breaking news
Nagireddypet Mandal
-
విప్ ధిక్కరణ.. ఎంపీపీపై వేటు..!
సాక్షి, కామారెడ్డి : పార్టీ విప్ ధిక్కరించిన ఓ ఎంపీపీపై వేటు పడింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని నాగిరెడ్డిపేట్ ఎంపీపీ కృష్ణవేణి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. పార్టీ విప్ ధిక్కరించి టీఆర్ఎస్ మద్దతుతో ఎంపీపీగా గెలుపొందారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. విప్ తీసుకున్న సంతకం తనది కాదని కృష్ణవేణి బుకాయించడంతో ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. సంతకం ఆమెదే అని తేలడంతో కృష్ణవేణిపై అనర్హతవేటు వేయాలంటూ కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ఎంపీపీ కృష్ణవేణిపై అనర్హత వేటు వేయాలని ప్రిసైడింగ్ అధికారుకు ఆదేశాలు జారీచేసింది. -
అయ్యా.. నేను సదివి బాగుపడతా
నాగిరెడ్డిపేట: ‘నాన్నా...నన్ను బడికెందుకు పంపవు...పంపకపోతే చచ్చిపోతా’అంటూ ఓ గిరిజన బాలిక పంతం పట్టి అనుకున్నది సాధించింది. వివరాలివీ... నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం పంచాయతీ పల్లెబొగడ తండాలో గురువారం జాతీయ బాల కార్మిక చట్టం పథకం సంచాలకుడు సుధాకర్, ఎంఈవో గోవర్దన్రెడ్డి కలిసి బడి బయట పిల్లలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి నిర్మల అనే బాలిక తారసపడింది. తల్లిదండ్రులు ఆమెను గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదివించి ఆరునెలల క్రితం మాన్పించిన విషయం తెలుసుకున్నారు. అధికారులు నిర్మల తల్లితో మాట్లాడి కూతురును బడికి పంపేందుకు ఒప్పించారు. అయితే, ఆమె తండ్రి దేవుజా గ్రామంలో లేకపోవటంతో ఫోన్లో సంప్రదించారు. అతడు మాత్రం కూతురును బడికి పంపడానికి అంగీకరించలేదు. జైలుకు పంపుతామని హెచ్చరించినా లెక్క చేయలేదు. ఈ సంభాషణంతా వింటూ అక్కడే ఉన్న నిర్మల పీడీ చేతిలో నుంచి ఫోన్ తీసుకొని తండ్రితో మాట్లాడింది. తనను ఎందుకు బడికి పంపవని నిలదీసింది. బడికి పంపకపోతే చచ్చిపోతానని బెదిరించింది. కంగుతిన్న దేవుజా చివరికి కూతురును బడికి పంపేందుకు అంగీకరించాడు. అనంతరం బాలికను పీడీ సుధాకర్, ఎంఈఓ గోవర్ధన్రెడ్డితో కలిసి తండాలోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు.