-
పల్లె పిలిచింది..!
‘‘దృఢమైన సంకల్పంతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తుంటే అది విజయవంతం కావడానికి ప్రకృతి కూడా ‘కుట్ర’ పన్నుతుంది’’ అంటాడు సుప్రసిద్ధ రచయిత పాలో కోయిలో. కార్పొరేట్ ఉద్యోగాలు వదలి సేంద్రియ సేద్యం చేపట్టి.. అద్భుత ఫలితాలు సాధిస్తున్న సత్యజిత్, అజింక హంగె సోదరుల జీవితం ఈ సూక్తిని జ్ఞప్తికి తెస్తోంది. పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వీరిద్దరూ కష్టపడి ఎంబీయే చదువుకొని కార్పొరేట్ సంస్థల్లో పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగారు. పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. హోదాకు, డబ్బుకు కొదవ లేకున్నా మనసు లోతుల్లో తెలియని వెలితి, అసంతృప్తి. తమకు ఆనందాన్నిచ్చే జీవితం ఇది కాదని అర్థమైంది. వీకెండ్స్లో పల్లెకు, పొలానికి వెళ్లినప్పుడు కలిగే ఆనందం తర్వాత చప్పున ఇగిరిపోతోంది. అంతరంగంలో ప్రతిధ్వనిస్తున్న పల్లె పిలుపును మనసొగ్గి ఆలకించారు. పెద్ద జీతాలతో కూడిన ఉద్యోగాలను సైతం త్యజించి పల్లెబాట పట్టారు. కోటి ఆశలతో స్వగ్రామానికి చేరారు. గిర్ ఆవులు కొన్నారు. తొలుత కొద్దిపాటి భూమిలోనే సేంద్రియ సేద్యానికి శ్రీకారం చుట్టారు. రసాయనిక అవశేషాల్లేని అమృతాహారం పండించడమే కాదు.. ఏటా రూ. 3 కోట్ల టర్నోవర్తో భళా అనిపించుకుంటున్నారు. సత్యజిత్, అజింక హంగె సోదరులు పుట్టింది భోదని అనే పల్లెటూరులో. రైతు కుటుంబం. పుణె నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో భోదని ఉంటుంది. వాళ్ల తల్లిదండ్రులు మట్టిమనుషులు. కాయకష్టం చేసి వారిని పుణె నగరంలోని ఆంగ్లో–ఇండియన్ బోర్డింగ్ స్కూల్లో చదివించారు. వారి జీవితం గొప్పగా ఉండాలని ఎంబీయే చదివించారు. సత్యజిత్, అజింక బాగా చదువుకొని సిటీబ్యాంక్, డీబీఎస్, హెచ్డిఎఫ్సి, హెచ్ఎస్బీసీ వంటి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. పదేళ్లు గడిచాయి. ఉద్యోగాల్లో మంచి జీతభత్యాలు అందుకుంటున్నారు. అంతాబాగానే ఉన్నా తెలియని అసంతృప్తి, వెలితి మనసు పొరల్లో రొద పెడుతూనే ఉన్నాయి. వారాంతంలో పల్లెకు వెళ్తే ఉండే హాయి నగరంలో ఉన్పప్పుడు దొరకడం లేదని గ్రహించారు. తెగువ చూపారు. ఉద్యోగాలు వదిలేశారు. నేను పడిన కష్టం పిల్లలకు ఉండకూడదనుకున్న తండ్రి తల్లడిల్లిపోయాడు. సరైన ఆదాయం దొరకని వ్యవసాయంలోకి రావడం మంచి నిర్ణయం కాదన్నాడు. అయినా, సత్యజిత్, అజింక సోదరులు జంకలేదు. మట్టి మీద కోటి ఆశలు పెట్టుకొని మనోబలంతో ముందడుగేశారు. తొలుత కొద్దిపాటి భూమిలోనే సేంద్రియ సేద్యం ప్రారంభించారు.తొలి దశలో ఏటా రూ. 2 లక్షల అమ్మకాలు జరిగేవి. అష్టకష్టాలూ పడ్డారు. అయినా మడమ తిప్పలేదు. క్రమంగా పరిస్థితులు అనుకూలించాయి. సోదరులు ప్రస్తుతం 20 ఎకరాల్లో సేంద్రియ పంటలు పండిస్తున్నారు. ఏటా రూ. 3 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే దశకు ఎదిగారు. చెరకు బదులు పండ్ల తోటలు... పశ్చిమ మహారాష్ట్రలో చాలా మంది రైతులు కరువు కాలంలో కూడా చెరకు అలవాటుగా చెరకు పంటను రసాయనిక ఎరువులు, పురుగుమందులతో సాగు చేస్తుంటారు. సత్యజిత్, అజింక సోదరులు పంటల సరళిని సాగు పద్ధతిని కూడా మార్చారు. అదే వారి విజయరహస్యం. సేంద్రియ పద్ధతుల్లో పండ్ల తోటలను సాగు చేయనారంభించారు. చెరకుతో పోల్చితే ఈ తోటలకు నీటి అవసరం చాలా తక్కువ. తోటల సాగుకు భూమిని కూడా పెద్దగా దున్నాల్సిన అవసరం లేదు. సేంద్రియ పండ్లు ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ ఉంటాయి. ‘రసాయనిక ఎరువులు, పురుగుమందులు భూముల ఉత్పాదక శక్తిని నశింపజేస్తున్నాయని, ఆహారోత్పత్తుల నాణ్యతను దెబ్బతీస్తున్న విషయం గుర్తించాం. గ్రామంలో అనుభవజ్ఞులైన వ్యవసాయ కూలీలు, రిటైరైన రైతులతో మాట్లాడి.. ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న పద్ధతులను కలగలిపి.. ఆవు పేడ, మూత్రంతో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నాం..’ అని సత్యజిత్ అన్నారు. రెండు ఎకరాల భూమిలో దేశీ రకం దానిమ్మ, దేశీ రకం కందులను తొలుత సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతోపాటు 20 దేశవాళీ గిర్ ఆవులను కొనుగోలు చేశారు. తొలి నాలుగేళ్లు నష్టాలే ఎదురొచ్చాయి. ‘అది చాలా కష్టకాలం. ఉద్యోగాలు వదిలేసి వచ్చి వ్యవసాయంలో దిగాం. టన్ను దేశీ బొప్పాయిలు పండించాం. అదే మా తొలి చెప్పుకోదగ్గ సేంద్రియ దిగుబడి. నోట్లో వేసుకుంటే అమృతంలాగా ఉంది రుచి. లోకల్ మార్కెట్కు తీసుకెళ్తే కిలో రూ. 4కు కొన్నారు. అంతా దళారుల రాజ్యం. ఇక ఇలా లాభం లేదని.. ఒక టెంపో వాహనంలో కొన్ని బొప్పాయిలు వేసుకొని వంతెనల వద్ద ఉండే తోపుడు బండ్ల వ్యాపారుల దగ్గరకు తీసుకెళ్లాం. మా దగ్గర నుంచి కిలో రూ. 20కి కొనడానికి వాళ్లు ముందుకు రాలేదు. అందుకని, వాళ్లకు ఉచితంగానే ఇచ్చాం. వాటిని రుచి చూసిన వినియోగదారులు తిరిగి వచ్చి.. అవే కావాలని అడగడం మొదలు పెట్టారు. పంటను లాభదాయకంగా అమ్మటం అలా మొదలు పెట్టాం..’ అన్నారు సత్యజిత్. ఇలా 8 నెలలు తోపుడు బండ్ల వారి ద్వారా పండ్ల అమ్మకం సాగించిన తర్వాత.. ఓ మాల్ యజమాని అనుకోకుండా ఈ పండ్లను రుచి చూసి సత్యజిత్, అంజిక్యలకు కబురు పెట్టాడు. మాల్లో ఒక ర్యాక్ను ఉచితంగా ఇచ్చాడు. రసాయనాలతో పండించిన ఇతర ర్యాక్లలో పండ్లు అలాగే ఉండేవి. వీళ్ల ర్యాక్ వెంటనే ఖాళీ అయిపోయేది. తదనంతరం సత్యజిత్, అంజిక్య దాదార్లో రైతు మార్కెట్ను ప్రారంభించారు. ఇవ్వాళ వీరి సేంద్రియ పండ్లు కొంటున్న వారిలో వ్యాపారవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు! మామిడి పండుపై ఈ పోగులు ఎందుకొస్తాయి? మామిడి పండ్లలో అప్పుడప్పుడూ ఈ ఫొటోలో మాదిరిగా తొక్క తీయగానే వేర్ల మాదిరిగా పోగులు అల్లుకొని కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్య ఉన్న మామిడి పండ్లు తింటే ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదు. కానీ, చూపులకు బాగుండదు కాబట్టి తినడానికి వినియోగదారులు పెద్దగా ఇష్టపడరు. ఆ కాయలు పెద్దగా ధర పలకవు. రైతులు, వ్యాపారులు ఏటా భారీగానే నష్టపోతుంటారు. ఈ పోగులు అల్లుకున్న చోట మామిడి గుజ్జు కొంచెం ఎర్రగా మారుతూ ఉండటం కూడా గమనిస్తుంటాం. ఈ సమస్యను రెసిన్ కెనాల్ డిస్కలరేషన్(ఆర్.సి.డి.) అంటారు. ఇంతకీ ఇవి ఏర్పడడానికి కారణం ఏమిటి? అన్నది ఇన్నాళ్లూ మిస్టరీగానే మిగిలిపోయింది. వాతావరణ మార్పుల వల్ల లేదా ఎరువుల ద్వారా ఈ పోగులు ఏర్పడుతున్నాయని గతంలో అనుకునేవారు. అయితే, ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల మామిడి పండ్లకు సోకుతోందని తాజా పరిశోధనల్లో తేలింది. కాయలు కోత, రవాణా, మగ్గబెట్టే దశల్లో ఒక రకమైన బాక్టీరియా సోకడం వల్ల మామిడి పండులో పోగులు ఏర్పడుతున్నట్లు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తిస్థాయి పరిశుభ్రత పాటించడం ద్వారా ఈ బాక్టీరియా ఇన్షెక్షన్ సోకకుండా