-
డాక్టర్తో వీడియో కాల్ చూస్తూ నర్స్ ఆపరేషన్.. గర్భిణీ మృతి
బిహార్:వీడియో కాల్లో చూస్తూ నర్స్ ఆపరేషన్ చేయడం వల్ల ఓ గర్భిణీ మృతి చెందింది. ఈ దారుణ ఘటన బిహార్లోని పూర్నియా ప్రాంతంలో జరిగింది. మాల్తీ దేవీ(22)కు నొప్పులు రావడంతో స్థానికంగా ఉన్న సమర్పన్ మెటర్నిటీ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ లేకపోయిన గర్భిణీని ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్నారు సిబ్బంది. మాల్తీకి నొప్పులు ఎక్కువవగానే ఐసీయూలోకి తీసుకెళ్లారు. వీడియో కాల్ ద్వారా డాక్టర్ సీతాకుమారి సలహాలు ఇస్తుండగా..గర్భిణీకి నర్స్ ఆపరేషన్ చేసింది. పుట్టిన కవలలు క్షేమంగానే ఉన్నప్పటికీ ఆపరేషన్ ఆనంతరం బాధితురాలికి విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. అనంతరం మాల్తీ మృతి చెందింది.దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి:16 వేల గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్టు.. గుండెపోటుతో మృతి -
స్టాఫ్నర్సు కళావతిపై చర్యలు తీసుకోవాలి
తల్లాడ : స్టాఫ్నర్సు కళావతిని సస్పెండ్ చేయాలని, శిశువు మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తల్లాడ పీహెచ్సీ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మార్తిని పద్మ డెలివరీ అయిన తర్వాత శిశువు మృతి చెందటంతో ఆస్పత్రి సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. వారికి రైతు సంఘం, కుర్నవల్లి గ్రామస్తులు మద్దతు తెలిపారు. శిశువు కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి లేకుండా డెలివరీ చేసిన స్టాఫ్ నర్సు కళావతిని సస్పెండ్ చేయాలన్నారు. 24 గంటలు డాక్టరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే డాక్టరు ఉండి వెళ్లటం వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. అనంతరం డిప్యూ టీ డీఎంఅండ్హెచ్ఓ భాస్కర్నాయక్, డాక్టర్లు వి. రాజ్కుమార్, కె.శ్రీనులతో చర్చించారు. 24 గంటలు ఆస్పత్రిలో వైద్యులు ఉండేలా నివేదిక పంపిస్తామన్నారు. బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గుంటుపల్లి వెంకటయ్య, తమ్మిశెట్టి శ్రీను, చల్లా నాగేశ్వరరావు, గంటల వెంకటాచారి, ఐనాల రామలింగేశ్వరరావు, కందికొండ నర్సిరెడ్డి, దగ్గుల ముత్తారెడి, జక్కుల రాములు, నెర్సుల తిరుపతిరావు, ఎల్లమ్మ, సావి త్రి పాల్గొన్నారు. -
నర్సు ఆపరేషన్.. గర్భిణి మృతి!
శ్రీకాకుళం: ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ గర్భిణి మృతిచెందింది. ఈ ఘటన శ్రీకాకుళం రాజాం సెయింటాన్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. డెలివరీ కోసం ఇక్కడికి తీసుకురాగా.. డాక్టర్కు బదులుగా నర్సు ఆపరేషన్ చేసింది. దీంతో ఈ ఆపరేషన్ వల్ల తల్లి మృతిచెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బిడ్డ మాత్రం క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మృతురాలి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ
మాయావతి పార్టీ మరో లిస్ట్..
రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఆ ఓటర్లే కీలకం..!
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్కు లేఖ రాసిన జేజేపీ
తప్పక చదవండి
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement