-
కరోనాతో వయోవృద్దులకు కష్టకాలం
-
వృద్ధాశ్రమం, బాలల సంరక్షణ కేంద్రం ఒకే చోట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ప్రయోగాత్మకంగా బాలల సంరక్షణ కేంద్రాన్ని, వృద్ధాశ్రమాన్ని కలిపి ఏర్పాటు చేస్తామని, దీని ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అనాథలు, బాల్యంలోనే నేరాలు చేసి రక్షణ గృహాల్లో ఉన్న చిన్నారులను, అలాగే వృద్ధాశ్రమాలకే పరిమితమైన వృద్ధులను ఒకే చోట ఉంచడం వల్ల సత్ఫలితాలు ఉంటాయన్న హైకోర్టు అభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. వాస్తవానికి వృద్ధాశ్రమాలకు అనుబంధంగా బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. రెండింటినీ ఒకేచోట ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతి సదుపాయాలు ఏమిటో పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వివరించింది. వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి ఏమైనా అసౌకర్యం కలిగితే ఫిర్యాదు చేసేందుకు వీలుగా 14567 హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేశామని తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునేలా జిల్లా ఎస్పీలు, నగర కమిషనర్లకు ఆదేశాలిచ్చినట్లు కోర్టుకు వివరించింది. వృద్ధాశ్రమాల్లో పరిస్థితులపై రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం, పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ డి.దివ్య ఈ నివేదికను కోర్టు ముందుంచారు. -
రిజిస్ట్రేషన్ లేని వృద్ధాశ్రమాలా?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల నిర్వహణ అధ్వానంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లేదని, ఏడాదిలో రెండుసార్లు తనిఖీ చేయాలన్న చట్ట నిబంధనల్ని అమలు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో రిజిస్టర్ చేసినవి 89 ఉంటే రిజిస్టర్ చేయనివి 41 ఉన్నాయని తెలుసుకున్న ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. రిజిస్టర్ కూడా చేసుకోని వృద్ధాశ్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని, తనిఖీలు చేయాల్సిన అధికారులు తమ విధులను సరిగ్గా నిర్వహించకపోవడంపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నదీ కూడా వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధాశ్రమాల్లో వసతులు లేవని, అక్కడి పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి రాసిన లేఖను హైకోర్టు ప్రజా హిత వ్యాజ్యంగా పరిగణించింది. ఈ పిల్ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహా న్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టుకు సహాయకారిగా (అమికస్ క్యూరీ) నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తయారు చేసిన నివేదికను ధర్మాసనానికి అందజేశారు. జంటనగరాల్లో 41 వృద్ధాశ్రమాలు కనీసం రిజిస్టర్ చేయకుండా నిర్వహిస్తున్నారని, పలు ఆశ్రమాల్లో కనీస వసతులు లేవని నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ కల్పించుకుని, లాక్డౌన్ కారణంగా అన్ని ఆశ్రమాలను అధికారులు తనిఖీలు చేయలేకపోయారని, కొన్ని చోట్ల వసతులు సాధారణంగా ఉన్నాయని తెలిపారు. హెల్ప్లైన్ ఏర్పాటు చేశామన్నారు. 41 ఆశ్రమాలకు నోటీసులు ఇచ్చామని, 15 రోజుల్లోగా రిజిస్టర్ చేసుకోకపోతే వృద్ధాశ్రమాల్ని రద్దు చేస్తామని చెప్పామన్నారు. వాదనల అనంతరం జూలై 14 నాటికి ప్రభుత్వ నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. -
పండుటాకుల పాట్లు..!
సాక్షి, హైదరాబాద్: వృద్ధాశ్రమాల నిర్వహణ కంటతడి పెట్టించేలా ఉందని, పట్టించుకో వాల్సిన ఉన్నతాధికారులను అక్కడ మూడు రోజులు బస చేయిస్తే ఎంత ఘోరంగా అవి ఉన్నాయో అనుభవంలో తెలుస్తుందని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగరిక సమాజంలో అనాగరిక పరిస్థితుల ను నగరాల్లోనే చూస్తున్నామని, నాగరికత లేదని చాలా మంది భావించే గ్రామాల్లోనే అమ్మానాన్నలను బాగా చూసుకుంటున్నారని అభిప్రాయపడింది. పండుటాకుల పట్ల ప్రేమ చూపని నేటి తరం.. రేపటి వృద్ధ తరమని మరిచిపోవద్దని హెచ్చరించింది. జంట నగరాల పరిసర ప్రాంతాల్లోని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాల నిర్వహణపై అమికస్క్యూరీ (ఈ కేసులో కోర్టుకు సహాయకారి)గా నియమితులైన న్యాయవాది వసుధా నాగరాజ్ ఇచ్చిన నివేది కను పరిశీలించిన ధర్మాసనం వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారని వ్యాఖ్యా నించింది. వృద్ధాశ్రమాల నిర్వహణ ఎలా ఉందో చూడాల్సిన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఓ మూడు రోజులు అ లాంటి ఆశ్రమాల్లో బస చేయమంటే పరిస్థితులు అనుభవపూర్వకంగా తెలిసివస్తాయం ది. నివేదికపై ప్రభుత్వ వాదనను తెలియ జేస్తూ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆ ఇద్దరు ఉన్నతాధికారులను ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నగ రంలోని మమత వృద్ధాశ్రమంలో దుర్లభ పరిస్థితులపై న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు మరో సారి విచారణ జరిపింది. వారికీ హక్కులు ఉన్నాయన్నది మరవద్దు.. వృద్ధాశ్రమాల్లో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో నివేదిక చూస్తే అర్ధమవుతోందని, నిరుపేదలు కాబట్టి ఎవరికీ చెప్పుకోలేరని అనుకోవద్దని హెచ్చరించింది. వారికి రాజ్యాంగం హక్కులు కల్పించిందనే విషయాన్ని అధికారులు మరిచిపోకూడదని, చట్ట ప్రకారం.. సాంఘిక, స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు తనిఖీలు చేయాలనే బాధ్యతను నిర్వహించకపోతే వారిని ఏమనాలని ప్రశ్నించింది. ‘ఒకచోట మదర్స్ నెస్ట్ అనే వృద్ధాశ్రమంలో మూడు గదుల్లో ఏకంగా 24 మంది ఉన్నారు. గదులకు కిటికీలు ఊడిపోయాయి. మరుగుదొడ్లు కూడా లేవు. ‘ది సెకండ్ చాన్స్’లో మంచాల మధ్య నడిచే ఖాళీ కూడా లేదు. ఎప్పుడో ఉతికిన దుప్పట్లు.. దుమ్ము ధూళితో ఉన్నాయి. దాతల చేయూతతోనే ఎన్జీవోలు వీటిని నిర్వహిస్తున్నాయి. రూ.25–30 వేల వరకూ చెల్లించి ఉండే కొన్ని చోట్ల పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఇంకొన్ని అంతకంటే ఎక్కువే వసూ లు చేస్తున్నాయి. అధికారులు ఏడాదికోసారి తనిఖీ చేసినట్లుగా చెబుతున్నారు. పలుచోట్ల అయితే వృద్ధాశ్రమం రిజిస్టర్ చేసినప్పుడే తనిఖీ జరిగింది’అని నివేదికలోని విషయాలను ధర్మాసనం ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదనను వెలిబుచ్చింది. హెల్ప్లైన్ ఏర్పాటు చేయండి... ‘జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాలో అధికారికంగా రిజిస్ట్రర్ చేసినవి ఎన్ని ఆ శ్రమాలున్నాయి. రిజిస్ట్రర్ చేయనివి ఎన్ని ఉన్నా యి. ఇప్పటివరకూ ఎన్నిసార్లు తనిఖీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తూ ఎలాంటి చర్యలు తీసుకున్నారు. వృద్ధాశ్రమాల్లోని వారి కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలి. పత్రికలు, టీవీల ద్వారా ప్రచారం చేయా లి. హెల్ప్లైన్లకు వచ్చే ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ల ద్వారా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. వృద్ధాశ్రమాలను ఆదుకునేందుకు కార్పొరేట్ కంపెనీల సాయం పొందే చర్యలు తీసుకోవాలి. మేము జారీ చేసే ఉత్తర్వుల ప్రతులను అన్ని వృద్ధాశ్రమాల నిర్వాహకులకు అధికారులు అందజేయాలి’అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
‘పెన్షన్ రాజ్యాంగ హక్కు.. కోతకు వీల్లేదు’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లో 25 శాతం కోత విధించడంపై హై కోర్టులో దాఖలయిన పిటిషన్ను సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారించింది. పిటీషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లో కోత విధించవద్దని పిటీషనర్ కోర్టును కోరారు. పూర్తి పెన్షన్ను అందించేలా చూడాలన్నారు. పెన్షన్ రాజ్యాంగ హక్కని.. దీనిలో కోత విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షన్పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు ఉన్నాయని కోర్టుకు వెల్లడించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు పెన్షన్ అంశంలో ఎలాంటి హక్కులు ఉన్నాయో పూర్తి వివరాలను తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణనను ఈ నెల 17కు వాయిదా వేసింది. వృద్ధాశ్రమాల నిర్వహణపై హై కోర్టు విచారణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాశ్రమాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని న్యాయవాది వసుధ నాగరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. స్వచ్ఛంద సంస్థల ద్వారా వృద్ధాశ్రమాలు నడుస్తున్నాయని పిటీషనర్ కోర్టుకు విన్నవించారు. నిధులు లేని వృద్ధాశ్రమాల్లో ఒక్కొక్కరి వద్ద నుంచి 60-13 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వృద్ధాశ్రమాల్లో ఉన్నవారిని చూసుకోవడానికి సరిపడా సిబ్బంది లేరని తెలిపారు. పిటీషనర్ తరపున వాదనలు విన్న కోర్టు రాష్ట్రంలోని వృద్ధాశ్రమాల్లో ఏలాంటి పరిస్థితులు ఉన్నాయో నేరుగా వెళ్లి పరిశీలించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. పిటీషనర్ను తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్స్ను సందర్శించాలని తెలిపింది. వాస్తవిక పరిస్థితుల చూసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వృద్ధాశ్రమాల నిర్వహణ కోసం కావాల్సిన నిధులను కార్పోరేట్ కంపెనీలు, ఎన్జీవోల ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబులిటీ(సీఎస్ఆర్) కింద సమకూర్చుకోవాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాక తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్న వృద్ధాశ్రమాల ఎన్ని.. వాటిలో రిజిస్టర్ అయినవి ఎన్ని, కానివి ఎన్ని ఉన్నాయో తెలపాలన్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని సెక్రటరీ సోషల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చైల్డ్, అండ్ ఉమెన్ అధికారులును ఆదేశించించిది. తదుపరి విచారణనను ఈ నెల 23కు వాయిదా వేసింది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement