breaking news
Official program
-
వాహనాల విషయంలో మంత్రులు, సీఎంలకు కేంద్రం కీలక సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వ బాధ్యులుగా నిత్యం వివిధ పర్యటనల్లో ఉండే చీఫ్ మినిష్టర్లు, మినిస్టర్లకు కేంద్రం కీలక సూచన చేసింది. ప్రభుత్వ విధానాలకు తగ్గట్టుగా మంత్రులు, ముఖ్యమంత్రులు ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు. కేంద్ర మంత్రి లేఖ కేంద్ర ప్రభుత్వం గత కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కోరుతోంది. అందుకు తగ్గట్టే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెంచేందుకు ఫేమ్ పేరుతో ప్రత్యేకంగా ప్రోత్సహకాలు అందిస్తోంది. ప్రజలకు ఆదర్శనంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ)లను ఉపయోగిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రతినిధులకు లేఖ రాశారు. ఈవీలనే వాడండి ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న డీజిల్, పెట్రోల్ ఇంజన్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)లను ఉపయోగించాలని మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్కి రాసిన లేఖలో కేంద్ర మంత్రి కోరారు. అంతేకాదు ఆయా శాఖల వారీగా ఉపయోగిస్తున్న పెట్రోలు, డీజిల్ వాహనాలను సైతం ఈవీలగా మార్చాలని కోరారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఈవీలనే వాడాలని సూచించింది. మంచిమార్పే సాధారణంగా ముఖ్యమంత్రుల కాన్వాయ్లో పదికి పైగా వాహనాలు ఉంటాయి. మంత్రుల కాన్వాయ్లో ఐదుకు వరకు వాహనాలు ఉంటాయి. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చితే మంచి ప్రచారం జరగడంతో పాటు కాలుష్యాన్ని కూడా కొంత మేరకు కట్టడి చేసినట్టు అవుతుంది. చదవండి : ఈ-శ్రమ్ పోర్టల్లో పేరు రిజిస్టర్ చేసుకోవడం ఎలా? -
సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాకు వైఎస్ జగన్
సాక్షి, వేంపల్లె/జమ్మలమడుగు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు. ఆయన శుక్రవారం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్, హెలీప్యాడ్ను గండి ఆలయ ప్రాంగణాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ కొండారెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, సమాధికి నివాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం గండి క్షేత్రంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారన్నారు. పులివెందుల డాక్టర్ వైఎస్సార్ ఆర్టికల్చర్ యూనివర్శిటీకి అనుబంధంగా అరటి రీసెర్చ్ స్టేషన్కు గండిలో శంకుస్థాపన చేస్తారన్నారు. జమ్మలమడుగులో జరిగే సభా వేదికగా రైతులకు మద్దతు ధర, వైఎస్సార్ పెన్షన్ కానుక ప్రారంభించనున్నారన్నారు. ఎన్నికల ముందు మాట ఇచ్చిన నేపథ్యంలో క్వింటా శనగలకు రూ.6,500, వైఎస్సార్ పెన్షన్ను రూ.2250లు అందజేస్తారని తెలిపారు. జమ్మలమడుగులో రైతులకు శనగకు మద్దతు ధర రూ.6,500 చెక్కులను అందజేస్తారని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతు తదితర పెరిగిన పింఛన్లు అందజేస్తారన్నారు. పర్యటనకు సంబంధించి మా ర్పులు, చేర్పులపై విధి విధానాలు సీఎం కార్యాల యం నుంచి రావాల్సి ఉందన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ బెల్లం ప్రవీణ్ కుమార్రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, మండల బూత్ కమిటీ మేనేజర్ ఆర్.శ్రీను, మాజీ సర్పంచ్ సురేష్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణరెడ్డి, ప్రశాంత్రెడ్డి, శంకరయ్యలతో పాటు కడప ఆర్డీఓ మలోల, పీఆర్ ఈఈ రామలింగారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి తండ్రి బాటలో సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జగన్మోహన్రెడ్డి మొదటిసారిగా జిల్లాలో పర్యటించబోతున్నారని డిఫ్యూటీ సీఎం అంజద్బాషా అన్నారు. జమ్మలమడుగులో జగన్ పర్యటన పర్యటన ఏర్పాట్లను డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి..సుధీర్రెడ్డి,కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు,తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్భంగా డిఫ్యూటీ సీఎం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రైతు పక్షపాతిగా నిలవనున్నారని తెలిపారు. ఇక్కడ జరిగే రైతు సదస్సులో జగన్ మోహన్రెడ్డి పాల్గొంటారన్నారు. రైతులకు పలు వరాలు ఇవ్వబోతున్నారన్నారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జగన్ చర్చించి గోదావరి జలాలను కృష్ణనదిలోనికి మళ్లించే బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నారని తెలిపారు. గోదావరి నదిలో 90 నుంచి 100 రోజుల వరకు వరద నీరు పారుతుంది. 180 టీఎంసీల నుంచి 200 టీఎంసీ నీరు గోదావరి నుంచి కృష్ణానది లోనికి మళ్లించుకుని రాయలసీమలోని దాదాపు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. నీటిని మళ్లించుకోవడం కోసం దాదాపు లక్ష కోట్ల బడ్జెట్ అవుతుందని ..ఈ దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు చేస్తున్నారన్నారు. గోదావరి నుంచి నీటిని కృష్ణానదిలోనికి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.గతంలో ఆయన తండ్రి వైఎస్రాజశేఖర్రెడ్డి జలయజ్ఞం పనులు చేపట్టి రైతుల భూములకు సాగునీరు అందించి ఆపరభగీరథుడుగా పేరు సంపాదించారు. ఆయన కుమారుడు కూడా రైతుల సంక్షేమానికి పెద్దపీటవేస్తారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్రెడ్డి మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి, మల్కిరెడ్డి.హనుమంతరెడ్డి, పోరెడ్డి మహేశ్వరరెడ్డి,గౌస్లాజం,లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. సభావేదిక పరిశీలన జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు సభా ప్రాంగణాన్ని శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి, ఎమ్మెల్యే మూలే సుధీర్రెడ్డి, డీఎస్పీ కోలా కృష్ణన్ పరిశీలించారు. వేదిక,రూట్ మ్యాపు, హెలిప్యాడ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది వచ్చే అవకశముందో అంచనా వేశారు. సభావేదిక నిర్వాహణ, గ్యాలరీ, సెక్యూరిటీ గురించి చర్చించారు. సభకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. హనుమంతరెడ్డి, పోరెడ్డిమహేశ్వరరెడ్డి, బ్రçహాæ్మనందరెడ్డి,కులాయ్బాషా, విష్ణువర్ధన్రెడ్డి, శివగుర్విరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ అతిథి గృహంలో నేతల భేటీ కడప కార్పొరేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా, వైఎస్ఆర్సీపీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు కె. సురేష్బాబు, ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డాక్టర్ సుధీర్రెడ్డి తదితరులు సమావేశమై చర్చించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా వస్తున్న జగన్కు ఘన స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. సభా స్థలం వద్ద డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేలు 8వ దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధు్దలు, వితంతువులకు రూ.2250లు పింఛన్ ఇవ్వడం జరుగుతోందన్నారు. సభకు రైతులు ఎక్కువగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సభకు ప్రజల తరలింపునకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవడంపై నేతల విముఖత ప్రదర్శించారు. అవసరమైతే ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, కార్యకర్తలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా తాగునీరు, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
ఏదీ ఆహ్వానం..?
కడప ఎడ్యుకేషన్: జిల్లా ప్రథమ పౌరుడు, క్యాబినెట్ ర్యాంకు హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్మన్కు జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా పిలుపులేకుండా పోతోంది. తాజాగా జిల్లాలో జరుగుతున్న జన్మభూమితో పాటు నేడు పులివెందులకు వస్తున్న సీఎం సభకు కూడా ఆహ్వానం అందలేదు. కనీసం ప్రోటోకాల్ కోసమైనా ఆహ్వాన పత్రికలను పంపాల్సి ఉన్నా దాని గురించి పట్టించుకునే వారే లేరు. ఇటీవల ఉపరాష్ట్రపతి కార్యక్రమానికి కూడా.. ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన ఓ పాఠశాల ఉత్సవాల కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వచ్చారు. ఈయన కార్యక్రమానికి కూడా జెడ్పీ చైర్మన్కు పిలుపులేదు. ∙గతంలో జిల్లా పరిషత్తు కార్యాలయ ఆవరణంలో నిర్మించిన డీఆర్సీ భవన్ శంకుస్థాపనకు మంత్రి గంటా వచ్చారు. ఆ రోజు కూడా ఆహ్వానం లేదు. మంత్రి వచ్చే ముందు ఫార్మాలిటీకి ఆధికారులు వచ్చి కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. దీంతో జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తమ కార్యాలయం ఆవరణంలో కార్యక్రమం జరుగుతున్నా ఆహ్వానం లేకపోవడంపై మండిపడ్టారు. జెడ్పీ చైర్మన్ దళితుడని అధికారులకు చిన్నచూపేమోనని పలు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా అవమానం తాను దళితుడినని జిల్లా అధికారులు అడుగడుగునా అవమానానికి గురి చేస్తున్నారని జెడ్పీ చైర్మన్ గూడూరు రవి సాక్షితో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే చైర్మన్ పదవిలో అగ్రవర్ణాలకు చెందిన వారు ఉండి ఉంటే ఇలా చేశేవారా అని ప్రశ్నించారు. జిల్లాలో ఏ అధికారిక కార్యక్రమం జరి గినా కనీసం ఆహ్వాన పత్రికను కూడా పంపరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందంతా జిల్లా అధికారులే చేస్తున్నారా లేక అ«ధికార పార్టీవారు చెప్పి చేయిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. -
అధికారిక సమావేశాల్లో పతి‘దేవుడు’
- ‘సమీక్ష’లకు హాజరు - చర్చనీయాంశమైన పద్మాదేవేందర్రెడ్డి భర్త తీరు - అధికారిక కార్యక్రమంలోఅనధికారి..! - ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న అధికార పార్టీనేత - మీడియాకు నో ఎంట్రీ... అంటూనే మరికొంతమందితో సమీక్ష మెదక్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమం షెడ్యూల్లో భాగంగా శుక్రవారం మెదక్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో, కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఒకరోజు ముందే ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ను స్థానిక డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయం నుంచి మీడియాప్రతినిధులకు అధికారికంగా సమాచారం అందించారు. అయితే ఎప్పటిలాగే సీన్ రివర్స్ అయింది. మీటింగ్ హాల్లో కొద్దిసేపు నిరీక్షించిన విలేకరులకు స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ భర్త దేవేందర్రెడ్డి స్వయంగా వచ్చి ఇది అధికారిక సమీక్షా సమావేశమని, మీడియాకు అనుమతి లేదని చెప్పడంతో అక్కడున్న కొందరు విలేకరులు అవాక్కయ్యారు. కొంతమంది విలేకరులు అక్కడి నుంచి వెళ్లిపోగా, మరికొంతమంది సమావేశంలో పాల్గొనడం గమనార్హం. అధికారికంగా జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్రెడ్డి దర్జాగా కూర్చున్నారు. కేవలం ఉపసభాపతి భర్త అయినంత మాత్రాన ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన ఏడుపాయల జాతర సమీక్ష సమావేశంలో సైతం ఆయన పాల్గొన్నారని ధ్వజమెత్తారు.