breaking news
Nation Building
-
ఆమె.. దేశ నిర్మాత
‘ఆడవాళ్లు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలి’.. ‘భార్య అంటే పనిమనిషి’ ‘ఇంట్లో గృహిణులు చేసే పనికి విలువ కట్టాల్సిన పనిలేదు’... ఇలాంటి పురుషాధిపత్య భావజాలానికి చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. వేతనం లేని ఇంటి చాకిరీకి ఇటీవలి కాలంలో లభించిన అత్యంత బలమైన, న్యాయపరమైన గుర్తింపులలో ఈ తీర్పు ఒకటని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గృహశ్రమ అనేది కొలవదగిన, ఆర్థిక, సామాజిక విలువ కలిగిన ఉత్పాదకశ్రమ అనే భావనను సుప్రీం తీర్పు మరింత బలపరుస్తోంది.‘గృహాలను నడిపే వ్యక్తులను కేవలం గృహిణులుగా అభివర్ణించడం వారి సహకారాన్ని తక్కువ చేసి చూడడమే అవుతుంది’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. గృహిణుల ప్రమాద మరణాలకు సంబంధించిన ఒక నష్టపరిహార కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతూ...మహిళల పాత్ర కేవలం ఇంటి పనులకే పరిమితం కాలేదు. కుటుంబాలు, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడం, దేశనిర్మాణానికి తోడ్పడం వంటి అనేక అంశాలకు ఆమె ప్రాతినిధ్యం వహిస్తోంది. గృహిణులు చేసే ఇంటి పనులు, సంరక్షణ సేవలకు ఆర్థిక విలువ ఉందని, మానవ అభివృద్ధికి దోహద పడడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోందని జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘ఆమెను కేవలం గృహిణి అని పిలవడానికి బదులుగా దేశనిర్మాత అని పిలవాలి’ అని కోర్టు పేర్కొంది.అదేకాదు...అంతకు మించి!ఇంటి పట్టున మహిళ చేసే పని ప్రభావం కేవలం ఆ ఇంటి నాలుగు గోడలకే పరిమితం కాదని, అంతకు మించి ఉంటుందని కోర్టు నొక్కి చెప్పింది. పెళ్లి అంటే పనిమనిషిని నియమించుకోవడం కాదంటూ, వివాహవ్యవస్థలోని లోటుపాట్లపై కూడా వ్యాఖ్యలు చేసింది కోర్టు. ఇంటి పనుల పూర్తి బాధ్యతను మహిళ ఒక్కరే తీసుకునే ఏర్పాటుగా వివాహాన్ని చూడకూడదని స్పష్టం చేసింది. గృహ బాధ్యతలనేవి భార్యాభర్తల ఉమ్మడి బాధ్యతలని నొక్కి చెప్పింది.పెళ్లయిందనే ఒకే ఒక్క కారణంతో వృత్తిపరమైన లక్ష్యాలు, ఆశయాలను మహిళలు త్యాగం చేయనవసరం లేదని పేర్కొంది.అది క్రూరత్వం కాదు...ఒక మహిళ తన పిల్లలకు స్థిరమైన వాతావరణాన్ని కల్పిస్తూనే డాక్టర్గా, వృత్తినిపుణురాలిగా, మరే ఇతర రంగాలలోనైనా తన వృత్తిని కొనసాగించాలని కోరుకుంటే అది భర్త, అత్తమామల పట్ల క్రూరత్వంగా పరిగణించరాదని కోర్టు పేర్కొంది.పెళ్లి తరువాత మహిళ గుర్తింపు ముగిసి పోదుగృహిణులు చేసే వ్యక్తిగత త్యాగాలు పెద్దగా గుర్తింపు పొందవని కోర్టు తెలియజేసింది. ఇంటి పనుల కోసం తమ సమయాన్ని, శక్తిని వెచ్చించే మహిళలు కుటుంబం నిలబడడానికి, కుటుంబ సంపదకు గణనీయంగా దోహదపడతారని, వారి కృషిని సామాజికంగా, ఆర్థికంగా తగిన విధంగా గుర్తించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సంవత్సరాల తరబడి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే ఇంటిపనులు, పిల్లల సంరక్షణ ద్వారా వారు అందించే అమూల్యమైన సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడిగా సంపాదించిన కుటుంబ ఆస్తులలో గృహిణులు సమాన వాటాకు అర్హులని పేర్కొంది.గృహిణుల శ్రమకు ఆర్థిక విలువ ఉంది...కుటుంబం, సమాజం సజావుగా నడవడానికి గృహ కార్మికుల శ్రమ అత్యవసరం అయినప్పటికీ, సంప్రదాయ ఆర్థిక లెక్కల్లో ఇది చాలాకాలంగా కనిపించకుండా పోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక గృహిణి చేసే సేవ కేవలం వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇంటిపనులు చూసుకోవడానికి పరిమితం కాదని ధర్మాసనం తెలిపింది. పిల్లలను పెంచడంలో, వారిలో విలువలను పెంపొందించడంలో, కుటుంబ సభ్యులకు అండగా నిలవడంలో, తర్వాత తరాన్ని తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. మానవ వనరుల అభివృద్ధికి, తద్వారా జాతీయ అభివృద్ధికి ఆమె కృషి నేరుగా దోహదపడుతుందని కోర్టు అభిప్రాయపడింది.స్పష్టమైన సందేశంపరిహారం అనేది కేవలం ఆర్థిక నష్టాన్ని అంచనా వేయడానికి మాత్రమే పరిమితం కాకూడదని, కుటుంబం కోల్పోయిన గృహసంరక్షణ సేవల విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు తెలిపింది. పరిహార దావాలను అంచనా వేసేటప్పుడు కోర్టులు ఉపయోగించే ప్రస్తుత ప్రమాణాలతోపాటు ఈ సూత్రం ఒక అదనపు మార్గదర్శకంగా పనిచేస్తుందని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ సంక్షేమం, సామాజిక అభివృద్ధిలో గృహిణుల పాత్ర కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుందని గుర్తిస్తూ, వారి భవిష్యత్ సహకారానికి సంబంధించిన లెక్కలను కూడా పరిహార మంజూరులో పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొంది. తమ శ్రమకు ఎలాంటి ప్రతిఫలం లేదా గుర్తింపు దొరకని లక్షలాది మంది మహిళలకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన సందేశం ఇచ్చింది...‘ఇంటి బాధ్యతలు నిర్వహించే వ్యక్తి కేవలం గృహిణి మాత్రమే కాదు ఆమె దేశ నిర్మాత’. -
గృహిణి సేవలకు ‘సుప్రీం’ విలువ!
ఇంటికి దీపం అని భావించే ఇల్లాలి సేవల విలువ ఎంత? భార్య రోడ్డు ప్రమాదంలో మరణిస్తే భర్తకు జరిగే లోటును ఎంత మొత్తంతో భర్తీ చేయవచ్చు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం సమాధానమిచ్చింది. మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద చెల్లించే నష్ట పరిహారంలో భార్య అందించే కుటుంబ సేవలకు వేరుగా విలువకట్టి చెల్లించాలని చెప్పింది. ఈ మొత్తం నెలకు రూ.30,000గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాద కేసుల్లో ఏడాది లోగా నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కే సింగ్లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు పూర్వాపరాలు...రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో 2017 నాటి సుప్రీంకోర్టు తీర్పు (ప్రణయ్ సేథీ తీర్పుగా పిలుస్తారు) మార్గదర్శకాలకు ఇది అదనం అని తెలిపింది. ‘‘ప్రణయ్ సేథీ కేసు విషయంలో చెప్పిన వాటికి భార్య మరణం వల్ల కుటుంబ సేవలకు కలిగే నష్టాన్ని అదనంగా చేరుస్తున్నాం. గృహిణికి ఇప్పుడైనా నేషన్ బిల్డర్ హోదా లభిస్తుందని నమ్ముతున్నాం’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కూడా మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల ప్రగతిని పర్యవేక్షించాలని సత్వర న్యాయం దక్కేలా చేయాలని కోరింది.సెక్షన్ 169 కింద ఇచ్చిన సమ్మరీ ప్రోసీజర్ను కచ్చితంగా అనుసరించడం ద్వారా బాధిత కుటుంబాలు సుదీర్ఘ న్యాయ పోరాటం నుంచి ఉపశమనం పొందవచ్చునని తెలిపింది. నష్ట పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాలను అక్షర, భావ స్ఫూర్తితో అనుసరించాలని కోరింది. హోం మేకర్ అనగానే అందరికీ ఓ మహిళ రూపం కళ్ల ముందు మెదులుతుందని అయితే ఇది అన్ని సందర్భాలకూ వర్తించక పోవచ్చునని సుప్రీంకోర్టు బెంచ్ తన తీర్పులో పేర్కొంది. కొన్ని అసాధారణ పరిస్థితుల్లోనో, దురదృష్టవశాత్తో పురుషుడు కూడా హోం మేకర్ పాత్ర పోషించే అవకాశాలు లేక పోలేదని తెలిపింది. వీరికి దక్కాల్సిన గౌరవం ఇస్తూనే ప్రస్తుత కేసులో మాత్రం భార్య అందించే కుటుంబ సేవలకు మాత్రమే విలువ కట్టామని వివరించింది.ప్రణయ్ సేథీ తీర్పు ప్రకారం...రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నష్ట పరిహారం చెల్లింపు విషయంలో 2017 నాటి ప్రణయ్ సేథీ కేసు తీర్పు నిర్ణయాత్మకమైంది. ఈ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడం బీమా కంపెనీలకు తప్పనిసరిగా మారింది ఈ తీర్పుతోనే. చని పోయిన వారు భవిష్యత్తులో ఎంత ఆదాయం సంపాదించగలరు అన్నదాన్ని ఎలా లెక్కించాలో ఈ తీర్పులో స్పష్టంగా వివరించారు. ఏ ఏ విషయాల్లో నష్టపరిహారం చెల్లించాలి, వేటిని మినహాయించాలి అన్నది కూడా ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏ.కే.సేక్రీ, జస్టిస్ ఏ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ డాక్టర్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పు ప్రకారం...⇒ నలభై ఏళ్ల లోపు వయసుండి శాశ్వత ఉద్యోగం కలిగి ఉన్న వారైతే...నష్టపరిహారంలో వారి వేతనంలో సగాన్ని ఆదాయంగా పరిగణించాలి (వేతనమంటే అన్ని రకాల పన్నులు మినహాయించిన తరువాతి మొత్తం)⇒ నలభై నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కులైతే వేతనంలో 30 శాతాన్ని, యాభై నుంచి అరవై ఏళ్ల మధ్య వయసు వారైతే 15 శాతాన్ని ఆదాయంగా పరిగణించాలి. ⇒ స్థిరమైన వేతనంతో సొంతంగా ఉద్యోగం కలిగి ఉండి నలభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉంటే వేతనంలో 40 శాతాన్ని ఆదాయానికి జోడించాలి. ⇒ 2009 నాటి సరళ వర్మ, డీటీసీ కేసు మార్గదర్శకాల ప్రకారం నష్ట పరిహారం నుంచి వ్యక్తిగత ఖర్చులను మినహాయిస్తారు. ⇒ లాస్ ఆఫ్ ఎసెట్స్ (బతికి ఉంటే సంపాదించే అవకాశమున్న ఆస్తులు, ఆదాయం) కింద రూ.15,000, అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కింద రూ.15,000, భార్య/భర్త సాంగత్యాన్ని కోల్పోయినందుకు రూ.40,000 కూడా చెల్లించాల్సిన నష్టపరిహారాల జాబితాలోకి చేరుతుంది.⇒ ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ప్రతి మూడేళ్ల కాలానికి పది శాతం చొప్పున పరిహారం పెరగాలి.శిశుపాల్ వర్సెస్ సుర్జీత్మోటారు వాహన ప్రమాద పరిహారానికి సంబంధించిన ‘శిశుపాల్ వర్సెస్ సుర్జీత్’ కేసులో దాఖలైన అప్పీలును సుప్రీంకోర్టు విచారించింది. ప్రమాదాల్లో గృహిణులు మృతి చెందినప్పుడు లేదా వికలాంగులుగా మారినప్పుడు వారి సేవలకు తగిన ఆర్థిక విలువ కట్టడం లేదన్న వాదనలు న్యాయస్థానం ముందుకొచ్చాయి. గృహిణులకు ఎలాంటి ప్రత్యక్ష ఆదాయం లేనందున కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిహారం చెల్లింపుల్లో తక్కువ మొత్తాలను ఖరారు చేస్తున్న తీరును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై స్పందించిన న్యాయస్థానం... గృహిణుల సేవలకు కచ్చితమైన, గౌరవప్రదమైన విలువను ఆపాదించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.పరిహారం లెక్కింపుపై స్పష్టమైన తీర్పు బాధిత కుటుంబం కోల్పోయే ‘గృహ సంరక్షణ’ను ఇకపై ఒక స్వతంత్ర ప్రాతిపదికగా పరిగణించి పరిహారం లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతంలో ప్రణయ్ సేథీ కేసులో ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన పరిహారాలకు అదనంగా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే, ప్రమాద పరిహార క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 169 ప్రకారం సత్వర చర్యలు తీసుకోవాలని, దీనిని క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించింది. పరిహార కేసుల విచారణలు సకాలంలో పూర్తయ్యేలా, తీర్పులోని సూత్రాలు అమలయ్యేలా అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పర్యవేక్షించాలని మార్గదర్శకాలను జారీ చేసింది. – సాక్షి, న్యూఢిల్లీపాతికేళ్ల క్రితం నాటి కేసు...2001లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఈ కేసులో చివరకు 2026 జూన్ నెలలో తీర్పు వెలువడింది. జీపులు రెండు ఢీకొన్న ప్రమాదంలో కక్షిదారు భార్య మరణించింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు 2024లో తీర్పునిస్తూ... బాధితుడికి, ముగ్గురు పిల్లలకు ఎనిమిది లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అయితే బాధితుడు ఈ తీర్పును సవాలు చేస్తూ గత ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
