-
పంజాగుట్టలో ఆర్టీసీ బస్సులో కాల్పులు
పంజగుట్ట : ఆర్టీసీ బస్సులో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. బస్సు దిగిపొమ్మన్నందుకు ఓ వ్యక్తి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. గన్ తీసి ఫైరింగ్ చేశాడు. బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ నుంచి దూసుకుపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రయాణికులతో పాటు బస్సు డైవ్రర్ ఆందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ నుంచి ఫిల్మ్ నగర్ వెళ్తున్న 47L బస్సు (AP28Z4468)లో పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, డైవ్రర్ బస్సు ఎక్కడా నిలపకుండా వెళ్లినట్టు సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ డ్రెస్లో ఉన్నాడని ప్రయాణికులు తెలిపారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు బస్సుతో పాటు కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తెరేష్బాబుకు అశ్రు నివాళి
హైదరాబాద్: ప్రముఖ దళిత కవి పైడి తెరేష్బాబు అంత్యక్రియలు మంగళవారం పంజగుట్ట శ్మశానవాటికలో జరిగాయి. అంతిమయాత్రలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఓ మంచి కవిని కోల్పోయామంటూ పలువురు కంటతడి పెట్టారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు ఆయన భౌతికకాయాన్ని మంగళవారం ఆస్పత్రి నుంచి అశోక్నగర్లోని నివాసానికి తరలించారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్యతోపాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు శామ్యూల్, ముఠా గోపాల్, ఏపీసీసీ అధికార ప్రతినిధి గౌతం, సినీ ప్రముఖులు ఆర్.నారాయణమూర్తి, ప్రముఖ పాత్రికేయులు కె.శ్రీనివాస్, సతీష్చందర్, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, తెలకపల్లి రవి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, వివిధ సంఘాల నాయకులు ఆవుల బాలదానం, కృపాకర్ మాదిగ, బత్తుల రాంప్రసాద్, గుర్రం సీతారాం, అరుణ్ సాగర్, కొమ్ముల సురేందర్, రమేశ్, యశ్పాల్, డాక్టర్ రత్నాకర్, నీలం నాగేంద్ర.. తెరేష్బాబు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తెరేష్బాబు కుటుంబానికి రూ. 10లక్షలు ప్రభుత్వసాయం ప్రముఖ దళిత, బహుజన క వి, రచయిత పైడి తెరేష్బాబు కుటుంబానికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. తెరేష్బాబు కాలేయవ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు స్పందించి తెరేష్బాబు కుటుంబానికి సాయం ప్రకటించారు.దళిత బహుజన కవి కుటుంబానికి సాయమందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున మల్లేపల్లి లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
శిక్షణలో నేర్పించే అంశాలు
ప్రభుత్వబడిలో చదివి జిల్లా ఫస్ట్ వచ్చింది
కళ్లు చల్లబడ్డాయా.. బాబు!
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
చంద్రబాబు డైరెక్షన్లో ఎన్నికల సంఘం
టీడీపీ ప్రలోభాల పర్వం
శిక్షణలో నేర్పించే అంశాలు
పోలింగ్ బూత్ల వద్ద భద్రత కట్టుదిట్టం
వేసవిలో ప్రత్యేక రైళ్లు
బీసీలందరికీ అండగా ఉంటా
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement