-
యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం
ఇస్లామాబాద్: సరిహద్దుల్లోని యుద్ధ విమానాలను భారత్ తరలిస్తే తప్ప తమ దేశం గుండా వాణిజ్య విమానాలకు గగనతలం తెరవబోమని పాకిస్తాన్ విమానయాన కార్యదర్శి షారుక్ నుస్రత్ స్పష్టంచేశారు. పుల్వామా తీవ్రవాద దాడి అనంతరం పాక్లోని బాలాకోట్లో జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలను భారత యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 26 తర్వాత నుంచి పాక్ తన గగనతలంపైనుంచి భారత విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. నుస్రత్ ఆదేశాలతో పాక్ విమానయాన శాఖకు చెందిన సెనేట్ స్టాండింగ్ కమిటీ భారత అధికారులకు సమాచారమిచ్చింది. ‘పాక్ గగనతలం తెరవాలని భారత ప్రభుత్వం సంప్రదించింది. మేం అందుకు సిద్ధం. అయితే ముందుగా సరిహద్దుల్లోని వైమానిక స్థావరాల నుంచి యుద్ధ విమానాలను భారత్ ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని నుస్రత్ పేర్కొన్నారు. గగనతలం తెరవడంపై ఓ పాక్ సీనియర్ అధికారి స్పందించడం ఇదే మొదటిసారి. పాక్ గగనతలం మూసివేతపై ఆంక్షలు జూలై 12 వరకు పొడిగించారు. ఏదిఏమైనా పాక్ గగనతల మూసివేతతో భారత విమానయాన పరిశ్రమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ.. పాక్ గగనతల మూసివేత కారణంగా దూరపు మార్గాల్లో విమానాలు ప్రయాణించడం ద్వారా ఎయిరిండియా రూ.430 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపారు. -
చదువు సాగేదెట్టా..
పాఠశాలల పునఃప్రారంభంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. చతుర్దశి, అమావాస్య సాకుతో ఇప్పటికీ తలుపులు తెరవని పరిస్థితి. నిర్లక్ష్యపు నీడలో బాలికల గురుకుల పాఠశాల గది తాళానికి వేసిన సీలు అలాగే .. నిరుపేద విద్యార్థులనే చులకన భావమో.. ప్రశ్నించే సాహసం చేయలేరన్న ధీమానో తెలియదు కానీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులపై ప్రభుత్వ ఉదాసీనత, స్థానిక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆళ్లగడ్డ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల పరిస్థితి ఇందుకు నిదర్శనంగా ఉంది. ఆళ్లగడ్డ టౌన్: వేసవి సెలవుల అనంతరం గత సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో.. మరీ ముఖ్యంగా ప్రయివేటు పాఠశాలలు రెండు రోజులు ముందుగానే విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది. అయితే ఆళ్లగడ్డ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ పరిస్థితి ఏ మాత్రం లేకపోవడం గమనార్హం. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు రోజులైనా వంట శాల, భోజనశాల తలుపులకు వేసిన సీలు కూడా తీయకపోవడం ఇందుకు నిదర్శనం. పట్టణ శివారులోని వక్కిలేరు వాగు సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మిగతా స్కూళ్లతోపాటే ఈనెల 15న ప్రారంభమైంది. అయితే రెండు రోజులు పూర్తయినా విద్యార్థుల చడీచప్పుడు కనిపించలేదు. ఉపాధ్యాయులు మాత్రం వచ్చి వారి సమయం వరకు కూర్చొని వెళ్తున్నారు తప్పితే పరిస్థితిని పట్టించుకోవడం లేదు. 5 నుంచి 10వ తరగతి వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 420 మంది బాలికలు చదువుతున్న ఈ పాఠశాలలో ఈ పరిస్థితి ఉండడం గమనార్హం. దీంతో అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులతో వచ్చి ఇక్కడి పరిస్థితిని చూసి తిరిగి వెళ్లిపోతున్నారు. సీలు కూడా తొలగించలేదు.. గత ఏడాది పాఠశాల చివరి రోజున పాఠశాల అధికారి, సిబ్బంది సమక్షంలో వంటశాల, భోజనశాల గదులకు వేసిన తాళాలు వేసి సీలు వేశారు. సాధారణంగా స్కూలు పునఃప్రారంభ సమయానికి రెండు రోజుల ముందుగానే వీటిని తీసి శుభ్రం చేస్తారు. అవసరమైన మేరకు సరుకులు సమకూర్చుకుని వంటకు సిద్ధమవుతారు. అయితే ఇక్కడ కనీసం తలుపులకు వేసిన సీలు కూడా తొలగించకపోవడం చూసి విద్యార్థులను స్కూలులో వదిలేందుకు వచ్చిన వారి తల్లిదండ్రులు ఇంత నిర్లక్ష్యమా అంటూ నివ్వెరపోతున్నారు. పాఠశాలలో మరమ్మతులు, రంగులు వేయడం కొనసాగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల వారు సోమవారం వచ్చి ఇళ్లకు వెళ్లి పోయారు. మంగళవారం ఆదోని నుంచి వచ్చిన 6వ తరగతి విద్యార్థిని మాత్రం ఏం చేయాలో దిక్కు తోచక దిగాలు గా అలాగే పాఠశాల గేటు వద్ద కూర్చుని ఉండడం కనిపించింది. ఒక రోజు ఆలస్యంగా వచ్చినా స్కూల్లో ఈ పరిస్థితి ఉందని, మళ్లీ ఆదోనికి వెళ్లి మళ్లీ రావడం ఎలా కుదురుతుందని విద్యార్థిని తండ్రి శాంతిరాజ్ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సుశీలను వివరణ కోరగా చతుర్ధశి, అమావాస్య ఉండడంతో తెరవలేదని సెలవిచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూ.2.71 లక్షల వంచన
ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది
జిల్లాలో నేటి ఓటింగ్కు సర్వం సిద్ధం
ఓటుకు రూ.100–200ల పంపిణీ
సురపుర విజేత ఎవరో?
ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి డ్రైవర్ మృతి
నేడే మలివిడత ఎన్నికలు
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
నేటి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement