-
అమెరికానే బురిడీ కొట్టించిన నిత్యానంద.. అసలు కైలాస దేశమే లేదు..
వాషింగ్టన్: వివాదాస్పద గురువు నిత్యానంద ఏకంగా అమెరికానే బురిడీ కొట్టించాడు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ కొద్దికాలం క్రితం భారత్ నుంచి పారిపోయిన ఈయన.. ఓ ఐలాండ్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దానికే 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' అని పేరుపెట్టుకున్నాడు. ఇదే తన దేశమని ప్రకటించుకున్నాడు. ఇటీవల ఐక్యరాజ్య సమితిలో కైలాస ప్రతినిధులు పాల్గొని భారత్కు వ్యతిరేకంగా ప్రసంగించారు. వీరి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అయితే 'సిస్టర్ సిటీ' పేరుతో కైలాస దేశం అమెరికాలోని నెవార్క్ నగరంతో ఒప్పందం కుదుర్చుంది. జనవరి 12న ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రతులపై ఇరువురు సంతకాలు కూడా చేశారు. దీంతో పాటు వర్జీనియా, ఓహియో, ఫ్లోరిడా సహా అమెరికాలోని 30 నగరాలు కైలసతో సాంస్కృతిక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆ దేశం తెలిపింది. కానీ అసలు కైలాస అనే దేశమే లేదని తెలుసుకున్నాక అమెరికా నగరాలు నివ్వెరపోయాయి. దీంతో నెవార్క్ నగరం కైలాసతో ఒప్పందాలు రద్దు చేసుకుంది. కనీసం ఒక దేశం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఇలా గుడ్డిగా ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటని నెవార్క్ అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పుతిన్పై ఐసీసీ అరెస్టు వారెంట్ -
హ్యాట్సాఫ్ .. మనోజ్ఞ
నెవార్క్ (న్యూజెర్సీ) : ఏదేశమేగిన ఎందుకాలిడినా పొగడరా నీ తల్లిభూమి భారతిని అన్నట్టుగా అమెరికా వెళ్లినా.. ఇండియా కోసం పరితపిస్తోంది వైద్య విద్యార్థి మనోజ్ఞ రూత్ ప్రసాద్. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం చూసి చలించిపోయారు డాక్టర్ మనోజ్ఞ. దీంతో అమెరికాలో ఉంటూనే ఇండియాలో ఉన్న డాక్టర్లకు సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నారు. దీంతో పాటు కోవిడ్ పట్ల అవగాహన పెంచేందుకు అమెరికాలో పలు కార్యక్రమాలు మనోజ్ఞ చేపడుతున్నారు. కోవిడ్ సాయం న్యూ జెర్సీలోని నెవార్క్లో ఉన్న సెయింట్ మైఖేల్ మెడికల్ సెంటర్లో మనోజ్ఞ మెడికల్ రెసిడెంట్గా పని చేస్తోంది. ఇక్కడ ఉంటూనే ఇండియాలో ఉంటున్న వారి కోసం నిధుల సమీకరణ, అమెరికా ప్రజల్లో పట్ల కోవిడ్ అవగాహన పెంచే పనులు చేపడుతున్నారు. దీని కోసం గోఫండ్మీ ఫేజ్ను క్రియేట్ చేశారు. కాలేజీలో తనతో పాటు పని చేస్తున్న డాక్టర్లు , విద్యార్థులు, అధ్యాపకులను ఒప్పించారు. అంతా కలిసి మంగళవారం నెవార్క్లో ర్యాలీ నిర్వహించారు. హాస్పటిల్ నుంచి జేమ్స్ స్ట్రీట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ గోఫర్మీ ద్వారా ఇప్పటి వరకు 2,500 డాలర్ల నిధులు సేకరించగలిగారు. గోఫండ్మీ ‘గోఫండ్మీ పేజ్ ద్వారా మేము నిర్వహించిన ర్యాలీ వల్ల కోవిడ్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరుగుతుంది. అంతేకాకుండా ఇతరులకు సహాయ పడేందుకు ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తుంది’ అని డాక్టర్ మనోజ్ఞ రూత్ ప్రభు తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇండియాకు సాయం ఎంతో అవసరమని ఆమె అన్నారు. మెడికల్ లెర్నింగ్ ప్రాసెస్లో సోషల్ యాక్టివిజమ్ ఓ భాగమని ఇంటర్నల్ మెడిసిన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ థియోడర్ డికోస్టా అభిప్రాయపడ్డారు. చదవండి : రాష్ట్రాభివృద్ధికి ఎన్నారైల బాసట -
పొరపాటున వేరే విమానమెక్కి..
న్యూయార్క్: అమెరికాలో ఒక విమానయాన సంస్థ తప్పిదంతో ఒక మహిళ దాదాపు 4,800 కిలోమీటర్లు తప్పు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. అమెరికాలోని నెవార్క్ నుంచి పారిస్ వెళ్లేందుకు ఏప్రిల్ 24న విమానమెక్కిన లూసీ చివరకు శాన్ఫ్రాన్సిస్కోలో దిగింది. అసలేం జరిగిందంటే.. చివరి నిమిషంలో యునైటెడ్ ఎయిర్లైన్స్ పారిస్ వెళ్లే విమానం బోర్డింగ్ గేట్ను మార్చింది. మైక్ ద్వారా ప్రకటించినా.. లూసీకి ఇంగ్లిషు రాకపోవడంతో ఆ విషయం తెలియలేదు. బోర్డింగ్ సిబ్బంది కూడా టికెట్ను సరిగా చూడకుండా స్టాంప్ వేయడంతో ఆమె శాన్ఫ్రాన్సిస్కో వెళ్లే విమానం ఎక్కేసింది. తన సీటులో ఎవరో కూర్చోవడంతో విషయాన్ని సిబ్బందికి తెలిపింది. వారు కూడా టికెట్ను సరిగా పరిశీలించకుండా వేరే సీటును కేటాయించారు. దీంతో ప్యారిస్ బదులు శాన్ఫ్రాన్సిస్కో చేరుకోవడంతో పాటు అక్కడ 11 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చింది. చివరకు అధికారులు క్షమాపణ చెప్పి ఆమెను గమ్యస్థానానికి చేర్చారు. -
చుక్కలు చూపించిన విమానం!
న్యూయార్క్ః విమాన ప్రయాణం అంటేనే ఇటీవల వణుకు పుట్టే పరిస్థితి వస్తోంది. సాంకేతిక లోపాలు ఏర్పడటం, పక్షులు అడ్డు పడటం, ల్యాండింగ్ లో పొరపాట్లు జరగడం వంటి సంఘటనలు మామూలైపోయింది. తాజాగా న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ విమానం ఒక్క ఉదుటున ఎగిరి పడటంతో ప్రయాణీకులు అదిరి పడ్డారు. ప్రాణాలు గుప్పెట్టో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. న్యూయార్క్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన బోయింగ్ 767 ప్యాసింజర్ విమానం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. ల్యాండ్ అయ్యే ముందు పైలట్ మనసు మార్చుకోవడంతో రన్ వే పై బౌన్స్ కొట్టి, తిరిగి టేకాఫ్ అయ్యింది. పైలట్ రఫ్ రైడింగ్ తో విమానంలోని ప్యానెల్స్, మెకానికల్ బాక్స్ లు ఇతర చిన్న చిన్న వస్తువులు ప్రయాణీకులపై పడ్డాయి. హోస్టన్ నుంచి 214 మంది ప్రయాణీకులతో బయల్దేరిన 557 విమానం ల్యాండింగ్ విషయంలో ఏర్పడ్డ అస్థవ్యస్థ స్థితికి ప్రయాణీకులు వణికిపోయారు. ల్యాండ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానం స్కిప్ అవ్వడంతో పైలట్ తిరిగి టేకాఫ్ చేశాడని, తిరిగి ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించగా విమానం తిప్పలు పెట్టడంతో మరోసారి టేకాఫ్ చేశాడని ఇలా పలుమార్లు ల్యాండింగ్ కు ప్రయత్నించడం, టేకాఫ్ అవ్వడం ప్రయాణీకులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఓ ప్రత్యక్ష సాక్షి... ప్రయాణీకుడు తెలిపాడు. చివరిసారి ల్యాండ్ అయ్యేందుకు ముందు ఆకాశంలో పైటట్ కనీసం 30 సార్లు చక్కర్లు కొట్టించినట్లు తెలిపిన ప్రయాణీకుడు.. ఎట్టకేలకు ల్యాండ్ చేయడంతో ప్రయాణీకుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసినట్లు చెప్పాడు. అయితే విమానం చివరికి సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు తగల్లేదని ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అయితే అంతటి సందిగ్ధావస్థలోనూ ఓ వ్యక్తి వీడియోను తీసి సిబ్బందికి అందించడం విశేషం. -
ముంబై టు న్యూయార్క్
- విమానంలో కరెన్సీ అక్రమ తరలింపు - న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అడ్డంగా దొరికిపోయిన పైలట్ ఆకాశమార్గంలో నగదు అక్రమ తరలింపునకు పాల్పడ్డ పైలట్ ఉదంతం అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. నిందితుడి దగ్గర లభించిన అక్రమ కరెన్సీ ముంబై నుంచి సరఫరా కావటంతో ఇటు భారతీయ అధికారులూ కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. టెక్సాస్ కు చెందిన ఆంటోనీ వార్నర్ (55) ఓ కమర్షియల్ పైలట్. వేరొక మిమానంలో ముంబై నుంచి న్యూయార్క్ కు భారీగా అక్రమ డాలర్లు తరలిస్తున్న ఆయనను లిబర్టీ ఇంజర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ల్యాప్ టాప్ బ్యాగులో దాచిన రెండు లక్షల యూఎస్ డాలర్లతోపాటు భారీగా ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత డబ్బు, నగలపై వార్నర్ వివరణ అనుమానాస్సదంగా అనిపించడంతో అతణ్ని అరెస్టుచేశామని ఇమిగ్రేషన్ అధికారుల చెప్పారు. కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ సైతం దర్యాప్తులో పాలుపంచుకుంటున్న ఈ కేసులో నేరణం నిరూపణ అయితే వార్నర్ కు గరిష్టంగా ఐదేళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉంది. అయితే ముంబై నుంచి న్యూయార్క్ కు వార్నర్ ప్రయాణించిన విమానం ఏ సంస్థకు చెందిందో తెలిపేందుకు నిరాకరించారు అధికారులు!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement