-
మాజీ IAS పద్మనాభయ్యతో మనసులో మాట
-
‘అస్కి’ని నిత్యనూతనంగా నిలబెడతాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పద్మనాభయ్య దేశంలోనే తొలి మేనేజ్మెంట్ శిక్షణ కేంద్రమైన ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా’ (అస్కి)ని కాలానుగుణంగా నిత్యనూతనంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని సంస్థ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి కె.పద్మనాభయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన వ్యవస్థ సామర్థ్యం పెంపు, పథకాల అమలు, పరిశోధన, ఉన్నతాధికారులకు నాయకత్వ శిక్షణ తదితరాల్లో పేరున్న అస్కి బుధవారంతో 60 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు... అస్కి 60 ఏళ్ల ప్రస్థానంపై.... దేశంలోనే తొలి మేనేజ్మెంట్ సంస్థగా 1956లో పురుడు పోసుకుంది మొదలు నేటిదాకా అస్కి ఎన్నో మైలురాళ్లు దాటింది. దేశ పురోగతిలో తనవంతు పాత్ర పోషిస్తూ వస్తోం ది. అనేకానేక ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయానికి, ఉన్నతాధికారుల మధ్య సత్సం బంధాల సాధనకు, నాయకత్వ, నైపుణ్య శిక్షణలకు వేదికగా మారింది. పథకాల అమలు తీరుతెన్నులు, లోటుపాట్లను విశ్లేషించి, పలు అంశాలపై పరిశోధన చేసి ప్రభుత్వాలకు నివేదిస్తాం. ఎంతో అనుభవమున్న నిపుణులున్నారిక్కడ. సార్క్ దేశాల నుంచి అధికార బృం దాలు శిక్షణకు వస్తాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, యునిసెఫ్, యూరోపియన్ యూనియన్ అస్కి సేవలను వినియోగించుకుంటున్నాయి! మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్కు చెందిన దాతృత్వ సంస్థ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్కు కూడా అస్కి కన్సల్టెన్సీ సేవలందిస్తోంది. ఆర్థిక కష్టాలను అధిగమించాం ప్రభుత్వాల నుంచి అస్కి రూపాయి సాయం కూడా పొందదు. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు సొంతగా సిబ్బంది శిక్షణ కాలేజీలు ప్రారంభించుకోవడం మొదలవడంతో మా సేవలకు డిమాండ్ తగ్గింది. 2011 నుంచి ఐదేళ్లు వరుసగా నష్టాలే. 2014–15లో రూ.3.8 కోట్ల నషమొచ్చింది. సంస్థ సేవలు వాడుకునే వారి సంఖ్య పెంచడం, కోర్సులను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చడంపై దృష్టి పెట్టాం. అస్కిలో శిక్షణ పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులతో మాట్లాడి, మా సేవలు వాడుకునేలా ఒప్పించాం. 2015– 16 ముగిసేసరికి రూ.58 లక్షల లాభం వచ్చిం ది. 2015–16లో రూ.1.5 కోట్ల లాభం ఆశిస్తున్నాం. లాభాలు ముఖ్యం కాదు. సంస్థ దీర్ఘకాల మనుగడకు ఆర్థిక పరిపుష్టత అవసరం. పూర్వవైభవం దిశగా వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పెద్దనోట్లపై అపోహల తొలగింపునకు సదస్సులు
బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై ప్రజల్లో అవగాహనను కల్పించడంతో పాటు అపోహలు తొలగించేందుకు సదస్సులను నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు. పార్టీ పాలసీ రీసెర్చ్ గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం ‘‘పెద్ద నోట్ల రద్దు-ఆవశ్యకత, ప్రభావం, పరిణామాలు’’అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ బాగోగుల కోసం తీసుకున్న నిర్ణయమని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇదెంతో ఉపకరిస్తుందన్నారు. ఈ నిర్ణయం దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా సేవలందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్లధనం, అవినీతి నియంత్రణకు మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో న్యాయ, బ్యాంకింగ్, పోలీస్, ఆర్థిక నిపుణులను భాగస్వాములను చేసి ప్రజల అపోహలను దూరం చేసేందుకు పార్టీ ఆధ్వర్యంలో చర్చా గోష్టులను నిర్వహిస్తు న్నామన్నారు. రూ. 2వేల నోటు ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలి ఈ సదస్సులో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మళ్లీ రూ.2 వేల నోటును ఎందుకు తీసుకొచ్చారో చెప్పాల్సి ఉందని అన్నారు. వివిధ ప్రజావసరాలకు ప్రజలు చెల్లించే బిల్లులను రెండు నెలల పాటు వారుుదా వేయాలని సూచించారు. దేశానికి పట్టిన కుళ్లు వదలాలంటే మోదీ మరో రెండు పర్యాయాలు గెలవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. మోడీకి సంకల్పం, ధైర్యం రెండూ ఉన్నారుు కాబట్టి ఈ నిర్ణయాన్ని అమలు చేయగలిగారన్నారు. మోదీ కారణజన్ముడని.. ఇది అతిశయోక్తి ఎంతమాత్రం కాదని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదులు, విభజన శక్తులు జమ్మూ కశ్మీర్లోనో, మరోచోటో ఏదో ఒక చర్యకు దిగే అవకాశం ఉందని మాజీ డీజీపీ అరవిందరావు అభిప్రాయపడ్దారు. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోదని, రియల్ ఎస్టేట్ అసంఘటిత రంగంపై కొంత ప్రభావం పడుతుందని క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్రెడ్డి అన్నారు. బీజేపీ పాలసీ రీసెర్చ్ గ్రూప్ కన్వీనర్ జీఆర్ కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ గోష్టిలో ఎస్బీఎం మాజీ ఎండీ ఎం. సీతారామమూర్తి, ఆర్థిక నిపుణులు కె.నరసింహమూర్తి, పారిశ్రామికవేత్త అనిల్రెడ్డి, సీనియర్ జర్నలిస్టు జి. వల్లీశ్వర్, ప్రొ. వాసుదేవాచారి (ఓయూ) తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement