breaking news
PCC President N.raghuvirareddy
-
కనకదుర్గమ్మకు ఎప్పుడూ అపచారమే
విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడ కనకదుర్గమ్మకు ఎప్పుడూ అపచారమే జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో దుర్గమ్మ నగలు దొంగతనం జరిగితే వాటి స్థానంలో నకిలీ వస్తువులు పెట్టారు.. ఇపుడు ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని తెలిపారు. ఆ పూజలు మీ అనుమతి లేకుండా చేశారా.. ఎవరి కోసం చేశారో చెప్పాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. తాంత్రిక పూజలపై దొంగే దొంగ అన్నట్లుగా ఉందంటూ ఈ పూజలపై విచారణ అంటున్న ప్రభుత్వం గతంలో వేసిన విచారణ కమిటీల నివేదికలపై తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు తెలపాలన్నారు. తాంత్రిక పూజలు భక్తులు మనోభావాలను దెబ్బతీశాయన్నారు. మీ విచారణల మీద ప్రజలకు నమ్మకం లేదని, అందువల్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు. కాగా, గత నాలుగు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ ఇపుడు జన్మభూమి నిర్వహిస్తున్నారు.. దీనివల్ల ఏ ఒక్కరికీ ఉపయోగం లేదన్నారు. జన్మభూమి, టీడీపీ కార్యక్రమాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉపయోగించడం సబబుకాదన్నారు. పులివెందులలో మైక్ ఇవ్వకుండా చంద్రబాబు ఎంపీని అవమానించారన్నారు. ప్రైవేట్ వ్యక్తులు జన్మభూమి కార్యక్రమంలో ఎక్కవ కనిపిస్తున్నారని, పోలీస్ పహరాలోనే ఈ కార్యక్రమం జరుగుతోందని రఘువీరా విమర్శించారు. -
టీడీపీని ప్రజలు ఛీకొడుతున్నారు
నగరి : టీడీపీని ఏడాదికే రాష్ట్ర ప్రజలు ఛీకొట్టారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. గురువారం నగరి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్నగర్ కట్టపై ఉన్న శ్రీషిరిడీ సాయిబాబా దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. నగరి, పుత్తూరు కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో ఇప్పటికే వ్యతిరేకత వచ్చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు రైతు, డ్వాక్రా మహిళలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్లను తరిమివేయాడానికి పోరాడారని, చంద్రబాబు, మోదీ బ్రిటిష్ వాళ్లను భారత్కు తీసుకురావడానికి పోటీ పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని ప్లాన్, మన రహస్యాలు ఎవరికీ తెలియకుండా ఉంచుకోవాల్సిన బాధ్యత ఉందని, అయితే ఏకంగా రాష్ట్ర రాజధాని ప్లాన్నే విదేశీయుల చేతుల్లో పెట్టడం పద్ధతి కాదని చెప్పారు. సాగు చేస్తున్న భూములను రాజధాని రైతులను దౌర్జన్యం చేసి టీడీపీ లాక్కుంటోందని విమర్శించారు. తెలంగాణ విభజన రోజే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి, పథకాల అభివృద్ధి కోసం రూ.5లక్షల కోట్లు కేటాయించిందని చెప్పారు. అనంతరం పుత్తూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులురాలు హిందుమతి ఇంటిలో తేనీటి విందు తీసుకొన్నారు. పుత్తూరు సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ వెన్ను విరిచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ తులసిరెడ్డి, రెడ్డివారి చెంగారెడ్డి, డాక్టర్ నరసింహులుతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.