చూసుకోవచ్చని రైతులకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మామిడి రైతులకు ఇది పెద్ద శుభవార్త అంటూ ఆస్ట్రేలియా మాంగో ఇండస్ట్రీ అసోసియేషన చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ గ్రే ఎగిరి గంతేశారు. మామిడి పండుపై బాక్టీరియా పోగులు లేపనం చేయని పండ్లు, లేపనం చేసిన పండ్లు అరటి నెమ్మదిగా మగ్గాలంటే.. గంజి లేపనం! అరటి గెలలు చెట్టు నుంచి కోసిన తర్వాత త్వరగా మగ్గిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోగలిగితే రైతుల ఆదాయం పెరుగుతుంది. మరీ త్వరగా మగ్గిపోకుండా చూడటానికి శీతల గిడ్డంగిలో పెట్టడం ఒక పరిష్కారం. అయితే, ఇది భారీ ఖర్చుతో కూడిన పని. ప్రత్యామ్నాయం కోసం పరిశోధిస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన న్యూ క్యాజిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చిన్న రైతులకు కూడా ఉపయోగపడే ఒకానొక చవకైన, రసాయన రహితమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారు. అరటి కాయలను గంజితో లేపనం చేయడం. వరి బియ్యం గంజికి సముద్రపు నాచు నుంచి సంగ్రహించిన కర్రగీన్ అనే పదార్థం కలిపి అరటి కాయలకు లేపనం చేసి సత్ఫలితాలు సాధించారు. త్వరగా మగ్గిపోయే స్వభావం ఉన్న కావెండిష్ రకం అరటి కాయలను 60 లాట్లుగా తీసుకొని ప్రయోగం చేశారు. ప్రతి లాట్లో 8 పండ్లు ఉంచారు. ఒక లాట్లో పండ్లను ఏమీ చేయకుండా పక్కన ఉంచారు. సగం లాట్లలో అరటిపండ్లకు గంజి పట్టించారు. మిగతా సగం లాట్లలో పండ్లను నీటిలో ముంచి తీశారు. వీటన్నిటినీ రెండు నిమిషాలు ఎయిర్ డ్రై చేసి.. ఎథిలిన్ ఛాంబర్లో 24 గంటలు ఉంచారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఈ లాట్లన్నిటినీ పరిశీలించారు. పండ్ల బరువు, శ్వాసక్రియ, ఎథిలిన్ ఉత్పత్తి, గంజి పరిమాణం, క్లోరోఫిల్ స్థాయిలను నమోదు చేశారు. గంజి లేపనం చేసిన పండ్ల శ్వాసక్రియ, తేమ నష్టం ఇతర పండ్లలో కన్నా తక్కువగా ఉన్నదని, అందువల్ల మగ్గే ప్రక్రియ కూడా నెమ్మదించినట్లు గుర్తించారు. సత్యజిత్, అంజిక హంగె సోదరులు పంటల వైవిధ్యం పంటల మధ్య బంధు మిత్రులతో.. -
53 మండలాలు.. 93 పంచాయతీలు
పల్లె పిలుపునకు శ్రీకారం - జిల్లా వ్యాప్తంగా గ్రామాభివృద్ధికి బాటలు - వెల్దుర్తి మండలం మల్లేపల్లె, కృష్ణగిరిలో పాల్గొన్న కలెక్టర్ - పల్లె బాట పట్టిన జిల్లా అధికారులు - నీటి సమస్యపై వినతుల వెల్లువ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పిలుపు కార్యక్రమం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. 53 మండలాల్లోని 93 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ కారణంగా మొదటి రోజు అధికారులంతా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అన్ని శాఖల అధికారులు మండలాలకు స్పెషల్ ఆఫీసర్లుగా హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జీలుగా నియమితులైన డిప్యూటీ కలెక్టర్లు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. వెల్దుర్తి మండలం మల్లేపల్లెలో కలెక్టర్ సత్యనారాయణ పల్లె పిలుపును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామం మొత్తాన్ని కలియ తిరగడంతో పాటు ఎన్ఆర్జీఎస్ పనులను, గ్రామ స్థాయిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేశారు. గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య లోపంపై కలెక్టర్ పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యలో బడి మానేసిన విద్యార్థుల గురించి ఆరా తీశారు. గ్రామంలో డ్రాప్ అవుట్స్ ఎవరూ లేరని ఎంఈఓ కలెక్టర్కు వివరించారు. అయితే కలెక్టర్ గ్రామంలో తిరుగుతూ మధ్యలో బడి మానేసిన ఒక బాలుడిని గుర్తించి తప్పడు సమాచారం ఇచ్చినందుకు ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మండల కేంద్రమైన క్రిష్ణగిరికి చేరుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు మెడికల్ ఆఫీసర్ సరిగ్గా సమాధానాలు ఇవ్వకపోవడంపై ఆగ్రహించారు. పీహెచ్సీ నిర్వహణలో లోపాలను గుర్తించారు. ఈ కార్యక్రమాల్లో పల్లె పిలుపు కార్యక్రమ ఉద్దేశాలను జిల్లా కలెక్టర్ వివరించారు. ఇదిలాఉండగా జిల్లా కలెక్టర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాన్ని కల్లూరుతో పాటు వివిధ మండలాల్లో అధికారులు తూతూ మంత్రంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దారు ఆధ్వర్యంలో రెండు టీములు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా.. మొదటి రోజు పలు మండలాల్లో ఎంపీడీఓ, తహసీల్దారు కలసి ఒకే టీముగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పల్లెపిలుపు కార్యక్రమంలో భాగంగా ప్రజలు అధికారులకు తమ సమస్యలపై భారీగా వినతిపత్రాలను అందించారు. ప్రధానంగా నీటి సమస్యపై వినతులు వెల్లువెత్తాయి. -
పల్లె పిలుపుతో గ్రామీణాభివృద్ధి
ఎంపీడీఓ, తహశీల్దార్ల ఆధ్వర్యంలో రెండు టీమ్ల ఏర్పాటు – ప్రతి వారం రెండు గ్రామాలకు వెళ్లి అధ్యయనం – మూడు నెలల్లో అన్ని గ్రామాల్లో పర్యటన – వర్క్షాప్లో కలెక్టర్ సత్యనారాయణ కర్నూలు(అగ్రికల్చర్): గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా పల్లె పిలుపు కార్యక్రమం చేపట్టాలని.. అన్ని శాఖల అధికారులు జవాబుదారీ తనంతో గ్రామీణ ప్రగతికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో పల్లె పిలుపు కార్యక్రమంపై మండల స్థాయి అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఏఈలు తదితరులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈనెల 17 నుంచి ప్రారంభించనున్న పల్లె పిలుపు కార్యక్రమంపై కలెక్టర్ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రామ పరిపాలన పటిష్టమైతే ప్రజా సమస్యలు గ్రామ స్థాయిలోనే చాలా వరకు పరిష్కారమవుతాయన్నారు. గ్రామ స్థాయి పరిపాలనను మెరుగు పరిచేందుకు తహసీల్దార్, ఎంపీడీఓల ఆధ్వర్యంలో రెండు టీమ్లు ఏర్పాటు చేశామని, ప్రతి వారం ఈ టీమ్లు రెండు గ్రామాలను విధిగా కవర్ చేయాలని తెలిపారు. గ్రామాలకు వెళ్లే ఈ టీమ్లు గ్రామ స్థాయిలో ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లు, చౌక దుకాణాలు తదితరాలను తనిఖీ చేసి లోపాలను గుర్తించాలన్నారు. ఇలా మూడు నెలలకు మండలంలోని అన్ని గ్రామాలను కవర్ చేయాలని ఆదేశించారు. పిల్లె పిలుపు కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని సూచించారు. ఈ ఏడాది 400 గ్రామాలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి హైస్కూల్కు ప్లే గ్రౌండ్ ఉండాలని, లేని పాఠశాలలకు ఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.5 లక్షలతో ప్లే గ్రౌండ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.. సమస్య ఎక్కువగా ఉంటే తక్షణం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ ఆనంద్నాయక్, జడ్పీ సీఈఓ ఈశ్వర్, అన్ని మండలాల నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement