breaking news
PaisaVasool
-
‘పైసా వసూల్’ స్టంపర్ వచ్చేసింది..
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాలకృష్ణ- శ్రేయ- కైరాదత్ కాంబినేషన్లో వస్తున్న ఫిల్మ్ ‘పైసా వసూల్’ ' స్టంపర్ వచ్చేసింది. రెగ్యులర్ టీజర్, ట్రైలర్లకు భిన్నంగా ఉంటుందన్న ప్రకటించిన దర్శకుడు పూరీ అన్నట్టుగానే స్టంపర్ ను విడుదల చేశారు. కాగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ‘‘ఆయామ్ ద హీరో... నేను పులిలాగే ఉంటానట’’ అంటూ ఫ్యాన్స్కు కిక్కెస్తున్న ఈ అఫీషియల్ ట్రైలర్ సారీ.. స్టంపర్ మీకోసం... -
బాలయ్య బాబు-బాలీవుడ్ భామ@ డిన్నర్
పూరి జగన్నాధ్ దర్శకత్వం లో బాలకృష్ణ- శ్రేయ- కైరాదత్ కాంబినేషన్లో వస్తున్న ఫిల్మ్ ‘పైసా వసూల్’. ఈ మూవీ వెరైటీ స్టంపర్ శ్రావణమాసం తొలి శుక్రవారం (నేడు)రిలీజ్ కానుంది. దీని కోసం ఒకవైపు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మరోవైపు ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న బాలీవుడ్ భామ కైరా ఓ ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హీరో బాలకృష్ణతో కలిసి డిన్నర్ చేసిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అంతేకాదు ఈ సందర్భంగా హీరో బాలకృష్టపై ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణగారు నిజమైన జెంటిల్మెన్, మనసు బంగారం అంటూ అపారమైన ప్రేమను, శాశ్వతమైన గౌరవాన్ని చాటుకుంటూ ట్వీట్ చేయడం విశేషం. కాగా రెగ్యులర్ టీజర్, ట్రైలర్లకు భిన్నంగా ఉండే తమ స్టంప్కోసం ఈ నెల 28వ తేదీ వరకు వెయిట్ చేయండి అని ఇప్పటికే పూరి ప్రకటించిన సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు.. త్వరలోనే రిలీజ్ కానున్న ఆడియోపై అభిమానుల్లో భారీ అంచనానే నెలకొన్నాయి. Date night with Balakrishna Garu. A true gentleman & a man with a golden heart. Unconditional love & eternal respect. #NBK101 #PaisaVasool pic.twitter.com/RbzohSS0Ev — Kyra Dutt (@KyraDutt) July 27, 2017