది. క్లెయిమ్దారులు నామినీ క్లెయిమ్ ఫారం, మరణ ధృవీకరణ పత్రం, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని సమర్పిస్తే చాలు.ఆలస్యమైతే పరిహారంఏదైనా డిపాజిట్ సంబంధిత క్లెయిమ్ గడువులోగా పరిష్కరించబడకపోతే, అటువంటి ఆలస్యానికి గల కారణాలను బ్యాంకు హక్కుదారులకు తెలియజేయాలి. “… ఆలస్యమైతే, ఆ ఆలస్య కాలానికి సెటిల్మెంట్ మొత్తంపై ప్రస్తుత బ్యాంకు రేటు సంవత్సరానికి 4% కంటే తక్కువ కాకుండా వడ్డీ రూపంలో క్లెయిమ్దారులకు బ్యాంకు పరిహారం చెల్లిస్తుంది" అని సర్క్యులర్లో పేర్కొన్నారు.ఇక సేఫ్ డిపాజిట్ లాకర్ లేదా సేఫ్ కస్టడీలో ఉన్న వస్తువులకు సంబంధించి క్లెయిమ్లను ప్రాసెస్ చేయడంలో జాప్యం జరిగితే, ఆలస్యం జరిగిన ప్రతి రోజుకు బ్యాంకు రూ .5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.నాన్-నామినీ, జాయింట్ అకౌంట్ క్లెయిమ్ల సెటిల్మెంట్మరణించిన డిపాజిటర్ నామినీని పేర్కొనకపోయి ఉన్నప్పుడు లేదా జాయింట్ అకౌంట్ల విషయంలో నామినీ లేదా సర్వైవర్ క్లాజ్ లేని సందర్భాల్లో క్లెయిమ్ల పరిష్కారానికి బ్యాంకులు సరళీకృత విధానాన్ని అవలంబించాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. ఇటువంటి క్లెయిమ్ల సెటిల్మెంట్ కోసం ఒక బ్యాంకు దాని రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థల ఆధారంగా రూ .15 లక్షల పరిమితిని నిర్ణయించాలి.బ్యాంకులు పూర్తి డాక్యుమెంట్లు అందిన 15 రోజుల్లోగా క్లెయిమ్లను సెటిల్ చేయాల్సి ఉంటుంది. సేఫ్ డిపాజిట్ లాకర్/వస్తువులు సేఫ్ కస్టడీలో ఉన్నట్లయితే, అవసరమైన అన్ని పత్రాలను అందుకున్న 15 రోజుల్లోగా, బ్యాంకు క్లెయిమ్ ప్రాసెస్ చేయాలి. -
భారతీయ పాటకు గొంతు కలిపిందని..వైరల్!
-
పొరుగు దేశం పాట పాడినందుకు పాక్ యువతిపై..
లాహోర్ : భారతీయ పాటకు గొంతు కలిపిందనే కారణంతో పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది పాక్ యువతిపై చర్యలు చేపట్టింది. పాక్ జాతీయ జెండా ఉన్న టోపీని ధరించి ఇండియన్ సాంగ్ను ఆలపించిందనే కారణంతో ఎయిర్పోర్ట్లో పనిచేసే యువతిపై అధికారులు చర్యలు తీసుకోవడం చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. నియమావళిని ఉల్లంఘించినందుకు 25 ఏళ్ల మహిళా ఉద్యోగినికి ఇంక్రిమెంట్లు, పెర్క్స్ను నిలిపివేశారు. భవిష్యత్లో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే తీవ్ర చర్యలు తప్పవని అధికారులు ఆమెను హెచ్చరించారు.సోషల్ మీడియాలో ఎలాంటి వివాదాస్పద కార్యకలాపాల్లో తలదూర్చరాదని ఎయిర్పోర్ట్ అధికారులు తమ సిబ్బందిని హెచ్చరించారు. కాగా పాక్ యువతి గత రెండేళ్లుగా సియోల్కోట్ ఎయిర్పోర్ట్లో విధులు నిర్వహిస్తున్నారు. పాక్ యువతి చర్యపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణను ప్రారంభించింది. -
అమెరికా ఆటో దిగ్గజానికి చైనా షాక్?
షాంఘై : చైనా అనుసరిస్తున్న విధానాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎలాగైనా గట్టి షాకివ్వాలని డ్రాగన్ వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలో ఓ అమెరికా ఆటో దిగ్గజానికి త్వరలోనే చైనా భారీ ఫైన్ విధించబోతుందని తెలుస్తోంది. కంపెనీ పేరు వెల్లడించని చైనా డైలీ న్యూస్పేపర్, ఓ అమెరికా ఆటో దిగ్గజం అనుసరిస్తున్న గుత్తాధిపత్య ధోరణికి త్వరలోనే జరిమానా పడుతున్నట్టు వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ అమెరికా కంపెనీ 2014 నుంచి డిస్ట్రీబ్యూటర్లకు ధరలను నిర్ణయిస్తూ వస్తోందని ఇన్వెస్టిగేటర్ల విచారణలో తేలినట్టు చైనా జాతీయ అభివృద్ధి, సంస్కరణ కమిషన్( ఎన్డీఆర్సీ) డైరెక్టర్ ఝాంగ్ హ్యాన్డాంగ్ చెప్పారు. ఈ జరిమానా విషయంలో ఎవరూ తప్పుడు వార్తకథనాన్ని చదవడం లేదని పేర్కొన్నారు. అయితే ఈ ఆర్టికల్ ఏ కంపెనీకి, ఎంత మొత్తంలో జరిమానా విధించబోతున్నారో పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఆటో దిగ్గజాలకు చైనా అతిపెద్ద మార్కెట్గా ఉంది. అమెరికా ఆటో దిగ్గజాలు జనరల్ మోటార్స్ కంపెనీ, ఫోర్డ్ మోటార్ వంటి కంపెనీలు ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే మీడియా ఊహాగానాలపై తాము స్పందించమని ఈ కంపెనీలు తేల్చేశాయి. యాంటీ-మోనోపలి ఇన్వెస్టిగ్వేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఆటో దిగ్గజాలకు ఈ ఎన్డీఆర్సీ ఏడో సార్లు జరిమానా విధించింది. తైవాన్పై ఆధిపత్య ధోరణిగా చైనా అనుసరిస్తున్న 'వన్ చైనా' పాలసీపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన అనంతరం చైనా డైలీ ఈ వార్తాకథనాన్ని ప్రచురించడం గమనార్హం. తైవాన్ను బీజింగ్ తమలో ఒకటిగా భావిస్తోంది. అంతేకాక తైవాన్కు, అమెరికాకు 1979 నుంచి ఎలాంటి దౌత్యసంబంధాలు లేవు. కానీ ట్రంప్ గెలవగానే, చైనాకు వ్యతిరేకంగా తైవాన్ను మార్చడానికి పలు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.