breaking news
ndd mandal
-
ఇసుక లారీలు సీజ్
నిడదవోలు రూరల్: నిడదవోలు మండలంలోని పందలపర్రు ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పట్టుకుని సీజ్ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. ర్యాంపు వద్ద మంగళవారం అర్ధరాత్రి లారీల్లో ఇసుకను లోడ్ చేస్తుండగా పోలీస్ సిబ్బంది వీటిని స్వాధీనం చేసుకున్నారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
ముగిసిన కోటసత్తెమ్మ తిరునాళ్లు
నిడదవోలు : మండలంలోని తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోట సత్తెమ్మ అమ్మవారి తిరునాళ్లు ఉత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద చండీ పారాయణ, సాయంత్రం చండీ హోమం, ఊయల సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో రాత్రి గరగనృత్యాలు, పూల గరగలు ఆకట్టుకున్నాయి. తణుకు పట్టణానికి చెందిన అంబికా డా¯Œ్స అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నృత్యాలు చేశారు. కనక తప్పెట్లు, తాసమరపాలు, రామడోలు, వీరణం, రాజరాజేశ్వరి, కాళీమాత నృత్య ప్రదర్శనలు, కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఘనంగా బాణా సంచా కాల్చారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ దేవులపల్లి రామసుబ్బరాయశాస్త్రి, ఈవో యాళ్ల శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.