బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి ‘ఇంజనీర్డ్‌ ఇన్‌ ఇండియా’

Cyient founder BVR Mohan Reddy pens his entrepreneurial journey  - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సైయంట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి రచించిన  ‘ఇంజినీర్డ్‌ ఇన్‌ ఇండియా–ఫ్రమ్‌ డ్రీమ్స్‌ టు బిలియన్‌ డాలర్‌ సైయంట్‌’ పుస్తకాన్ని పెంగ్విన్‌ ఇండియా ప్రచురించింది.

ఓ వ్యాపారవేత్తగా ఎదగాలని, దేశ నిర్మాణంలో తన వంతు పాలుపంచుకోవాలని కలలుకంటూ ఐఐటీ కాన్పూర్‌ నుంచి 1974లో  బయటకు అడుగుపెట్టిన ఓ యువకుని సాహసోపేత కథ ఇది అని పెంగ్విన్‌ తెలిపింది.  భారత్‌లో స్వేచ్ఛాయుత వాణిజ్యానికి ముందు  అనుభవలేమి, మూలధన అవసరాలను సమకూర్చుకోవడమనే అవరోధాలను సైతం అధిగమించి మోహన్‌ రెడ్డి సాగించిన స్ఫూర్తిదాయక  ప్రయాణాన్ని ఇది వెల్లడిస్తుందని వివరించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top