దేశ నిర్మాణంలో యువత కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనియువతకు సాధికారిత కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత విజయమే, దేశం విజయమని ప్రధాని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన 17వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 51 వేల మందికి పైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. పండుగ వేళ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ప్రధాని తెలిపారు. ‘పండుగ ఉత్సాహం, ఉద్యోగం పొందిన విజయం.. ఈ రెండూ కలిసి 51 వేల మందికి పైగా యువత జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి. ఈ కొత్త ఆరంభం సందర్భంగా వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు నా అభినందనలు’అని మోదీ పేర్కొన్నారు. నాగరిక్ దేవో భవ మరవద్దు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘ఈ రోజు మీరు పొందినవి కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావు, ఇవి దేశ నిర్మాణంలో చురుకుగా పాల్గొనేందుకు లభించిన అవకాశాలు. కొత్తగా నియమితులైన మీరంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేస్తారని, భవిష్యత్ భారతం కోసం మెరుగైన వ్యవస్థలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని నేను విశ్వసిస్తున్నాను’అని అన్నారు. ‘నాగరిక్ దేవో భవ’(పౌరుడే దైవం) అనే మంత్రాన్ని ఎప్పటికీ మరవవద్దని, సేవాభావం, అంకితభావంతో పనిచేయాలని ఆయన యువ కర్మయోగులకు సూచించారు. 3.5 కోట్ల మంది లక్ష్యం ‘వికసిత భారత్ నిర్మాణం అనే సంకల్పంతో గత 11 ఏళ్లుగా దేశం ముందుకు సాగుతోంది. ఈ ప్రయాణంలో యువతదే ప్రధాన పాత్ర’అని ప్రధాని నొక్కి చెప్పారు. యువ సాధికారతకు తమ ప్రభు త్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ‘యువత ఆకాంక్షలను నెరవేర్చడంలో రోజ్గార్ మేళాలు శక్తివంతమైన మాధ్యమంగా మారాయి. ఇటీవలి కాలంలో ఈ మేళాల ద్వారానే 11 లక్షలకు పైగా నియామక పత్రాలను జారీ చేశాం’అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ‘పీఎం వికసిత భారత్ రోజ్గార్ యోజన’ద్వారా 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ వెల్లడించారు. స్కిల్ ఇండియా మిషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ వంటి వేదికలు యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని అన్నారు. ప్రతిభావంతుల కోసం యువత కోసం చేపట్టిన మరో కీలకమైన ‘ప్రతిభా సేతు పోర్టల్’గురించి ప్రధాని మోదీ ప్రకటించారు. ‘యూపీఎస్సీ తుది జాబితా వరకు చేరుకుని, ఎంపిక కాని అభ్యర్థులకు ఈ పోర్టల్ అవకాశాలు కల్పిస్తుంది. వారి ప్రతిభ వృథా కాదు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పుడు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఈ ప్రతిభావంతుల సేవలను వినియోగించుకుంటున్నాయి. యువత ప్రతిభను ఇలా సద్వినియోగం చేయడం ద్వారా భారత యువశక్తి ప్రపంచానికి తెలుస్తుంది’అని మోదీ అన్నారు. పండుగ సీజన్కు కొత్త ఊపు జీఎస్టీ సంస్కరణలు పండుగ సీజన్కు కొత్త ఊపునిచ్చాయని ప్రధాని అన్నారు. ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్ కారణంగా నిత్యావసర వస్తువులు చౌకగా మారాయి. దీంతో డిమాండ్ పెరిగింది. పెరిగిన డిమాండ్ ఉత్పత్తిని, సప్లై చెయిన్లను వేగవంతం చేసింది. ఫ్యాక్టరీలలో ఉత్పత్తి పెరిగితే కొత్త ఉద్యోగాలు వస్తాయి. అందువల్ల, జీఎస్టీ బచత్ ఉత్సవ్.. ‘ఉపాధి ఉత్సవ్’గా కూడా మారుతోంది’అని ప్రధాని విశ్లేషించారు. ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా నమోదైన రికార్డు స్థాయి అమ్మకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. విదేశాంగ విధానం.. యువత కోసమే: ‘భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత యువ దేశం. ఈ యువశక్తే మన గొప్ప ఆస్తి’అని మోదీ అన్నారు. విదేశాంగ విధానాన్ని కూడా భారతీయ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రూపొందిస్తున్నామన్నారు. యూకే, యూరప్, బ్రెజిల్, సింగపూర్, కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాలతో ఏఐ, ఫిన్టెక్, క్లీన్ ఎనర్జీ రంగాల్లో కుదుర్చుకుంటున్న ఒప్పందాలు యువతకు శిక్షణ, నైపుణ్యం, ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘కొత్తగా నియమితులైన ఈ యువ కర్మయోగులు ’వికసిత భారత్’సంకల్పాన్ని నెరవేర్చడంలో ముందుండాలి. ఇందుకోసం ‘ఐ–గాట్ కర్మయోగి భారత్ ప్లాట్ఫామ్’ద్వారా నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీ ప్రయత్నాల ద్వారానే భారతదేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది’అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. -
దేశ నిర్మాణమే సంఘ్ ధ్యేయం
న్యూఢిల్లీ: దేశ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అద్వితీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైన సంఘ్పై ఇప్పటిదాకా ఎన్నో దాడులు జరిగాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ఏనాడూ ఎవరిపైనా విద్వేషం ప్రదర్శించలేదని, అందరినీ అక్కున చేర్చుకుందని కొనియాడారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సంఘ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కులం, జాతి అనే అడ్డుగోడలను తొలగించి, సమాజంలో ప్రజల మధ్య సామరస్యం, సోదరభావం పెంపొందించడమే లక్ష్యంగా దేశంలో నలుమూలలకూ సంఘ్ విస్తరించిందని చెప్పారు. సమీకృత సమాజ నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తోందని ఉద్ఘాటించారు. బ్రిటిషర్ల పాలనలో జరిగిన అకృత్యాలపై ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు స్వయంసేవకులు ఆశ్రయం ఇచ్చారని, స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది సంఘ్ నాయకులు అరెస్టయ్యి జైలుశిక్ష అనుభవించారని చెప్పారు. దేశాన్ని ప్రేమించడమే ఆర్ఎస్ఎస్ విధానమని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే... విశ్వాసం, గౌరవమే సంఘ్ బలం ‘‘ఆర్ఎస్ఎస్ ఆశయాలను అణచివేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. తప్పుడు కేసులు పెట్టారు. సంఘ్ను శాశ్వతంగా నిషేధించే ప్రయత్నాలు కూడా చేశారు. లెక్కలేనన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అయినప్పటికీ సంఘ్ ఏనాడూ వెనక్కి తగ్గలేదు. మహా మర్రివృక్షంగా స్థిరంగా నిలిచింది. ఎవరినీ ద్వేషించలేదు. ఎందుకంటే మనమంతా ఈ సమాజంలో భాగమే. ఇక్కడ మంచితోపాటు చెడును కూడా స్వీకరించాల్సిందే. సంఘ్ అధినేత గురూజీ గోల్వాల్కర్పై తప్పుడు కేసు నమోదుచేసి, జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచి్చన తర్వాత ఆయన విజ్ఞత ప్రదర్శించారు. జనాభా స్థితిగతుల్లో మార్పులు ఆందోళనకరం ఆర్ఎస్ఎస్కు వందేళ్లు పూర్తవుతున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలన్న ఉద్దేశంతో సరిగ్గా వందేళ్ల క్రితం విజయ దశమి రోజున సంఘ్ స్థాపన జరిగింది. అప్పటి నుంచి దేశ ప్రగతికి కృషి చేస్తూనే ఉంది. దేశ భక్తి, ప్రజాసేవకు పర్యాయపదం ఆర్ఎస్ఎస్. ‘ఒకే భారత్, మహోన్నత భారత్’ అనే సిద్ధాంతాన్ని సంఘ్ విశ్వసిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వమే మనదేశ ఆత్మ. అది విచ్ఛిన్నమైతే దేశం బలహీనపడుతుంది. దేశంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తుండడం ఆందోళనకరం. ఈ పరిణామం దేశ భద్రతకు, సామాజిక సామరస్యానికి ప్రమాదకరం. బాహ్య శక్తులు మన దేశంలోకి చొరబడి వేర్పాటువాద సిద్ధాంతాలను నూరిపోస్తున్నాయి. చొరబాటుదారుల నుంచి మన పౌరులను కాపాడేందుకు ‘డెమొగ్రఫిక్ మిషన్’ను ప్రకటించాం. వాటి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి 1962లో యుద్ధం సమయంలో, 1971 నాటి సంక్షోభంలో, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో వారు విశేషమైన సేవలందించారు. బాధితులను ఆదుకున్నారు. సంఘ్ సేవలను మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ కూడా ప్రశంసించారు. వార్ధాలోని సంఘ్ క్యాంప్ను మహాత్మాగాంధీ సందర్శించారు. సంఘ్ సిద్ధాంతాలను కొనియాడారు. ప్రస్తుత సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ సమాజం ముందు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రజలందరికీ ‘ఒకే బావి, ఒకే గుడి, ఒకే శ్మశాన వాటిక’ అని చెబుతున్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు కలసిమెలసి ఉండాలని బోధిస్తున్నారు. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వివక్ష, విభజన, అసమ్మతి నుంచి సమాజానికి విముక్తి కల్పించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పోస్టల్ స్టాంప్, నాణెం ఆవిష్కరణ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్, స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. రూ.100 విలువ కలిగిన ఈ నాణెంపై ఒక వైపు భరతమాత చిత్రం, మరోవైపు జాతీయ చిహ్నం ఉంది. సింహంతోపాటు వరద ముద్రతో భరతమాత చిత్రం ఆకట్టుకుంటోంది. స్వయం సేవకులు ఆమెకు వందనం సమర్పిస్తున్నట్లుగా ఈ నాణెం ముద్రించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన కరెన్సీపై భరతమాత చిత్రాన్ని ముద్రించడం ఇదే మొట్టమొదటిసారి అని ప్రధాని మోదీ చెప్పారు. ఇది చరిత్రాత్మకమని, మనకు గర్వకారణమని అన్నారు. నాణెంపై ఆర్ఎస్ఎస్ మోటో ‘రాష్ట్రాయ స్వాహా, ఇదం రాష్ట్రాయ, ఇదం న మమ’ కూడా ముద్రించారు. ‘ఏదీ నాది కాదు.. అంతా దేశానికే అంకితం’ అని దీని అర్థం. ఇక పోస్టల్ స్టాంప్పై 1963 రిపబ్లిక్ డే పరేడ్లో స్వయంసేవకులు పాల్గొన్న చిత్రం ముద్రించారు. ‘పంచ పరివర్తన్’ ఎజెండా ప్రజల మద్దతుతోనే సంఘ్ వందేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే చెప్పారు. శతాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. దేశంలో నేడు అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా మారిందని, దీని వెనుక ఎన్నో సవాళ్లు, కష్టాలు ఉన్నాయని తెలిపారు. సంఘ్పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంఘ్ నిస్వార్థ సేవలకు ఇది చక్కటి గుర్తింపు అని పేర్కొన్నారు. మన దేశ ప్రగతి కోసం స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాలని ప్రజలను కోరారు. దేశం స్వయం సమృద్ధి సాధించడానికి అందరూ కృషి చేయాలన్నారు. శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని సంఘ్ నాయకత్వం ‘పంచ పరివర్తన్’ ఎజెండాను రూపొందించింది. భారతీయ విలువలు, సరైన కుటుంబ విలువలు, సామాజిక సామరస్యం, పర్యావరణహిత జీవనశైలితోపాటు పౌర విధులు సక్రమంగా నిర్వర్తించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నదే ఈ ఎజెండా లక్ష్యం. -
Mann ki Baat: పటేల్ జయంతి నాడు... మేరా యువ భారత్
న్యూఢిల్లీ: జాతి నిర్మాణ కార్యకలాపాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా మేరా యువ భారత్ పేరుతో జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తేనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆ సందర్భంగా మేరా యువ భారత్ వెబ్సైట్ను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. MYBharat.Gov.in సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని యువతకు సూచించారు. దీన్ని యువ శక్తిని జాతి నిర్మాణానికి, ప్రగతికి వినియోగపరిచేందుకు తలపెట్టిన అద్భుత కార్యక్రమంగా మోదీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి మాట్లాడారు. అక్టోబర్ 31 దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కూడానని గుర్తు చేసుకున్నారు. ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. నవంబర్ 15న ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు కూడా మోదీ నివాళులర్పించారు. విదేశీ పాలనను ఒప్పుకోని ధీర నాయకునిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. తిల్కా మహరాజ్, సిద్ధూ, కాన్హు, తాంతియా భీల్ వంటి వీర గిరిజన నాయకులు దేశ చరిత్రలో అడుగడుగునా కనిపిస్తారన్నారు. గిరిజన సమాజానికి దేశం ఎంతగానో రుణపడిందన్నారు. స్థానికతకు మరింతగా పెద్ద పీట వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ఖాదీ వస్తువుల అమ్మకం రికార్డులు సృష్టించిందని గుర్తు చేశారు. ఢిల్లీలో అమృత్ వాటిక రెండున్నరేళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31న ఘనంగా ముగియనుందని మోదీ చెప్పారు. ‘‘దీనికి గుర్తుగా ఢిల్లీలో అమృత్ వాటిక నిర్మించనున్నాం. ఇందుకోసం అమృత్ కలశ్ యాత్రల పేరుతో దేశవ్యాప్తంగా మట్టిని సేకరించి పంపుతుండటం హర్షణీయం’’అన్నారు. వ్యర్థాల నుంచి సంపద అన్నది మన నూతన నినాదమని మోదీ అన్నారు. గుజరాత్ల అంబా జీ మందిర్లో వ్యర్థౠల నుంచి రూపొందించిన పలు కళాకృతులు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. దీన్ని దేశవాసులంతా స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. బెర్లిన్లో తాజాగా ముగిసిన ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్లో భారత్ 75 స్వర్ణాలతో పాటు ఏకంగా 200 పతకాలు సాధించడం గర్వకారణమన్నారు. గిరిజన వీరుల ప్రస్తావన ప్రధాని నరేంద్ర మోదీ మన్కీ బాత్లో గిరిజన వీరుల గురించి ప్రస్తావించారు. గిరిజన యుద్ధ వీరుల చరిత్రను ప్రశంసించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, అసిఫాబాద్ ప్రాంతాలను పరిపాలించి బ్రిటిష్ పాలనకు వ్యతిరేంగా పోరాడి ఉరికొయ్యకు ప్రాణాలరి్పంచిన రాంజీ గోండు, ఛత్తీస్గఢ్లో బస్తర్ప్రాంతానికి చెందిన వీర్ గుండాధుర్, మధ్యప్రదేశ్కు చెందిన ప్రథమ స్వాతంత్య్ర సమర యోధుడు భీమా నాయక్ల వీర చరిత్రను కొనియాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన తిల్కా మాంఝీ, సమానత్వం కోసం పోరాడిన సిద్ధో–కన్హూ, స్వాతంత్య్ర యోధుడు తాంతియా భీల్లు ఈ గడ్డపై పుట్టినందుకు గరి్వస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని పేర్కొన్నారు. గిరిజన సమాజానికి స్ఫూర్తినిచి్చన రాణి దుర్గావతి 500వ జయంతిని దేశం జరుపుకొంటోందని, గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన వారి గురించి యువత తెలుసుకొని వారి నుంచి స్ఫూర్తి పొందాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
పురోగతికి నిధులు కావాల్సిందే
న్యూఢిల్లీ: వృద్ధికి, దేశ నిర్మాణానికి నిధులు తప్పనిసరి అని అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, చెల్లింపుల సామర్థ్యం ఆధారంగానే కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. నిర్వహణ పరిమితుల్లోపే రుణాలను కట్టడి చేస్తామని, ఈ విషయంలో ఇన్వెస్టర్ల సమూహాన్ని ఒప్పించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రుణాలను సకాలంలో చెల్లించిన చరిత్రను ప్రస్తావించింది. పూర్తి చెల్లింపులకు తగిన సామర్థ్యం ఉన్నట్టు స్పష్టం చేసింది. 2023 మార్చి నాటికి తీర్చాల్సిన రుణాలకు ముందే చెల్లింపులు చేసినట్టు వేదాంత రీసోర్సెస్ తెలిపింది. గడిచిన 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తగ్గించుకున్నట్టు వివరించింది. 2023 జూన్తో ముగిసే త్రైమాసికం వరకు నిధుల అవసరాలను చేరుకోగలమని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సంస్థ చరిత్రలో ఇప్పటి వరకు 35 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించగా, వాటన్నింటికీ సకాలంలో చెల్లింపులు చేసినట్టు ప్రకటించింది. అధిక నగదు ప్రవాహాలను తెచ్చిపెట్టే బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయంటూ నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం చేస్తున్న విస్తరణతో సమీప భవిష్యత్తులో ఆదాయం 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ‘‘వేదంతా కంపెనీలు అన్నీ కూడా టాప్ సీఈవోల ఆధ్వర్యంలో నిపుణులతో నిర్వహిస్తున్నవి. అధిక వృద్ధి అవకాశాలతో, తక్కువ నిర్వహణ వ్యయాలతో వేదాంతా గ్రూప్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. భారత్ ఆర్థిక పురోగతిలో మేము కూడా భాగస్వాములు అవుతాం’’అని లింక్డ్ఇన్ పోస్ట్లో వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వేదాంత లిమిటెడ్ ప్రమోటర్ సంస్థకు భారీ రుణాలు ఉండడంతో.. అదానీ తర్వాత వేదాంతా గ్రూపు రుణ సమస్యలు ఎదుర్కోనుందంటూ ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ విడుదల చేయడం గమనార్హం. -
బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్ రెడ్డి రచించిన ‘ఇంజినీర్డ్ ఇన్ ఇండియా–ఫ్రమ్ డ్రీమ్స్ టు బిలియన్ డాలర్ సైయంట్’ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్ నుంచి 1974లో బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్ తెలిపింది. భారత్లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది. -
దేశ నిర్మాణమనే మహాయజ్ఞంలో... ఎన్ఈపీది కీలక భూమిక
న్యూఢిల్లీ: దేశ నిర్మాణమనే మహాయజ్ఞంలో కీలక భూమిక పోషిస్తున్న వాటిలో నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యువత తమ ఆకాంక్షలను నేరవేర్చుకోవడానికి దేశం వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ఎన్ఈపీని అమలు చేయడానికి టీచర్లు, ప్రిన్సిపాల్స్, విధాననిర్ణేతలు తీవ్రంగా శ్రమించారని కితాబిచ్చారు. ‘భవిష్యత్తులో ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటామనేది ప్రస్తుతం యువతకు మనమెలాంటి విద్యను అందిస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. దేశం మొత్తం మీతో ఉందని, మీ ఆకాంక్షలకు అండగా నిలుస్తుందనే భరోసాను కొత్త ఎన్ఈపీ యువతకు ఇస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు. గురువారం కొత్తగా ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ– ఏఐ) కార్యక్రమం యువతను భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా తీర్చిదిద్దుతుందని, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు బాటలు వేస్తుందని అన్నారు. ఆకడమిక్ బ్యాంక్ ఆప్ క్రెడిట్ (ఏబీసీ) పథకాన్ని ప్రధాని ప్రకటించారు. దీని ప్రకారం ఉన్నతవిద్యలో ఒక విద్యార్థి తనకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. భిన్న యూనివర్శిటీలకు మారొచ్చు. వరుసగా ఇన్నేళ్లు చదవాలని కాకుండా... తను కోరుకున్నపుడు కోర్సులో చేరడం, మధ్యలో నిలిపివేయడం చేయవచ్చు. అతని రికార్డులన్నీ ఏబీసీలో నిక్షిప్తమవుతాయి. అలాగే 3, 5, 8వ తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన సమర్థత ఆధారిత మూల్యాంకనం (సఫల్)ను గురువారం మోదీ ఆరంభించారు. మాతృభాషకు పెద్దపీట మాతృభాషకు, ప్రాంతీయ భాషలకు కూడా ఎన్ఈపీ ప్రాధాన్యమిస్తోందనే అంశాన్ని ఎత్తిచూపుతూ... ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఐదు భారతీయ భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ) విద్యాబోధనను ప్రారంభించనుండటం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంజనీరింగ్ పాఠ్యాంశాలను 11 భాషల్లోకి అనువదించడానికి ఒక టూల్ను అభివృద్ధి చేయడం జరిగింది. మాతృభాషలో చదువుల కు ప్రాధాన్యమిస్తే... పేద, గ్రామీణ, గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపగలం. భారత సంకేత భాషకు తొలిసారిగా భాష హోదా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఎవరైనా తాము నేర్చుకునే భాషల్లో ఒకటిగా దీన్ని ఎంచుకోవచ్చు’ అని పేర్కొన్నారు. -
నెహ్రూ జాతినిర్మాణ కార్యక్రమంపై అమిత్ షా విమర్శలు
పుణె: జవహర్ లాల్ నెహ్రూ జాతీయ నిర్మాణ కార్యక్రమం దేశంలోని విలువలను నిర్మూలించి, విదేశాలనుంచి ఆలోచనలను అరువు తెచ్చుకునే విధాన మని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు.దీన దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన సిద్ధాంతమే దేశంలో విలువలను కాపాడగలదని పేర్కొన్నారు.దీన్ దయాల్ జీవిత చరిత్ర 'రాష్ట్ర్ర ద్రష్ట' ను పుణెలో ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీన దయాల్ సిద్ధాంతాల పునాదులపైననే జన సంఘ్ నిర్మాణం,బీజేపీ స్థాపన జరిగిందని షా తెలిపారు. విభిన్న భావజాలమున్న వ్యక్తుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వతంత్రం వస్తే గొప్ప తనాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందని ఆయన పేర్కొన్నారు.దీన్ దయాల్ సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన ఆశయ సాధనకు బీజేపీ కృషి చేస్తోందని షా అన్నారు.


