breaking news
One woman
-
అన్నదమ్ముల్ని పెళ్లాడిన యవతి.. ఇదెక్కడి ఆచారం!
ఒక వధువు.. ఇద్దరు పెండ్లి కొడుకులు.. పైగా అన్నదమ్ములు.. వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు వందలమంది హాజరై.. ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఈమధ్యకాలంలో జరిగే పరిణామాలతో పెళ్లంటేనే వణికిపోతున్న క్రమంలో.. ‘హవ్వా ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా?’ అయితే ఈ కథనంలోకి పదండి.. హిమాచల్ ప్రదేశ్ సిరమూర్ జిల్లా షిల్లై గ్రామంలో జులై 12 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా.. అతని సోదరుడు కపిల్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. కున్హట్ గ్రామానికి చెందిన సునీత పెద్దల మాటకు విలువ ఇచ్చే ఈ వివాహం చేసుకుందట. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని, పైగా ఇలా వివాహం చేసుకోవడం(polyandry) అనాదిగా తమ తెగలో వస్తున్న ఆచారమని చెబుతున్నారు. పైగా ఈ వివాహం తమకెంతో గర్వంగా ఉందని ఫొటో షూట్లో ఉత్సాహంగా పాల్గొంటూ చెప్పారు. Astonishing! Two real brother marry a Same Girl 👇In Shillai area of Sirmaur district, two real brothers have married the same girl. This has become a topic of discussion in the entire region. This tradition is ancient in the Giripar region but in today's modern era, due to the… pic.twitter.com/8fIOaeQtjs— Akashdeep Thind (@thind_akashdeep) July 19, 2025హట్టి తెగ ప్రజలు హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ట్రాన్స్ గిరి రీజియన్లో 450 గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందటే ఈ తెగకు షెడ్యూల్డ్ ట్రైబ్(గిరిజన తెగ.. ఎస్టీ) గుర్తింపు దక్కింది. అయితే వేల ఏళ్లుగా బహుభర్తృత్వం((polyandry)ను ఈ తెగ పాటిస్తోందట. అందుకు భూవివాదాలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కుటుంబ ఐక్యత.. తద్వారా భూవివాదాలు లేకుండా ఉండేందుకే హట్టి తెగ ఈ ఆచారం మొదలుపెట్టిందట. సోదరుల మధ్య బంధం బలంగా ఉండి ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగవనేది మరో కారణం. అంతేకాదు.. ఇద్దరు భర్తలు ఉంటే తమ ఆడబిడ్డలకు రక్షణ బలంగా ఉంటుందని ఈ తెగవారు భావిస్తారట. అయితే.. మారుతున్న పరిస్థితులు, మహిళలు చదువుకోవడం, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడం.. కారణాలతో ఈ తరహా వివాహాలు అరుదుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరహా వివాహాలకు అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా సమ్మతిని తెలుపుతున్నాయి. జోడిధారా పేరుతో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు జరిగాయని అధికారులు చెబుతున్నారు. హట్టి తెగలో ‘జాజ్దా’ పేరుతో ఈ వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. పెళ్లి కూతురిని ఊరేగింపుగా పెళ్లి కొడుకులు ఉన్న ఊరికి తీసుకొస్తారు. అక్కడ వరుడి ఇంట సీంజ్ అనే పద్దతిలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ల భాషలో పంతులుగారు మంత్రాలు చదువుతూ.. పవిత్ర జలాన్ని వధువు- ఇద్దరు పెళ్లి కొడుకుల మీద జల్లుతాడు. ఆపై ఆ ముగ్గురు ఒకరికొరు బెల్లం తినిపించుకుంటారు. ఆఖర్లో కుల్ దేవతా ఆశీర్వాదంతో ఈ వివాహ తంతు ముగుస్తుంది. హిమాలయ పర్వతాల రీజియన్లోని కొన్ని తెగలు ఒకప్పుడు ఈ తరహా వివాహాలకు మక్కువ చూపించేవి. తమిళనాడులో తోడా అనే తెగ ఒకప్పుడు ఈ ఆచారం పాటించేది. అలాగే నేపాల్, కెన్యాలో కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ తరహా వివాహాలు జరుగుతున్నాయి. -
ముగ్గురి ఆత్మహత్య
కైకరం(ఉంగుటూరు) : వేర్వేరు చోట్ల బుధవారం ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. చేబ్రోలు పోలీసుల కథనం ప్రకారం.. పెంటపాడు మండలం పడమర విప్పరుకు చెందిన వాలిపల్లి రాజారావు (45)కు 20ఏళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల నుంచి భార్యా, పిల్లలు అతనికి దూరంగా ఉం టున్నారు. దీంతో మానసికంగా కుంగి పోయిన అతను వారం క్రితం తన సోదరి బొమ్మిడి సుబ్బలక్ష్మి ఇంటికి వచ్చాడు. మంగళవారం సోదరి ఇంటివద్ద పురుగు మందు తాగి మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి .. ఏలూరు అర్బన్ : స్థానిక జ్యూట్మిల్ ప్రాంతంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ జాన్సన్ కథనం ప్రకారం.. ఓవర్బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉందని బుధవారం స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే హెచ్సీ జాన్సన్ మృతుడు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. మృతుని గురించి స్థానికులను విచారించినా ఎలాంటి సమాచా రం లభించలేదు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం బాగా ఛిద్రమైంది. మృతుడు నల్లరంగు గళ్లు కలిగిన లేత బిస్కెట్ రంగు పొడవు చేతుల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వయసు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండొచ్చని, వివరాలు తెలిసిన వారు 9491362001 నంబరు కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉరేసుకుని యువకుడు మృతి మొగల్తూరు : గదిలోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మొగల్తూరు స్టేషన్ పరిధి సీతారామపురంలో జరి గింది. ఎస్ఐ డి.జె.రత్నం కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన కర్ల చందు (25) కొంత కాలంగా సీతారామపురంలో పొక్లెయిన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇక్కడే గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం రాత్రి తన గదికి వెళ్లిన చందు బుధవా రం ఉదయం ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు పగలగొట్టారు. దీంతో అతను ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వీఆర్వో కురెళ్ళ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
భారత సరిహద్దు వద్ద పాక్ కాల్పులు : మహిళ మృతి
జమ్మూ కాశ్మీర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం బుధవారం తన తెంపరితనాన్ని మరోసారి చాటుకుంది. భారత సరిహద్దుల్లోని అకునూర్ ప్రాంతంపై పాక్ సైన్యం తుపాకీ గుళ్ల వర్షం కురుపించింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. -
బెంగళూరులో పేలుళ్లకు ఓ మహిళ మృతి