breaking news
Parkinson Disease
-
డోపమైన్ లోపం వణికిస్తుందా..?
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వాళ్లలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తించి, మొదట్లో దానికి ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... వ్యాధినిమొదట గుర్తించిన ఫిజీషియన్ పేరిట ఇది ప్రాచుర్యం పొందింది. కొందరిలో మెదడులోని డోపమైన్ అనే రసాయనం ఉత్పిత్తి తగ్గడం వల్ల, శరీర కదలికలను అదుపులో ఉంచే నాడీకణాలు తగ్గిపోతాయి. దాంతో దేహం వణకడం మొదలై పార్కిన్సన్స్ వ్యాధి మొదలువుతుంది. ఈ వ్యాధి గురించి తెలుసుకుందాం...పార్కిన్సన్ వ్యాధి ఉన్నవాళ్లలోతొలుత నడకతో మొదలై... తర్వాత అన్ని రకాల కదలికలూ ప్రభావితమవుతాయి. ఇలా ఒక వ్యక్తి కదలికలు తగ్గిపోయే గుణాన్ని ‘హైపోకైనేసియా’ అంటారు. తర్వాత చెయ్యి వణకడం మొదలవుతుంది. ఈ వణకడమనేది ఏ పనీ చేయని దశలో... అంటే ఓ వ్యక్తి ఏ పనీ చేయకుండా పూర్తిగా రెస్ట్లో ఉన్నప్పుడు కూడా వస్తుంది ఉంటుంది. కాబట్టి ఈ వణుకుడును ‘రెస్ట్ ట్రిమర్స్’గా చెబుతారు. ఇలాంటి వ్యక్తులు పక్కకు తిరగబోయే ప్రయత్నంలో అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతూ ఉంటారు. ఇలా బ్యాలెన్స్ కోల్పోవడాన్ని పోష్చురల్ ఇన్స్టెబిలిటీ’ అంటారు. ఇవన్నీ ఈ జబ్బుకు ఉన్న ముఖ్యమైన లక్షణాలు. ఇవేగాక ఇంకా చాలా అనుబంధ లక్షణాలూ కనిపిస్తుంటాయి.కారణాలు... నిర్దిష్టంగా కారణం ఇదీ అని చెప్పలేనప్పటికీ కొన్ని పరిశీలనల ద్వారా పార్కిన్సన్ జబ్బు రావడానికి అనేక కారణాలు ఉన్నాయన్నది వైద్య శాస్త్రవేత్తల మాట. అందులో ముఖ్యమైనది జన్యులోపం. ఈ జన్యులోపం ఉన్నవారిలో ఒక వయసు దాటాక ఈ జబ్బు తప్పనిసరిగా బయటపడుతుంది. అలాగే కొందరిలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా డోపమైన్ సరిగా వెలువడక జబ్బు వస్తుంది. మరి కొందరిలో వారు తీసుకునే పానియాల్లో లేదా పీల్చే గాలిలో కొన్ని రకాల విషపదార్థాలు (టాక్సిక్ మెటీరియల్స్) ఉన్న కారణంతో... ఆ విషాలు డోపమైన్ విడుదల చేసే కణాలను దెబ్బతీనందువల్ల డోపమైన్ సరిగా విడుదల కాకపోవడంతో ఈ జబ్బు వస్తుంది. అంతేకాకుండా మరికొందరిలో తలకు పదే పదే దెబ్బలు తగలడం వల్ల కూడా ఈ జబ్బు రావచ్చు. ఇంకొందరిలో మెదడుకు కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా ఈ జబ్బు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇవన్నీ ఈ జబ్బుకు కారణమయ్యే అంశాలు. అయితే ఈ జబ్బుకు గురైన దాదాపు 50 శాతం మందిలో మాత్రం ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. ఇంకా విచిత్రం ఏమిటంటే... ఈ జబ్బు ఎలాంటి చెడు అలవాట్లు (అంటే స్మోకింగ్, ఆల్కహాల్) లేకపోవడం లేదా కనీసం కాఫీ, టీలు తాగని వారిలోనూ కనిపించడమన్నది చాలామంది వైద్యశాస్త్రవేత్తలూ, అధ్యయనవేత్తల దృష్టికి వచ్చిన ఆశ్చర్యకరమైన అంశం. ఏ వయసు వారిలో... పార్కిన్సన్స్ వ్యాధికి గురైన వారిలో 98 శాతం మంది 50 ఏళ్లు పైబడిన వారే. కేవలం రెండు శాతం లోపు వారిలోనే ఇది 50 ఏళ్లలోపు వారిలో కనిపించింది. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో మరీ యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుడటంతో దీన్ని వంశపారంపర్యంగా కనిపించే పార్కిన్సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్సనిజమ్) అంటున్నారు.ఎందుకు వస్తుందీ జబ్బు? మన మెదడు నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నది తెలిసిందే. అందులోని ఒక చిన్న భాగం పేరు ‘సబ్స్ట్రాన్షియా నైగ్రా’. దీని నుంచి డోపమైన్ అనే రసాయనం (బయోకెమికల్) వెలువడుతుంది. ఇది మన దేహం కదలికలను నియంత్రిస్తుంది. సాధారణంగా 50 ఏళ్లు పైబడ్డ వ్యక్తులు కొందరిలో ఈ రసాయనం సరిగా వెలువడదు. ఆ రసాయనం లోపించడం వల్లనే కదలికల్లో లోపాలు కనిపించడం మొదలవుతుంది.వ్యాధి నిర్ధారణ ఇలా... మెదడు ఎమ్మారై పరీక్ష, అయోఫ్లుపేన్ సింగిల్ ఫొటాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (స్పెక్ట్) పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు ∙ఎఫ్–డోపల్–6 ఫ్లూరో –3, 4 డై హైడ్రాక్సీ ఫినైల్ అలనైన్ (18 ఎఫ్– డో΄ా) పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పెట్) స్కాన్ పరీక్ష. కొన్ని నివారణ పద్ధతులు వ్యాయామం పార్కిన్సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో వచ్చే పాషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడంతో పాటు పార్కిన్సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి కొన్ని రకాల మానసిక సమస్యలు రావడంతో పాటు అవే సమస్యలు పార్కిన్సన్ వ్యాధికి దారితీసే ప్రమాదం ఉన్నందున సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ కూడా అవసరం కావచ్చు. జబ్బు గురించి కొన్ని కొత్త విషయాలు : ఈ జబ్బుతో బాధపడేవారి జీవన పరిస్థితులను (క్వాలిటీ ఆఫ్ లైఫ్) మెరుగుపరిచేందుకు ఎన్నో మందులు అందుబాటులో ఉన్నాయి. మెదడులో డోపమైన్ అనే రసాయన పదార్థం ఉత్పత్తి తగ్గడం వల్ల ఈ జబ్బు వస్తుంది కాబట్టి జబ్బు ఉన్నవారిలో ఇదే పదార్థాన్ని బయట నుంచి టాబ్లెట్ల రూపంలో ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ.కొన్ని ప్రధాన చికిత్స ప్రక్రియలు : మెదడులో తగ్గిన డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతోపాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూపోవాల్సి ఉంటుంది. లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గించి, ఉపశమనాన్నిస్తాయి. ఎమ్మారై ఇమేజింగ్ సమయంలో ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ థెరపీతో థలామస్లో కొన్ని లీజన్స్ కల్పించడమూ ఓ చికిత్సగా చెప్పవచ్చు. ఇదొక నాన్–ఇన్వేజివ్ ప్రక్రియ. అంటే... కత్తి కోత గానీ లేదా గాటు గానీ పడకుండా చేసే చికిత్స.పై చికిత్సలతో పాటు గత పది పదిహేనేళ్ల వ్యవధిలో దీనికి అనేక కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. డీబీఎస్ : డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే రూపానికి ఇంగ్లిష్ పొడి అక్షరాలే డీబీఎస్. ఇదో శస్త్రచికిత్స ప్రక్రియ. ఇందులో చాలా మోతాదులో తక్కువ కరెంట్ను పంపి డోపమైన్ కణాలను ఉత్తేజపరుస్తారు. జబ్బు బాగా ముదిరిపోయి, ఇక మందులు ఎలాంటి ప్రభావం చూపని దశలోనే ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఈ కరెంట్ పంపే పరికరం గుండెకు అమర్చే పేస్మేకర్లా ఉంటుంది. మెదడు లోపల ‘సబ్స్ట్రాన్షియా నైగ్రా’ అనే ప్రాంతంలో దీని తాలూకు ఎలక్ట్రోడ్ను అమర్చుతారు. బయట దాన్ని అనుసంధానించడానికీ, మోతాదు నియంత్రించడానికీ ఒక బటన్ను అమర్చుతారు.మందుల దుష్ప్రభావాలు మొదలైతే ప్రత్యామ్నాయం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ...పార్కిన్సన్ వ్యాధిలో వాడుకునే మందులు మూడు నుంచి ఐదేళ్ల వరకు సమర్థంగా పనిచేసినా... ఆ తర్వాత రెండు రకాల దుష్ప్రభావాలు మొదలవుతాయి. కొందరిలో టాబ్లెట్ ప్రభావం కొనసాగినంతసేపు బాగానే ఉన్నా... దాని ప్రభావం తగ్గగానే లక్షణాలు బయటపడుతుంటాయి. దీన్నే ‘ఆన్ ఆర్ ఆఫ్ ఫినామెనా’ అంటారు. మరికొందరిలో మాత్ర వేసుకున్నప్పుడు వ్యాధి తీవ్రత పెరిగినట్లుగా... దేహంలో కదలికలు మరింత పెరిగి΄ోతూ ఉంటాయి. ఈ రెండు రకాల దుష్ప్రభావాలూ సుదీర్ఘకాలం మందులు వాడినవారిలో కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మందుల్ని ఆపలేక... కొనసాగించలేక బాధితులు ఇబ్బంది పడతారు. ఇలాంటివారికి ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అన్నది ఓ వరప్రదాయని అనుకోవచ్చు. డీబీఎస్ సర్జరీకి ముందు పరీక్ష... పార్కిన్సన్ వ్యాధి మందులతో అదుపు కావడంలేదని నిర్ధారణ చేసుకోవడం కోసం వైద్యులు ఓ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో బాధితులకు మొదట మందులు ఇవ్వకుండా వారి చేత కొన్ని పనులు చేయిస్తారు. వాటితో మందు ప్రభావమూ, దుష్ప్రభావాల తీవ్రత తెలుస్తాయి. మందులతో ఇక ఏమాత్రమూ ప్రయోజనం కనిపించని బాధితులను మాత్రమే సర్జరీకి ఎంపికచేస్తారు. అంతేకాదు... వాళ్లకు ఎలాంటి మానసిక రుగ్మతలూ ఉండకూడదు. సర్జరీ తర్వాత కొందరిలో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీకి ముందు ఎలాంటి మానసిక సమస్యలూ లేవని సైకియాట్రిస్ట్ తొలుత నిర్ధారణ చేయాలి. డీబీఎస్ సర్జరీలో ఏంజరుగుతుందంటే... డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కోసం మెడిట్రానిక్స్, బోల్టన్ సైంటిఫిక్, సెయింట్ జ్యూడ్ మొదలైన కంపెనీల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే ఈ శస్త్రచికిత్సలో భాగంగా... ఎలక్ట్రోడ్లను కలిగిన లీడ్లను మెదడులో అమర్చుతారు. వాటికి విద్యుత్తును అందించే పల్స్ జనరేటర్ను ఛాతీలో అమర్చుతారు. ఈ రెండూ వైర్తో అనుసంధానమై ఉంటాయి. బ్యాటరీతో నడిచే ఈ పల్స్ జనరేటరు నిరంతరం పనిచేస్తూ, విద్యుత్ ప్రసారాన్ని వెలువరిస్తూ ఉండటం వల్ల మెదడుకు నిరంతరాయంగా కరెంట్ సరఫరా జరుగుతూ ఉంటుంది. దాంతో లక్షణాలు అదుపులోకి వస్తాయి. బ్యాటరీతో పనిచేసే ఈ పల్స్ జనరేటర్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. వీటిలో రీచార్జ్, సింగిల్ యూజ్ అనే రెండు రకాల బ్యాటరీలు ఉంటాయి. సింగిల్ యూజ్ బ్యాటరీలు ఏకంగా మూడు నుంచి ఐదేళ్ల వరకు పనిచేస్తాయి. కాలం చెల్లిన తర్వాత చిన్న సర్జరీతో బ్యాటరీని మార్చుకోవాల్సి ఉంటుంది. అదే రీచార్జ్ బ్యాటరీ అయితే 15 నుంచి 20 ఏళ్ల వరకు పనిచేస్తాయి. వీటిని ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్లుగా, ఓ వైర్లెస్ ఛార్జర్ను ఛాతీకి కట్టుకుని బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే..? డోపమైన్ను బయటి నుంచి అందించకుండానే... ఆ న్యూరోట్రాన్స్మిటర్ శరీరంలో ఉందనే భావనను మెదడుకు కలిగించేలా చేసే సర్జరీ ఇది. ఇందుకోసం... మెదడులో శరీర కదలికలను నియంత్రించే ‘న్యూక్లియస్’లలోకి ఓ లీడ్ను అమర్చుతారు. దాన్ని బ్యాటరీకి అనుసంధానిస్తారు. శస్త్రచికిత్స ద్వారా ఆ బ్యాటరీని ఛాతీలో ఉంచుతారు. ఆ బ్యాటరీ నుంచి వెలువడే ‘ఎలక్ట్రిక్ ఇంపల్స్’ మెదడును ప్రేరేపిస్తాయి. దాంతో న్యూక్లియస్లన్నీ గాడిలో పడి, డోపమైన్ ఉన్నట్లుగా మెదడుకు భ్రమ కలిగిస్తాయి. ఫలితంగా పార్కిన్సన్ వ్యాధి అదుపులోకి వస్తుంది. అంతేకాదు... మందుల తాలూకు దుష్ప్రభావాలలో కనిపించే ‘ఆన్ అండ్ ఆఫ్ ఫినామినా’ కండిషన్ తొలగిపోతుంది. బ్యాటరీ నుంచి విద్యుత్తు నిరంతరాయంగా మెదడుకు ప్రసరిస్తూ ఉండటం వల్ల లక్షణాలు పెరగడం / తగ్గడం లాంటివి కూడా ఉండవు. అలాగే సర్జరీ తర్వాత మందుల మోతాదు కూడా తగ్గిస్తారు. దాంతో అదనపు కదలికలూ తగ్గుతాయి. డీబీఎస్ సర్జరీ ఫలితం ఇలా...ఈ శస్త్రచికిత్సతో పార్కిన్సన్ వ్యాధిని మరింత పెరగకుండా అక్కడికి అదుపుచేయవచ్చు. అయితే గతంలో జరిగి΄ోయిన నష్టాన్ని మాత్రం భర్తీ చేయడం సాధ్యం కాదు. బాధితులు ఒకింత నాణ్యమైన జీవితం గడపడం కోసమే ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ చికిత్స ఉపయోగపడుతుంది తప్ప... ఇది పూర్తిగా వ్యాధిని నయం చేయలేదని గ్రహించాలి. సర్జరీ సమయానికి రోగి శారీరక స్థితి ఎలా ఉందో, అదే పరిస్థితి కొనసాగడం లేదా అంతకంటే దిగజారకుండా ఉండటానికి మాత్రమే డీబీఎస్ ఉపయోగపడుతుంది.స్టెమ్సెల్ థెరపీ: పార్కిన్సన్ డిసీజ్కు శాశ్వత చికిత్స అందించే ప్రయత్నాల్లో ఈ చికిత్స ప్రక్రియను మొదటిదిగా పేర్కొనవచ్చు. మన శరీరంలోని వేర్వేరు అవయవాల్లో ఉండే కణాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదా: మెదడు కణాలను న్యూరాన్లుగా, రక్తకణాల్లో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్గా, కాలేయకణాలు హెపటోసైట్స్, కండరకణాలు మయోసైట్స్గా, ఎముకకణాలు ఆస్టియోసైట్స్గా ఉంటాయి. అయితే ఈ కణాలన్నీ ఉత్పత్తి అయ్యే మూల (ప్రిమిటివ్) కణాన్ని ఇంగ్లిష్లో ‘స్టెమ్సెల్’ అంటారు. ప్రస్తుతం బొడ్డుతాడునుంచి సేకరించిన కణాలను కొన్ని ప్రక్రియలు, దశల తర్వాత స్టెమ్సెల్గా మార్చి అమర్చితే... అది అమర్చిన ప్రదేశాన్ని బట్టి... అది సదరు అవయవానికి సంబంధించిన కణంగా మారి΄ోతుంది. ఈ తరహా చికిత్సనే స్టెమ్సెల్ థెరపీ అంటారు. ఈ చికిత్సలో భాగంగా స్టెమ్సెల్స్ను మెదడులో సబ్స్ట్రాన్షియా నైగ్రా (ఎస్.ఎన్.) ఉన్న ప్రాంతంలో ప్రవేశపెడతారు. అక్కడ అవి కొత్త ఎస్.ఎన్. కణాలుగా తయారవుతాయి. దాంతో ఆ కొత్త కణాలనుంచి మళ్లీ శరీరానికి కావాల్సిన డోపమైన ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి ఈ జబ్బు లక్షణాలన్నీ పూర్తిగా తగ్గి΄ోయేందుకు అవకాశముంది. స్టెమ్సెల్స్ ఉత్పత్తి ఇలా : మన శరీరంలో ఏదో ఒక శాంపుల్ నుంచి కణాలను సేకరిస్తారు. (ప్రధానంగా రక్తం లేదా బొడ్డు తాడులో ఉన్న రక్తంలో స్టెమ్సెల్స్ ఎక్కువగా ఉంటాయి). ఈ శాంపుల్ను ఒక యంత్రంలో ఉంచి మరిన్ని కణాలు ఉత్పత్తి అయి వాటి సంఖ్య పెరిగేలా ఇంక్యుబేట్ చేస్తారు. ఇలా ఒక మూలకణం... కణవిభజన ప్రక్రియ ద్వారా మరెన్నో కణాలుగా విభజన అయి చాలా కణాలు తయారవుతాయి. వాటినే మనం మూలకణాలుగా అవసరమైన చోట ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రక్రియ గురించి విస్తృతంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుత పురోగతిని బట్టి ఈ ప్రక్రియ ద్వారా రానున్న కొన్నేళ్లలో ఇవి కచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయని తప్పక చెప్పవచ్చు. ఫీటల్ సెల్ట్రాన్స్ప్లాంటేషన్ : ఈ ప్రక్రియలోనూ అనుసరించే విధానం ఇంచుమించు పైన పేర్కొన్నట్లుగానే ఉంటుంది. బిడ్డ పుట్టగానే ఆ చిన్నారి బొడ్డుతాడును, దాంతోపాటు కొద్దిగా రక్తాన్ని (ఫీటల్ బ్లడ్)ను సేకరించి, ప్రత్యేకమైన ల్యాబ్లో ప్రాసెస్ చేసి, మూలకణాలను తయారు చేస్తారు. వాటిని అవసరమైనప్పుడు కావాల్సిన చోట వాడుకుంటారు. అప్పుడు ఆ ప్రదేశంలో కొన్ని మూలకణాలను అమర్చగానే అది పూర్తి అవయవంగా రూపుదిద్దుకోవాలన్నదే ఈ ప్రక్రియ లక్ష్యం. జీన్ థెరపీ : ఈ ప్రక్రియపై గత 15–20 ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. పార్కిన్సన్స్ డిసీజ్ అనే ఈ జబ్బు... పార్క్’ అనే ఒక జన్యువు లోపం కారణంగా వస్తుంది. కాబట్టి ఈ జన్యువులో వచ్చే లోపాలను నివారిస్తే అసలు జబ్బు రాకుండానే నివారించే అవకాశం ఉంది. ఇలా అరికట్టడం అనే ప్రక్రియ రాబోయే దశాబ్దకాలంలో అందరికీ అందుబాటులోకి రావచ్చని ప్రస్తుతం ఉన్న పురోగతిని బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రాసావిన్ చికిత్స : ప్రాసావిన్ అనే పదార్థాన్ని మెదడుభాగంలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయని తేలింది. ప్రస్తుతం ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ బయోమెడికా సంస్థలో ఈ చికిత్స ప్రక్రియపై పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రైట్లైట్ : ఒక ఫ్రీక్వెన్సీలో ఉండే కాంతి తరంగాలను ప్రసరింపజేయడం వల్ల మెదడులో ఉండే మెలటోనిన్ను తగ్గించి డోపమైన్ ఉత్పత్తిని ఎక్కువ చేయవచ్చనే అంశం ఆధారంగా జరిగే చికిత్స ఇది. ట్రాన్స్ క్రేనియల్ ఆల్టర్నేట్ కరెంట్ స్టిమ్యులేషన్స్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరెంట్ ఇచ్చి, నైగ్రల్ సెల్స్ను ఉత్తేజపరచి, డోపమైన్ ఉత్పత్తి జరిగేలా తమ ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. పైన పేర్కొన్న చికిత్స ప్రక్రియలతో పాటు న్యూరల్ గ్రోత్ ఫ్యాక్టర్, జీడీఎన్ఎఫ్ (గ్లయల్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్) వంటి కొన్ని అంశాలను రక్తంలోకి ప్రవేశింపజేయడం వల్ల అవి మళ్లీ మెదడులోకి ప్రవేశించి అక్కడ నైగ్రల్ సెల్స్ను అభివృధ్ధి చేసేలా చూస్తే ప్రక్రియలపైన చాలా విస్తృతమైన అధ్యయనం జరుగుతోంది. మునుపటితో పోలిస్తే ప్రస్తుతం పార్కిన్సన్స్ డిసీజ్ను తగ్గించేందుకు కొంతమేర మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయని, కొన్నాళ్లలో ఇంకా మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నమ్మకంగా చెప్పవచ్చు. డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ అండ్ న్యూరో సర్జన్(చదవండి: హీరో సల్మాన్ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..) -
డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స
అద్భుతమా, అసంబద్ధమా? ఏమిటిది! నియంత్రణ లేని కదలికలకు నియమబద్ధమైన కదలికలతో చికిత్సా?! ‘పార్కిన్సన్స్’ డిసీజ్ అంటే నడక అదుపు తప్పటం, చేతులు కదలకపోవటం, కాళ్లు మెదలకపోవటం, తల వణకడం, ఉన్నట్లుండి అదిరి పడటం, నాడీ వ్యవస్థకు, ఇంద్రియాలకు మధ్య సమన్వయం గాడి తప్పటం!! దేహం ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు నృత్యం చెయ్యటం ఎంత దుర్లభం! పైగా దుర్లభమే దుర్భరానికి చికిత్స అవటం ఇంకెంత విడ్డూరం! అయితే ఇది విడ్డూరమేమీ కాదు, ప్రయోగాత్మకంగా నిర్థారణ అయిన విషయమే అంటోంది ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ (ఐ.ఎ.డి.ఎం.టి). పార్కిన్సన్లో ఏ కదలికా లయబద్ధంగా ఉండదు. డాన్స్లో లయబద్ధంగా లేని ఒక్క కదలికా ఉండదు. కానీ ఐ.ఎ.డి.ఎం.టి. పార్కిన్సన్స్ వ్యాధిని నయం చేయటానికి, వ్యాధిగ్రస్తుల్ని శక్తిమంతం చేయటానికి భారతీయ నృత్య రీతుల్ని ఒక చికిత్సా విధానంగా ఉపయోగిస్తోంది. విశాలమైన ఒక నిశ్శబ్దపు గది, వెనుక నుంచి మంద్రస్థాయిలో వినిపించే తబలా బీట్ వంటి ఒక సంగీత వాద్యం ఈ చికిత్సలో ముఖ్య భాగంగా ఉంటాయి. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా వృద్ధులు అంతా కలిసి ఆ గదిలో ఉంటారు. అందరూ కూడా పార్కిన్సన్స్ బాధితులే. మనసును తాకుతున్న నేపథ్య ధ్వనికి అనుగుణంగా వాళ్ల చేతులు మబ్బుల్లా తేలుతాయి. చేతి వేళ్లు మృదువైన హావభావాలు అవుతాయి. పాదాలు లయకు అనుగుణంగా కదులుతాయి. గొప్ప పారవశ్యంతో మదిలోంచి జనించే ఉద్దేశపూర్వకమైన ఆంగికం (అవయవాల కదలిక)తో వారు ఒక మహా విజయాన్ని సాధిస్తారు. పార్కిన్సన్స్లో ప్రమేయం లేని కదలికలు మాత్రమే ఉంటాయి కనుక ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని కదలించటం అన్నది మహా విజయమే. తప్పిన పట్టు తిరిగి వచ్చేస్తోంది‘‘ఇక్కడికి వచ్చిన వారు కొన్ని నెలల క్రితం వరకు కూడా పడిపోతామేమో అనే భయం లేకుండా నడవలేకపోయిన వారే. కానీ వారిని ఈ నృత్య చికిత్స ఎంతగానో మెరుగు పరిచింది’’ అంటారు ఐ.ఎ.డి.ఎం.టి. అధ్యక్షురాలు, ‘డ్రామా థెరపీ ఇండియా’ వ్యవస్థాపకురాలు అన్షుమా క్షేత్రపాల్. పార్కిన్సన్స్లో నాడీ వ్యవస్థ–శరీరావయవాల పరస్పర చర్యల మధ్య సమన్వయం (మోటార్ కంట్రోల్) దెబ్బతింటుంది. మానసికంగానూ పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు పట్టుతప్పుతారు. ఈ స్థితిలో వారికొక ఉనికిని, వ్యక్తీకరణ శక్తిని, మునుపటి ఆనందకరమైన జీవితంలోకి మార్గాన్ని నృత్య చికిత్స ఏర్పరుస్తుందని అన్షుమా చెబుతున్నారు. ఈ సంస్థల శాఖలు ముంబై, పుణే, బెంగళూరులలో ఉన్నాయి.నృత్యం తెచ్చే మార్పేమిటి?పార్కిన్సన్స్ మెదడు క్రియాశీలతను, డోపమైన్ కేంద్రమైన ‘బేసల్ గాంగ్లియా’ను ప్రభావితం చేస్తుంది. దాంతో స్వచ్ఛంద కదలికలు కష్టతరం అవుతాయి. కానీ మెదడు మాత్రం ‘లయ’లకు స్పందిస్తుందని అన్షుమా అంటున్నారు. ‘‘సంగీతాన్ని వింటున్నప్పుడు మెదడులో దెబ్బతినని సర్క్యూట్లు (పార్కిన్సన్స్ వల్ల దెబ్బతిన్నవి కాకుండా) వేర్వేరు నాడీ రహదారుల ద్వారా కదలికలను తెస్తాయి. నాడీ శాస్త్రపరంగా, ఈ నృత్య చికిత్స బలాల్లో ఒకటి రిథమిక్ ఆడిటరీ స్టిమ్యులేషన్ (ఆర్.ఎ.ఎస్.) ఉద్దీపన చెందటం. దీనివల్ల అవయవ సమన్వయం ఏర్పడుతుంది. డోపమైన్, ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ల వంటి న్యూరో ట్రాన్సిమీటర్ హార్మోన్లు పెరుగుతాయి. దాంతో కదలికలు మాత్రమే కాదు, మానసిక స్థితీ మెరుగుపడుతుంది’’ అని ఆమె అంటున్నారు.గర్బా నృత్యంపై తొలి ప్రయోగంగుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’పై 2024లో ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనంలో పార్కిన్సన్స్ రోగులపై ఈ డ్యాన్స్ చక్కటి ప్రభావం చూపినట్లు వెల్లడైంది. పార్కిన్సన్స్కు చికిత్సగా నృత్య రీతుల్ని ఆశ్రయించటం 2009లో ముంబైలోని ‘పార్కిన్సన్స్ డిసీ జ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ సొసైటీ ’ ప్రయత్నాలతో మొదలైంది. అదే సమయంలో ఆర్జెంటీనాలో టాంగో, సల్సా డ్యాన్సులు పార్కిన్సన్స్కు చికిత్స గా ఉపయోగపడతాయా అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఆ స్ఫూర్తితో 2010లో మన దగ్గర శా స్త్రీయ నృత్యాల చికిత్సా తరగతులు వారానికి రెండుసార్లు 3 నెలల పాటు ముంబైలో జరిగాయి. ప్రస్తుతం దేశంలోని అనేక కమ్యూనిటీ సెంటర్లు భరతనాట్యం, గర్బా, కూడియట్టంలతో చికిత్స చేస్తున్నాయి.పార్కిన్సన్స్ లక్షణాలు – కారణాలుప్రధానంగా ఇవి శారీరకమైనవి. వణుకు, బిగదీసుకుపోవటం, కదలికలు నెమ్మదించటం, భంగిమలో అస్థిరత వంటివి కనిపిస్తాయి. క్రమంగా ఆందోళన, కుంగుబాటు మొదలౌతుంది. ఎవ్వరితోనూ కలవలేక, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అపారమైన దుఃఖం మిగులుతుంది. మెదడులో డోపమైన్ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు సక్రమంగా పని చెయ్యకపోవటం లేదా నశించటం పార్కిన్సన్స్కు ప్రధాన కారణం. మనిషి తను కదలాలనుకున్నట్లు కదలటానికి డోపమైన్ అవసరం. డోపమైన్ లోపించటం వల్ల కదలికలు అస్తవ్యస్తం అవుతాయి. మెదడులో డోపమైన్ ఉత్పత్తి తగ్గటానికి గల కారణాలపై పరిశోధకులింకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఒక కారణం మాత్రం వృద్ధాప్యం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో సుమారు ఒక శాతం మందికి పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. డోపమైన్ను భర్తీ చేసే మందులు, మెదడు ఉద్దీపన వంటి వైద్య చికిత్సలలో పురోగతి సాధించినప్పటికీ ఫలితాలైతే అనుకున్నంతగా లేవు.రోగులు తమకు తామే వైద్యులుసాధారణ వైద్యంలా ఈ ‘డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ ఎవరో సూచించేది కాదు. ఎవరికి వారుగా అనుసరించేది. ఎలా కదలాలన్నదీ ఎవరూ చెప్పరు. కదిలే మార్గాలను ఎవరికి వారే అన్వేషించేలా మాత్రం ప్రోత్సహిస్తారు. నడక లేదా భంగిమను సరిదిద్దుతారు. శ్వాసపై నియంత్రణ కల్పిస్తారు. ఊహాశక్తిని, వ్యక్తీకరణను లయబద్ధం చేస్తారు. చికిత్సలో పాల్గొనే వారిలో కొంతమంది కూర్చుని నృత్యం చేస్తారు. మరికొందరు స్థిరంగా నిలబడతారు. కొందరు మరింత స్వేచ్ఛగా కదులుతారు. మొత్తానికి వాళ్లంతా రోగుల్లా కాకుండా, దేన్నో సృష్టిస్తున్నట్లుగా ఉంటారు.సాక్షి నేషనల్ డెస్క్(చదవండి: హీరో శింబు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..) -
నాన్న ఉన్నట్టుండి పడిపోతున్నారా?, అయితే..
ఆరు పదుల వయసు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు?, ఎలా ఉంటున్నారు? అనేది పిల్లలు గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అంతకుముందు చురుగ్గా తిరిగిన తండ్రి.. ఇప్పుడు ఉన్నట్టుండి డల్గా మారిపోవడం, శరీరం అంతా బిగుసుకుని ఉండిపోవడం, ఎక్కువగా నడవలేకపోవడం, ఒకవేళ నడిచినా పడిపోతుండడం లాంటి లక్షణాలు కనపడితే, అది కేవలం వయసు ప్రభావం మాత్రమే కాదు.. పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు. పై లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించాలి. తగిన పరీక్షల ద్వారా దానికి కారణాలేంటో తెలుసుకుని తక్షణం చికిత్స ప్రారంభిస్తే లక్షణాలు తగ్గడమే కాదు, కొన్ని కేసుల్లో పూర్తిగా నయం అయిపోతుంది కూడా! మెదడులో ఉండే డొపమైన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వచ్చే పార్కిన్సన్స్ వ్యాధి గురించి సామాన్య ప్రజల్లో కూడా అవగాహన ముఖ్యమని.. దాని లక్షణాలను గమనించి వెంటనే చికిత్స చేయించడం అవసరమని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిరుధ్ రావు దేశ్ముఖ్ తెలిపారు. ఈ నెల 11న ప్రపంచ పార్కిన్సన్స్ డే(World Parkinson's Day) సందర్భంగా ఆయన మాట్లాడారు.“మన శరీరంలో ఇన్సులిన్ తగ్గితే మధుమేహం ఎలా వస్తుందో... అలాగే డొపమైన్ తగ్గితే పార్కిన్సన్స్ వస్తుంది. సాధారణంగా ఇది 60 ఏళ్లు దాటినవారిలోనే కనిపిస్తుంది గానీ, ఇటీవల కొన్ని కేసుల్లో మాత్రం 20లలో ఉన్నవారికి కూడా చూస్తున్నాం. ఇతర వ్యాధుల్లా కాకుండా.. శారీరకంగా కనిపించే లక్షణాలను బట్టే దీన్ని గుర్తించేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది. 👉ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం, గతంతో పోలిస్తే బాగా డల్గా ఉండడం, ముఖంలో ఎలాంటి హావభావాలు పలికించకపోవడం, శరీరం అంతా బిగుతుగా అయిపోవడం, చేతులు కొద్దిగా వణకడం, చేత్తో ఏవీ సరిగ్గా పట్టుకోలేకపోవడం, నడక తగ్గిపోవడం, నడుస్తుంటే పడిపోవడం... ఇలాంటివన్నీ కూడా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలే. వీటిలో ఏవి కనిపించినా కూడా అవతలివాళ్లు వెంటనే గుర్తించగలరు. 👉అలా గుర్తించినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో.. కుటుంబంలో ఏదైనా మరణం సంభవించడం వల్ల కుంగుబాటు (డిప్రెషన్)తో అలా అయిపోయారని, కొన్ని రోజులు పోతే అదే నయమైపోతుందని వదిలేయకుండా వెంటనే వైద్యులకు చూపించాలి. చూపించినప్పుడు ఆ సమస్య మానసికమా, శారీరకమా అన్నది గుర్తించి అందుకు తగిన చికిత్సలు అందిస్తారు.👉గతంలో పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ) వచ్చిందంటే దానికి ప్రధానంగా డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) లాంటి శస్త్రచికిత్సలే ఉండేవి. లేదంటే శరీరంలో డొపమైన్ స్థాయిని పెంచేందుకు కొన్ని రకాల మందులు వాడేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి కారణాలు ఏంటో తెలుసుకుని అందుకు తగిన చికిత్స చేసేందుకు అవకాశం వచ్చింది. ఇటీవల నా దగ్గరకు ఒక రోగి వచ్చారు. ఆయనకు పార్కిన్సన్స్ లక్షణాలే ఉన్నాయి. పరీక్షించినప్పుడు యాంటీబాడీలు తయారవ్వడం వల్ల డొపమైన్ స్థాయి తగ్గుతోందని గుర్తించాం. దాంతో ఇమ్యునోథెరపీ ప్రారంభిస్తే చాలా తక్కువ సమయంలోనే ఆయనకు పూర్తిగా నయమైంది. ఇప్పుడు మామూలు మనిషిలా ఉన్నారు. అందువల్ల సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొస్తే, పార్కిన్సన్స్ వ్యాధిని కూడా పూర్తిగా నయం చేసేందుకు కొన్ని కేసుల్లో అవకాశం ఉంటుంది. అదే ఇంతకుముందయితే జీవితాంతం డొపమైన్ పెంచేందుకు ఉపయోగపడే మందులు వాడుతూ ఉండాల్సి వచ్చేది, లేదా డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చేది. కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీరంలో కణాలు చచ్చిపోతాయి. అందువల్ల కూడా డొపమైన్ ఉత్పత్తి తగ్గిపోయి ఈ సమస్య వస్తుంది. అందువల్ల.. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే రసాయనాలకు గురికావడాన్ని కూడా తగ్గించాలి. అలాగే ఎంత త్వరగా ఈ లక్షణాలు గుర్తిస్తే అంత త్వరగా వైద్యులకు చూపించి, త్వరగా చికిత్స చేయడం మొదలుపెడితే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. చురుకైన జీవనశైలిని పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం, నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధి రాకుండా నిరోధించుకోవచ్చు” అని డాక్టర్ అనిరుధ్ రావు దేశ్ముఖ్ వివరించారు.డాక్టర్ అనిరుధ్ రావు దేశ్ముఖ్,ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్,స్ట్రోక్ స్పెషలిస్ట్ -
బ్రహ్మాండంగా బైడెన్ ఆరోగ్యం.. నిర్ధారించిన వైట్ హౌస్ వైద్యులు
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్కు మతిమరుపుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ వస్తున్న వదంతుల్ని వైట్హౌస్లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ ఖండించారు. అధ్యక్షుడి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ప్రతినిధి జోబైడెన్ ఆరోగ్యం గురించి వ్యక్తమవుతున్న ఆందోళనపై డాక్టర్ కెవిన్ను ప్రశ్నించారు.ప్రస్తుతం జోబైడెన్ ఆరోగ్యం ఎలా ఉంది? అధ్యక్ష పదవి ముగిసేలోపు ఆయనలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. లేదు.లేదు. ఆయ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. మరి మానసిక పరిస్థితి ఎలా ఉందని అడగ్గా.. అద్భుతంగా ఉందని బదులిచ్చారు. మరోవైపు ఆనారోగ్యం కారణంగా డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ సుమారు ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది సార్లు వైట్ హౌస్లో బైడెన్తో భేటీ అయినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.In just a few months, the American people will choose the course of America’s future. I made my choice.And I would like to thank our great Vice President—@KamalaHarris.She’s experienced, tough, capable. She has been an incredible partner to me and leader for our country.— Joe Biden (@JoeBiden) July 25, 2024 అధ్యక్ష రేసు నుంచి అవుట్ఇటీవల బైడెన్కు తలెత్తుతున్న అనారోగ్య సమస్యల కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీలో ఓటమి భయం మొదలైంది. అందుకే మరోసారి బైడెన్ను అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. బాహాటంగా నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.కమలా హారిస్ సమర్థురాలంటూపదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని పరోక్షంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమర్థురాలంటూ... ఆమే అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు. మిగిలి ఉన్న ఆరు నెలల పదవీకాలంలో తన విధిని సమర్థంగా నిర్వర్తిస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. -
Kiran Kamdar: కిచిడీ బామ్మ
ఆస్పత్రిలోని రోగులు ప్రతి మధ్యాహ్నం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఆమె రాకుండా పోదు. మబ్బులు రానీ నిప్పులు కురవనీ వస్తుంది. ముంబై ఆస్పత్రుల్లోని పేద రోగులకు రోజుకు వంద మందికి ఆమె కిచిడీ పంచుతుంది. ఆమె దగ్గర డబ్బు లేదు. మనసు తప్ప. అందుకే ఆమెను అందరూ ‘కిచిడీ ఆజి’ అని పిలుస్తారు.62 సంవత్సరాల కిరణ్ కామ్దార్ కుదురుగా నిలబడిగాని, కూచునిగాని మాట్లాడలేదు. దానికి కారణం ఐదేళ్ల క్రితం ఆమెకు వచ్చిన పార్కిన్సన్స్ వ్యాధి. కాని ఆమె ఆలోచనలు కుదురుగా ఉన్నాయి. ఆమె సేవాగుణం కుదురుగా ఉంది. దానిని ఎవరూ కదపలేరు. ముంబై శివార్లలో కొంకణి తీరాన ఉన్నపాల్ఘర్ పట్టణం ఆమెది. సాదాసీదా జీవనమే అయినా ఒక మనిషికి సాటి మనిషి సేవ అవసరం అని ఆమె తెలుసుకుంది. అందుకు కారణం ఆమె కుమారుడు సెరిబ్రల్పాల్సీతో జన్మించడమే. కుమారుడి కోసం జీవితాన్ని అంకితం చేసిన కిరణ్ చుట్టుపక్కల పేద పిల్లలకుపాఠాలు చెప్పడంతోపాటు చేతనైన సాయం చేయడం కొనసాగించేది. అయితేపార్కిన్సన్స్ వ్యాధి ఆమె కార్యకలాపాలను స్తంభింపచేస్తుందని ఆమె భర్త, కుమార్తె అనుకున్నారు. కాని 2021లో జరిగిన ఒక ఘటన అందుకు విరుద్ధంగా ఆమెను ప్రేరేపించింది.కిచిడి ముద్దపాల్ఘర్లో ఒకే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల 15 పల్లెల నుంచి పేద జనం ఉదయం నుంచే వచ్చి ఓపీలో వెయిట్ చేస్తుంటారు. వారికి చెకప్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ సమయంలో వారి ఆకలి బాధకు అక్కడ విరుగుడు లేదు. 2021లో కోవిడ్ సెకండ్వేవ్ సమయంలో ఒక బంధువును పరామర్శించడానికి కిరణ్ ఆ ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం వేళ చాలామంది పేషెంట్లు ఆకలితో బాధ పడుతున్నారని గ్రహించింది. ‘వీరికి ఆకలి తీరే మార్గమే లేదా?’ అనుకుని వెంటనే రంగంలో దిగింది. హాస్పిటల్ డీన్ని కలిసి ‘నేను మీ హాస్పిటల్లోని పేషెంట్లకు శుచిగా చేసిన వెజిటబుల్ కిచిడి పెట్టొచ్చా. వాళ్లు అన్నం లేక బాధ పడుతున్నారు’ అని అడిగింది. హాస్పిటల్ డీన్ వెంటనే అంగీకారం తెలిపారు. అలా మొదలైంది కిరణ్ ‘కిచ్డీ బ్యాంక్’ ఆలోచన.రోజూ 100 మందిఅంతటిపార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నా రోజూ స్వయంగా దాదాపు 20 నుంచి 22 కిలోల కిచిడి తయారు చేస్తుంది కిరణ్. ఆ తర్వాత దానిని స్వయంగా తీసుకుని ఆస్పత్రి చేరుతుంది. అక్కడ వార్డు వార్డుకు తిరుగుతూ పేషెంట్లకి, వారి బంధువులకి, చిన్న పిల్లలకు పంచి పెడుతుంది. ఇందుకు రెండు మూడు గంటలు పట్టినా ఆమె అలసి పోదు. పల్లెటూరి పేదవారు ఆమె తెచ్చే ఆ కిచిడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ‘నువ్వు దేవతవు తల్లీ’ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. ‘కిచిడి పేషెంట్లను త్వరగా కోలుకునేలా చేస్తుంది. సులభంగా అరుగుతుంది’ అంటుంది కిరణ్.అదే వైద్యంపార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఇంతమందికి రోజూ వండటం గురించి కిరణ్కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆందోళన చెందినా, వారించినా ఇప్పుడు మూడేళ్లుగా సాగుతున్న ఆమె సేవను చూశాక, ఆమెకు పరీక్షలు చేశాక ‘ఆమె చేస్తున్న సేవే ఆమెకు వైద్యంగా పని చేస్తున్నదని’ తేల్చారు. ఆమె సంకల్పం వ్యాధిని అదుపులో పెడుతోందని తెలియచేశారు. కిరణ్ కామ్దార్ గత మూడేళ్లుగా సాగిస్తున్న ఈ సేవకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మెచ్చుకోళ్లు దక్కుతున్నాయి. నిజానికి ఇది అసాధ్యమైన పని కాదు. ఆమె మాత్రమే చేయదగ్గ పని కాదు. ఎవరైనా అతి సులువుగా పూనుకోదగ్గదే. ప్రతి ్రపాంతంలో ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర పేదవాళ్లు, లోపలి పేషెంట్లు సరైన తిండి లేక బాధపడుతుంటారు. వారికి కిచ్డీయో సాంబార్ రైసో పెట్టడం పెద్ద కష్టం కాదు. రోజూ చేయకపోయినా వారానికి ఒకరోజైనా ఇలాంటి సేవ చేస్తే ఆ తృప్తే వేరు. ఎక్కువమంది పూనుకోరు. పూనుకున్నవారు కిరణ్ కామ్దార్లా చిరాయువు పొందుతారు. -
పెద్దవయసు వారిని వణికించే పార్కిన్సన్స్ వ్యాధి!
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పెరిగిన వారిలో అంటే 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే వ్యాధి. ఇందులో బాధితుల వేళ్లు, చేతులు వణుకుతుంటాయి. ఈ వ్యాధిని డాక్టర్ జేమ్స్ పార్కిన్సన్ అనే వైద్యనిపుణుడు 1817లో గుర్తిం, ‘షేకింగ్ పాల్సీ’ అని పేరు పెట్టినప్పటికీ... కనిపెట్టినవారి పేరుతోనే ఇది ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాధి గురిం ప్రాథమిక అవగాహన కోసం ఈ కథనం. పార్కిన్సన్స్ వ్యాధి మహిళల్లో కంటే పురుషుల్లో దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. కొందరిలో యుక్తవయసులో అంటే 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తుండటంతో దీన్ని అనువంశీకంగా కనిపించే పార్కిన్సనిజమ్ (హెరిడిటరీ పార్కిన్సనిజమ్) అంటున్నారు. లక్షణాలు: కదలికలు నెమ్మదిస్తాయి (దీన్ని బ్రాడీకైనేసియా అంటారు). దాంతో నడక, స్నానం, దుస్తులు ధరించడం కష్టమవుతుంది. ముందుకు పడిపోతున్నట్లు అనిపిస్తుంటుంది. బ్యాలెన్స్ కోల్పోతారు. కాళ్ల, చేతుల్లోని కండరాలు బిగుసుకుపోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన అలసట (ఫెటీగ్)కనిపిస్త, తరచూ నిద్రాభంగమవుతుంది. ఈ పరిణామాలతో పాటు మెదడులోని కొన్ని రసాయనాల అసమతౌల్యత వల్ల కుంగుబాటు (డిప్రెషన్), నిద్రసమస్యలు కనిపిస్తాయి. పీడకలల, రాత్రి నిద్రలేమితో అకస్మాత్తుగా పగటినిద్ర రావచ్చు. కొందరిలో మింగడం కష్టంకావడం, మింగలేకపోవడంతో ఆహారం గొంతులో పట్టేయడం /ఇరుక్కుపోవడం. కొందరిలో కండరాల నొప్పులు / కీళ్ల నొప్పులు. మొదట్లో కనిపించే ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తే, అవి మరింత ముదిరి బాధితులు తమ రోజువారీ పనులు చేసుకోలేనంతగా ఇబ్బంది పడతారు. ∙కొన్ని చర్మ సమస్యలతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మూత్ర విసర్జన సమస్యల అలాగే మలబద్దకం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ ఇలా... పార్కిన్సన్స్ వ్యాధిని పసిగట్టడం అన్నది ప్రధానంగా వ్యాధి లక్షణాల్ని బట్టి, క్లినికల్ పరీక్షల సహాయంతో జరుగుతుంది. నిర్ధారణ కోసం ఈ కింది పరీక్షలు అవసరమవుతాయి. మెదడు ఎమ్మారై పరీక్ష, స్పెక్ట్ అనే పరీక్ష. దీన్నే డాట్ స్కాన్ అని కూడా అంటారు. పెట్ స్కాన్ పరీక్ష. చికిత్స : వయసు పెరగడంతో మెదడులోని డోపమైన్ తగ్గడం, దాంతో కదలికలను నియంత్రించే మెదడు కణాలు నశించడం వల్ల పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. డోపమైన్ ఉత్పత్తిని పెంచే మందులతో లక్షణాల్ని అదుపులోకి తేవచ్చు. అయితే పెరిగే వయసుతో పాటు డోపమైన్ ఉత్పాదన / మెదడులో దాని మోతాదు తగ్గుతూ వస్తుండటంతో మందుల మోతాదును పెంచుతూ పోవాల్సి ఉంటుంది. లెవోడోపా / కార్బిడోపా అనే మందులు దేహంలోకి వెళ్లగానే డోపమైన్గా మారతాయి. మావో–బి ఇన్హిబిటార్స్ మందులు మరింత డోపమైన్ లభ్యమయ్యేలా చేస్తాయి. ∙యాంటీ కొలెనెర్జిక్ మందులు లక్షణాల తీవ్రతను తగ్గిం, ఉపశమనాన్నిస్తాయి. శస్త్రచికిత్స : మందుల మోతాదు పెరుగుతున్న కొద్దీ ఓ దశలో దుష్ప్రభావాలు మొదలవుతాయి. అందుకే మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేని సందర్భాల్లో ఇక చివరి యత్నంగా ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ’ అనే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. నివారణతో పాటు అవసరమయ్యే ఇతర పద్ధతులు: ∙వ్యాయామం పార్కిన్సన్ వ్యాధిని కొంతమేరకు నివారిస్తుంది. ఫిజియోథెరపీ, రీ–హ్యాబిలిటేషన్, మింగలేని సమయాల్లో పోషకాహార లోపాలను అధిగమించడానికి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. అలాగే పార్కిన్సన్ వ్యాధి వల్ల కుంగుబాటు (డిప్రెషన్) వంటి వనసిక సమస్యలు పార్కిన్సన్ వ్యాధికి దారితీసే ప్రమాదమూ ఉంది. అందుకే సైకియాట్రిక్ ఇవాల్యుయేషన్ అవసరం కావచ్చు. డాక్టర్ ఎం సాయి శ్రవంతి, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ (చదవండి: షిజెల్లోసిస్..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!) -
వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వృద్ధురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు
ఒక వృద్ధురాలు కేవలం వాసనతోనే వ్యాధిని గుర్తించేస్తోంది. ఆమె ముక్కు అలాంటి ఇలాంటి వ్యాధిని కాదు అరుదైన పార్కిన్సన్ వ్యాధిని గుర్తిస్తోంది. ఈ వ్యాధి దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి తీవ్రతను బట్టి శరీరంలోని మొత్తం ప్రధాన వ్యవస్థను నియంత్రించేస్తుంది. ఈ వ్యాధి కారణంగా వణుకుతూ ధృఢంగా లేకుండా ఉంటారు. క్రమంగా కదలిక మందగించడమే కాకుండా నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి 500 మందిలో ఒకరు ఈ వ్యాధి భారినపడతారు. అంతేకాదు పార్కిన్సన్స్ వ్యాధికి మందు లేదు. స్కాట్లాండ్కి చెందిన జాయ్మిల్నే అనే 72 ఏళ్ల వృద్ధురాలు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఆమె ముక్కుకి ఒక విలక్షణమైన లక్షణ ఉంది. ఆమె వాసన ద్వారా పార్కిన్సన్ వ్యాధిని పసిగట్టేస్తుంది. దీన్ని మొదటసారిగా తన భర్తలో గుర్తించింది. తన భర్తకు 45 ఏళ్ల వయసులో పార్కిన్సన్ వ్యాధి భారిన పడతారని చెప్పేసింది. అంటే ఆమె 12 ఏళ్లకు ముందే నాడిసంబంధిత వ్యాధితో బాదపడుతున్నాడని నిర్థారించగలిగింది. తన భర్తకు 33 ఏళ్లు వచ్చేటప్పటికి తన భర్త శరీరం నుంచి ఒక విధమైన వాసన వచ్చేదని అప్పుడే తాను ఈ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వివరించింది. ఆమెకు శరీర వాసనలో వింత మార్పును పసిగట్టగల సామర్థ్యం కలిగి ఉంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమె సాయంతో ఈ విషయాన్ని అధ్యయనం చేసే పనిలో నిమగ్నమయ్యారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని విద్యావేత్తలు ఆమె సాయంతో పార్కిన్సన్తో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించే విధానాలపై పలు పరిశోధనలు చేస్తున్నారు. (చదవండి: హౌస్కీపర్ని పెళ్లి చేసుకున్న డాక్టర్) -
రష్యా అధ్యక్షుడు పుతిన్ జీవించేది మరో రెండేళ్లే!
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్(69) ఆరోగ్యం నానాటికీ వేగంగా క్షీణిస్తోందని, ఆయన మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని ఉక్రెయిన్ నిఘా విభాగం అధికారి మేజర్ జనరల్ కైరిలో బుడానోవ్ వెల్లడించారు. తాను ఇటీవలే రష్యాలో రహస్యంగా పర్యటించానని, ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని చెప్పారు. పుతిన్ ఆరోగ్యంపై గత కొన్ని నెలలుగా రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్పై యుద్ధం మొదలయ్యాక పుతిన్ తన మిలటరీ అధికారులతో తరచుగా సమావేశమవుతున్నారు. యుద్ధ వ్యూహాలు రచిస్తున్నారు. రష్యా విడుదల చేస్తున్న చిత్రాల్లో పుతిన్ అస్వస్థతతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇటీవల మాస్కోలో జరిగిన కార్యక్రమంలో పుతిన్ ఎక్కువసేపు నిలబడలేకపోయారు. మరో కార్యక్రమంలో నీరసంగా వెనుకా ముందు ఊగుతూ దర్శనమిచ్చారు. బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు ఆయనకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. పుతిన్ కంటిచూపు కూడా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. పార్కిన్సన్స్, స్కిచోఫ్రినియా లక్షణాలు సైతం ఉన్నాయని రష్యా వర్గాలు తెలియజేశాయి. పుతిన్ ఇప్పటికే క్యాన్సర్ బాధితుడు. గతంలో క్యాన్సర్ సర్జరీ జరిగినట్లు సమాచారం. ఆయనలో మళ్లీ తీవ్రమైన క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. -
‘వణికి’స్తోంది
సాక్షి, హైదరాబాద్: పార్కిన్సన్స్ (వణుకుడు రోగం) వ్యాధికి కేంద్ర బిందువుగా భారత్ మారుతోందని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరాలజీ విభాగం వైద్య బృందం తెలిపింది. ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మందిలో 120 మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారని.. మొత్తంగా 5.8 లక్షల మంది పార్కిన్సన్స్తో బాధపడుతున్నారని చెప్పింది. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తాము చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నిమ్స్ ఆస్పత్రి వైద్య బృందం చెప్పింది. ఆదివారం నిమ్స్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని పార్క్ హయత్లో పార్కిన్సన్స్ వ్యాధిపై వైజ్ఞానిక సదస్సు జరిగింది. పార్కిన్సన్స్ అధునాతన చికిత్సలో వాడే డి–మైన్ పంపులు, ఇంజక్షన్లను లండన్లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్కు చెందిన మూవ్మెంట్ డిజార్డర్స్, పార్కిన్సన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ మెట్టా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పార్కిన్సన్స్ చికిత్సలో భాగంగా అపోమోర్ఫిన్ థెరపీ విధానంలో మందులు తీసుకునేప్పుడు ఉపశమనం ఉంటుంది కానీ కొద్దిరోజుల తర్వాత అవి సరిగా పని చేయట్లేదని చెప్పారు. ఫలితంగా రోగుల్లో వణుకు, పటుత్వం కోల్పోవడం, ఆందోళన చెందడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుతం అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. యువ జనాభాలోనూ సమస్య నిమ్స్ హాస్పిటల్లో డి–మైన్ పంపులు, సిరంజ్ లు ఉపయోగించి చేసే అపోమోర్ఫిన్ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తెచ్చామని నిమ్స్ న్యూరాలజీ హెచ్వోడీ ప్రొఫెసర్ రూపమ్ బొర్గొహెయిన్ తెలిపారు. ఐరోపాలో బాగా వాడే ఈ థర్డ్ జనరేషన్ అపోమోర్ఫిన్–డెలివరీ పరికరాలు నిమ్స్తో పాటు నగరంలోని అన్ని ప్రఖ్యాత ఆస్పత్రుల్లో రోగులకు అందుబాటు లోకి వచ్చాయన్నారు. రోగుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నా యువ జనాభాలో నూ సమస్య పెరుగు తోందని అన్నారు. భవిష్యత్లో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పార్కిన్సన్స్ ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 30 మంది న్యూరాలజిస్ట్లు, మూవ్ మెంట్ డిజార్డర్స్ స్పెషలిస్టులు ఈ కొత్త తరహా డ్రగ్ డెలివరీ పరికరం వాడకంపై సందేహాలను నివృత్తి చేసుకున్నారని సెలెరా న్యూరో సైన్సెస్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బాబూ నారాయణన్ చెప్పారు. -
Elgar Case: స్టాన్ స్వామికి బాంబే హైకోర్టులో ఊరట
ముంబై: ఎల్గర్ పరిషద్ కేసులో నిందితుడిగా ఉన్న కార్యకర్త స్టాన్ స్వామికి బాంబే హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. పార్కిస్కన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎన్ఆర్ బోర్కర్లతో కూడిన ధర్మాసం స్టాన్ స్వామికి సుబ్రున్ బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో 15 రోజుల పాటు చికిత్స అందించేందుకు అంగీకరించింది. చికిత్సకు అయ్యే డబ్బులను తానే భరిస్తానని స్వామి ధర్మాసనం ఎదుట అంగీకరించారని ధర్మాసనం తెలిపింది. కాగా అంతకముందు స్టాన్ స్వామి కేసును అత్యవసరంగా విచారించాలంటూ ఆయన తరపు సీనియర్ న్యాయవాది మిహిర్ దేశాయ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్కిస్కన్ వ్యాధితో బాధపడుతున్న 84 ఏళ్ల స్టాన్ స్వామిని కరోనా రోగుల మధ్య ఉంచి చికిత్స అందకుండా చేస్తున్నారని.. అతని ప్రాణాలు పోయే అవకాశం ఉందని మిహిర్ దేశాయ్ ఆరోపించారు. ఆయన వాదనలు విన్న బాంబే హైకోర్టు స్టాన్ స్వామిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు అంగీకరించింది. కాగా ఎల్గర్ పరిషద్- మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై స్టాన్ స్వామిని అక్టోబర్ 2020లో అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన నవీ ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నారు. -
పుతిన్ పదవి నుంచి వైదొలగనున్నారా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇకపై పదవిలో కొనసాగబోరనే వార్తలు వినపడుతున్నాయి. పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా పుతిన్ జనవరిలో పదవి నుంచి వైదొలగే వీలుందని వార్తలొచ్చాయి. పుతిన్ ప్రియురాలు 37 ఏళ్ళ ఎలీనా కబేవా, ఆయన కుమార్తెలు పుతిన్ని పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు, మాస్కోకి చెందిన రాజకీయ విశ్లేషకులు వలేరి సొలోవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘ద డెయిలీ మెయిల్’ఒక కథనాన్ని ప్రచురించింది. పుతిన్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఉండి ఉండవచ్చునని సొలేవే తెలిపారు. పుతిన్ పాదాల కదలికలో తేడాలున్నాయని, ఆయన కుర్చీని గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న దృశ్యాలు బయటపడ్డాయని, ఆయన పక్కనున్న కప్పు నిండా మాత్రలున్నాయని ఆయన తెలిపారు. పుతిన్ త్వరలోనే నూతన ప్రధానిని నియమిస్తారని, ఆయనను తన వారసుడిగా తయారు చేస్తారని సొలోవే తెలిపినట్లు న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది. ఇదిలా ఉండగా పుతిన్ పదవి నుంచి దిగిపోతారనే ప్రచారాన్ని రష్యా అధికార వర్గాలు తోసిపుచ్చాయి. పదవి నుంచి వైదొలగే అవకాశమే లేదని క్రిమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. -
అరుదైన వ్యాధి.. పుతిన్ రాజీనామా..!
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పుతిన్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేలా కుటుంబ సభ్యులతో పాటు వైద్యులు సైతం ఒత్తిడి చేస్తున్నారని రష్యాలోని ఓ ప్రముఖ పత్రిక తన కథనంలో పేర్కొంది. 68 ఏళ్ల పుతిన్ పార్కిన్సన్ (మెదడులోని నాడీ వ్యవస్థ దెబ్బతినడం) వ్యాధితో బాధపడుతున్నారని, ఈ సమయంలో పదవీ బాధ్యతలను నిర్వర్తించడం అంత సరైనది కాదని వైద్యులు సూచించినట్లు తెలిపింది. అయితే బతికున్నంతకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే విధంగా రాజ్యాంగంలో సవరణలు తీసుకువచ్చిన పుతిన్.. అనుహ్యంగా తప్పుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన తన విధులను ఇంటి నుంచే నిర్వర్తిస్తున్నారని, భవిష్యత్లో వ్యాధి మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత 20 ఏళ్లుగా రష్యాను ఏకఛత్రాధిపత్యం కిందపాలిస్తున్న పుతిన్.. వ్యాధి కారణంగా పదవీ బాధ్యత నుంచి తప్పుకుంటారన్న వార్తలను ఆ దేశ ప్రజలు కొట్టిపారేస్తున్నారు.పుతిన్ తొలుత 1999 నుంచి 2000 వరకు ప్రధాన మంత్రిగా కొనసాగారు. అనంతరం 2000 నుంచి 2008 వరకు అధ్యక్షుడిగా, 2012 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. ఆ తరువాత మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పెద్ద ఎత్తున రాజ్యాంగ సవరణలు చేపట్టి.. బతికునేంత వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగే విధంగా మార్పులు చేశారు. పుతిన్ ప్రస్తుత అధ్యక్ష పదవీ కాలం 2024లో ముగియనుంది. ఆ తర్వాతా మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలను రష్యా పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపింది. మాజీ కేజీబీ అధికారి అయిన వ్లాదిమిర్ పుతిన్ 20 ఏళ్లుగా రష్యా రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తుండటం తెల్సిందే. సోవియట్ యూనియన్ (యూఎస్ఎస్ఆర్) విచ్ఛిన్నం అనంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రష్యాను ప్రగతిపథంలో నడిపించడంలో పుతిన్ విజయవంతం అయ్యారు. ఆ తరువాత దేశంలో చోటుచేసుకున్న రాజకీయ పరిస్థితుల కారణంగా పార్లమెంట్ ఎన్నికల్లో కనీస పోటీ కూడా లేకుండా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో పుతిన్ అర్థాంతరంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారనే వార్తలు ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా వార్తలపై సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి.. పదవిలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే తాజా పుతిన్ రాజీనామా వార్తలపై అధ్యక్ష కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. -
జీవితాన్నే మార్చిన ఐడియా..
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. బెంగళూరు కుర్రాడు సమయ్ గోధిక ఇప్పుడు ఇదే అనుకుంటూ ఉంటాడు.. ఎందుకంటే పదహారేళ్ళ ఈ నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి ఐడియా కోట్ల రూపాయల బహుమతి తెచ్చి పెట్టింది మరీ. ఎలాగంటారా... ‘బ్రేక్ త్రూ జూనియర్ చాలెంజ్ ’పేరుతో నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోటీలో సమయ్ తొలి స్థానంలో నిలిచాడు. జీవ, భౌతిక శాస్త్రాల్లో కొత్త, వినూత్న ఐడియాలను సులువైన భాషలో అందరికీ అర్థమయ్యేలా 3 నిముషాల వీడియో తీసి పంపడం ఈ పోటీ లక్ష్యం. సమయ్.. 24 గంటల మనిషి జీవితంలో గడియారానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన ఆలోచనను వీడియోగా పంపారు. మెచ్చిన న్యాయ నిర్ణేతల బృందం సమయ్కు రెండు లక్షల యాభై వేల డాలర్ల (రూ.1.8 కోట్ల) బహుమతి ప్రకటించింది. అంతేకాకుండా సమయ్ సైన్స్ టీచర్ ప్రమీల మీనన్కి రూ.36 లక్షలు, పాఠశాలలో పరిశోధనశాల ఏర్పాటుకు రూ.కోటి అందించారు. ఇంతకీ సమయ్ దేని గురించి వీడియో పంపాడో తెలుసా.. మన జీవగడియారానికి పార్కిన్సన్స్ వ్యాధికి ఉన్న సంబందంపై వీడియో రూపొందించి పంపాడు. -
రోగాలను గుర్తించే స్మార్ట్ గ్లోవ్స్
న్యూయార్క్: చలికాలం వచ్చిందంటే బయటకెళ్లేటప్పుడు సాక్సులు, గ్లౌవ్స్, షూ వేసుకోడం తప్పనిసరి. అయితే భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కునాల్ మన్ కొండియా తయారు చేసిన సాక్సులు, షూలు, గ్లౌవ్స్ వేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా? మీకేదైనా అనారోగ్య సమస్య ఉందా? అనే వివరాలు మీ వైద్యుడి వద్దకు గణాంకాలతోసహా వెళ్లిపోతాయి. ఎందుకంటే ఈ స్మార్ట్ వస్త్రాలను సెన్సార్లను ఉపయోగించి తయారు చేశానని చెబుతున్నాడు కునాల్. ఇటువంటివి అందుబాటులోకి వస్తే మన ఆరోగ్యానికి సంబంధించి పదే పదే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ముందే జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుందని కునాల్ చెబుతున్నాడు. ప్రస్తుతానికి తాను తయారుచేసిన సాక్సులు గుండె పనితీరును ఎప్పటికప్పుడు అంచనావేస్తూ.. వైద్యుడికి సమాచారం అందిస్తాయని, దీనివల్ల వైద్యుల నుంచి తగిన సూచనలు, సలహాలు మనకు అందుతూనే ఉంటాయన్నాడు. భవిష్యత్తులో పెరాలసిస్, పార్కిన్సన్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారించే స్మార్ట్ వస్త్రాలను తయారు చేస్తానని చెబుతున్నాడు. ఇవి అందుబాటులోకి వస్తే.. రోగ నిర్ధారణ పరీక్షల కోసం ఇక డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని కునాల్ భరోసా ఇస్తున్నాడు.