breaking news
Panchayati Raj Institutions
-
ఇక పంచాయతీల్లో ఆన్లైన్ పాలన
పలమనేరు, న్యూస్లైన్: ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పంచాయతీరాజ్ సంస్థలను శక్తివంతంగా తయారు చేసేందుకు పంచాయతీల్లో ఆన్లైన్ పాలనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ-పంచాయత్స్ పేరుతో పిలిచే ఈ కార్యక్రమాన్ని 2008-09 సంవత్సరంలో జాతీయ సాంకేతిక సమాచార సంస్థ (ఎన్ఐసీ) వారి సాయంతో రూపొందించారు. వారం రోజుల్లో జిల్లాలోని 348 గ్రామ పంచాయతీల్లో తొలి దశగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన కంప్యూటర్లు, పరికరాలు, సంబంధిత ఎంపీడీవో కార్యాలయాలకు చేరాయి. మూడంచెలుగా వినియోగం 2008-09లో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని అభివృద్ధిపరచి మూడు అంచెలుగా ముందుకు తీసుకెళ్లనున్నారు. ప్రాథమికంగా గ్రామాల్లో జనన మరణాల నమోదు, ఇంటి పన్నులు, లెసైన్స్ ఫీజు వసూళ్లను చేపట్టనున్నారు. పనుల పర్యవేక్షణ, పంచాయతీ సమావేశాలు, ప్రజాప్రతినిధుల సమాచారం, ఉద్యోగుల వివరాలు, వేలం పాటలు, కోర్టు కేసులు, తని ఖీలు, సమాచార హక్కు చట్టం, ఆడిట్, ఫిర్యాదులకు సంబంధించిన ఎంఐఎస్ రిపోర్టులు, పంచాయతీరాజ్ నిధులకు సంబంధించి ఈ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ముఖ్యమైన అప్లికేషన్లు ఇలా ప్లాన్ ప్లస్ ద్వారా జిల్లా ప్రణాళిక కమిటీ నుంచి తుది ఆమోదం పొందేవరకు కార్యక్రమమంతా వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్లు గ్రహించి రిపోర్టులను అందిస్తాయి. ఇవి కేంద్ర స్థాయిలో జాతీయ ప్రణాళికలను రూపొందించేందుకు ఉపయోగపడుతాయి. యాక్షన్ స్టాఫ్ ద్వారా స్థానిక రికార్డులు ఆర్థిక ప్రగతిని చూపెడతాయి. ప్రియాసాఫ్ట్ ద్వారా ఉద్యోగులకు శిక్షణ గురించి ఇందులో అప్లికేషన్లు ఉంటాయి. లోకల్ గవర్నమెంట్ డెరైక్టరీ ద్వారా అప్డేట్ సమాచారం ఉంటుంది. నేషనల్ పంచాయత్ పోర్టల్ ద్వారా పంచాయతీలకు సంబంధించిన సమాచారం లభ్యమవుతుంది. ఏరియా ప్రొఫైలర్, నేషనల్ అసెట్ డెరైక్టరీ, సర్వీసెస్, సోషల్ ఆడిట్ తదితర అంశాలు గ్రామీణుల చెంతకు రానున్నాయి. ఇప్పటికే సర్పంచులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఆపరేటర్లను నియమించారు. ఈ-పంచాయత్తో అన్ని రకాల సేవలు సామాన్యునికి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై డీపీవో ప్రభాకర్ను ‘న్యూస్లైన్’ వివరణ కోరగా పనులు జరుగుతున్నాయని, వారం రోజుల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. -
ఆడిట్ అక్షింతలు
సాక్షి, చిత్తూరు: పంచాయతీరాజ్ సంస్థలు, జిల్లా పరిషత్, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీల్లో 2010-11 ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆడిట్ నివేదికను రాష్ట్ర ఆడిట్ డెరైక్టర్ జనరల్ విడుదల చేసింది. ఈ నివేదికలో చిత్తూరు జిల్లాకు సంబంధించి భారీ సంఖ్యలో ఆడిట్ అభ్యంతరాలు ఉన్నాయి. చంద్రబాబు నియోజకవర్గం కుప్పం పంచాయతీలో కనీసం ఆస్తిపన్ను, కొళాయిపన్ను, షాపింగ్ కాంప్లెక్స్ల అద్దె కూడా నిర్ణీత సమయంలో వసూలు చేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించింది. జిల్లాలో రూ.11 కోట్లకు పైగా అభ్యంతరాలు చిత్తూరు జిల్లాలో జిల్లాపరిషత్ సంస్థ నుంచి 22 ఆడిట్ అభ్యంతరాలకు గాను రూ.4.05 కోట్లు దుర్వినియోగమైనట్టు గుర్తించారు. మండల పరిషత్లకు కేటాయించిన నిధులు, గ్రాంట్ల వినియోగంలో మొత్తం 813 ఆడిట్ అభ్యంతరాలను గుర్తించారు. వీటి కింద రూ.1.77 కోట్లమేర లెక్కలు సరిగా లేవని, సరైన ఓచర్లు లేవని, ఇతర సాంకేతిక కారణాలతోనూ ఆడిట్ అభ్యంతరాలు ఉన్నట్లు వెల్లడించారు. గ్రామ పంచాయతీల్లో 19,398 ఆడిట్ అభ్యంతరాలను గుర్తించారు. రాబడికన్నా చెల్లింపులే ఎక్కువ జిల్లా పరిషత్, మండల పరిషత్ల్లో వచ్చిన రాబడులు, గ్రాంట్ల కన్నా అధికమొత్తంలో ఖర్చుచేసినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 2010-11 ఆర్థిక సంవత్సరంలో రాబడులు 4542.16 లక్షలు కాగా, ఖర్చులు 4843.70 లక్షలుగా ఉంది. కొన్ని పంచాయతీలు నిర్ణీత సమయంలో ఇంటిపన్ను, కొళాయి పన్నులు వసూలు చేయడం లేదని పేర్కొన్నారు. ఇందులో కుప్పం టౌన్ పంచాయతీలో 3.20 లక్షల ఇంటిపన్ను, ఆస్తిపన్ను వసూలు కాలేదని ఆడిట్ అధికారులు చివాట్లు పెట్టారు. చౌడేపల్లె పంచాయతీలోనూ రూ.86 వేల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. 2012 నాటికి 65 మండలాల ఆడిట్ నివేదికలు పూర్తయినట్లు చూపారు. జిల్లాలో మూడు మండల పరిషత్తుల్లో గ్రాంట్ల దుర్వినియోగమైనట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆడిట్ నిబంధనలు ఉల్లంఘించి ఖర్చుచేసిన ఖాతాల సంఖ్య పంచాయతీరాజ్ సంస్థల్లో 4,500 వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో రూ.కోటికి పైగా నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్కు చివాట్లు రాష్ట్ర ఆడిటర్ డెరైక్టర్ జనరల్ విడుదల చేసిన నివేదికలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిధుల వ్యయంపై భారీగా తప్పులు జరిగినట్లు గుర్తించారు. ఖాతాల సంఖ్యలనే తారుమారు చేసినట్లు తేల్చారు. నిధులు దారిమళ్లించినట్టు వెల్లడించారు. ఇందులో రూ.6.59 లక్షలు ఒక పనికి సంబంధించిన నివేదికను వేరొక పనికి మళ్లించడాన్ని తప్పుబట్టారు. బకాయిల వసూళ్లలో తీవ్ర జాప్యం, నిర్లక్ష్యం ఉందని తప్పుబట్టారు. ఇందులో మొత్తం 15 ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటికి సంబంధించి మొత్తం 1277.56 లక్షల నిధులు వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అడ్వాన్స్ల సర్దుబాటు పెండింగ్కు సంబంధించి రూ.14.84 లక్షలు లెక్కల్లో జమచేయకుండా ఉంచినట్లు పేర్కొన్నారు. ఆడిట్ నియమావళి ఉల్లంఘించిన వ్యవహారంలో 9 తప్పులను గుర్తించారు. ఈ తప్పులకు సంబంధించి రూ.57.38 లక్షలు మున్సిపల్ కార్పొరేషన్ ఆడిట్ అభ్యం తరాలును పేర్కొన్నారు. ఓచర్లు లేని ఖాతా ఒకటి గుర్తించారు. దీనికింద రూ.1.11 లక్షలు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. అధిక చెల్లింపుల కింద 7 ఖాతాలకు రూ.611 లక్షలు చెల్లించారని, దీనికి సంబంధించిన వివరాలు సరిగ్గాలేవని ఆడిట్ అభ్యంతరం వ్యక్తమైంది. వృథా వ్యయం కింద తప్పు జరిగిందని పేర్కొంటూ అనవసరంగా *171.9 లక్షలు ఖర్చుచేశారని ఆడిటర్ జనరల్ నివేదికలో పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో రూ.7.39 లక్షల చెల్లింపులు శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కాంట్రాక్టర్ల చెల్లింపుల నుంచి 1 శాతం లేబర్ సెస్ మినహాయించి నిధులు చెల్లిం చాల్సి ఉండగా, లేబర్ సెస్ మినహాయించకుండా రూ.7.39 లక్షలు చెల్లించినట్లు ఆడిట్ అధికారులు గుర్తించారు. ఈ మొత్తాన్ని సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయాల్సిందిగా సిఫార్స్ చేశారు. మార్కెట్ కమిటీల్లో ఆడిట్ అభ్యంతరాలు 2010-11 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఏడు మార్కెట్ కమిటీల్లో రూ.31.14 లక్షల గ్రాంట్ల అధిక వినియోగం జరిగినట్లు గుర్తించారు. నిధుల మళ్లింపునకు సంబంధించి మరో 7 మార్కెట్ కమిటీల్లో నిధులు రూ.50.5 లక్షల వరకు దారిమళ్లినట్టు తేల్చారు. వీటికి సంబంధించి అధికారులు వివరణ ఇవ్వాలని రిమార్కు రాశారు. శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో రూ.3.94 లక్షలు వసూలు చేయకుండా వదిలేశారని, ఇది పని నిర్లక్ష్యం కిందకు వస్తుందని నివేదికలో తప్పుబట్టారు. గ్రంథాలయాలకు సంబంధించి జిల్లాలో ఒక ఖాతా ద్వారా రూ.55.6 లక్షలు దారిమళ్లిందని పేర్కొన్నారు. సూచించిన అంశానికి కాకుండా వేరే అవసరాలకు వాడారని గుర్తించారు. దీనిపై అధికారుల వివరణ తీసుకోవాలని సూచించారు. -
పంచాయతీ సభ్యుల శిక్షణ పెంచాలి : స్థాయీ సంఘం
దేశవ్యాప్తంగా ఎన్నికైన పంచాయతీ ప్రతినిధులకు ఇస్తున్న శిక్షణ ఏమాత్రమూ సరిపోవడం లేదని, ముఖ్యంగా శిక్షణనిచ్చేందుకు ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు ఎంతమాత్రమూ సరిపోవని పంచాయతీ రాజ్ సంస్థలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న శిక్షణ కార్యకలాపాలను మరింతగా పెంచేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. పంచాయతీ రాజ్ సంస్థల సామర్థ్యం ఆశించిన విధంగాలేదని అదేసమయంలో ఎన్నికైన 29 లక్షల మంది ప్రతినిధులకు ఆయా రాష్ట్రాల్లో ఇస్తున్న శిక్షణ కూడా సంతృప్తికరంగా లేదని స్థాయీ సంఘం తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం అందిస్తున్న శిక్షణ నెట్వర్క్ను మరింత విసృ్తతం చేసేందుకుగాను నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. సదరు సిఫార్సులపై స్పందించిన మంత్రిత్వ శాఖ, రాజీవ్ గాంధీ పంచాయత్ సశక్తికరణ్ అభియాన్ ఆయా సమస్యలపై దృష్టి సారిస్తుందని పేర్కొంది.