breaking news
nidamanoor
-
కబడ్డీ క్రీడాకారుడికి ఆర్థిక సాయం
సాక్షి, నల్గొండ: కబడ్డీ క్రీడాకారుడికి ఆర్థిక ఇబ్బందులు బంధనాలుగా మారిన తరుణంలో దాతలు ముందుకొచ్చి ఆదుకున్నారు. నల్గొండ జిల్లా నిడమనూర్ మండల కేంద్రంలో గోకికార్ సురేష్ అనే కబడ్డీ క్రీడాకారుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్ తన వంతు సాయంగా రూ.10,000 అందించి ఉదారతను చాటుకున్నారు. స్థానిక ఎంపీపీ బొల్లం జయమ్మ, పీఏసీఎస్ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య చేతుల మీదుగా బాధితుడికి ఈ మొత్తాన్ని అందించారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి మాజీ ఎంపీటీసి మన్నెం వెంకన్న యాదవ్, టీఆర్ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, టీఆర్ఎస్వీ నాగార్జునసాగర్ నియోజకవర్గ కార్యదర్శి కుంటిగొర్ల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రార్థనా మందిరానికి పాఠశాల స్థలమా?
విజయవాడ: ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ప్రార్థనా మందిరానికి కేటాయించడాన్ని ఆ గ్రామస్తులు నిరసిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ సంఘటన విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన 20 సెంట్ల భూమిని ప్రార్థనా మందిరం నిర్మించుకునేందుకు గన్నవరం ఎమ్మెల్యే వంశీ కేటాయించారు. దీంతో ఆ భూమిని పొందినవారు దాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. ఎమ్మెల్యే వంశీ నిర్ణయంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల స్థలాన్ని ఏ అధికారంతో మతపరమైన కార్యక్రమాలకు కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ స్థలంలో హైస్కూల్కు అనుబంధంగా జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలను నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హైస్కూల్ గ్రౌండ్లో గ్రామస్తులు సమావేశమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించారు. హైస్కూల్ వద్ద ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టగా పోలీసులు రంగంలోకి దిగారు. విజయవాడ సబ్ కలెక్టర్, రూరల్ తహసీల్దార్లు సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. -
పూర్తి కావచ్చిన పనులు
- రూ.కోటి యాభైలక్షలతో గోదాం నిర్మాణం - 95శాతం పూర్తయిన పనులు - 2400 మెట్రిక్ టన్నుల సామర్థ్యం నిడమనూరు : నిడమనూరు వ్యవసాయ మార్కెట్లో నాబార్డ్ నిధులు రూ.కోటి యాభైలక్షలతో నిర్మిస్తున్న గోదాం త్వరలో అందుబాటులోకి రానుంది. వ్యవసాయ మార్కెట్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నూతన గోదాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 25వందల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం.. కొత్త గోదాం పూర్తయితే 25వందల మెట్రిక్ టన్నుల నిల్వ సామర ్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ యార్డులో 6వందల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నాలుగు, రెండు మెట్రిక్ టన్నులతో రెండు గోదాంలున్నాయి. కొత్త గోదాం అందుబాటులోకి వస్తే మరో 8900 మెట్రిక్ టన్నుల సామర్థ్యం సమకూరుతుంది. రైతుల ప్రయోజనాల కోసం ఈ గోదాంల నిర్మాణం జరుగుతుంది. రైతులకు ఎంతో ఉపయోగం ఇంటి వద్ద నిల్వ చేసుకునే అవకాశాలు లే ని రైతులకు ఈ గోదాంలు ఉపయోగపడ్తాయి. రైతు బంధు పథకం(ఆర్బీపీ) ద్వారా రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లో నిల్వ చేసుకునే వెసులుబాటు ఉంది. నిల్వ చేసుకున్న ధాన్యం విలువలో 70శాతం రైతుబంధు పథకం ద్వారా ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణం లభిస్తుంది. దీంతో రైతులు ధాన్యానికి మద్దతు ధర వచ్చే వరకు నిల్వ చేసుకుని ఆ తర్వాత విక్రయించుకొనే వెసులుబాటు ఉంటుంది. ఒక వేల ఆరు నెలల తర్వాత కూడా నిల్వ చేసుకుంటే మాత్రం రుణంపై వడ్డీ చెల్లించాల్సి అవసరం ఉంది. నిల్వ చేసుకున్న రైతులు 24మంది రైతులు ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా ధాన్యాన్ని మార్కెట్లో నిల్వ చేసుకున్నారు. 4వేల రెండు వందల బస్తాలకు గాను రూ.31,43,000లు రుణంగా పొందారు రైతులు. ధాన్యాన్ని అమ్ముకుని వచ్చిన డబ్బును తీసుకున్న రుణం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రైతులు రెండు విధాల ప్రయోజనం చేకూరినట్లవుతుంది. నిల్వ సామర్థ్యం పెరుగుతుంది : ఎంఏ ఘని, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటి, నిడమనూరు కొత్త గోదాం అందుబాటులోకి వస్తే ధాన్యం నిల్వ సామర్థ్యం మార్కెట్కు పెరుగుతుంది. తద్వారా రైతుల ధాన్యాన్ని మరింత నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుంది. కొత్త గోదాం నిర్మాణ పనులు 95శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేసి అప్పగిస్తే ప్రారంభించడానికి సిద్ధం చేస్తామన్నారు.