breaking news
old cases
-
4 దశాబ్దాల నిరీక్షణ ఫలించిన వేళ
ప్రయాగ్రాజ్: చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకుపైగా కేసులో నిందితునిగా ఉంటూ సమాజంలో హంతకుడు అనే ముద్ర తో బతుకీడిస్తున్న 100 ఏళ్ల వృద్ధునికి ఎట్టకేలకు కేసు నుంచి మోక్షం లభించింది. 1982నాటి హత్యకేసులో ధనీరామ్ను నిర్దోషిగా పేర్కొంటూ అలహాబాద్ హైకో ర్టు డిజిజన్ బెంచ్ తాజాగా తీర్పును వెలువర్చింది.దీంతో దాదాపు 42 సంవత్సరాల తర్వాత కేసు నుంచి ధనీరామ్ విముక్తుడయ్యాడు. నత్తనడకన సాగే కేసుల విచారణ, కోట్ల కొలదిగా పేరుకుపోయిన కేసుల కొండల మధ్య సరిగ్గా వందేళ్ల వయసులో ధనీరామ్ నిర్దోషిగా బయటపడడం విశేషం. దేశ న్యాయవ్యవస్థలో న్యాయం కోసం కొన్ని సందర్భాల్లో దశాబ్దాల తరబడి వేచి ఉండక తప్పదన్న చేదునిజాన్ని ధనీరామ్ కేసు మరోసారి స్మరణకు తెచి్చందని పలువురు న్యాయనిపుణులు వ్యాఖ్యానించారు. అసలేంటీ కేసు? ఉత్తరప్రదేశ్లో 1982 ఆగస్ట్ 9వ తేదీన ఒక భూవివాదం చివరకు గున్వా అనే వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ వివాదంపై 1984లో కేసు నమోదైంది. ఈ కేసులో హమీర్పూర్కు చెందిన ధనీరామ్తోపాటు మైకూ, సత్తిదిన్లను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు నేరాభియోగాలు మోపారు. విషయం తెల్సి ప్రధాన నిందితుడు మైకూ పారిపోగా సత్తిదిన్, ధనీరామ్లను పోలీసులు అరెస్ట్చేశారు. ఇద్దరినీ దోషులుగా తేలుస్తూ హమీర్పూర్ సెషన్స్కోర్టు యావజ్జీవకారాగార శిక్ష విధిస్తూ 1984లోనే తీర్పు చెప్పింది. వెంటనే ధనీరామ్, సత్తిదిన్ హైకోర్టును ఆశ్రయించి అదే ఏడాది బెయిల్మీద బయటికొచ్చారుగానీ శిక్షరద్దు పిటిషన్ అలాగే పెండింగ్లోనే ఉండిపోయింది. ఈలోపే సత్తిదిన్ మరణించారు. 42 సంవత్సరాల తర్వాత గత నెల జస్టిస్ చంద్రధారీ సింగ్, జస్టిస్ సంజీవ్ కుమార్ల అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ శిక్షరద్దు పిటిషన్ను విచారించింది. ‘‘ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసు ఇలాగే పెండింగ్లో పడిపోవడం అత్యంత నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆనాడు ప్రత్యక్షసాక్షులుగా చెబుతున్న వాళ్ల వివరాలు, వాంగ్మూలాలు ఎఫ్ఐఆర్లో లేవు. కేవలం అనుమానంతోనే ధనీరామ్కు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. బాధితుడిని ఇతను తుపాకీతో కాల్చిచంపినట్లుగా బలమైన సాక్ష్యాధారాలే లేవు. దశాబ్దాలపాటు విచారణలో ఆలస్యం, అలసత్వంతో న్యాయ వితరణ అనేది సవ్యంగా జరగదు. సంశయలాభం కింద ఇతనికి కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నాం. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను రద్దుచేస్తున్నాం’’అని 23 పేజీల తీర్పులో ధర్మాసనం పేర్కొంది. వందేళ్ల వయోభారం, న్యాయ వితరణలో అసాధారణ ఆలస్యం కారణంగానూ ఈయనకు శిక్షను రద్దుచేస్తున్నామని ధర్మాసనం వివరించింది. ఆనాడు బెయిల్ కోసం సమరి్పంచిన బెయిల్బాండ్ నగదు పూచీకత్తులనూ తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది. -
100 కేసులు.. 109 పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: క్రిమినల్ కేసుల్లో తెలంగాణ హైకోర్టు సత్వర పరిష్కారం చూపిస్తోంది. సగటున నమోదైన 100 కేసులకు పాత కేసులతో కలిపి 109 కేసులను పరిష్కరిస్తోంది. సివిల్ కేసుల్లో 94 శాతం పరిష్కారంతో కేసుల విచారణ సాగిస్తోంది. హైకోర్టులో ఇప్పటికి దాదాపు 2.35 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 శాతం న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నా.. పరిష్కారం శాతంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. కౌంటర్ల జాప్యంతో పెరుగుతున్న పెండింగ్లు కేసుల సత్వర విచారణకు న్యాయస్థానం తీవ్రంగా కృషి చేస్తున్నా.. జడ్జిల ఖాళీలు, సిబ్బంది లేమితోపాటు ప్రభుత్వం వేగంగా కౌంటర్లు వేయకపోవడంతో కొన్ని కేసులు విచారణ నత్తనడకను తలపిస్తోంది. సివిల్ కేసుల్లో ఏళ్లకేళ్లు కౌంటర్లు దాఖలు చేయకుండా సర్కార్ మీనమేషాలు లెక్కిస్తుండటం పెండింగ్ శాతం పెరగడానికి ప్రధాన కారణమని న్యాయమూర్తులే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం గమనార్హం.⇒ దేశంలోని హైకోర్టుల్లో 7 లక్షల క్రిమినల్ అప్పీళ్లు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు పేర్లను కేంద్ర ప్రభుత్వం త్వరగా సిఫారసు చేయాలి. న్యాయమూర్తుల కొరతతో క్రిమినల్ అప్పీళ్లు భారీగా పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యను అరికట్టాల్సి ఉంది. – సుప్రీంకోర్టు⇒ కేసులు పెద్ద సంఖ్యలో పేరుకుపోవడం కోర్టు వ్యవస్థపై తీవ్ర భారం మోపుతుంది. ఒత్తిడి పెరగడంతో న్యాయమూర్తులు కేసులను సకాలంలో విచారించి నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. సుదీర్ఘ జాప్యం కారణంగా సాధారణ ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. – న్యాయ నిపుణులుప్రధాన సమస్యలు..⇒ న్యాయమూర్తుల ఖాళీలు, సిబ్బంది కొరత ⇒ అంతంత మాత్రంగా మౌలిక సదుపాయాలు ⇒ న్యాయ వ్యవస్థకు అరకొర నిధుల కేటాయింపు ⇒ కౌంటర్ల దాఖలుకు సర్కార్ ఏళ్లకేళ్లు సమయం తీసుకోవడం ⇒ చట్టంలోని లోటుపాట్లను కొందరు అనుకూలంగా మార్చుకోవడం ⇒ సాంకేతికతపై న్యాయవాదులకు పూ ర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంఅనుకూలతలు..⇒ కోవిడ్ తర్వాత వర్చువల్ విధా నం అందుబాటులోకి రావడం ⇒ లోక్ అదాలత్లపై ప్రజలను విస్తృత స్థాయిలో చైతన్యం చేయడం ⇒ సివిల్ కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ⇒ న్యాయమూర్తులు విచారణలను వేగవంతంగా చేపడుతుండటం ⇒ ఆన్లైన్లోనూ న్యాయవాదులు విచారణకు హాజరవు తుండటంఇంకా ఏం చేయాలి..⇒ సాంకేతికతపై కక్షిదారులకు, న్యాయవాదులకు అవగాహన కల్పించడం ⇒ ఒకే రకమైన కేసులను ఒకే చోట విచారణ చేపట్టడం ⇒ చిన్నచిన్న విచారణలకు న్యాయవాదులకు గడువు నిర్దేశించడం ⇒ బలమైన కారణాలుంటే తప్ప విచారణ వాయిదా వేయకుండా ఉంటడం ⇒ స్వల్ప కేసుల్లో వెంటవెంటనే తీర్పులు వెల్లడించడం ⇒ కౌంటర్ల దాఖలుకు సర్కార్కు గడువు విధించడంవాయిదాలు తగ్గితేనే..ప్రధానంగా సివిల్ కేసుల్లో వాయిదాలు తగ్గితేనే సత్వర పరిష్కారం సాధ్యమవడంతోపాటు పెండింగ్ భారం తగ్గుతుంది. కొన్ని కేసులు ఏళ్లకు ఏళ్లు వాయిదా పడుతూ పెండింగ్ జాబితా పేరుకుపోతోంది. క్రిమినల్తో పాటు సివిల్ కేసులను వంద శాతానికి మించి పరిష్కారం చేయాలి. రెండేళ్లుగా జడ్జీలు సత్వర పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నా.. అదనపు భారంతో తీవ్ర ఒత్తిడి ఉంటోంది. మంజూరైన మేరకు న్యాయమూర్తుల నియామకం, మౌలిక వసతులు చేపడితే ఈ భారాన్ని తగ్గిస్తూ రావొచ్చు. – సంజీవ్రెడ్డి జిల్లెల్ల, హెచ్సీఏఏ మాజీ కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది -
ఇదేంది సారు!.. ఇలాంటివి రాకుండా ఎన్నెన్నో స్టేలు తెచ్చుకున్న చరిత్ర మనది!
ఇదేంది సారు!.. ఇలాంటివి రాకుండా ఎన్నెన్నో స్టేలు తెచ్చుకున్న చరిత్ర మనది! -
పాత కేసులను పరిష్కరించాలి
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ నౌషద్ అలీ కర్నూలు(లీగల్): పాత కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టీస్ నౌషద్ అలీ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా వినియోగదారుల ఫోరంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల వివరాలు, వాటి పెండింగ్ కాల పరిమితిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్చార్జి అధ్యక్షురాలు ఎస్.నజీరున్నిసా పాల్గొన్నారు. కర్నూలులో రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఏర్పాటు చేయాలని జిల్లాలోని వినియోగదారుల సంఘాల నాయకులు, కక్షిదారులు ఆయన విజ్ఞానపత్రం ఇచ్చారు.


