-
నేనూ బాధితురాలినే: నటి
సాక్షి, సినిమా: నటి పార్వతీ మీనన్ నేనూ అలాంటి బాధితురాలినే అని అంటున్నారు. పూ, బెంగుళూర్ డేస్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళీ భామ ఇటీవల మలయాళ సినీ సంఘం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అంతకు ముందు సంఘం నుంచి తొలగించబడ్డ హీరో దిలీప్ను మళ్లీ సంఘంలోకి తీసుకోవడాన్ని పలువురు నటీమణులు తీవ్రంగా వ్యతిరేకించి సంఘం నుంచి బయటకొచ్చారు. అందులో నటి పార్వతీ మీనన్ కూడా ఉంది. నటి భావన కిడ్నాప్, అత్యాచారయత్నం కేసు విచారణలో ఉండగానే నటుడు దిలీప్ను సంఘంలో చేర్చుకోవడాన్ని పార్వతి ఖండించింది. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ.. సహ నటి కిడ్నాప్నకు గురైన సంఘటన గురించి తెలిసి తాను షాక్ అయ్యానన్నారు. ఆమెకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఇది తనను మరింత దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు. తనకూ అలాంటి సంఘటన ఎదురైందని చెప్పారు. తనను కిడ్నాప్ చేసినవారెవన్నది ఇప్పుడు వెల్లడించి కూడా శిక్ష పడేలా చేయగలనని, అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. వారు ఏం చేయడానికైనా తెగిస్తారని, తనకు జరిగిన సంఘటనకు తాను మూలన కూర్చుని ఏడవలేదని, దాని నుంచి బయటపడగలిగానని అన్నారు. ఇలాంటి విషయాల్లో స్త్రీలు అవగాహనతోనూ, హెచ్చరికగానూ మసలుకోవాలని పార్వతీమీనన్ హితవు పలికారు. -
మౌనం వీడిన మమ్ముట్టి
‘కసాబా’ వివాదానికి ఫుల్స్టాప్ ఎప్పుడు? ‘‘ఇంత జరుగుతున్నా మమ్ముట్టి ఎందుకు మౌనంగా ఉన్నారు. ఆయన ఎవరికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు’’... కేరళ రాష్ట్రంలో జరుగుతోన్న చర్చ ఇది. దీనికి కారణం ‘కసాబా’లో ఆయన చెప్పిన కొన్ని డైలాగ్స్. అసలేం జరిగిందనే విషయంలోకి వెళితే.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ ప్యానల్ మెంబర్గా ఉన్న కథానాయిక పార్వతి మీనన్ ‘కసాబా’ చిత్రంపై చేసిన వ్యాఖ్యలు దూమారం రేపిన విషయం తెలిసే ఉంటుంది. ఆ చిత్రంలో మమ్ముట్టి పోలీసాఫీసర్ పాత్రను పోషించారు. ఓ సన్నివేశంలో భాగంగా ఆయన ఒక లేడీ కానిస్టేబుల్ బెల్ట్ పట్టుకుని స్త్రీల సామర్థ్యం గురించి తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ డైలాగ్ గురించి పార్వతీ మీనన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – ‘‘సమాజంలో ఉన్న ప్రతి అంశాన్ని సినిమా ప్రతిబింబించేలా ఉండాలి. స్త్రీలను తక్కువగా చిత్రీకరించటాన్ని ఎంటర్టైన్మెంట్గా భావించకూడదు. ఒక స్టార్ హీరో అటువంటి సంభాషణలు పలకటం వల్ల మిగతా వారు తప్పు దోవ పట్టే అవకాశాలు ఉన్నాయి’’ అని ఆమె నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ వ్యాఖ్యలు మమ్ముట్టి అభిమానులను ఆగ్రహానికి గురి చేశాయి. పార్వతి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్›చేశారు. కొంతమందైతే ఏకంగా చంపేస్తాం, రేప్ చేస్తాం అంటూ బెదిరించారు. పార్వతీ మీనన్ వీళ్లపై పోలీసులకు కంప్లైట్ కూడా చేశారు. పోలీసులు కొంతమందిని అదుపులోకి కూడా తీసుకున్నారు. దాదాపు నెల రోజులుగా జరుగుతున్న ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడే అవకాశం కనిపించడంలేదు. ఇంత జరుగుతున్నా మమ్ముట్టి ఎందుకు స్పందించడంలేదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. దానికి సమాధానం దొరికేసింది. ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేయను: మమ్ముట్టి ఎట్టకేలకు మమ్ముట్టి మౌనం వీడారు. గత కొంతకాలంగా సాగుతున్న ‘కసాబా’ డ్రామాకు తెర దించే ప్రయత్నం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ – ‘‘వివాదాల్లో భాగం కావడం నాకు ఇష్టం ఉండదు. ఈ విషయం గురించి వేరేవాళ్ల దగ్గర నా అభిప్రాయం చెప్పడం ఇష్టం లేదు. ఆ మాటలు వేరే వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే స్వయంగా నేనే మాట్లాడుతున్నా’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారాయన. ‘‘పార్వతి ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకు వచ్చింది. ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోవద్దని తనతో చెప్పాను. ఇలాంటి చర్యలకు పాల్పడటానికి నా అభిమానులను ఎంకరేజ్ చేయను. వాక్ స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు తెలియజేసే హక్కు ఉంది’’ అని మమ్ముట్టి అన్నారు. మరి.. ఇప్పుడైనా ఈ వివాదానికి ఫుల్స్టాప్ పడుతుందో లేదో కాలమే చెప్పాలి. అరెస్టయిన యువకుడికి జాబ్ ఆఫర్ ఈ కసాబా కాంట్రవర్శీలో తనను అమానుషంగా దూషిస్తున్న వారిలో కొందరి గురించి పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు ప్రింటో అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన ప్రింటో బెయిలు పై బయటకు వచ్చాడు. అతనికి ‘కసాబా’ నిర్మాత జాబీ జార్జ్ ఓ ఆఫర్ ఇచ్చారు. ‘‘నువ్వు ఎక్కడున్నా సరే నన్ను నా ఆఫీస్ లేదా ఇంట్లో కలిస్తే నేను బ్రతికున్నంత వరకూ నీ జాబ్ బాధ్యతలు చూసుకునే పూచీ నాది. ఇండియా, దుబాయ్, యూకె, ఆస్ట్రేలియా.. ఎక్కడ కావాలంటే అక్కడ నీకు జాబ్ ఇప్పిస్తా’’ అని ఫేస్బుక్ ద్వారా జాబీ జార్జ్ పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే.. అరెస్టుల తతంగం ఒక్క ప్రింటోతో ఆగేట్లు కనిపించడంలేదు. రోజన్ అనే యువకుణ్ణి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. -
మరోసారి పల్లెటూరి యువతిగా..
పల్లెటూరి యువతిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించిన పార్వతీ మీనన్ తాజాగా ఉదయనిధి స్టాలిన్తో నటిస్తున్న చిత్రంలో కూడా గ్రామీణ యువతిగా కనిపించనుందట. ఇందులో పార్వతీమీనన్ పాత్రకు మరింత ప్రాముఖ్యత ఇచ్చారట. ఉదయనిధి స్టాలిన్తో హీరోయన్ పార్వతీ మీనన్ రొమాన్స్ చేయనుంది. అప్పుడప్పుడు కోలీవుడ్లో మెరిసిపోతున్న మాలీవుడ్ అమ్మడు పార్వతీమీనన్. అప్పుడెప్పుడో పూ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టి ఆ తరువాత ధనుష్తో మరియాన్ చిత్రంలో చాలా సన్నిహితంగా నటించి వార్తల్లోకెక్కింది. పూ చిత్రంలో పల్లెటూరి యువతిగా మొదటిసారి నటించింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని బెంగళూర్ నాట్కళ్, కమలహాసన్తో ఉత్తమ విలన్ చిత్రాల్లో మెరిసింది. తొలి చిత్రంలోనే మంచి నటిగా నిరూపించుకుంది. అయితే దురదృష్టం ఏమిటంటే ఈ భామ నటించిన తమిళ చిత్రాలేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. తనకి వచ్చిన అవకాశాలను అంగీకరించడం లేదట. మాతృభాషలో బాగానే అవకాశాలు వస్తున్నాయట. కాగా మరోసారి తమిళ సినీ అభిమానులను పలకరించడానికి పార్వతీమీనన్ రెడీ అవుతోంది. వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్న యువ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన తాజా చిత్రం పొదువాగ ఎన్ మనసు తంగం గత శుక్రవారం తెరపైకి వచ్చింది. అంతకుముందే ఆయన తన తరువాత చిత్రానికి రెడీ అయిపోయారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నారు. ఆ చిత్ర షూటింగ్ ఇటీవలేకేరళలోని షూకుట్రాళంలో ప్రారంభమైంది. సినిమా పేరును ఇంకా నిర్ణయించలేదు. ఈ చిత్రంలో హీరోయిన్గా పార్వతీమీనన్ నటించనుంది. -
పవన్కు జోడిగా మలయాళీ బ్యూటీ
భారీ అంచనాల మధ్య విడుదలైన సర్దార్ గబ్బర్సింగ్ నిరాశపరచటంతో తన నెక్ట్స్ సినిమా మీద దృష్టి పెట్టాడు పవన్ కళ్యాణ్. గతంలోలా.., లాంగ్ గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఎస్ జె సూర్య డైరెక్షన్ లో ఓ సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో సర్దార్ గబ్బర్సింగ్ హీరోయిన్ ఎంపిక విషయంలో అభిమానులకు షాక్ ఇచ్చిన పవర్ స్టార్, మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోబోతున్నాడట. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ మొదలు కాకముందు అనీషా ఆంబ్రోస్ను, ఆ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ చేసినట్టు ప్రకటించాడు పవన్. అయితే అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పవన్, కాజల్ అగర్వాల్ను హీరోయిన్గా ఫైనల్ చేశాడు. అయితే తన నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఇలాంటి నిర్ణయాన్నే పవన్ తీసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. బెంగళూర్ డేస్ సక్సెస్తో ఆకట్టుకున్న మలయాళీ భామ పార్వతీ మీనన్ను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడు. మాలీవుడ్ లో పలు చిత్రాల్లో మెప్పించిన పార్వతి స్టార్ హీరోయిన్గా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటి హీరోయిన్, పవన్ ఇమేజ్కు ఎలా సూట్ అవుతుందన్న డైలామాలో ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. మరి పవన్ ఈ సారి రిస్క్ చేస్తాడా.? లేక అభిమానుల కోరిక మేరకు స్టార్ హీరోయిన్ వైపు మొగ్గుచూపుతాడా..? చూడాలి. -
వసంత్ దర్శకత్వంలో పార్వతీ మీనన్
వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకులు పేర్లతో వసంత్ పేరు కచ్చితంగా ఉంటుంది. కేలడీ కణ్మణి, నీ పాది నాన్ పాది, ఆశై, నేరుక్కునేర్, రిథం లాంటి పలు విభిన్న కథా చిత్రాలు సృష్టికర్త వసంత్. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ శిష్యుడైన ఈయన చివరి చిత్రం మూండ్రుపేర్ మూండ్రు కాదల్. తాజాగా తన్నీర్ అనే మరో వైవిధ్యభరిత కథా చిత్రాన్ని సెల్యులాయిడ్పై కెక్కించడానికి సిద్ధం అయ్యారు వసంత్. ఇది ప్రముఖ రచయిత అశోక్ మిత్రా రాసిన నవల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం. ఇందులో కథానాయకి పాత్రకు నటి పార్వతి మీనన్ అయితే పక్కాగా నప్పుతుందని వసంత భావించినట్లు తెలిసింది. పార్వతి మీనన్ ఇంతకుముందు పూ మరియన్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొం దారు. ఇటీవల విడుదలైన ఉత్తమవిలన్ చిత్రంలో కమల్ కూతురిగా నటిం చారు. మంచి పాత్రల కోసం తాపత్రయపడే పార్వతి చిత్రం తన్నీర్ ద్వారా మరోసారి తన సత్తా చాటుకోనున్నారన్న మాట.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement